26న తమిళనాడుకు కేబినెట్ ఉపసంఘం | Tamil Nadu Cabinet Committee on 26 | Sakshi
Sakshi News home page

26న తమిళనాడుకు కేబినెట్ ఉపసంఘం

Published Sat, Feb 20 2016 3:15 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

26న తమిళనాడుకు కేబినెట్ ఉపసంఘం - Sakshi

26న తమిళనాడుకు కేబినెట్ ఉపసంఘం

సాక్షి, హైదరాబాద్: వైద్య రంగంలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 26, 27 తేదీల్లో తమిళనాడులో పర్యటించనుంది. మంత్రివర్గ ఉపసంఘంలోని మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తదితరులు ఆ రాష్ట్రంలో పర్యటించి అక్కడి ఉన్నతాధికారులతో చర్చిస్తారు. రెండు నెలల క్రితమే ఉపసంఘం తమిళనాడులో పర్యటించాల్సి ఉండగా అక్కడ భారీ వరదల కారణంగా వాయిదా పడి ంది. తమిళనాడులో వైద్య ఆరోగ్య సేవలు ఆదర్శంగా ఉన్నాయని భావించిన మంత్రులు అక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేస్తారు. వివిధ ఆసుపత్రులను సందర్శిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement