Laxma Reddy
-
ఉప్పల్ లో బీఆర్ఎస్ జోరు
-
ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వీడియో హల్చల్
జడ్చర్ల: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేయకపోతే ఇళ్లను ఇవ్వబోమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్న ఓ వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 4వ వార్డు పరిధిలోని బోయలకుంటలో ప్రచార సమయంలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ‘ఎన్నికలు కాబట్టి ఎవరెవరో వచ్చి ఓట్లు అడుగుతారు. ఎవరొచ్చి ఏం చేసేది ఏమీ లేదు. ఏం చేసినా మనమే చేయాలి. పొరపాటు జరిగి మా అభ్యర్థికి తక్కువ ఓట్లువస్తే ఇళ్లు కూడా ఇవ్వను. బీరుకో, బిర్యానీకో ఆశపడి ఓట్లు వేయొద్దు’ అని అన్నారు. ఈ వీడియోపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటర్లను బెదిరింపులకు గురిచేసేలా లక్ష్మారెడ్డి వైఖరి ఉండడం సరికాదన్నారు. అర్హులకు పథకాలు అందించడం ప్రభుత్వాల పని అని, ఎవరూ బెదిరింపులకు భయపడొద్దన్నారు. చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్ చదవండి: టీకా వేసుకున్న భర్త.. ఆ తర్వాత భార్య -
వ్యాఖ్యల దుమారంపై స్పందించిన లక్ష్మారెడ్డి
సాక్షి, మహబూబ్నగర్: ప్రజలకు మంచి చేస్తే మరచిపోతారని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రద్దు చేయాలనే వ్యాఖ్యలపై టీఆర్ఎస్ జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. తాను అలా అనలేదని, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించి ప్రసారం చేసిందని అన్నారు. పనిచేసే ప్రభుత్వాలను ప్రజలు గుర్తుంచుకోవాలని అర్ధం వచ్చేలా తాను నిన్న మాట్లాడానని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాలు ఏవైనా ప్రజలకు మేలు చేస్తే ఆ ప్రభుత్వాలను ఆదరించాలి. నేను నిన్న చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించి ప్రసారం చేశాయి’అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్, జడ్చర్ల మండల కేంద్రాలలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లక్ష్మారెడ్డి మంగళవారం లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటుందని, ఏడాదిపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని కేసీఆర్ను కోరుతానని లక్ష్మారెడ్డి మాట్లాడినట్టు వార్తలు వెలువడ్డాయి. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేపాయి. టీఆర్ఎస్ శ్రేణుల్లోనూ అసహనం వ్యక్తమైంది. (చదవండి: 'జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటుంది..') -
అవసరమైతే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి
అవసరమైతే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి.. నిర్వాసితులకు మేలు చేస్తామని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్లో మంపు నిర్వాసితులు చేపట్టిన దీక్ష శిబిరానికి వారు చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. సాక్షి, జడ్చర్ల : అవసరమైతే సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి.. నిర్వాసితులకు మేలు చేస్తామని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న వల్లూరు, ఉదండాపూర్ ప్రజలు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మంగళవారం అక్కడి శిబిరానికి చేరుకుని ఆందోళన విరమించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో నిర్వాసిత కుటుంబాలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో సేకరించిన భూములకు అతి తక్కువ ధరలు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు పనిగట్టుకుని రెచ్చ గొడుతున్నాయని, ఆ నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. పునరావాసం, ముంపునకు గురవుతున్న ఇళ్లకు సంబంధించిన ప్యాకేజీ తదితర సమస్యలను చర్చించేందుకు ఓ కమిటీగా ఏర్పడి అసెంబ్లీ వద్దకు రావాలన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ తదితర కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను అందజేసి ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తామన్నారు. పోలేపల్లి పరిధిలోని భూములకు రూ.12.5 లక్షలు ఇస్తున్నట్లు వచ్చిన ప్రచారంలో నిజం లేదని, నిబంధనల మేరకే పరిహారం అందుతుందన్నారు. నిర్వాసితులకు బండమీదిపల్లి, శంకరాయపల్లి పరిధిలో ఒక్కో కుటుంబానికి 300 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తామన్నారు. 18ఏళ్లు నిండిన యువకులకు పునరావాసంలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. రిజర్వాయర్లో చేపలను పట్టుకుని అమ్ముకుని ఉపాధి పొందేందుకు అనుమతి ఇస్తామన్నారు. వారి వెంట జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, ఆర్డీఓ శ్రీనివాస్, జడ్చర్ల తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. -
‘న్యాయశాఖ’ జాతీయ అధ్యక్షుడిగా బి.లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: బిహార్లో జరిగిన ఆల్ ఇండియా న్యాయశాఖ ఉద్యోగ సంఘాల సమావేశంలో సంఘం జాతీయ అధ్యక్షుడిగా బి.లక్ష్మారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 29 రాష్ట్రాల సంఘాలు ఆ సమావేశానికి హాజరుకాగా, దేశంలోని 78 శాతం సంఘాలు లక్ష్మారెడ్డికి మద్దతు తెలిపాయి. రంగారెడ్డి జిల్లాలోని కుమ్మేర గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయ శాఖ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. 2015 నుంచి జాతీయ న్యాయశాఖ ఉద్యోగుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు -
సమాచార కమిషనర్ నియామకం వివాదాస్పదం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్గా ఐలాపురం రాజా నియామకం వివాస్పదంగా మారింది. రాజా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో జన చైతన్యవేదిక అధ్యక్షులు లక్ష్మణ్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. లంచ్మోషన్లో పిటిషనర్ తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సెక్షన్-50లోని క్లాజ్3 నిబంధనలు ఉల్లంఘించి ఐలాపురం రాజాని నియమించారని పొన్నవోలు అర్గ్యుమెంట్ చేశారు. సెక్షన్-15 క్లాజ్ 6 ప్రకారం సమాచార కమిషనర్గా వ్యాపారస్తులని నియమించకూడదని చట్టంలో స్పష్టంగా ఉందని వాదించారు. సేవాదృక్పధం, జ్ఞాన సంపత్తి లేని ఐలాపురం రాజా నియామకాన్ని రద్దు చేయాలని విన్నవించారు. ప్రభుత్వం మారే సమయంలో ఇష్టులకి పదవుల పందేరంలో భాగంగానే ఐలాపురం పేరు సూచించారని ఆరోపించారు. అర్గ్యుమెంట్స్ విన్న తర్వాత విచారణను ఈ నెల 29కి హైకోర్టు వెకేషన్ బెంచ్ వాయిదా వేసింది. అలాగే ఈ నెల 29న కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
బాబు ఇంటి ముందు తమ్ముళ్ల తన్నులాట
-
అవయవదాన పత్రంపై లక్ష్మారెడ్డి సంతకం
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవదానం చేస్తానని ప్రతిజ్ఞ చేసి సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. మరికొందరు అవయవదానం చేయాలని కూడా ఆయన ప్రోత్సహించడం విశేషం. ఆదివారం లక్ష్మారెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాదేపల్లి పట్టణంలో మెగా రక్తదాన శిబి రం నిర్వహించినట్లు తెలిపారు. 15 ఏళ్లుగా తన పుట్టినరోజున శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. గతంలో 1,220 యూనిట్ల రక్త సేకరణ రికార్డుగా ఉండగా, ఈ ఏడాది 2,120 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. -
ఏపీలో ‘108’ అంబులెన్సుల కొను‘గోల్మాల్’
షాద్నగర్టౌన్: ఏపీ సీఎం చంద్రబాబు అవినీతి పాలన కొనసాగిస్తున్నారని, ‘108’ అంబులెన్సుల కొనుగోలులో భారీ అవకతవకలు జరిగాయని మాజీమంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆరోపించారు. సోమవారం ఇక్కడి టీఆర్ఎస్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలసి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలనావ్యవహారాలపై ఇటీవల సీఎం కేసీఆర్ నిజాలు మాట్లాడారని, అవి నచ్చకపోవడంతో ఆంధ్రామంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబుపై ఎన్నో కేసులు ఉన్నాయని, విచారణ జరగకుండా స్టేలు తెచ్చుకొని చంద్రబాబు బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు ఒకే నమూనాలో ఉన్న అంబులెన్సులను కొనుగోలు చేశాయని, తెలంగాణ ప్రభుత్వం ఒక్కో వాహనాన్ని రూ.15 లక్షలకు కొనుగోలు చేస్తే, చంద్రబాబు రూ.20 లక్షల చొప్పున కొనుగోలు చేశారన్నారు. చంద్రబాబు ఆంధ్రా ప్రజల సొమ్మును భారీగా దోచి ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ నేతల కోసం తరలించారని ఆరోపించారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసమే సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ రహిత ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు దేశవ్యాప్తంగా తిరుగుతున్నారని లక్ష్మారెడ్డి అన్నారు. -
‘108’లోనూ అవినీతి.. తెలంగాణ కంటే 4లక్షలు ఎక్కువ ఖర్చు!!
సాక్షి, షాద్నగర్ : 108 వాహనాల కొనుగోళ్లలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ వైద్యాశాఖ తాజా మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆరోపించారు. షాద్నగర్లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఒక్కో 108 వాహనానికి తెలంగాణ ప్రభుత్వం కంటే రూ. నాలుగు లక్షలు ఎక్కువగా పెట్టి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, దీని వెనుక అవినీతి జరిగిందని ఆయన తెలిపారు. జన్మభూమి కమిటీలతోనే చంద్రబాబు సర్కార్ అవినీతి మొదలైందని, మహబూబ్నగర్లో కరువు పేరుతో ప్రపంచబ్యాంకు నిధులను తెచ్చి దోచుకున్న చరిత్ర చంద్రబాబుదని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అవినీతిపై ప్రచారం చేస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు. -
‘ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు’
కామారెడ్డి క్రైం: టెక్నాలజీని వాడుకుని ఈవీఎం యంత్రాలను ట్యాంపరింగ్ చేయడంతోనే టీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వచ్చాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఓటమి ఎదురైనందుకు తాను ఇలా మాట్లాడటం లేదన్నారు. సాంకేతికతపై అవగాహన ఉన్నందునే మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన గంపగోవర్ధన్కు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. తాను నియోజకవర్గంలో 45 రోజలు పాటు ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చే శానన్నారు. అలాగే ప్రజలు అన్నిచోట్ల నుంచి బీజేపీకి ఓట్లు వేశారని పేర్కొన్నారు. ప్రజలు బీజేపీపై విశ్వాసంతో ఓట్లు వేసినా ట్యాంపరింగ్ చేయడంతోనే సీట్లు రాలేదన్నారు. లేదంటే ఎన్నికల ప్రచార సమయంలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో, ఎన్ని సీట్లు వస్తాయో సీఎం కేసీఆర్కు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. రెవెన్యూ, పోలీస్శాఖలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ ఖూనీ చేసిందన్నారు. నీతి, నిజాయితీలు, అవినీతి రహిత పాలనే అజెండాగా ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్తామన్నారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ విధానాన్ని తీసుకువచ్చేలా పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, అసెంబ్లీ కన్వీనర్ తేలు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కుంట లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షుడు బాలకిషన్, నాయకులు మహేశ్గుప్తా, నరేందర్రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం : బాణాల తాడ్వాయి: ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని, కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటు లో ఉండి వారి సమస్యలను తీ ర్చేలా కృషి చేయాలని బీజేపీ కామారెడ్డి జిల్లా అద్యక్షడు బా ణాల లక్ష్మారెడ్డి అన్నారు. తా డ్వాయి మండలంలోని క్రిష్ణాజివాడి గ్రామంలో శుక్రవా రం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పని చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం నుంచి ఏఒక్క గ్రామానికి నిధులు రాలేదని, కేంద్రం నుంచి ఎల్లారెడ్డి నియోజక వర్గానికి 13, 14ఆర్థిక నిధుల క్రింద రూ.157కోట్లు వచ్చాయని తెలిపారు. మోదీ ప్ర భుత్వం భారత దేశంలో ఉన్న ప్రతి గ్రామానికి రూ.కోట్లల్లో నిధులు విడుదల చేస్తే రాష్ట్రప్రభుత్వం తమ నిధులని చెప్పుకుంటున్నదని ఆరోపించారు. ఈ నెల 16న జుక్కల్, 17న బాన్స్వాడ, 18న కామారెడ్డి నియోజక వర్గాలలో సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యకర్తలు మరింత కష్టపడి రాబోయే ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకుడు మర్రి రాంరెడ్డి, నాయకులు వెంకన్న, బాలకిషన్, సురెందర్రెడ్డి, రమణారెడ్డి, వెంకట్రావు, సాయిబాబా, నర్సింహారెడ్డి, సతీష్, రవీందర్రావు, ఏడు మండలాల అ«ధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బూతు కమిటి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘ఆరోగ్యశ్రీ’ బంద్ విరమణ
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులు ఆందోళనను విరమించాయి. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో మాణిక్రాజ్తో ఆదివారం జరిగిన చర్చలు సఫలం కావడంతో వైద్య సేవల బంద్ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలంగాణ నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం ప్రకటించిం ది. తక్షణమే వైద్య సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాకేశ్ ‘సాక్షి’కి తెలిపారు. సీఈవో తమ సమస్యలకు సానుకూలంగా స్పందించారని, ఈ నెలాఖరుకు మరో రూ.150 కోట్లు్ల ఇచ్చేందుకు అంగీకరించారని ఆయన వెల్లడించారు. ఇప్పటికే రూ.150 కోట్లు చెల్లించినందుకు కృతజ్ఞతలు తెలిపామన్నారు. బకాయిలు పేరుకుపోవడంతో... ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ పథకాల కింద పేదలు, ఉద్యోగులకు నెట్వర్క్ ఆస్పత్రులు నగదు రహిత వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయి లు పేరుకుపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. రూ.1200 కోట్ల బకాయిలు ఉండటంతో ఆ రెండు పథకాల కింద లబ్ధిదారులకు వైద్య సేవలను గత నెల 20వ తేదీ నుంచి నిలిపేశాయి. ప్రభుత్వం రూ.150 కోట్ల వరకు విడుదల చేసింది. పూర్తిస్థాయి తీర్చలేదంటూ ఈ నెల 1 నుంచి పూర్తిస్థాయిలో ఇన్పేషెంట్, అత్యవసర వైద్య సేవలనూ నిలిపివేశాయి. ఆందోళనలపై సర్కారు ఆగ్రహం ఒకవైపు ఎన్నికలు జరుగుతుంటే, మరోవైపు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయటంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమయం సందర్భం లేకుండా సేవలను నిలిపివేయడంలో రాజకీయ స్వార్థం దాగుందని సర్కారు వర్గాలు అనుమానించాయి. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన పలువురు అధికారులు నెట్వర్క్ ఆస్పత్రుల తీరును ఖండించారు. చివరకు మంత్రి రంగంలోకి దిగి సీరియస్ కావడంతో చర్చలు జరగడం, బంద్ ఉపసంహరించుకోవడం చకచకా జరిగిపోయింది. అత్యవసర వైద్య సేవలను నిలిపేస్తున్న నెట్వర్క్ ఆస్పత్రులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తుండటంతో వాటి యాజమాన్యాల్లోనూ భయాందోళనలు ఏర్పడ్డాయి. చివరకు సంబంధిత ఆస్పత్రుల్లో కొన్నింటికి నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు జరిగాయి. ఈ పరిస్థితిని గమనించిన నెట్వర్క్ ఆస్పత్రులు వెనక్కు తగ్గాయన్న ప్రచారం జరుగుతోంది. -
ప్రతిపక్ష పార్టీలది దొంగల కూటమి
షాద్నగర్టౌన్: ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఓ కూటమిని ఏర్పాటు చేశాయని, ఆ కూటమిలో అందరు దొంగలు ఉన్నారని, మహా కూటమితోనే ఒరిగేదేమీ లేదని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం షాద్నగర్ నియోజకవర్గంలోని హాజిపల్లి, కిషన్నగర్ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. దొంగల కూటమిలో కాంగ్రెస్, టీడీపీలతో పాటు మరిన్ని పార్టీలు జతకట్టాయని, చంద్రబాబునాయుడు తెలంగాణకు వచ్చి ప్రచారం చేసినా ఒరిగేదేమీ లేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును ఆపాలని చంద్రబాబునాయుడు కేంద్ర వాటర్ బోర్డు కమిషన్కు లేఖలు రాశారని, ప్రచారానికి వచ్చే ఆయన ఎందుకు ప్రాజెక్టు పనులు ఆపారని ప్రజలు అడిగితే ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నించారు. ఎంత మంది చంద్రబాబునాయుడులు వచ్చినా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉంటారని చెప్పారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతం పూర్తిగా నిరాధారణకు గురైందన్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలను సీమాంధ్ర ప్రాంత నాయకులు తరలించుకపోయారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపట్టారని చెప్పారు. ఎందరో త్యాగాల పునాదుల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, కొట్లాది సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషిచేస్తున్నారని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. లక్ష్మిదేవునిపల్లి ప్రాజెక్టును పూర్తిచేస్తాం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందని, ఈ పథకంలో భాగంగా కొందుర్గు వద్ద లక్ష్మిదేవునిపల్లి ప్రాజెక్టును నిర్మించేందుకు రూపకల్పన చేసినట్టు మంత్రి చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ నాయకులు కోర్టులకు వెళ్లి కేసులు వేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తి కావాలంటే టీఆర్ఎస్ను తిరిగి అధికారంలోకి తీసుకరావాలని ఆయన ప్రజలను కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల కోసం రూ.42వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. టీఆర్ఎస్ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మెనిఫెస్టోను తయారు చేసిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తామని ప్రకటిస్తే.. కాంగ్రెస్ రెండు లక్షల రూపాయలను ప్రకటించిందని, ఇది కాంగ్రెస్ పార్టీ అవివేకానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో ఏ రైతుకూ రెండు లక్షల రూపాయల రుణం లేదన్నారు. కాంగ్రెస్ నేతలు తెలివితక్కువ దద్దమ్మలని, వచ్చే ఎన్నికల్లో ప్రజలను వారిని ఏవిధంగా ఎన్నుకుంటారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు. ప్రజలు ఈ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని, టీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు అందెబాబయ్య, శ్యాంసుందర్రెడ్డి, జిల్లెల వెంకట్రెడ్డి, సూర్యప్రకాష్, వెంకట్రాంరెడ్డి, లక్ష్మణ్, శోభ, వెంకట్రెడ్డి, నరేందర్, రఘునాథ్ యాదవ్, గుళ్లె కృష్ణయ్య, సంజీవరెడ్డి, యుగెందర్, సజ్జల కాశీనాథ్, శ్రీశైలం, చిల్కమర్రి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చల్లారేదెన్నడు ?
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: వేగంగా దూసుకెళ్లాలని ఉవ్విళ్లూ రుతున్న ‘కారు’కు అసమ్మతి నేతలు కొరకరాని కొయ్యలా తయారయ్యారు. అసెంబ్లీ రద్దు చేసిన వెనువెంటనే బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్లాలని భావించిన టీఆర్ఎస్కు ఈ అంశం మింగుడు పడటం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్, కల్వకుర్తి, షాద్నగర్, అలంపూర్ నియోజకవర్గాల్లో అసమ్మతి చిచ్చు రగిలింది. దీంతో జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు టీఆర్ఎస్ ముఖ్యలైన మంత్రులు కేటీఆర్, హరీశ్రావు జోక్యం చేసుకోవడంతో అసమ్మతి గళం సద్గుమణిగినట్లు కనిపించింది. అయితే ఒక్క అలంపూర్ మినహా మిగతా చోట్ల పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. స్వయంగా పార్టీ అభ్యర్థులకు ఫోన్లు చేసి ‘అసమ్మతి నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రచారంలో నిమగ్నం కావాలి.. ఏ ఒక్క గంటను కూడా వృథా చేయడానికి వీలులేదు. అసమ్మతి నేతలు లేరనుకుని ప్రచారంలో ముందుకు సాగండి’ అంటూ స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులకు కొండంత ధీమా వచ్చినట్లయింది. అభ్యర్థులను మార్చేది లేదు.. విపక్షపార్టీలకు చిక్కకుండా వేగంగా దూసుకెళ్లాలని భావించిన టీఆర్ఎస్ అభ్యర్థులకు అక్కడక్కడా అసమ్మతి నేతలు బ్రేకులు వేస్తున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చాలంటూ సభలు, సమావేశాలు ఏర్పాటుచేస్తుండగా.. మరికొన్ని చోట్ల ద్వితీయశ్రేణి నాయకత్వం పార్టీని వీడుతోంది. మక్తల్, కల్వకుర్తిలో అభ్యర్థులను మార్చాలనే డిమాండ్ కొనసాగుతుండగా.. అచ్చంపేట, దేవరకద్ర తదితర చోట్ల ద్వితీయశ్రేణి నేతలు పార్టీని వీడారు. అచ్చంపేట నియోజకవర్గానికి పలువురు కీలక నేతలు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వినికిడి. ఇలా ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని పరిస్థితులు పార్టీ అధిష్టానానికి చికాకు తెచ్చి పెడుతున్నాయి. నష్టనివారణకు... అభ్యర్థుల విషయమై అసంతృప్తి విషయంలో నష్టనివారణ చర్యల కోసం పార్టీకి చెందిన ముఖ్యులు కొంత కాలంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాకు చెందిన మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వంలోని కీలక మంత్రులు కేటీఆర్, హరీశ్రావు కూడా పలు దఫాలు అసంతృప్తులతో చర్చలు జరిపారు. పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల విషయమై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే టికెట్ ప్రకటించినట్లు నేతలకు సర్దిచెబుతున్నారు. అభ్యర్థుల విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న తుది నిర్ణయానికి అందరూ కట్టుబడి పార్టీ కోసం పనిచేయాలని హితబోధ చేశారు. పార్టీలో ఉన్న వారికి ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూసుకుంటామని... భవిష్యత్లో మంచి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో కొందరు అసమ్మతి నేతలు వెనక్కి తగ్గారు. అయితే, కొన్ని చోట్ల మాత్రం వెనక్కి తగ్గినట్లే తగ్గి.. మళ్లీ నిరసనల గళం వినిపిస్తుండడం గమనార్హం. ఎంపీ జితేందర్రెడ్డిపై ఒత్తిడి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈనెల 5న వనపర్తిలో ఎన్నికల ప్రచార సభ ఏర్పాటుచేశారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానుండగా.. అప్పటి లోగా అసమ్మతి పూర్తిగా తగ్గిపోవాలని ఆదేశాల మేరకు ముఖ్యనేతల సంప్రదింపులు ముమ్మరం చేశారు. మక్తల్ నియోజకవర్గ ం విషయంలో మహబూబ్నగర్ ఎంపీ జితేందర్రెడ్డిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసమ్మతి గళం వినిపించే వారందరు కూడా ఎంపీ అనుచరగణంగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యం లో ఆదివారం మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన సభలో... పార్టీ అభ్యర్థి చిట్టెం రామ్మో హన్రెడ్డిపై అసమ్మతినేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. కొందరు ఏకంగా చిట్టెంను వ్యక్తిగతంగా దూషించారు. పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థిపై అసభ్యపదజాలాన్ని ఉపయోగించినా... పార్టీ ముఖ్యులు ఉపేక్షించడంలో మతలబు ఏమిటని చిట్టెం వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. అలాగే పార్టీ అధిష్టానం నుంచి కూడా ఒత్తిళ్లు పెరుగుతుండడంతో ఎంపీ జితేందర్రెడ్డి ఆగమేఘాల మీద సోమవారం మక్తల్ వెళ్లి... అసంతృప్తుల విషయమై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కేసీఆర్ మాటే వేదంగా టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రాంమోహన్రెడ్డి విజయానికి అందరూ కృషి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కల్వకుర్తిలో తర్జనభర్జన రాజకీయ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే క ల్వకుర్తి విషయంలో అసమ్మతి వర్గం తర్జనభర్జన పడుతోంది. రాబోయే ఎన్నికలకు పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే టికెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. కసిరెడ్డికి పార్టీ టికెట్ ఇస్తే సులువుగా గెలవొచ్చంటూ వారి అనుచరులు పేర్కొంటున్నా రు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ జోక్యం చేసు కుని ముఖ్యనేతలందరితో సంప్రదింపులు చేసి, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచిం చారు. ఇటీవల నాగర్కర్నూల్లో నిర్వహించిన బహిరంగసభలో కూడా మంత్రి కేటీఆర్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ కసిరెడ్డి వర్గం మాత్రం ససేమిరా అంటోంది. స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగాలని కొంత కాలంగా ఒత్తిడి చేస్తున్నా.. ఆయన వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికీ కసిరెడ్డి వర్గం ఎక్కడా కూడా పూర్తిస్థాయిలో ప్రచారంలో పాల్గొనకుండా ప్రత్యేక సమావేశాలతో తర్జనభర్జనలు చేస్తుండడం గమనార్హం. -
టీఆర్ఎస్తోనే యువతకు భవిత
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్తోనే యువతకు భవిష్యత్తు ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలతోపాటు యువత కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ఇప్పటికే కేజీ టు పీజీ విద్యతోపాటు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల మెరుగు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల యువ నేతలు, కార్యకర్తలు భారీగా టీఆర్ఎస్లో చేరారు. లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఐదేళ్లల్లో తెలంగాణలో పేదరికం దూరం అవుతుందని, అప్పటికి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయని, తద్వారా తలసరి ఆదాయం పెరుగుతుందన్నారు. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా ఉందని చెప్పారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగి రాష్ట్రం సుభిక్షం గా మారుతుందన్నారు. గతంలో వివిధ పార్టీల్లో ఉన్నందువల్ల యువకులు కొందరు ఉద్యమంలో పాల్గొనలేక పోయారని, అలాంటి వాళ్లంతా ఇప్పుడు టీఆర్ఎస్లో చేరి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్నే గెలిపిద్దామని ప్రజలు నిర్ణయించుకున్నారని మంత్రి తెలిపారు. ఒకప్పుడు ఊళ్లకు వెళితే ప్రజలు మాకేమిస్తారని అడిగేవారని, ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థులకు డబ్బులు ఎదురు ఇస్తూ, ఓటు వేస్తామని ప్రమాణాలు చేస్తున్నారని, ఏకగ్రీవ తీర్మానాలు చేసి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. 2009లో కేసీఆర్ దీక్ష చేసిన సమయంలో యూ టర్న్ తీసుకుని అనేక మంది ఉసురు పోసుకున్న చరిత్ర కాంగ్రెస్దన్నారు. ఎంపీ జితేందర్రెడ్డి మాట్లాడుతూ గుజరాత్ కంటే తెలంగాణలో ఆర్థిక ప్రగతి అద్భుతంగా ఉందంటూ ప్రధాని మోదీ పార్లమెంట్లోనే చెప్పారన్నారు. కార్యక్రమంలో నాటక అకాడమీ చైర్మన్ బద్మీ శివకుమార్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
రాసి పెట్టుకోండి..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : ‘ఉమ్మడి జిల్లాలో దాదాపు అన్ని స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. ఈ రోజు నేను అంటున్నానని కాదు.. ఈ మాట రాసి పెట్టుకోండి.. పాలమూరు ప్రాంతంలో టీఆర్ఎస్ విజయ దుదుంభి మోగిస్తుంది. 60 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరును వెనకబడిన ప్రాంతంగానే ఉంచారు. టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల పాలనలో ఎంతో మార్పు వచ్చింది. ఇంకా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవన్నీ నెరవేరి పాలమూరు ప్రజల తలరాత మారాలంటే మరోసారి టీఆర్ఎస్ను గెలిపించుకోవడం చారిత్రక అవసరం. ప్రజలు కూడా ఇంకోసారి టీఆర్ఎస్, కేసీఆర్ను ఆశీర్వదించడం ఖాయం’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి అంశాలు ప్రభావితం చూపుతాయి, ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పరిస్థితి, విపక్షాల విమర్శలు, అసంతృప్తి నేతల వేరు కుంపట్లు తదితర అంశాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... వారిది అసమర్థ నాయకత్వం పాలమూరు ప్రాంతం అంటే కరువు, కాటకాలతో సతమతమయ్యేదనే ముద్ర పడింది. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వెనకబడిన ప్రాంతాల్లో పాలమూరు ఒకటి. ఇలా కావడానికి గత పాలకులే కారణం. ఎందుకంటే పాలమూరులో పుష్కలమైన వనరులు ఉన్నాయి. తలాఫున కృష్ణమ్మ పారుతున్నా... సాగు, తాగునీరు అందించలేని అసమర్థ నాయకత్వం గత పాలకులది.60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ చేయని అభివృద్ధిని... టీఆర్ఎస్ కేవలం నాలుగున్నర ఏళ్లలో చేసి చూపించింది. సమస్యలు అధిగమిస్తున్నాం.. విపక్షనేతలకు ఎంతసేపు రాజకీయం చేయాలనే ధ్యాసే తప్ప అభివృద్ధిలో పాలు పంచుకోవాలనే ఆలోచన లేదు. ఉదాహరణకు ఒక విషయం చెబుతా... పాల మూరులో తీవ్ర వర్షాభావంవల్ల అశించినంతగా సాగు జరగడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన పాలమూరు–రంగారెడ్డిని ప్రారంభించారు. ఇంత పెద్ద ప్రాజెక్టు వచ్చినప్పు డు ఏం చేయాలి? రాజకీయాలకు అతీతంగా అం దరూ కలిసి మెలిసి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలి. కానీ ప్రతిపక్షాల నాయకులు ప్రతీ చిన్న విషయానికి కోర్టుల్లో కేసులు వేశారు. ఫలితంగా మూడు, నాలుగేళ్లలో పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు పనులు నెమ్మదించాయి. అయితే వారు ఎన్ని చిక్కులు సృష్టిస్తున్నా... సీఎం కేసీఆర్ చాకచక్యంగా వ్యవహరించి సమస్యలను అధిగమిస్తున్నారు. మాటలతో మభ్యపెట్టారు. కాంగ్రెస్ నేతలకు మాటలు తప్ప మరేం చేతకాదు. ప్రాజెక్టులను వాళ్లు 90శాతం పూర్తి చేసినట్లయితే.. పది శాతం పనులే అడ్డంకయ్యాయా? 60 ఏళ్లుగా వాళ్లు ఇలాంటి మోసపూరిత మాటలతోనే మభ్యపెట్టారు. అభివృద్ధి విషయంలో వాళ్లు కళ్లు ఉండి కబోదులు. ఈ రోజు నాగర్కర్నూల్, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, మక్తల్, దేవ రకద్ర, అలంపూర్, గద్వాల నియోజకవర్గాలకు వెళ్లి చూడమనండి. సాగునీరుతో ఆ ప్రాంత మంతా కోనసీమ మాదిరిగా పచ్చదనంతో కళకళలాడుతోంది. మేం కాదు స్థానిక ప్రజలే చెబుతారు టీఆర్ఎస్ ఏం చేసిందనేది. ఉత్తుత్తి ప్రచారమే.. పాలమూరు టీఆర్ఎస్ బలహీనంగా ఉందనేది ఉత్తి ప్రచారం మాత్రమే. ప్రస్తుతం పాలమూరు ప్రాంతంలో టీఆర్ఎస్కు.. కాంగ్రెస్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఒక్క విషయం చెప్పాలంటే ... పాలమూరులో కాంగ్రెస్కు నూకలు చెల్లాయి. ఆ పార్టీ అభ్యర్థులకు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కడం కూడా కష్టమే. మొత్తం 14 అసెంబ్లీ సీట్లలో విపక్షాలు ఒకటి, రెండు స్థానాలు గెలిస్తే గగనమే. టీఆర్ఎస్ స్వీప్ చేయడం ఖాయం. ఓర్వలేక ఒకటయ్యారు.. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఒక్కటవుతున్నారు. వారికి జెండా లేదు అజెండా లేదు. వారి చేస్తున్న ప్రయత్నాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. విపక్షాలన్నీ వంద మందితో కలిసి వచ్చినా... టీఆర్ఎస్ సింహం సింగిల్గా ఎదుర్కొంటుంది. ఈ ఎన్నికలు మహాభారతంలో కౌరవ, పాండవుల యుద్ధం లాంటిది. అంతిమంగా న్యాయమే గెలిచి తీరుతుంది. అసంతృప్తి సహజం ఏ రాజకీయపార్టీలోనైన కాస్త అసంతృప్తి సహ జమే. అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవు కదా. అంతెందుకు చేతికి ఉండే ఐదు వేళ్లు ఒకలా ఉండవు. పార్టీలో ఉండే వ్యక్తలు అందరూ ఒకలా ఆలోచించాలనేది గ్యారంటీ ఉండదు. కనుక ఒకటి, రెండు చోట్ల అభ్యర్థుల విషయంలో అసంతృప్తి సహజంగాగా బయట పడుతోంది. ఇప్పటికే అసంతృప్తులతో సంప్రదింపులు చేశాము. అన్ని కూడా ఒకట్రెండు రోజుల్లో ఓ కొలిక్కి వస్తాయి. అందరూ పార్టీకి పనిచేస్తారు ప్రస్తుతం కొందరు అభ్యర్థులపై ఉన్న అసంతృప్తి టీ కప్పులో తుఫాను వంటిది. దీనిని భూతద్దంలో చూడాల్సిన పనిలేదు. బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో మార్పు ఉండదు. ఇది ఫైనల్ అని ఇదివరకే పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక్కడ మరో ప్రశ్నకు తావే లేదు. ప్రకటించిన అభ్యర్థులే బరిలో ఉంటారు. అసంతృప్తి కూడా సద్గుమణుగుతుంది. ఆ తర్వాత అందరు కూడా పార్టీ అభ్యర్థుల గెలుపునకు పనిచేస్తారు. కనీవినీ రీతిలో అభివృద్ధి జడ్చర్ల నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా కనివినీ ఎరుగని విధంగా అభివృద్ధి పథంలో నడుస్తోంది. నియోజకవర్గంలోని గ్రామాలన్నింటికీ బీటీ రోడ్లు వేశాం. నియోజకవర్గ కేంద్రంలో డివైడర్తో కూడిన రెండు లేన్ల రహదారి నిర్మించాం. తాగునీటికి ఎంతో ఇబ్బంది ఉండే బాదేపల్లి, జడ్చర్ల పట్టణాలకు మిషన్ భగీరథ ద్వారా నీరు ఇస్తున్నాం. అంతేకాదు నా హయాంలోనే జడ్చర్లకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటై అభివృద్ధి చెందింది. జడ్చర్ల నుంచి గతంలో ఎందరో ప్రాతినిధ్యం వహించినా ఎవరు కూడా నేను చేసినంత అభివృద్ధి చేయలేదు. ఆస్పత్రులన్నీ బలోపేతం చేశా.. వైద్య ఆరోగ్యశాఖ నాదే కావడంతో ఒక్క నా నియోజకవర్గమే కాదు ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులన్నీ బలోపేతం చేశాను. జిల్లాల పునర్విభజన తర్వాత మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి జిల్లా ఆస్పత్రిని అత్యంత వెనకబడిన నారాయణపేటకు కేటాయించాల్సి వచ్చింది. అందుకే నా నియోజకవర్గమైన జడ్చర్లలోని అన్ని పీహెచ్సీలను 30 పడకల ఆస్పత్రులుగా మారుస్తానని చెప్పా ను. అందుకు అనుగుణంగా బాలానగర్లోని పీహెచ్సీ 30 పడకలు పనులు పూర్తయ్యా యి. నవాబుపేట, మిడ్జిల్లో పనులు చురు గ్గా సాగుతున్నాయి. ఒక రాజాపూర్లో మా త్రమే అవసరం లేదని చేపట్టడంలేదు. ఎం దుకంటే రాజాపూర్ మండలం అటు బాలానగర్, ఇటు జడ్చర్లకు అతి చేరువలో ఉంది. జడ్చర్లలో వంద పడకల ఆస్పత్రిని కూడా ఎన్నికల నాటికి పూర్తి చేస్తాం. ఇక ఫైర్స్టేషన్కు సంబంధించి పనులు కాస్త నెమ్మదిగా జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు సాధించగా.. స్థలసేకరణ కూడా పూర్తయ్యింది. అది సాధ్యమైనంత త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. -
మంత్రి లక్ష్మారెడ్డిపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
జడ్చర్ల: తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష్మారెడ్డి ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని విమర్శిస్తూ తీవ్రపదజాలం వాడారు. ప్రభుత్వ వాహనాలు వాడుకుంటూ భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రి నియోజకవర్గం జడ్చర్లలో వంద పడకల ఆసుపత్రి మాటలకే పరిమితమైపోయిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో కూడా కనీస వైద్య సౌకర్యాలు లేవని, జడ్చర్ల నియోజకవర్గానికి లక్ష్మారెడ్డి చేసింది శూన్యమని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో లక్ష్మారెడ్డిని ఓడించి మల్లు రవిని గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తే లేదని, అక్కడి నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. -
లక్ష మందికి కంటి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘కంటి వెలుగు’కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి రోజు దాదాపు లక్ష మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. వేలాది మందికి కళ్లజోళ్లు ఇచ్చారు. కొందరికి మాత్రలు ఇవ్వగా, మరికొందరికి శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. కంటివెలుగు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో 824 శిబిరాల్లో ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లో 561, పట్టణ ప్రాంతాల్లో 109, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 158 శిబిరాలు ప్రారంభమయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి వరకు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్లో ‘కంటి వెలుగు’పథకాన్ని తొలుత లాంఛనంగా ప్రారంభించారు. కొంతమందికి కళ్లద్దాలను అందజేశారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్నగర్ జిల్లా మరికల్లో కంటి శిబిరాన్ని ప్రారంభించారు. కళ్లజోళ్లు, మందులు ఉచితంగా అందజేశారు. కంటిని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో అనేకమంది వృద్ధులు తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకోవడంతో పండగ వాతావరణం నెలకొందని మంత్రి లక్ష్మారెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’తో అన్నారు. మొదటిరోజు కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైందని, ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుందని వారు వివరించారు. -
సీజనల్ వ్యాధుల నివారణకు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ‘ఏజెన్సీకి ఫీవర్’ శీర్షికతో ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వ్యాధి నిర్ధారణ కిట్లు, మందులు సిద్ధం చేశామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టామని, గతంలోలాగే అధికారులు, వైద్యులు, సిబ్బందిని అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించామని మంత్రి చెప్పారు. వైద్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉంద న్నారు. ఈ సీజన్లో సాధారణం గా డెంగీ, స్వైన్ఫ్లూ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, వైరల్ హెపటైటిస్ (జాండీస్), విరేచనాలు, వాంతులు, డిప్తీరియా వంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయని, వైరల్, సీజనల్ వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంటుందన్నారు. అందుకని ఇలాంటి వ్యాధి లక్షణాలు కనిపించిన వారు వెంటనే సమీప ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్ళాలని సూచించారు. ఈ సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి, ప్రజలకు సత్వర వైద్యం అందడానికి వీలుగా వ్యాధి నిర్ధారణ కిట్లు, మందులతో సిబ్బంది, డాక్టర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ల్యాబ్ టెస్టులు చేయడానికి స్టాఫ్, కిట్లు, ఓపీలోనూ తగు సదుపాయా లు, ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ సిద్ధం చేశామన్నారు. దోమలు పెరగకుండా, నీళ్ళు నిల్వ ఉండకుండా, బురద, మురుగునీరు చేరకుండా, పారిశుద్ధ్యం సరిగా ఉండేలా మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ వంటి శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి... ఏజెన్సీ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఇప్పటికే మాట్లాడామన్నారు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో చర్చించామన్నారు. ప్రజల్లో వ్యాధుల పట్ల అవగాహన, చైతన్యం పెంచామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైద్యశాలల్లోనూ సదుపాయాలు, మందులు, పరికరాలు పెంచామని, అనేక మంది స్పెషలిస్టు డాక్టర్లను కూడా నియమించామని, దీంతో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ఇప్పుడిప్పుడే సీజనల్ వ్యాధు లు వస్తున్నాయని, వీటిని మొగ్గలోనే తుంచే విధంగా ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ప్రాథమిక దశలోనే వైద్యశాలలకు చేరితే ఎలాంటి ప్రమాదాలుండవన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి తదితరులతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. -
పారదర్శకంగా పోస్టింగులు: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైద్య విధాన పరిషత్ సహా మిగతా విభాగాల్లో కొత్తగా ఎంపిౖMðన అభ్య ర్థులకు పోస్టింగ్ల కేటా యింపుల్లో పారదర్శకత పాటించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా పోస్టింగులు ఇవ్వాలని సూచించారు. చరిత్రాత్మకంగా వైద్య ఆరోగ్యశాఖలో ఒకేసారి 1,133 పోస్టుల నియామకం చేపట్టగా, అందులో 919 పోస్టులు భర్తీ చేశామని, వారికి త్వరలో పోస్టింగ్లు కేటాయించాలని కోరారు. శనివారం వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంకా పూర్తి కావాల్సిన నియామకాల ప్రక్రియలో కూడా వేగం పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో ఏయే స్పెషాలిటీ డాక్టర్ల అవసరం ఉందో గుర్తించి, ఆయా చోట్ల వారిని నియమించాలని ఆదేశించారు. ప్రజా వైద్యానికి ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. కేసీఆర్ కిట్ల పథకంతో సర్కారీ దవాఖానాల్లో కాన్పుల సంఖ్య పెరిగినందున వాటిని దృష్టిలో పెట్టుకొని, ఎనస్థీసియా, స్త్రీ వ్యాధులు, ప్రసూతి నిపుణులను నియమించాలన్నారు. అలాగే ఇప్పటికే ప్రకటించిన, వివిధ స్థాయిల్లో ఉన్న నియామకాల ప్రక్రియల మీద కూడా మంత్రి సమీక్షించారు. -
నాడు పశువుల కాపరి నేడు పేదల వైద్యుడు
కృషి ఉంటే మనుషులు రుషులవుతారని అంటారు. లక్ష్మిరెడ్డి డాక్టర్ అయ్యారు. ఇరవై ఏళ్ల క్రితం పశువుల కాపరిగా ఉన్న లక్ష్మిరెడ్డి నేడు సివిల్ అసిస్టెంట్ సర్జన్గా మార్కాపురం ఏరియా వైద్యశాలలో ప్రభుత్వ వైద్యునిగా సేవలు అందిస్తున్నారు. మార్కాపురం మండలంలోని బిరుదులనరవ గ్రామంలో 1979లో పగడాల వెంకటరెడ్డి, సుబ్బమ్మలకు జన్మించిన డాక్టర్ లక్ష్మిరెడ్డి విద్యాభ్యాసం ఒకటి నుంచి నాల్గవ తరగతి వరకు దోర్నాల మండలం చిన్నదోర్నాలలోని వేమన విద్యాలయంలో జరిగింది. ఆరు నుంచి పది వరకు మార్కాపురం మండలంలోని తిప్పాయపాలెం హైస్కూల్లో జరిగింది. లక్ష్మిరెడ్డి టెన్త్లో ఫెయిల్ కావటంతో తల్లిదండ్రులు అతడికిక చదువు రాదని నిర్ణయించుకుని పశువులను మేపేందుకు పొలాలకు పంపారు. ఏడాది పాటు పశువుల కాపరిగా ఉన్న లక్ష్మిరెడ్డి ఇదే తన జీవితం కాదని, టెన్త్ పాస్ కావాలని నిశ్చయించుకున్నాడు. ఇన్స్టెంట్ పరీక్ష రాసి పాసయ్యాడు. మార్కాపురం ఎస్వీకేపీ డిగ్రీ కళాశాలలో ఇంటర్ చేరేందుకు వెళ్లగా టెన్త్ను ‘ఎట్ ఎ టైమ్’ పాస్ కాకపోవడంతో సీటు ఇవ్వలేమని చెప్పారు. దీనితో నల్లగొండలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చేరాడు. మళ్లీ రెండవ సంవత్సరం బేస్తవారిపేటలో చదివాడు. ఎంసెట్ లో 1600 ర్యాంక్ రావటంతో తిరుపతి వెటర్నరీ కళాశాలలో చేరాడు. దాంతో సంతృప్తి చెందని లక్ష్మిరెడ్డి మెడికల్ సీటు సాధించాలనే పట్టుదలతో మళ్లీ ఎంసెట్ రాశారు. ఈసారి 229వ ర్యాంక్ రావటంతో కర్నూలు మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆయన పట్టుదల అక్కడితో ఆగిపోలేదు. ఎంబీబీఎస్లో కూడా టాపర్గా నిలిచారు. తిరుపతి స్విమ్స్లో డయాబెటిస్లో కోర్సు పూర్తి చేశారు. 2007లో దూపాడులో వైద్యాధికారిగా విధుల్లో చేరారు. అప్పటికీ వైద్య వృత్తిలో ఇంకా ఏదో సాధించాలనే తపనతో పీజీ కోసం పరీక్ష రాశారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంఎస్లో సీటు వచ్చింది. కోర్సు పూర్తయిన అనంతరం 2015లో మార్కాపురం ఏరియా వైద్యశాలలో జనరల్ సర్జన్గా నియమితులయ్యారు. ఈ మూడేళ్ల కాలంలో లక్ష్మిరెడ్డి సుమారు రెండు వేల మైనర్ ఆపరేషన్లు, వెయ్యి మేజర్ ఆపరేషన్లు చేశారు. ఏ డాక్టర్ వద్దకు వెళ్లినా ఓపీ ఫీజు వందా, నూటాయాభై రూపాయలు ఉన్న ఈ రోజుల్లో పట్టణంలో ప్రజా వైద్యశాలను స్థాపించి ముప్పై రూపాయలు మాత్రమే తీసుకుంటూ పేదల డాక్టర్గా గుర్తింపు పొందారు లక్ష్మిరెడ్డి. నిరాశా నిస్పృహలు వద్దు ఎంసెట్లో మొదటి ప్రయత్నంలో మెడికల్ సీటు కోల్పోవటంతో ఇంటికి వచ్చేశా. అదే సమయంలో ‘నారాయణ’ విద్యా సంస్థల చైర్మన్ నాకు స్వయంగా ఫోన్ చేసి ఉచితంగా కోచింగ్ ఇప్పించడంతో రెండో ప్రయత్నంలో మెడికల్ సీటు సాధించా. దీనితో నా కల నెరవేరింది. పేదలకు మంచి వైద్యం అందించటమే నా లక్ష్యం. కృషి, పట్టుదల, శ్రమ ఉంటే సాధించలేనిదేమీ లేదు. ఇటీవల కాలంలో ఎంసెట్లో, నీట్లో ర్యాంక్లు రాలేదని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం చూస్తుంటే బాధ కలుగుతోంది. నిరాశ, నిస్పృహల్ని దగ్గరకు రానివ్వద్దు. పట్టుపట్టి చదివితే విజయం సాధించి తీరుతాం. అందుకు నేనే ఉదాహరణ. ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో మా సొంత ఊరెళ్లి తల్లిదండ్రులకు పొలం పనుల్లో సహాయం చేస్తుంటా. నాకు అది తృప్తినిస్తుంది. – డాక్టర్ లక్ష్మిరెడ్డి – జి.ఎల్.నరసింహారావు, సాక్షి, మార్కాపురం -
‘కళ్ల దానమే అంధత్వ నివారణకు మార్గం’
సాక్షి, హైదరాబాద్ : కళ్ల దానమే అంధత్వ నివారణకు మార్గమని ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. అవయవదానానికి అందరూ ముందుకు రావాలని కోరారు. బుధవారం సరోజనీ కంటి ఆస్పత్రిలో ఐ బ్యాంక్ను, నేత్రాల సేకరణకు రూ.కోటి విలువ చేసే అత్యాధునిక పరికరాలతో కూడిన అంబులెన్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐ బ్యాంక్ ఏర్పాటుతో సేకరించిన కార్నియాను రెండు నెలలవరకు నిల్వ ఉంచవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగు పర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద అంతా కలిసి ముందుకు వస్తే సర్కార్ ఆస్పత్రులను అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. -
వేగంగా ఎయిమ్స్ ప్రక్రియ: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రానికి మంజూరైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోందని వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంతర సంప్రదింపులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు త్వరితగతిన స్పందిస్తున్నారని చెప్పారు. అనుకున్న సమయానికి కంటే ముందుగానే కేంద్ర బృందం గురువారం రాష్ట్రానికి వచ్చిందని, బీబీనగర్లోని ప్రతిపాదిత ఎయిమ్స్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిందని తెలిపారు. వీలైనంత త్వరగా ఎయిమ్స్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. -
సుందర నగరానికి సహకరించాలి
కరీంనగర్కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో నూతనంగా కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ను సోమవారం కోర్టు చౌరస్తాలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్సిటీ హోదా దక్కించుకున్న కరీంనగర్ పరిశుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే నగరానికి స్వీపింగ్ మిషన్లు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వీపింగ్ మిషన్లు కొనుగోలు చేయడం ద్వారా నైట్ స్వీపింగ్ కార్మికులకు భారం తగ్గుతుందని, ప్రధాన రహదారుల్లో ప్రమాదాలను నియంత్రించొచ్చని పేర్కొన్నారు. రహదారులు పరిశుభ్రంగా ఉంటే నగరం సుందరంగా మారుతుందని, ప్రతి ఒక్కరూ సుందర నగరం కోసం సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, నగరపాలక సంస్థ కమిషనర్ శశాంక, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభం నగరంలోని 35వ డివిజన్ సప్తగిరికాలనీలో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి చేపట్టనున్న రూ.2.4కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత చిన్న సుందర నగరంగా కరీంనగర్కు గుర్తింపు ఉందని, కరీంనగర్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్సింగ్, కార్పొరేటర్ కవితబుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిపాపై ఆందోళన చెందవద్దు: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : కేరళను వణికిస్తున్న నిపా వైరస్పై రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. నిపా వ్యాధికి టీకాలు లేవని నివారణ ఒక్కటే మార్గమని ఆయన పేర్కొన్నారు. పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో నిపా వ్యాధి నిర్ధారణ పరీక్షల అవగాహనకు వచ్చిన మంత్రి.. ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్సీడీసీ)తో, మణిపాల్లోని మణిపాల్ సెంటర్ ఫర్ వైరాలజీ, రీసెర్చ్(ఎంసీవీఆర్)తో మాట్లాడినట్లు తెలిపారు. ప్రధాన వైద్యశాలల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి రాష్ట్రంలోని ఐపీఎం ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రజల్లో చైతన్యంతో ఇలాంటి వ్యాధులను అదుపు చేయడం, నివారించడం సాధ్యమన్నారు. -
రైతును రాజుగా చూడాలి..
రాజాపూర్(జడ్చర్ల) : రైతును రాజుగా చూడాలన్న లక్ష్యంతో దేశంలో ఎవరూ చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని దొన్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చొక్కంపేట గ్రామంలో రైతు బంధు పథకం చెక్కులను శనివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి ఆయన ప్రసంగిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తున్నది. రాజాపూర్ మండలం రైతులకు రూ.8కోట్ల పెట్టుబడి సాయం అందుతోందని తెలిపారు. రైతులు, వ్యవసాయాన్ని గత పాలకులు పట్టిం చుకోకపోగా.. తాము అధికారంలోకి వచ్చిన మొ దటి సంవత్సరంలోనే కోతలు లేని విద్యుత్, వ్యవసాయానికి పగలే నాణ్యమైన కరెంట ఇస్తున్నా మని తెలిపారు. వలసల జిల్లాగా పేరున్న పాలమూరు జిల్లా రైతాంగం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభిస్తే పనిలేని ప్రతిపక్ష నాయకులు కోర్టుల్లో కేసు లు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేస్తామన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గిరిధర్రెడ్డి పెట్టుబడి సాయంగా అందిన రూ.2లక్షల చెక్కును మంత్రి చేతుల మీదుగా ప్రభుత్వానికి అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, తహసీల్దార్ నర్సింగరావు, ఎంపీటీ సీ లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ గిరిధర్రెడ్డి, డీఎస్ఓ శారదా ప్రియదర్శిని, జేడి నిర్మల, ఏఓ నరేందర్, జడ్చర్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీశైలం యాదవ్తో పాటు వాల్యానాయక్, లక్ష్మణ్ నాయ క్, అభిమన్యురెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాయపడిన రైతుకు ఇంటి వద్దే పంపిణీ బాలానగర్(జడ్చర్ల) : రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగి చికిత్స పొందుతూ నడవలేని స్థితిలో ఉన్న గుండేడ్ గ్రామ రైతు జంగయ్యకు ఇంటి వద్దే మంత్రి లక్ష్మారెడ్డి పెట్టుబడి సాయం చెక్కు అందజేశారు. జంగయ్య కాలిలో రాడ్లు వేయడంతో లేవలేని స్థితిలోనే ఉన్నాడని తెలుసుకున్న మంత్రి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి చెక్కు ఇచ్చి పరామర్శించారు. టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్య నాయక్, మార్కెట్ డైరెక్టర్ర వెంకట్ నాయక్, వైస్ ఎంపీపీ లింగునాయక్తో పాటు చెన్నారెడ్డి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
రైతు కళ్లలో ఆనందం చూడాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్) : దాదాపు అరవై ఏళ్లుగా అరిగోస పడిన తెలంగాణ రైతాంగం కళ్లలో ఆనందం చూసేందుకే సీఎం కేసీఆర్ రైతులకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. స్థానిక జెడ్పీహాల్లో రైతుబంధు పథకంలో భాగంగా పట్టా పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణీపై బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. అనంత రం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చారన్నారు. ప్రతి అన్నదాత కళ్లలో ఆనందం చూడాలనే ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. రైతే రాజులా బ తికే విధంగా చేయాలన్నాదే సీఎం కేసీఆ ర్ లక్ష్యమన్నారు. పాస్ పుస్తకాల కోసం ఒక్కప్పుడు రైతుల, రెవెన్యూ కార్యాలయాల చుట్టు కాళ్ల అరిగేలా తిరిగే పరిస్థితి ఉండేదని, స్వరాష్ట్రంలో అధికారులే గ్రామాలకు వెళ్లి పాస్ బుక్కులు పంపిణీ చేస్తారన్నారు. రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసి రైతులకు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టామన్నారు. ప్రస్తుతం భూ రికార్డులో కాస్తు కాలం తొలగించి సులభతరం చేశామన్నారు. పెట్టుబడి కింద రైతులకు పంపిణీ చేసేందుకు రూ.6 వేల కోట్లు సిద్ధంగా ఉన్నాయని, వాటిలో రూ.4 వేల కోట్లు ఇప్పటికే ఆర్బీఐలో డిపాజిట్ చేశామన్నారు. తెలంగాణ రైతులకు సాగు, ఎరువులు, విద్యుత్, పెట్టుబడి ఇలా అనేక రకాలుగా రైతుల మేలు కోసం చేస్తున్న కార్యక్రమాలతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టా యని కేంద్రం నివేదికలు వెల్లడించా యన్నారు. ప్రతి అభివృద్ధి పథకానికి అడ్డుపడే అలవాటు ఉన్న ప్రతిపక్షాలు రైతు పెట్టుబడి పథకాన్ని కూడా అడ్డుకుంటాయేమోనని అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే షెడ్యూల్ ప్రకటన.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ నుంచి పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని కోరారు. పోస్టర్లు, బ్యానర్లతో ప్రచారం చేయాలన్నారు. త్వరలోనే పంపిణి షెడ్యుల్ను ప్రకటించనున్నట్లు వివరించారు. చెక్కులతోపాటు వెంటనే డబ్బులను డ్రా చేసుకునే విషయాన్ని రైతులకు చెక్కుల పంపిణీ సమయంలోనే వెల్లడించాలని సూచించారు. ప్రజాప్రతినిధులకు సమాచారం.. రైతులకు పెట్టుబడి పథకం అమలు చేస్తున్న సీఎం దేశంలో ఎక్కడ లేదని ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎస్ఆర్ రెడ్డి, రాంమోహన్రెడ్డిలు అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జా గ్రత్తలు తీసుకోవాలని కోరారు. పంపిణీ తేదీలను ఎమ్మెల్యేలతోపాటు, స్తానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల వారీగా పంపిణీ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్లు వివరించారు. కార్యక్రమంపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. రైతు పెట్టుబడి ఆర్ఎస్ఎస్లకే. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు పెట్టుబడి పథకంలో వచ్చే పెట్టుబడి నగదును వదులుకుంటే ఆర్ఎస్ఎస్ కార్పస్ ఫండ్కు జమ చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాంమోహన్రెడ్డి, ఎస్ఆర్రెడ్డిలు సూచించారు. ఆర్థికంగా ఉన్న ప్రజాప్రతినిధు లు తమకు వచ్చే పెట్టుబడిని స్వచ్ఛందంగా వదులుకోవాలని వారు పిలుపునిచ్చారు. వదులుకుంటే కార్పస్ ఫండ్కు.. ఎండల తీవ్రత వల్ల చెక్కల పంపిణి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు సాయంత్రం 5 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రొనాల్డ్రోస్ అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు పోతున్నట్లు తెలిపారు. స్థానికంగా రైతు సమన్వయ సమితిలు, ప్రజాప్రతినిధుల కలుపుకొని కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బ్యాంకర్లను సమాయత్తం చేసినట్లు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం నూతనంగా ముద్రించిన పాసుపుస్తకాలు, చెక్కులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ బస్వరాజ్గౌడ్, జేసీ వెంకట్రావ్, సబ్కలెక్టర్ కృష్ణాదిత్య, వ్యవసాయాధికారి సుచరిత, రైతుబంధు పథకం ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మైనారిటీల సంక్షేమానికి అనేక పథకాలు
బాలానగర్ (జడ్చర్ల) : రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఇందులో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని డిప్యూటీ సీఎం మహమూద్అలీ అన్నారు. బాలానగర్లోని జాతీయ రహదారి పక్కన మహ్మద్ నజీరొద్దీన్ అండ్ సన్స్ ఆధ్వర్యంలో అదునాతన సదుపాయలతో నూతనంగా నిర్మించిన మసీద్ను సోమవారం ఆయన మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింలను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే చూశాయని, టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముస్లింల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. రాబోయే కాలంలో ముస్లింల అభివృద్ధికి మరింత కృషిచేస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా మసీదుల అభివృద్ధితోపాటు, అందులో పనిచేసే గురువులకు జీతం ఇచ్చే ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. దేశంలోనే ఆదర్శ రాష్ట్రం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందన్నారు. రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు చేపట్టి అమలుచేస్తూ దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. తన నియోజకవర్గంలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన మసీద్ సదుపాయాలపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్, జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, నాయకులు వాల్యానాయక్, ఇబ్రహిం, దాస్రాంనాయక్, గోపాల్రెడ్డి, గిరిజన జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్నాయక్, మాజీ ఎంపీపీ నర్సింహులు, చెన్నారెడ్డి, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు. -
హైదరాబాద్లో కజాక్ ప్రొఫెసర్ల బృందం పర్యటన
సాక్షి, హైదరాబాద్ : విద్య, వైద్య రంగాల్లో పరస్పర సహకారం అందించుకునేందుకు భారత్, కజికిస్తాన్ ముందుకు వచ్చాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ కజికిస్తాన్ ప్రెసిడెంట్ ఫ్రొఫెసర్ అల్హనోవ్, డైరెక్టర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ పార్ట్నర్షిప్ ప్రొఫెసర్ అస్సన్తో కూడిన ప్రొఫెసర్ల బృందం సోమవారం హైదరాబాద్లో పర్యటించింది. వీరితో పాటు అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫ్ కజికిస్తాన్ భారత అధికార ప్రతినిధి డాక్టర్ బి.వవ్య సునీతరాజ్, నియో సీఈఓ డాక్టర్ బీవీకే రాజ్ ఉన్నారు. ఈ బృందం జేఎన్టీయూ హైదరాబాద్, ఉస్మానియా యూనిర్సిటీల వైస్ చాన్స్లర్లను అలాగే జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కలిసింది. కజికిస్తాన్లో మొత్తం 3 వేలమంది భారతీయ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తుండగా.. ఒక్క తెలంగాణ నుంచే 600 మంది వైద్య విద్యార్థులు ఉన్నారు. ఈ క్రమంలో వీరి కలయిక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి మధ్య వైద్య, విద్య ఆరోగ్య సంరక్షణకు సంబంధించి అనేక అంశాలు చర్చకు వచ్చాయి. కజాక్ లోని తెలంగాణ వైద్య విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని బృంద సభ్యులకు మంత్రి హామి ఇచ్చారు. అలాగే కజికిస్తాన్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తెలంగాణ విద్యార్థులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించే ఆలోచనలు కూడా చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కజికిస్తాన్ రాజధాని ’ఆస్తానా‘ నగరంగా అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దేందుకు సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్.రామచంద్రంతో పాటు, జేఎన్టీయూలో వీసీ, ప్రొఫెసర్ ఎ.వేణుగోపాల్ రెడ్డి, ప్రిన్సిపల్స్, డైరెక్టర్లతో సమావేశమైన బృంద సభ్యులు. ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ, మేనేజ్ మెంట్ కోర్సుల్లో కజికిస్తాన్ లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు.. ఉస్మానియా తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు ప్రొఫెసర్ అల్హనోవో వెల్లడించారు. ఇందుకు ఉస్మానియా వీసీ, జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. అలాగే ఫ్యాకల్టీలను కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవాలనే నిర్ణయానికి కూడా వచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంతరిక్ష పరిశోధన కేంద్రమైన బైక నోర్ కాస్మోడ్రామ్ లో అధ్యయనం చేసేందుకు ఉస్మానియా అధ్యాపక బృందాన్ని కజికిస్తాన్ ప్రతినిధి బృందం ఆహ్వానించింది. -
ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కృషి
సూర్యాపేట / హుజూర్నగర్ :రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, విద్యుత్శాఖ మంత్రి గుండకండ్ల జగదీశ్రెడ్డిలు పేర్కొన్నారు. సూర్యాపేట, హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లను మంత్రులు సోమవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ప్రజల ఆరోగ్యాలకు భరోసానిచ్చేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. అందులో భాగంగానే డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు చేయనున్నామన్నారు. శిబిరాల ద్వారా ప్రజలందరికీ పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇవ్వడంతో పాటు ఆపరేషన్లు కూడా చేస్తామన్నారు. కార్పొరేట్కు దీటుగా వైద్యసేవలు అం దించేందుకు ప్రభుత్వం పాటుపడుతోందని తెలి పా రు. సీఎం హామీ మేరకు నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నా రు. నల్లగొండలో భవనాలు సిద్ధంగా ఉన్నాయని.. సూ ర్యాపేట జిల్లా కేంద్రంలో స్థలాన్ని పరిశీలించామని.. త్వరలో కళాశాలలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా అంటేనే ఫ్లోరో సిస్ గుర్తుకు వస్తుందన్నారు. ఇలాంటి జిల్లాల ప్రజలకు మేలు చేసేందుకే సీఎం మిషన్ భగీరథ నీటిని ఇంటింటికీ సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ సురేంద్రమోహన్, కార్పొరేషన్ చైర్మన్ పర్యాద కృష్ణమూర్తి, డీఎంహెచ్ఓ మురళీమోహన్, డీసీహెచ్ఎస్ సంపత్కుమార్, సూర్యా పేట మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, బైరు దుర్గయ్యగౌడ్, నిమ్మల శ్రీనివాస్గౌడ్, వైవి, కట్కూరి గన్నారెడ్డి, గండూరి ప్రకాష్, శనగాని రాంబాబుగౌడ్, మారిపెద్ది శ్రీని వాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, కక్కిరేణి నాగయ్యగౌడ్, పుట్ట కిషోర్నాయుడు, నాతి సవిందర్కుమార్, హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీని వాస్ గౌడ్, వైస్ చైర్మన్ దొంతిరెడ్డి సంజీవరెడ్డి, ఎంపీపీ జి. నిర్మల, జడ్పీటీసీ ఎండీ.హఫీజా, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కె.శంకరమ్మ, రాష్ట్ర ఐడీసీ మాజీ డైరెక్టర్ సాముల శివారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లం ప్రభాకర్రెడ్డి, ఆర్డీఓ భిక్షానాయక్, వైద్యశాల సూపరింటెండెంట్ డా.ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు . -
వైద్యరంగాన్ని నిర్వీర్యం చేస్తున్న లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగాన్ని మంత్రి లక్ష్మారెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని టీపీసీసీ ఉపా ధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..‘పేదలకు అత్యంత అవసరమైన ప్రభుత్వ వైద్యరంగాన్ని, ఆస్పత్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉస్మానియాలో రెండు నెలలుగా అత్యవసర ఆపరేషన్లు చేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రచారం కోసం బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తామని చెబుతున్నా పెద్ద ఆస్పత్రుల్లోనే మందులు లేవు. ప్రభుత్వ వైద్యాన్ని నీరుగార్చి, ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులకు లాభం చేకూరే విధంగా మంత్రి లక్ష్మారెడ్డి వ్యవహరిస్తున్నారు’అని విమర్శించారు. -
క్యాన్సర్ కేంద్రంతో మెరుగైన సేవలు
పాలమూరు : మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన క్యాన్సర్ పాలియేటివ్ కేంద్రం ద్వారా రోగులకు మె రుగైన చికిత్స అందుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వె ల్లడించారు. జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఏడు పడకల క్యాన్సర్ పాలియేటివ్ కేంద్రాన్ని సోమవారం ఆయన ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడు, కలెక్టర్ రొనాల్డ్రోస్తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ దేశంలోనే రెండో పాలియేటివ్ కేంద్రం ఇక్కడ ప్రారంభించినట్లు తెలిపారు. అత్యంత ఆధునిక సదుపాయాలు ఈ కేంద్రంలో ఉంటాయన్నారు. ఈ కేంద్రం ద్వారా క్యాన్సర్ తో బాధపడుతూ చివరి దశలో ఉన్న రోగులకు అండగా ఉంటూ అవసరమైన వైద్యం లభిస్తుందని తెలిపారు. త్వరలో జనరల్ ఆస్పత్రి వెనుక భాగం గా పాలియేటివ్ కేంద్రానికి శాశ్వత భవనం నిర్మించడంతో పాటు పది పడకలకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. కాగా, జిల్లాలోని ఆస్పత్రుల్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన లేబర్ రూంలు ఏర్పాటుచేసి, గర్భిణులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ఎరుగైన వైద్యం అందజేస్తున్నామని తెలిపారు. జనరల్ ఆస్పత్రిలో ఉన్న ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఇక్కడే నిపుణులు ఉమ్మడి జిల్లా నుంచి ఎవరు కూడా వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిపుణులను నియమించి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లాకు మెడికల్ కళాశాల వచ్చిన తర్వాత నిపుణులైన వైద్యులు అందుబాటులోకి వచ్చారని.. దీంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. ఇప్పుడు ఉన్న ఆస్పత్రి సరిపోవడం లేదనందున పక్కనే ఉన్న స్థలంలో మరో భవన నిర్మాణానికి కూడా శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధ, డీఎంహెచ్ఓ రజని, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, డాక్టర్ మీనాక్షి, మల్లికార్జున్, మాస్ మీడియా అధికారి వేణుగోపాల్రెడ్డి, సునీల్, శ్రీనివాసరాజు, డాక్టర్ రాధ, చక్రధర్గౌడ్, పరంజ్యోతి, సునందిని, సత్యనారాయణరెడ్డి, భీంరెడ్డి, మధుసూదన్రెడ్డి, డాక్టర్ జీవన్, అధికారులు పాల్గొన్నారు. 45మంది ఏఎన్ఎంలకు వాహనాలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన అమలవుతున్న ‘ప్రాజెక్టు రెక్కలు’ పథకంలో భాగంగా 45మంది ఏఎన్ఎంలకు ద్విచక్ర వాహనాలను మంత్రి లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్యే, కలెక్టర్ అందజేశారు. నర్మద హోండ, అశ్విని హీరో షోరూం నుంచి ఏఎన్ఎంలకు వాటిని అందజేశారు. జిల్లాలో మొత్తం 270మంది ఏఎన్ఎంలకు మొదటి విడతలో 45మందికి వాహనాలు ఇచ్చారు. ఆనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ వాహనాల ద్వారా ఏఎన్ఎంలు క్షేత్రస్థాయిలో పర్యటించి వైద్యం అందించడానికి సలువుగా ఉంటుందన్నారు. ఎన్హెచ్ఎం కింద రూ.10వేలు, కలెక్టర్ నిధుల కింద రూ.5వేలు, షోరూం వాళ్లు రూ.3వేలు తగ్గింపు చేసి ఇస్తున్నట్లు తెలిపారు. -
చిన్నారుల్లో రక్తహీనత, కంటి సమస్యలెక్కువ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిన్నారుల్లో రక్తహీనత, కంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. పేదరికం, పోషకాహారలోపం, అవగాహన లేకపోవడం తదితర కారణాలతో ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. సమస్యను ప్రాథమిక స్థాయిలోనే నివారించేందుకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా చేయిస్తున్నామని బుధవారం శాసనమండలిలో వెల్లడించారు. ‘రాష్ట్రీయ బాల స్వాస్థ్య పథకం’లో భాగంగా 300 బృందాలను ఏర్పాటు చేశామని, ఒక్కో బృందంలో ఇద్దరు వైద్యులు, ఓ ఏఎన్ఎం, ఫార్మసిస్టు ఉంటారని.. వీరు అన్ని గ్రామాల్లో 18 ఏళ్ల లోపు వయసు వారిని పరీక్షించి ఆరోగ్య సమస్యలు గుర్తిస్తారని చెప్పారు. రాష్ట్రంలో 60 లక్షల మందిని పరీక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికి 36 లక్షల మందిని పరీక్షించామని వెల్లడించారు. వీరిలో 1.83 లక్షల మందికి ఆరోగ్య సమస్యలున్నట్లు గుర్తించగా.. ఎక్కువ మంది రక్తహీనత, నేత్ర సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసిం దన్నారు. ఇప్పటికే 28 వేల మందికి శస్త్రచికిత్సలు నిర్వహించామని వివరించారు. రాష్ట్రంలో జికా లేదు : జికా, ఎబోలా లాంటి ప్రమాదకర వైరస్లు రాష్ట్రంలో లేవని మంత్రి వెల్లడించారు. సభ్యుడు సుధాకరరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. వైరస్ల ప్రభావం రాష్ట్రంలో లేకున్నా ముందు జాగ్రత్తగా విమానాశ్రయంలో పరీక్ష కేంద్రం, గాంధీ ఆస్పత్రిలో మరో కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు..
శిశు మరణాలు తగ్గాయి: మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెరగడంతో నవజాత శిశు మరణాలు తగ్గాయని చెప్పారు. ప్రతి వెయ్యి మంది నవజాత శిశువుల్లో గతంలో 39 మంది చనిపోయేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 31కి తగ్గిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23 ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయని, మరో 12 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్రెడ్డి, చింతా ప్రభాకర్, పువ్వాడ అజయ్కుమార్ అడిగిన ప్రశ్నలకు లక్ష్మారెడ్డి సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ఏటా 6.5 లక్షల జననాలు నమోదవుతున్నాయని, అందులో లక్ష మందికి ప్రత్యేక శిశు సంరక్షణ కేంద్రాల సేవలు అవసరమవుతున్నాయని చెప్పారు. రోజూ 1.23 కోట్ల లీటర్ల పాల వినియోగం రాష్ట్రవ్యాప్తంగా 1,23,73,000 లీటర్ల పాల వినియోగం జరుగుతోందని, 1,05,68,000 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. అవసరానికి సరిపడా పాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్లోని విజయ డెయిరీ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న రెండు లక్షల లీటర్ల నుంచి పది లక్షల లీటర్లకు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్గౌడ్, సోలిసేట రామలింగారెడ్డి అడిగిన ప్రశ్నకు తలసాని సమాధానం ఇచ్చారు. పహాడీ షరీఫ్ అభివృద్ధి: మహమూద్ అలీ రంగారెడ్డి జిల్లా పహాడీ షరీఫ్ హజ్రత్ బాబా షర్ఫుద్దీన్ దర్గా అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. దర్గాను ప్రస్తుతం ఉన్న రహదారికి అనుసంధానించేందుకు సీసీ రోడ్డు, విశాలమైన పార్కింగ్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ బలాల, సయ్యద్ అహ్మద్ ఖాద్రీ, ముంతాజ్ అహ్మద్ ఖాన్, ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ అడిగిన ప్రశ్నలకు మహమూద్ అలీ సమాధానం ఇచ్చారు. దర్గాకు ఇప్పటికే రూ.9.6 కోట్లు కేటాయించామని, రెండో దశలో రూ.25 కోట్లతో సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. -
5 లక్షల మందిలో.. 2 వేల మందికి కేన్సర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏర్పాటు చేసిన కేన్సర్ స్క్రీనింగ్ కేంద్రాల ద్వారా 5 లక్షల మందిని పరీక్షించగా, రెండు వేల మందికి కేన్సర్ నిర్ధారణ అయిందని వైద్య, ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు కర్నె ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. స్క్రీనింగ్ కేంద్రాల ద్వారా కేన్సర్ను ముందుగానే గుర్తించడానికి వీలవుతుందన్నారు. త్వరలో అన్ని జిల్లాల్లోనూ కేన్సర్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రిలో ప్రైవేటు కంటే అత్యాధునిక పరికరాలు, వైద్యం అందుబాటులో ఉన్నాయన్నారు. మిషన్ కాకతీయపై సభ్యులు పాతూరి సుధాకర్రెడ్డి, గంగాధర్గౌడ్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్రావు సమాధానమిచ్చారు. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు సాగులోకి రానుందన్నారు. ఇప్పటివరకు 2.85 లక్షల ఆయకట్టు స్థిరీకరించగలిగామని చెప్పారు. పంట దిగుబడులు పెరిగాయన్నారు. వరి ఉత్పాదకత 4.4 శాతం పెరిగిందన్నారు. పత్తి ఉత్పాదకత 11.6 శాతం, మొక్కజొన్న 6.7 శాతం పెరిగిందన్నారు. చేపల దిగుబడి 36 నుంచి 39 శాతానికి పెరిగిందన్నారు. మిషన్ కాకతీయతకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు. మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం ఒక్క పైసా విడుదల చేయలేదని విమర్శించారు. మహారాష్ట్రలోనూ మిషన్ కాకతీయ స్ఫూర్తితో కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఖమ్మంలో పండ్ల మార్కెట్: హరీశ్రావు పండ్ల మార్కెట్లపై సభ్యులు బోడకుంటి వెంకటేశ్వర్లు, బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు అడిగిన ప్రశ్నకు హరీశ్రావు సమాధానమిస్తూ, అవసరమైన చోట్ల పండ్ల మార్కెట్లకు అనుమతి ఇస్తామని చెప్పారు. సభ్యుల కోరిక మేరకు ఖమ్మంలోనూ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పండ్లను మాగబెట్టడానికి కాల్షియం కార్బైడ్ వాడినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే 19 మందిపై కేసులు వేసి, జైలుకు పంపించామన్నారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ను రంగారెడ్డి జిల్లా కొహెడలో, జగిత్యాల మామిడి పండ్ల మార్కెట్ను చెల్గల్ గ్రామంలో ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదించామన్నారు. వారికి ‘పెట్టుబడి’ ఇవ్వలేం మహమూద్ అలీ పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.4 వేలు ఇవ్వడం సాధ్యం కాదని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. సభ్యులు కర్రె ప్రభాకర్, బాలసాని లక్ష్మీనారాయణలు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2004కు ముందు పోడు చేసు కునే వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పారని, కానీ వారికి పట్టాలు ఇవ్వలేదని బాలసాని పేర్కొన్నారు. కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ, రాచకొండ ప్రాంతం లో మంచాల్, సంస్థాన్నారాయణపురం మండలాల్లో పట్టాలు ఇచ్చారన్నారు. 2015 వరకు వారికి పహాణీలు కూడా ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పుడు పేర్లు లేకపోవడంతో వారికి రూ.4 వేల చొప్పున పెట్టు బడి సాయం అంద దని అన్నారు. దీన్ని పరిష్కరించాలని కోరారు. అదంతా అటవీ శాఖ పరిధిలోదని మహమూద్అలీ పేర్కొనగా, కాదని కర్నె అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు పైగా ఉన్న పోడు భూములను సాగు చేసుకునే గిరిజనులకు ఎలా రక్షణ ఇస్తారని సభ్యులు రామచందర్రావు ప్రశ్నించారు. సానుకూలంగా స్పందిస్తామని మహమూద్అలీ పేర్కొన్నారు. మల్లెపల్లి ఐటీఐకి చెందిన భూములపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, నైస్ ఆస్పతికి ఎకరా భూమిని గత ప్రభుత్వం లీజుకు ఇచ్చిందని, అందులో నిర్మాణం జరిగిందని, లీజు రద్దుపై ఆలోచిస్తున్నామని చెప్పారు. -
నిమ్స్కు అగర్వాల్ సమాజ్ బహుమానం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్యశాలలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తోన్న అగర్వాల్ సమాజ్ సహాయత సేవా ట్రస్ట్ తాజాగా నిమ్స్ ఆస్పత్రికి పూర్తిస్థాయి ఐసీయూని బహుమానంగా అందజేసింది. నిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం నిర్వహించనున్న మెగా హెల్త్ క్యాంపు సందర్భంగా ఈ నూతన ఐసీయూని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. సుమారు రూ.60 లక్షల విలువైన ఈ అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 5 వెంటిలేటర్లు, 7 మానిటర్లు, 6 వీల్ చైర్లు, 2 ట్రాలీలు, వెయిటింగ్ రూమ్ వద్ద స్టీల్ సోఫా సెట్లు, 2 ఎల్ఈడీ టీవీలు ఉన్నాయి. ‘ఇది వరుసగా రెండో మెగా హెల్త్ క్యాంపు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రికి డయాలసిస్ మెషీన్ను అందజేశాం. ఇప్పుడు నిమ్స్కి పూర్తిస్థాయి ఐసీయూని ఇస్తున్నాం. వచ్చే మెగా క్యాంపు నాటికి ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రికి మొబైల్ యూనిట్స్ ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులకు అందించే పరికరాలు, సదుపాయాలు నిజమైన పేదవారికి అందుతాయి. అది మా ట్రస్ట్కి ఎంతో సంతోషం కలిగించే అంశం’అని అగర్వాల్ సమాజ్ సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రాజేశ్ అగర్వాల్ అన్నారు. -
‘ఎయిమ్స్’కు నిధులు విడుదల చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ను పూర్తి స్థాయి హెల్త్ హబ్గా మార్చేందుకు దోహదపడే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర వైద్య ఆర్యోగ శాఖ మంత్రి జేపీ నడ్డాను రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. శుక్రవారం కేంద్ర మంత్రులను పార్లమెంటులో కలుసుకున్న ఆయన తెలంగాణకు ఎయిమ్స్ ప్రకటించి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదని వివరించారు. ఎయిమ్స్ ఏర్పాటు అవసరమైన స్థలం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అనంతరం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ను కలిసిన లక్ష్మారెడ్డి ఎయిమ్స్ ఏర్పాటు ప్రక్రియపై చర్చించారు. కేంద్ర మంత్రులను కలిసిన వారిలో టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్రెడ్డి, జి.నగేశ్, సీతారాంనాయక్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు ఉన్నారు. -
ఎయిమ్స్ కోసం ఆఖరి ప్రయత్నం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి రావాల్సిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) దోబూచులాటకు తెరపడుతోంది. దాదాపు నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న కేంద్రం నిర్ణయంపై స్పష్టత రానుంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కేంద్రానికి విన్నవిస్తున్నా ఎయిమ్స్పై స్పందన లేకపోవడం, తాజా కేంద్ర బడ్జెట్లోనూ ఆ ఊసే ఎత్తకపోవడంతో.. కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డాను స్వయంగా కలసి మరోసారి విన్నవించేందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్తున్నారు. రాజకీయ నిర్ణయం మినహా.. ఎయిమ్స్ను యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ క్యాంపస్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఎయిమ్స్ మంజూరుకు అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని పేర్కొంది. కేంద్ర ఆరోగ్య శాఖ సైతం ఇదే అభిప్రాయంతో ఉంది. రాజకీయ నిర్ణయం మినహా ఇతర సమస్యలేవీ లేవని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ కూడా ఇటీవలి రాష్ట్ర పర్యటన సందర్భంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్పై కేంద్రం నుంచి రాజకీయ నిర్ణయం వెలువడేలా ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎయిమ్స్ కోసం ఇదే ఆఖరి ప్రయత్నమని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ఐసీయూ అలంకారప్రాయం..
ఉట్నూర్(ఖానాపూర్) : ఏజెన్సీ గిరిజనులకు అత్యవసర వైద్యం అంద ని ద్రాక్షగానే మిగిలింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు లక్ష్మారెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి గత నెల 21న ఉట్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో అట్ట హాసంగా ప్రారంభిం చిన ఐసీయూ, డయాలసిస్ కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని ఆశపడ్డ ఏజెన్సీవాసులకు నిరాశే మిగిలింది. ముఖ్యంగా ఐసీయూ, డయాలసిస్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యాధికారులను నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిన ఏంబీబీఎస్లను నియమించినట్లు తెలిసింది. గిరిజనులకు వైద్య సౌకర్యాల కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం వైద్య సేవలు అందించే వైద్యాధికారులపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా అత్యధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నా గిరిజనులకు మెరుగైన వైద్యం అందడం లేదు. ఐసీయూలో ఎంబీబీఎస్లే దిక్కు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సదుపాయాలు మరింత చెరువ చేసేందుకు ప్రభుత్వం తెలంగాణ వైద్య విధాన పరిషత్ ద్వారా ఏప్రిల్లో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యునిట్)ను రూ. 22 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసింది. ఐసీయూలో విధులు నిర్వహించేందుకు యూనిట్ హెడ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(అనస్థీషియా), ఇద్దరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (జనరల్ మెడిసిన్), ఇద్దరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (పాల్మనరీ మెడిసిన్)లను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు ఆరుగురు స్టాఫ్ నర్సులు, ఒక్కొక్కరి చొప్పున ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలాజీ టెక్నీషీయన్, వెంటిలేటర్ టెక్నీషియన్, ఎనిమిది మంది ఎమ్ఎన్వో, ఏఫ్ఎన్వోలు, మూగ్గురు సెక్యూరిటీ గార్డులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేలా చర్యలు చేపట్టింది. ఐసీయూ కేంద్రంలో సెంట్రలైజ్డ్ ఏసీ సౌకర్యం, సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిస్టం ఏర్పాటు చేశారు. పది పడకల సామర్థ్యం గల యూనిట్ ఆస్పత్రి పర్యవేక్షకుడికి సంబంధం లేకుండా పూర్తిగా స్వయం ప్రతిపత్తి యూనిట్లుగా ఇన్చార్జీల పర్యవేక్షణలో ఉండేలా జాతీయ ఆరోగ్య మిషన్ చర్యలు చేపట్టింది. అయితే ఉట్నూర్ ఐసీయూ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యాధికారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఉన్నతాధికారుల సూచనలతో ఐదుగురు ఏంబీబీఎస్ వైద్యాధికారులను ఐసీయూ కేంద్రంలో విధులు నిర్వహించేలా నియమించినట్లు ఆస్పత్రి సుపరింటెండెంట్ పేర్కొంటున్నారు. అత్యవసర వైద్య సేవలు ప్రత్యేక వైద్యాధికారుల పర్యవేక్షణలో నిర్వహణ సాగితే మేలు జరుగుతుంది తప్ప ఎంబీబీఎస్ వైద్యులు నిర్వహణ కొనసాగిస్తే ప్రయోజనం ఉండదని గిరిజనులు వాపోతున్నారు. నెప్రాలజీ లేక.. కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తశుద్ధి కోసం ప్రభుత్వం సామాజిక ఆరోగ్య కేం ద్రంలో ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేసింది. ఒకేసారి ఐదుగురు బాధితులకు రక్తశుద్ధి చేసేలా ఐదు డయాలసిస్ యునిట్లు ఏర్పాటు చేసి కేంద్రం నిర్వహణ బాధ్యతలను ‘డీమెడ్’ అనే సంస్థకు అప్పగించింది. డయాలసిస్ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ఇద్దరు టెక్నికల్ అధికారులు, ముగ్గురు స్టాఫ్నర్సులు ఉన్నప్పటికీ డయాలసిస్ సమయంలో బాధితులను అన్ని విధాలా పర్యవేక్షించే అతి ముఖ్యమైన వైద్యాధికారి నెప్రాలజిస్ట్ లేక పోవడంతో కేంద్రం అలంకారప్రాయంగా మారింది. కీడ్నీ బాధితులకు డయాలసిస్ చేసేటప్పుడు అత్యవసరంగా రక్తం అవసరం పడుతుంది. కానీ సామాజిక ఆరోగ్య కేం ద్రంలో ఉన్న బ్లడ్ బ్యాంక్ ఎప్పుడో మూలకు పడింది. కొత్తగా నిర్మిస్తున్న భవనంలో బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నా అది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో బాధితులకు ఎలా డయాలసిస్ నిర్వహిస్తారో అధికారులకే తెలియాలి. ప్రత్యేక వైద్యాధికారులను నియమించి వైద్యం అందించాలని ఏజెన్సీ గిరిజనులు కోరుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో సేవలు.. సీహెచ్సీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐసీయూ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యాధికారులు ఎవరూ ముందుకు రాక ఉన్నతాధికారులు ఐదుగురు ఏంబీబీఎస్ వైద్యులను ఐసీయూలో విధులు నిర్వహించేందుకు నియమించింది. అయితే వీరికి త్వరలో విడతల వారీగా ఐసీయూలో విధుల నిర్వహణపై శిక్షణ నిర్వహించనున్నారు. కేంద్రం నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు రాగానే ఐసీయూ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. డయాలసిస్ కేంద్రంలో విధులు నిర్వహణ కోసం త్వరలో నెప్రాలజిస్ట్ను ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. – వేణుగోపాల్, సీహెచ్సీ సూపరింటెండెంట్ ఉట్నూర్ -
మెడికల్ కాలేజీలకు అటానమస్: లక్ష్మారెడ్డి
ఆదిలాబాద్: రాష్ట్రంలో అన్ని మెడికల్ కాలేజీలకు స్వయం ప్రతిపత్తి (అటానమస్) కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా రిమ్స్ ఆస్పత్రి, ఉట్నూర్ ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్లను ప్రారంభించారు. వీటితోపాటు అధునాతన పరికరాలు సిటీ స్కానింగ్, డయాలసిస్ సెంటర్, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఈ హెల్త్సెంటర్, పేయింగ్ రూమ్స్, పీడియాట్రిక్ ఐసీయూ, టెలీమెడిసిన్ సెంటర్లను మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్రెడ్డిలతో కలసి ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో సింగిల్ ఫిల్టర్ ద్వారా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రెండు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖలో 10 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
గ్రామాల్లో దంత వైద్య శిబిరాలు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. వైద్యాన్ని మారుమూల గ్రామాలకే కాదు, సామాన్య ప్రజల చెంతకూ తీసుకెళుతున్నామని చెప్పారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిధిలోని డెంటల్ కాలేజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ డెంటల్ హాస్పిటల్ను లక్ష్మారెడ్డి శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభించారు. వాహనం లోపలి సదుపాయాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లా డారు. ‘మొబైల్ డెంటల్ హాస్పిటల్ వాహనాన్ని మారుమూల గ్రామాలకు పంపి దంత వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. వాహనంలో ఏసీతో పాటు రెండు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. దంత సమస్యలను పరీక్షించి, ఎక్స్ రే తీసి అవసరమైన చికిత్స అందించవచ్చు. ఇద్దరు వైద్యులు, సిబ్బంది, పరికరాలు, మందులు వాహనంలోనే ఉంటాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా మొబైల్ వాహనాలను, బైక్ అంబులెన్స్ లను, రెక్కల వాహనాలను, టీకా బండ్లను ప్రారంభించాం. వచ్చే బడ్జెట్లోనూ వైద్య శాఖకు మరిన్ని నిధులు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ అంగీకరించారు’ అని చెప్పారు. -
‘తెలంగాణలో బస్తీ దవాఖానాలు’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలను విస్తరిస్తామని వైద్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి తెలిపారు. మొట్టమొదట హైదరాబాద్ లో 50 బస్తీ దవాఖానాల ఏర్పాటు చేస్తామని, ఈనెలలో పాతబస్తీలో 4 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామని చెప్పారు. బస్తీ దవాఖానాల కోసం డాక్టర్ల నియామకం చేపడతామని, కొత్తగా 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా నేతృత్వంలో మంగళవారం జరిగిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆహార భద్రతకు సంబంధించి కీలక అంశాలపై సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. ఇక నుంచి హోటళ్లు, ఆహార పరిశ్రమలకు గ్రేడింగ్ ఇస్తామని.. స్టార్ హోటళ్లతరహాలో వర్గీకరిస్తామని చెప్పారు. సిద్ధిపేట-మహబూబ్నగర్, నల్గొండ-సూర్యాపేటలో జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించాలని జేపీ నడ్డాను కోరినట్టు వెల్లడించారు. బీబీ నగర్ ఎయిమ్స్, జిల్లా ఆస్పత్రులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. -
అవి తప్పు అని తేలితే రాజకీయ సన్యాసం: మంత్రి
హైదరాబాద్, సాక్షి: కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపణలపై ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. ఇప్పటికే తన కాలేజీ గురించి, తన మెడికల్ సర్టిఫికెట్ గురించి స్పష్టత ఇచ్చానని ఆయన ఆదివారం విలేకరులతో తెలిపారు. అయినప్పటికీ కావాలనే రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిదన్నారు. ఆరోపణలు చేసే వారే పదిమంది జర్నలిస్టులను సెలెక్ట్ చేస్తే గుల్బర్గా యూనివర్సిటీకి తీసుకువెళ్లేందుకు తాను సిద్ధమని వ్యాఖ్యానించారు. వాళ్లే నిజనిర్ధారణ చేయాలని, తన సర్టిఫికెట్లు తప్పు అని తేలితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఎన్నికల అఫిడవిట్లో కూడా నిజాలే పేర్కొన్నానని, తప్పులు ఉంటే ఎన్నికల సంఘం చూసుకుంటుందని చెప్పారు. సంపత్ రావు అనే వ్యక్తి తన క్లాస్మేట్ కాదని, తాను చదివేటప్పుడు తమ లెక్చరర్ అని తెలిపారు. జర్నలిస్ట్ కమిటీని ఎప్పుడు పంపినా తాను సిద్ధంగా ఉంటానన్నారు. లేదంటే ఆరోపణలు చేసే వారు కానీ, మీడియా కానీ మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించొద్దని సూచించారు. మంత్రి లక్ష్మారెడ్డి నకిలీ డాక్టర్ అని, ఎంబీబీఎస్ పూర్తి చేయకుండానే డాక్టర్ అని ఆయన చెప్పుకుంటున్నాడని రేవంత్ రెడ్డి పలుమార్లు ఆరోపణలు గుప్పించిన సంగతి తెల్సిందే. -
ఉనికి చాటడంలో డైరీ ఆవిష్కరణలు తోడ్పడ్డాయి: మంత్రి
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ ఉనికి చాటడంలో డైరీ ఆవిష్కరణలు తోడ్పడ్డాయని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. రవీంద్రభారతిలో తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి, ఎంపీలు బండారు దత్తాత్రేయ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రి లక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డాక మరోసారి అందరినీ ఒక చోట కలుసుకునే అవకాశం కల్పిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులది కీలక పాత్ర అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ కలిసి పనిచేయటం వల్లే కొత్త రాష్ట్రం అభివృద్దిలో దూసుకెళుతోందన్నారు. తన శాఖ ఉద్యోగుల పనితీరు కృషి కారణంగా దేశంలోనే నెంబర్ వన్గా కొనసాగుతోందన్నారు. కేసీఆర్ కిట్స్తో డాక్టర్లపై ఒత్తిడి పెరిగిందన్నారు. ఓపీ మూడు నాలుగు వంతులు పెరిగినా వైద్యులు , సిబ్బంది నిబద్దతతో పనిచేస్తున్నారని చెప్పారు. హెల్త్ కార్డులతో ఉద్యోగులకు కార్పోరేట్ స్థాయి ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమాల్లో విజయం సాధించిందని పేర్కొన్నారు. పరిపాలనలో కూడా విజయం సాధించామన్నారు. తక్కువ సమయంలో సమస్యలు పరిష్కారం చేసుకున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటున్నారని, సమస్యలన్నీ పరిష్కరించుకుని దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తామని వ్యాఖ్యానించారు. -
మంత్రి లక్ష్మారెడ్డి దొంగ డాక్టరే : రేవంత్
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి దొంగ సర్టిఫికెట్ డాక్టర్ అని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, వాస్తవాలు నిరూపించడానికి బహిరంగచర్చకు సిద్ధమన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2004లో ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్లో 1988లో గుల్బర్గా వర్సిటీ నుంచి, 2014 లో ఇచ్చిన అఫిడవిట్లో 1987లో కర్ణాటక వర్సిటీ నుంచి వైద్యవిద్యలో ఉత్తీర్ణులైనట్టు పేర్కొన్నారన్నారు. ఈ రెండింటిలో ఏది వాస్తవమో మంత్రి చెప్పాలన్నారు. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి నుంచి 1990లో గుల్బర్గా వర్సిటీకి, కర్ణాటక వర్సిటీకి 1988లో అనుమతులు వచ్చాయన్నారు. ఆయా వర్సిటీలకు అనుమతులు రాకముందే లక్ష్మారెడ్డి ఉత్తీర్ణుడైనట్లున్నారన్నారు. తనపై, తన కుటుంబసభ్యులపై సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని, వీటికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటు స్పందన
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి తీరును మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేదా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. కేబినెట్ మంత్రిగా ఉన్న నాయకుడిపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రధాని మోదీపై 'నీచ్' వ్యాఖ్యలు చేసిన మణిశంకర్ అయ్యార్పై కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకుందని, ఆ సంప్రదాయన్ని గుజరాత్కే పరిమితం చేస్తుందా? లేక తెలంగాణకు కూడా పాటిస్తారో చూడాలని వ్యాఖ్యానించారు. లక్ష్మారెడ్డి డాక్టర్ పట్టా ఒరిజినల్దేనా అని ప్రశ్నించిన రేవంత్రెడ్డి.. ఆయనపై తిట్లదండకాన్ని ఎత్తుకున్న సంగతి తెలిసిందే. -
త్వరలో ఎన్సీడీ కిట్ల పంపిణీ
హన్మకొండ చౌరస్తా: ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ను బుధవారం ఆయన ప్రారంభించారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉండేందుకు ప్రభుత్వం నాలుగు విధానాలను అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ నుంచి వ్యాధి నిర్ధారణలో కీలకమైన డయాగ్నొస్టిక్ సెంటర్లు, వైద్య పరికరాలు, డాక్టర్ల సంఖ్యను పెంచిందన్నారు. త్వరలో ప్రతి వ్యక్తికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఎన్సీడీ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా జనగామ జిల్లాను ఎంపిక చేసినట్లు చెప్పారు. సరికొత్త ఎంప్లాయీస్, జర్నలిస్టుల హెల్త్ స్కీం కేవలం తెలంగాణలోనే అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, శ్రీనివాస్గౌడ్, ఎంపీ పి.దయాకర్, ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. నిమ్స్ పనులను త్వరగా పూర్తి చేయాలి బీబీనగర్: నిమ్స్ ఆస్పత్రి పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద ఉన్న నిమ్స్ను సందర్శించారు. ఇన్పేషెంట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నందున ఆస్పత్రి భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. త్వరలో ఇన్పేషెంట్ విభాగాన్ని ప్రారంభిం చనున్న నేపథ్యంలో అందుకు అవసరమ య్యే వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట నిమ్స్ డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ మహేశ్వర్రెడ్డి ఉన్నారు. -
సకాలంలో మెరుగైన వైద్య సేవలు
సాక్షి, హైదరాబాద్: కాలయాపన లేకుండా, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవలు, ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల వైద్యసేవలపై మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. వైద్య సేవలకు అవసరమైన అనుమతుల విషయంలో కాలయాపన లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవల ఆస్పత్రుల ఎంపానెల్మెంట్ ప్రక్రియ వేగంగా, సులభంగా అయ్యేట్లు చూడాలని ఆదేశించారు. కొత్తగా ఆంకాలజీ విభాగంలో గొంతు క్యాన్సర్, ట్యూమర్ చికిత్సలకోసం ప్రత్యేకంగా కోడ్ని కేటాయించి చికిత్స అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పాత జిల్లా కేంద్రాల్లో వెల్నెస్ సెంటర్లను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. వరంగల్లో బుధవారం వెల్నెస్ సెంటర్ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో గ్రామాల ప్రజలకు పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు పొందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమేశ్రెడ్డి, వైద్య సంచాలకురాలు లలితకుమారి, ఆయుష్ కమిషనర్ రాజేందర్రెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో మనోహర్, ఈహెచ్ఎస్–జేహెచ్ఎస్ సీఈవో కె.పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీ పరిధిలోకి ‘ఆయుష్’: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆయుష్ వైద్య సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చాలని యోచిస్తున్నట్లు వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు అలోపతి వైద్య సేవలు మాత్రమే ఆరోగ్య శ్రీ పరిధిలో ఉన్నాయి. ఆయుష్ (ఆయుర్వేదం, యునానీ, హోమియో, ప్రకృతి) వైద్య సేవలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ విభాగంలోని 56 రకాల సేవలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆయుష్ విభాగంలోని మొత్తం 56 రకాల వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చే ప్రతిపాదనపై లక్ష్మారెడ్డి సోమవారం సమీక్షించారు. ఏయే విభాగంలోని ఏయే సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలన్న దానిపై పరిశీలించి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవల బకాయిలు, చెల్లింపులపై ఆరా తీశారు. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్) అమలుపైనా అధికారులను అడిగి తెలుసుకున్నారు. కల్తీలేని మోడల్ సిటీలు.. ఆహార కల్తీపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి లక్ష్మారెడ్డి ఆ విభాగం అధికారులను ఆదేశించారు. నగరాలు, పట్టణాల్లోని ఒక్కో వీధిని ఎంపిక చేసి కల్తీలకు తావులేని వస్తువులను, పదార్థాలను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనికి అవసరమైన ప్రణాళికను వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. స్వైన్ ఫ్లూ, మలేరియా, డెంగీ వంటి వ్యాధులు అదుపులో ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసుల నమోదు సంఖ్య ఎక్కువగా ఉన్నా.. తగిన వైద్యంతో మరణాల రేటు గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. వైద్యశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. -
ఎక్కడా లేని అభివృద్ధి ఇక్కడే జరుగుతోంది: మంత్రి లక్ష్మారెడ్డి
ఖమ్మం: దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని ఆర్యోగ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఉద్యమ నేత మన ముఖ్యమంత్రి కావడం అదృష్టమని, ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి పని చేద్దామని అంగన్వాడీలకు సూచించారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ కృతజ్ఞత సభలో మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. గౌరవప్రదమైన వేతనం కల్పించి తమ డిమాండ్లు పరిష్కరించిన సీఎం కేసీఆర్కు అంగన్వాడీలు ధన్యవాదాలు తెలిపారు. తమకు అండగా నిలిచిన గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు, మంత్రులు తుమ్మల, లక్ష్మారెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్మీనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, స్థానిక నేతలు పాల్గొన్నారు. మాతా శిశు నూతన వైద్యశాల ప్రారంభం ఖమ్మం నగరంలో రూ.23.50కోట్లతో నిర్మించిన మాతాశిశు నూతన ఆసుపత్రిని మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, మంత్రి తుమ్మలతో కలిసి ప్రారంభించారు. 150 పడకలతో అత్యాధునిక వైద్యపరికరాలతో దీన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ప్రభుత్వ పెద్దాసుపత్రిలో నూతనంగా రూ.26లక్షలతో ఏర్పాటు చేసిన ఐసీయూను ప్రారంభించారు. -
నర్సింగ్ కాలేజీల సమస్యల పరిష్కారానికి కమిటీ
► నివేదికను సమర్పించేందుకు 15 రోజుల గడువు.. హైదరాబాద్: నర్సింగ్ కళాశాలల్లోని సమ స్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసి, దాని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని వైద్యా రోగ్యశాఖ నిర్ణయించింది. 15 రోజుల్లో కమిటీ నివే దిక ఇచ్చేలా గడువు విధించాలని ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి నిర్ణయించారు. గురువారం వెంగళరావు నగర్లోని కుటుంబ సంక్షేమశాఖ కార్యాలయంలో మంత్రి లక్ష్మారెడ్డి అధికారులతో సమీక్షించారు. డిగ్రీ, జీఎన్ఎం వంటి చదువుల ద్వారా నర్సుల నియామకాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో రకరకాల సమస్యలు నెలకొన్నాయి. వాటితో పాటు మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, అకడ మిక్ వ్యవహారాల వంటి వాటి మీద అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీని ఆదేశించారు. పాలమూరు వైద్యకళాశాలకు ఎల్ఓపీ.. పాలమూరు వైద్య కళాశాలకు రెండో ఏడాది కూడా లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్ఓపీ) లభించింది. సమావేశంలో దీనిపై మంత్రి సమీక్షించారు. జిల్లా కలె క్టర్లు, డీఎం,హెచ్ఓ సంబంధిత శాఖల ఉన్నతా ధికారులు సమన్వ యంతో సమస్యలను అధిగమిం చాలని సూచించారు. ఈ సమావేశంలో పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్రాస్, డీఎం ఈ రమణి, డీహెచ్ లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ వైద్యులకు శిక్షణ... గ్రామీణ వైద్యులకు గతంలో ప్రారంభించిన శిక్షణ వివిధ స్థాయిల్లో ఆగిపోయింది. దీంతో మళ్లీ శిక్షణ షెడ్యూల్ సిద్ధం చేయాలని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 17 శిక్షణ కేంద్రాలున్నాయి. వాటికి అదనంగా మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయా లని, పది రోజుల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని ఆదేశించారు. -
ఏజెన్సీ ప్రాంతాల్లో 5 లక్షల దోమ తెరలు
► పంపిణీ చేస్తామన్న వైద్య ఆరోగ్యమంత్రి లక్ష్మారెడ్డి ► 9 జిల్లాల కలెక్టర్లతో సీజనల్ వ్యాధులపై సమీక్ష సాక్షి, హైదరాబాద్: సీజనల్ అంటు వ్యాధులపై అప్రమత్తంగా వ్యవహరించి, వాటి నివారణకు ప్రజల్లో చైతన్యం కలిగిం చాలని జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. వివిధ శాఖల సమన్వయంతో వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అందుకోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు 5 లక్షల దోమ తెరలను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై ఏజెన్సీ ప్రాంతాలున్న తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, అక్కడి వైద్యాధికారులతో బుధవారం మంత్రి లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతేడాది వర్షాకాల సీజన్ కంటే ముందే పలు ఏజెన్సీ ప్రాంతాలను పర్యటించి తీసుకున్న చర్యల వల్ల ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించామని, ఈ ఏడాది కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు, ఐకేపీ, ఫిషరీస్ వంటి వివిధ విభాగాలతో వైద్య ఆరోగ్యశాఖ సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి అంటు వ్యాధుల నివారణకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా గ్రామాల సమస్యలను బట్టి క్షేత్ర స్థాయిలో క్లీనింగ్, స్ప్రేయింగ్ వంటి చర్యలతో దోమల నివారణకు నడుం బిగించాలన్నారు. వచ్చే జూన్, జులై నెలల్లో ఈ కార్యక్రమాలు పూర్తి చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించా మన్నారు. అవసరమైన సిబ్బందిని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతుల్లో కలెక్టర్లు నియమించుకోవచ్చన్నారు. బాలింతలకు అందించనున్న కేసీఆర్ కిట్ను మంత్రి ప్రదర్శించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ కిట్ను ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్రావు, భూపాలపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, కుమ్రం భీమ్, మహబూబబాద్, నాగర్ కర్నూలు జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
108 ఉద్యోగులకు ఉగాది కానుక
-
108 ఉద్యోగులకు ఉగాది కానుక
రూ.4 వేల చొప్పున జీతాల పెంపు: లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 ఉద్యోగులందరికీ రూ.4 వేల చొప్పున వేతనాలు పెంచారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ పెంపు 2016 ఏప్రిల్ నుంచి వర్తిం పచేస్తున్నట్లు చెప్పారు. పెంపు మొత్తాన్ని విడుదల చేశామన్నా రు. దీంతో 1,578 మందికి లబ్ధి చేకూరుతుందని, వివిధ కేడర్లకు చెందిన వారి వేతనాలు రూ. 19 వేలు కానున్నాయని మంత్రి వివరించారు. -
ప్రభుత్వాస్పత్రులకు మెరుగులు
⇒ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి ⇒ త్వరలో రూ.12 కోట్లతో ‘గాంధీ’కి వైద్య పరికరాలు, ఫర్నిచర్ ⇒ అన్ని ఆస్పత్రులను కొత్తగా తీర్చిదిద్దుతామని వెల్లడి ⇒ హెల్త్కార్డుల ద్వారా చికిత్సల్లో లోపం లేదని స్పష్టీరణ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరిచే పనులు ప్రారంభించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడించారు. మౌలిక వసతుల కల్పనతోపాటు అవసరమైన వైద్య పరికరాలను అందించనున్నట్లు ప్రకటించారు. ఇటీవల గాంధీ ఆస్పత్రిని సందర్శించినప్పుడు అక్కడి పరిస్థితులు చూసి సిగ్గుపడాల్సి వచ్చిం దని.. గత ప్రభుత్వాల పాపమే దీనికి కార ణమని, ఇప్పుడు వాటిని మెరుగు పరిచేం దుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో చాలా మార్పులొచ్చాయని, లిఫ్టులను రోగు లకు అందుబాటులోకి తెచ్చామన్నారు. వైద్యశాఖ పద్దుపై గురువారం శాసనసభలో లక్ష్మారెడ్డి ప్రసంగించారు. గాంధీ ఆస్పత్రిలో రూ.12 కోట్ల వ్యయంతో కొత్త వైద్య పరికరాలు, ఫర్నిచర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 690 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగు పరిచినట్టు తెలిపారు. అన్ని ఆస్పత్రులు కలిపి 20 వేల బెడ్స్ ఉంటే ఇప్పటికే 10 వేల కొత్త బెడ్షీట్స్ ఏర్పాటు చేశామని, మొత్తం లక్ష బెడ్షిట్స్ సమకూర్చుకునేందుకు ఆర్డర్ ఇచ్చామన్నారు. హైదరాబాద్లో నిమ్స్ స్థాయిలో కొత్తగా మూడు ఆస్పత్రులు నిర్మించనున్నట్టు మంత్రి వివరించారు. కొత్తగా నాలుగు ఆస్ప త్రుల్లో ఐసీయూ సేవలు ప్రారంభించామని, అన్ని ఆస్పత్రుల్లో ఐసీ యూలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో పేదలందరికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించటమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వా స్పత్రుల్లో అవినీతిని నిరోధించేందుకు కొత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హెల్త్కార్డుల ద్వారా చికిత్సల్లో లోపం లేదని, ఇప్పటివరకు లక్షా ఆరు వేల మందికి ఆ పద్ధతి లో చికిత్సలు అందించామన్నారు. ఇందులో ప్రైవేటు ఆస్పత్రులను చేర్చాక గత మూడు నెలల్లో 4,200 మందికి చికిత్సలు అందిం చినట్లు లక్ష్మారెడ్డి వెల్లడించారు. గద్వాల ఆస్పత్రి స్థాయి పెంపుతోపాటు రూ. 1.4 కోట్లతో ఐసీయూను మెరుగుపరుస్తున్నామని, తుంగతుర్తిలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు పరిశీలనలో ఉందన్నారు. అర్చకులకు ట్రెజరీ వేతనాలు కుదరదు: ఇంద్రకరణ్రెడ్డి దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వడం సాధ్యం కాదని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తేల్చి చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు, రోస్టర్ నిబంధనల ప్రకారం కాకుండా కేవలం ఆలయ చైర్మన్ల ద్వారా వారు నియమితులు కావడమే అందుకు కారణమన్నారు. ప్రభుత్వోద్యోగులకు దాదాపు సమంగా ఉండేలా వారికి వేతనాలు చెల్లించాలని నిర్ణయించామని, మరో పద్ధతిలో వారికి వేతనాల చెల్లింపు ఉంటుందన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ప్రతిపాదన సిద్ధం చేస్తోందన్నారు. సంవత్సరంలోపు యాదాద్రిని తెలంగాణ తిరుమలగా తీర్చి దిద్దుతామన్నారు. స్థలం ఉంటే కొత్త స్టేడియాలు: పద్మారావు నియోజకవర్గ కేంద్రాల్లో స్థలం సిద్ధంగా ఉంటే కొత్త స్టేడియాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పద్మారావు వెల్లడిం చారు. హైదరాబాద్లో 15 నియోజకవర్గాల్లో స్టేడియాలు ఉండేలా ప్రతి పాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో దుకాణదారులు అక్రమంగా సగంప్రాంతాన్ని కబ్జా చేసి వ్యాపారాలు చేస్తున్నారని, వాటిని తొలగిస్తామన్నారు. కొత్తగూడెం, కోరుట్ల, తుంగ తుర్తిలకు కొత్త స్టేడియాలు మంజూరయ్యాయని, భద్రాచలంలో ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్లు చెప్పారు. కనీసం వేతన చట్టం అమలు: నాయిని రాష్ట్రంలో కనీస వేతన చట్టాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని కార్మికశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. పదేళ్లుగా కనీసం వేతన బోర్డు లేదని, తమప్రభుత్వం ఏర్పాటయ్యాక దాన్ని ఏర్పాటు చేసినట్లు సభ దృష్టికి తెచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలవడంలో కార్మిక శాఖ కృషి ఉందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 1,200 పరిశ్రమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా 760 పరిశ్రమలకు అనుమతులిచ్చినట్లు చెప్పారు. కార్మిక చట్టానికి వ్యతిరేకంగా పని చేసిన 193 పరిశ్రమల యజమానులపై కేసులుపెట్టి 84 లక్షల పెనాల్టీ వసూలు చేశామన్నారు. -
స్టెంట్ల ధరలు తగ్గినా... పేదలను పీడిస్తూనే ఉన్నారు
⇒ ప్రైవేట్ ఆసుపత్రులను అదుపుచేయటంలో విఫలం ⇒ ప్రభుత్వం తీరును ఎండగట్టిన కాంగ్రెస్ సభ్యులు ⇒ ధరలు పెంచి అమ్మితే చర్యలు తప్పవన్న మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా హృద్రో గంతో చనిపోతున్న వారిలో తెలంగాణ ప్రాంత వాసుల సంఖ్యనే అధికంగా ఉన్నందున ప్రజ లకు తక్కువ ధరలకే స్టెంట్లు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభలో డిమాండ్ చేసింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ నిర్ధారించిన ధరలకే స్టెంట్లు అందుబాటులో ఉండేలా చూడాలని, రాష్ట్రంలో ప్రతి నెలా ఏడు వేల స్టెంట్లు అవసరమవుతున్నందున స్థాని కంగా ప్రభుత్వమే నాణ్యమైన స్టెంట్లు తయారు చేసేందుకు యూనిట్ను ఏర్పాటు చేసే విషయాన్ని ఆలోచించాలని కోరింది. కేంద్రం స్టెంట్ల ధరలను నిర్ధారించిందని.. కానీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో వాటిని అధిక ధరలకు విక్రయిస్తు న్నా ప్రభుత్వం నిలవరించ లేకపో తోందని ఆరోపించింది. బుధవారం శాసన సభలో కాంగ్రెస్ సభ్యులు జీవన్రెడ్డి, చిన్నా రెడ్డి, సంపత్ ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం ధర లు తగ్గించినా దాన్ని అమలు చేయకపోవటం దారుణమన్నారు. వైద్య శాఖ మంత్రి నిమ్స్ను వెంటనే తనిఖీ చేయాలన్నారు. స్టెంట్ అవసర మో కాదో తేల్చేందుకు పరీక్షలు అందుబా టులో ఉన్నప్పటికీ చాలా ఆసుపత్రుల్లో రోగి రాగానే నేరుగా స్టెంట్ వేయాలని డాక్టర్లు చెప్తున్నారని, ప్రాణభయంతో పేదలు ఆస్తులు అమ్మి స్టెంట్లు కొనాల్సి వస్తోందని అధికార పార్టీ సభ్యుడు శ్రీనివాసగౌడ్ పేర్కొన్నారు. నిర్ధారిత ధరలకే స్టెంట్లు: లక్ష్మారెడ్డి నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ మందు పూత ఉన్న స్టెంట్ ధరను రూ.29,600గా, పూత లేని స్టెంట్ ధర రూ.7,260గా నిర్ధారించిందని, ఆ ధరలకే వాటిని అమ్మాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ ధరలకు అమ్మలేక కొన్ని కంపెనీలు మార్కెట్లోని స్టెంట్లను వెనక్కు తీసుకుం టున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై చర్చిస్తున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టును అడాప్ట్ చేసుకుని రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారు. ఇందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించి పర్యవేక్షి స్తామన్నారు. అనవసర శస్త్రచికిత్సలు చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నా మన్నారు. ఇటీవలే అలాంటి 8 ఆసుపత్రులపై చర్యలు తీసుకు న్నామని చెప్పారు. నిమ్స్లో కొత్తగా 109 వెంటిలేటర్లు, 54 వరకు బెడ్లు సమకూర్చా మన్నారు. నిమ్స్ తరహాలో మరిన్ని ఆసుపత్రులు నిర్మించే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. -
రాష్ట్ర బడ్జెట్తో ఉత్తమ్ మైండ్ బ్లాక్: లక్ష్మారెడ్డి
హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖ పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె .లక్ష్మా రెడ్డి ఖండించారు. ఉద్యోగులు, జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వలేదన్న ఉత్తమ్ ఆరోపణలు అర్థరహితమన్నారు. ఏ ఆస్పత్రి కైనా వెళ్దాం.. హెల్త్ కార్డు పనిచేస్తే రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. శుద్ధ అబద్దాలతో ఉత్తమ్ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గత మూడు నెలల్లో 4,100 మందికి హెల్త్ కార్డుల ద్వారా వైద్యం అందిందని తెలిపారు. ఈ విషయంలోనే ఇన్ని అబద్దాలు మాట్లాడుతున్న ఉత్తమ్ గవర్నర్ ప్రసంగం అబద్ధమంటూ సీఎంను రాజీనామా కోరడం హాస్యాస్పదమని తెలిపారు. వైద్య ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్ లో సముచిత ప్రాధాన్యం దక్కిందన్నారు. ఈ బడ్జెట్ తో ఉత్తమ్ మైండ్ బ్లాంక్ అయిందని వ్యాఖ్యానించారు. -
బాలల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కృషి
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్: జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 94 లక్షల మంది పిల్లలకు నివారణ మందులు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి తెలిపారు. చిన్నారుల్లో శారీరక బలహీనతను అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ చేపడు తున్నట్లు వెల్లడించారు. గురువారం ఇక్కడ అంబర్పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థు లకు నులిపురుగుల నివారణ మందుబిళ్లలను అందించారు. నులిపురుగుల నివారణపై అవ గాహన పోస్టర్లను, క్యాలెండర్లను ఎమ్మె ల్యే కిషన్రెడ్డి, డీఎంహెచ్వో డాక్టర్ లలితా కుమారితో కలసి మంత్రి ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ త్వరలో ఆర్బీఎస్కె (రాష్ట్రీయ బాల వికాస కార్యక్రమం)తో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడిం చారు. పుట్టుకతో వచ్చే వ్యాధులను విద్యా ర్థుల జనన ధ్రువీకరణపత్రం ఆధారంగా గుర్తించి బాలల వికాసానికి కృషి చేస్తామ న్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మోడ్రన్ ఆస్పత్రులుగా తీర్చిదిద్దుతామన్నారు. త్వరలో ప్రా«థమిక ఆరోగ్యకేంద్రం స్థాయిని బట్టి డయాగ్నోస్టిక్ సెంటర్నూ ఏర్పాటు చేస్తామన్నారు. నిలో ఫర్, గాంధీ ఆస్పత్రుల ఘటనలపై మంత్రిని ప్రశ్నించగా పరిశీలిస్తామన్నారు. నేడు నివారణ మాత్రల పంపిణీ నులిపురుగుల నివారణ కోసం శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఏడాది నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారందరికీ ఈ మాత్రలను అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలో పంపిణీ చేసేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. -
ఆ సెలైన్లో పురుగుల్లేవ్: మంత్రి
హైదరాబాద్: చిన్నారి ప్రవళిక మృతిని వివాదాస్పదం చేయడం సరికాదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రవళికది సహజమరణమే అని, వారి కుటుంబసభ్యులను తామెవరం బెదిరించలేదన్నారు. సెలైన్ బాటిల్లో పురుగు ఉందన్న ప్రచారంలో వాస్తవం లేదని, చిన్నారి తండ్రి కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అన్నారు. నీలోఫర్లో బాలింతల మృతిపై సైతం లక్ష్మారెడ్డి స్పందించారు. బాలింతల మృతి వాస్తవమే అన్న ఆయన.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనారోగ్యంతో రెండు నెలల కిందట గాంధీ అసుపత్రిలో చేరిన జనగాం జిల్లాకు చెందిన సాయి ప్రవళిక అనే చిన్నారి మంగళవారం తెల్లవారు జామున మృతిచెందిన విషయం తెలిసిందే. చిన్నారికి ఎక్కించిన సెలైన్లో పురుగులున్నాయన్న ఆరోపనలు వచ్చిన నేపథ్యంలో మంత్రి ఈ మేరకు స్పందించారు. -
10 నెలల చిన్నారికి స్వైన్ఫ్లూ
గాంధీలో ఐదుగురు, నిమ్స్లో నలుగురికి చికిత్స డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 9 మంది మృతి రోగులను పరామర్శించిన వైద్య, ఆరోగ్య మంత్రి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ఫ్లూ మళ్లీ కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 5,700 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో 70 మందికి ఫ్లూ పాజిటివ్గా నిర్ధారణైంది. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందగా, కేవలం ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే నలుగురు చనిపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. బీబీనగర్కు చెందిన.. స్వైన్ఫ్లూతో బాధపడుతున్న పది మాసాల మగశిశువును శనివారం గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ఇప్పటికే పీడియాట్రిక్ విభాగంలో నగరానికి చెందిన మరో ఐదుగురు చిన్నారులు ఇదే లక్షణాలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం వైద్యులు వీరి నుంచి నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపారు. అయితే రిపోర్టు రావాల్సి ఉంది. వైద్యులు అనుమానిత ఫ్లూగా భావించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉస్మానియా ఐసోలేషన్ వార్డులో పని చేసే ఓ మహిళా ఉద్యోగికి స్వైన్ప్లూ లక్షణాలు పాసిటివ్ ఉన్నట్లు తేలింది. నిమ్స్లోని బాధితులకు మంత్రి పరామర్శ... రోజు రోజుకు స్వైన్ఫ్లూ కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గాంధీ జనరల్ ఆస్పత్రి సహా నిమ్స్, ఫీవర్, ఉస్మాని యా తదితర ఆస్పత్రుల్లో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసింది. గాంధీతో పాటు నిమ్స్లో కూడా రోగులు చికిత్స పొందుతున్నారు. టాంజానియా నుంచి స్వైన్ఫ్లూతో వచ్చి నిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితురాలు అశ్విని సహా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న తిమ్మన్న, రవీందర్రెడ్డి, భరత్లను మంత్రి లక్ష్మారెడ్డి పరామర్శించారు. శనివారం ఆయన నిమ్స్ను సందర్శించి ఆస్పత్రిలో స్వైన్ఫ్లూ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వైన్ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తలనొప్పి, జ్వరం, ముక్కు నుంచి నీరుకారడం, కీళ్లనొప్పులు వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే ఫ్లూ లక్షణాలుగా అనుమానించి వైద్యులను ఆశ్రయించాలని సూచించారు. పెరిగిన మాస్క్ల అమ్మకాలు స్వైన్ఫ్లూ మరణాలు సంభవించడంతో నగరంలో మాస్క్ల అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్, పేట్ల బురుజు తదితర ఆస్పత్రుల ప్రాంగణాల్లో రోగులు, రోగి సహాయకులు మాస్క్లు తప్పనిసరిగా ధరిస్తున్నారు. ఎన్95 మాస్క్లు రూ.60 నుంచి రూ.100 వరకు ఉండగా, అదే సాధారణ మాస్క్ రూ.5కే మార్కెట్లో లభ్యం అవుతుండడంతో వాటినే ప్రజలు విరివిగా వినియోగిస్తున్నారు. -
స్వైన్ఫ్లూపై ఆందోళన అవసరం లేదు
‘సాక్షి’ కథనంపై మంత్రి లక్ష్మారెడ్డి స్పందన సాక్షి, హైదరాబాద్: స్వైన్ఫ్లూ వైరస్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ అదుపులోనే ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ‘మళ్లీ స్వైన్ఫ్లూ విజృంభణ’ అనే శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తా కథనంపై ఆయన స్పందించారు. దీనిపై గురువారం ఆయన సచివాలయంలో వైద్యాధికారులతో సమీక్షించారు. స్వైన్ఫ్లూ విస్తరిస్తున్న దృష్ట్యా వైద్యులంతా అప్రమత్తంగా ఉండాలని, అన్ని ప్రభుత్వాస్ప త్రుల్లోనూ మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. చలిగాలులు వీస్తుండటంతో హెచ్1ఎన్1 వైరస్ బలపడే అవకాశం ఉందని, ఇప్పటికే హైదరా బాద్ సహా పలు జిల్లాల్లో స్వైన్ఫ్లూ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. -
104కు కొత్త వాహనాలు: లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: 104 ఉద్యోగులు తమ సమస్యలు అడగక ముందే వారి జీతాలను రెట్టింపు చేసిన ఘనత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నేతృత్వంలోని తెలంగాణ సర్కారుదే అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మంత్రి లక్ష్మారెడ్డికి తెలంగాణ భవన్లో 104 ఉద్యోగులు సన్మానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.36 వేల కోట్లతో అనేక పథకాలు చేపట్టిందని మంత్రి చెప్పారు. ఆరోగ్య తెలంగాణని సాధించే దిశగా సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు ప్రాధాన్యమిస్తున్నా రన్నారు. ఒక్క ఏడాదిలోనే ప్రభుత్వ వైద్యశాలల్లో 20 శాతం ఓపీ పెరిగిం దన్నారు. 104 సేవలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 104కి కొత్త వాహనాలను త్వరలోనే అందించనున్నామని చెప్పారు. కాగా, 104 ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసింది మంత్రి లక్ష్మారెడ్డియేనని మండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. 104 ఉద్యోగులకు కూడా సానుకూల నిర్ణయమే ఉంటుందన్న అభిప్రాయాన్ని పల్లా వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ హయాంలో ఐసీయూలో ఆరోగ్య శాఖ
• అతికష్టం మీద జనరల్ వార్డుకు తీసుకొచ్చాం: మంత్రి లక్ష్మారెడ్డి • సరైన సమాధానం రాలేదంటూ మండలి నుంచి కాంగ్రెస్ వాకౌట్ సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో ఆరోగ్య శాఖను ఐసీయూలోకి పంపించా రని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అతి కష్టం మీద ఇప్పుడిప్పుడే జనరల్ వార్డుకు తీసు కొచ్చామని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. పదేళ్లుగా డాక్టర్లు, సిబ్బంది పోస్టులు భర్తీ జరగలేదని.. 2,118 డాక్టర్, ఇతర పోస్టుల భర్తీ కావాల్సి ఉందన్నారు. శనివారం మండలి లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆరోగ్య శాఖే పేషెంట్ అయిందన్న పొంగులేటి సుధాకర్రెడ్డి వాఖ్యలకు మంత్రి ఘాటుగా స్పందించారు. విష జ్వరాలు, సరైన చికిత్స అందక సంభవి స్తున్న మరణాల నియంత్రణకు చర్యలపై కౌన్సిల్లో విపక్ష నేత షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్రెడ్డి, రంగారెడ్డి, ఆకుల లలిత అడిగిన ప్రశ్నపై మంత్రి సమాధానమిస్తూ.. 2015లో 1,831 డెంగీ కేసులు గుర్తించగా, 2016లో 2,725 కేసులను గుర్తించామని.. ముమ్మర నిఘా వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. మం త్రి సమాధానం నిరాశ కలిగించిందంటూ కాం గ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా కొత్త పరికరాల కోసం రూ.30 కోట్లు ఖర్చు చేసినట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వెల్లడించారు. సైబర్ విధానంపై ఐటీ మంత్రి కేటీఆర్తో సభ్యులకు సమావేశాన్ని ఏర్పాటు చేసి అనుమానాలు నివృత్తి చేస్తామని పొంగులేటి సుధాకర్రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. చారిత్రక దేవాలయాల పునర్నిర్మాణానికి చర్యలు తీసు కుంటున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్రెడ్డి తెలిపారు. నూరు శాతం సబ్సిడీపై చేప పిల్లల సరఫరాకు రూ.104 కోట్ల బడ్జెట్ను కేటాయించినట్లు పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. -
ప్రభుత్వోద్యోగులకు సరికొత్త ఆరోగ్య పథకం
వైద్య,ఆరోగ్య శాఖ సమీక్షలో మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య పథకం (సీజీఈహెచ్ఎస్) మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ప్రత్యేక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. మందుల సరఫరా సైతం ఈ పథకంలోకి తీసుకురానుంది. అలాగే ఔట్ పేషంట్ సేవల కోసం ప్రత్యేకంగా క్లినిక్లు నిర్వహించాలని భావిస్తోంది. శుక్రవారం సచివాలయంలో సీఎస్ రాజీవ్శర్మతో కలసి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వైద్యపరమైన అంశాలపై చర్చించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (టీజీఈహెచ్ఎస్)ను అందుబాటులోకి తెచ్చే అంశంపైనా చర్చించారు. ఖాళీగా ఉన్న 2,118 పోస్టులను భర్తీ చేయాల్సిన పద్ధతులపై సమాలోచనలు చేశారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, నవీన్మిట్టల్, జీఏడీ కార్యదర్శి శివశంకర్, న్యాయ కార్యదర్శి సంతోష్రెడ్డి, నిమ్స్ డెరైక్టర్ మనోహర్, టీజీఈహెచ్ఎస్ సీఈఓ పద్మ పాల్గొన్నారు. -
చీటికీమాటికీ సమ్మెలేంటి?
♦ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులపై సర్కారు ఆగ్రహం ♦ నోటీసు లేకుండా సమ్మెలపై సీరియస్ ♦ తరచూ సమ్మెకు దిగే ఆస్పత్రుల లైసెన్సు రద్దుకు యోచన ♦ దసరాకల్లా రూ. 300 కోట్ల బకాయిల విడుదల ♦ తక్షణమే రూ. 100 కోట్లు చెల్లించేందుకు ఏర్పాట్లు ♦ ఇకపై నెలనెలా నిధుల విడుదలకు చర్యలు ♦ సమ్మె విరమణకు మంత్రి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: పెండింగ్ బకాయిల కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మెకు దిగడాన్ని వైద్య, ఆరోగ్యశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ముందస్తు సమాచారం లేకుండా చీటికీమాటికీ సమ్మెకు వెళ్లడంపై మండిపడుతోంది. తరచూ సమ్మె చేసే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడంతోపాటు వాటి లెసైన్సు రద్దు చేయాలని యోచిస్తోంది. పేద రోగులను అడ్డుపెట్టుకుని ఆస్పత్రులు బ్లాక్ మెయిల్ చేయడం సరికాదని ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ సమ్మె చేయాల్సి వస్తే నాలుగైదు రోజుల ముందే నోటీసు ఇస్తే వాస్తవ పరిస్థితిని తెలియజేస్తామని...అవసరమైతే వారి డిమాండ్లపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుందని పేర్కొంటున్నారు. అలా కాకుండా ఈ ఏడాది ఇప్పటికి మూడుసార్లు సమ్మెకు వెళ్లడం వల్ల రోగుల్లో ఆందోళన నెలకొందని, వారి వైద్య చికిత్సలను పణంగా పెట్టేలా ఆస్పత్రులు వ్యవహరిం చడం మంచిది కాదంటున్నారు. ప్రభుత్వం ప్రాధాన్యం ప్రకారం నిధులను కేటాయిస్తుందని... ఒక్కోసారి ఆలస్యమైతే తమ దృష్టికి తీసుకురావాలే కానీ ఇలా చేయకూడదని వారు హితవు పలుకుతున్నారు. వెంటనే సమ్మెను విరమించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆస్పత్రి వర్గాలను కోరారు. తక్షణం రూ. 100 కోట్లు విడుదల ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ. 430 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇందులో పాత బకాయిలు పోనూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ నెల 2(ఆదివారం) నాటికి రూ. 246.24 కోట్లు చెల్లిం చాల్సి ఉండగా ప్రభుత్వం కేవలం రూ. 38.74 కోట్లు మాత్ర మే చెల్లించింది. అంటే ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ. 207.50 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది. అయితే ఆస్పత్రుల సమ్మె నేపథ్యంలో పాత బకాయిలు, ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన బకాయిల్లో దసరా నాటికి రూ. 300 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో తక్షణమే రూ. 100 కోట్లు విడుదల చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ‘సాక్షి’కి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆర్థిక శాఖ చేపడుతోం దని ఆయన వివరించారు. అలాగే ఇకపై ఆస్పత్రులకు నెల నెలా నిధులు విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ప్రభుత్వాస్పత్రులకు ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రూ. 91.45 కోట్ల బిల్లులు చెల్లిం చాల్సి ఉండగా ప్రభుత్వం కేవలం రూ. 5.45 కోట్లే చెల్లించింది. 500 కోట్లు చెల్లించే వరకు సేవలు పునరుద్ధరించం ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తమ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపేయాల్సి వచ్చిందని ప్రైవేటు, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ వెల్లడించింది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలోని ఆస్పత్రులకు రూ. 500 కోట్ల బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించబోమని తేల్చిచెప్పింది. సంఘం ప్రతినిధులు డాక్టర్ ఇంద్రాసేనారెడ్డి, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ తిరుపతిరెడ్డి, డాక్టర్ రఘుపతిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ప్రభుత్వ కార్యదర్శి, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోరుుందన్నారు. మే నెలలోనే బకారుులను చెల్లించాలని సమ్మె చేసినప్పుడు 2 నెలల్లో చెల్లిస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఆ మాటను పక్కన పెట్టిందన్నారు. ప్రభుత్వానికి నోటీసులు పంపామని, స్పందించక పోవడం వల్లే ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేశామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒకట్రెండు ఆస్పత్రులు మినహా అన్ని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు సహా ప్రైవేటు, నర్సింగ్ హోమ్స్ యథావిధిగా ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్సలు అందించాయి. ప్రైవేటు నర్సింగ్ హోమ్స్ సమ్మె ప్రకటన నేపథ్యంలో సోమవారం ఆయా ఆస్పత్రులకు ఓపీ, ఐపీ రోగుల సంఖ్య సగానికి తగ్గింది. -
మా గోస చూడయ్యా..
హైదరాబాద్: ఎడతెరిపిలేని వర్షాల కారణంగా నాలాలు, చెరువులు ఉప్పొంగి ఇళ్లను ముంచెత్తడంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హుస్సేన్ సాగర్ సహా శివారులోని పలు చెరువులన్నీ నిండుకుండల్లా ఉన్నాయి. ప్రభుత్వ అభ్యర్థనమేరకు రంగంలోకి దిగిన ఆర్మీ.. అల్వాల్ లో వరదనీటిలో చిక్కుకున్నవారిని పడవలద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు పురపాలక, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, ఇతర అధకారులతో కలిసి శుక్రవారం నగరంలో విస్తృతంగా పర్యటించారు. (హైదరాబాద్ అతలాకుతలం..రంగంలోకి ఆర్మీ) ఈ క్రమంలోనే అల్వాల్ లోని వెన్నెలగడ్డ చెరువు వద్దకు వెళ్లిన కేటీఆర్ దగ్గరకు ఒక వృద్ధురాలు వచ్చి తన గోడు వెళ్లబోసుకుంది. 'మా గోస చూడయ్యా..' అంటూ మంత్రిగారి చెయ్యిపట్టుకునిమరీ తన ఇంటికి తీసుకెళ్లింది. వృద్ధురాలికి అవసరమైన సహాయసహకారాలు అందించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. రోజంతా పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు బాధితుల కోసం చేపడుతోన్న చర్యలను పర్యవేక్షించారు. కొన్ని ప్రాంతాల్లో యువకులు కేటీఆర్ ను ఫొటోలు తీసేందుకు ఉత్సాహం చూపారు. -
వాళ్లిద్దరినీ బర్తరఫ్ చేయండి: చాడ
యాదగిరిగుట్ట(నల్లగొండ): ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన విద్య, ఆరోగ్యశాఖ మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. లీకేజీ వీరులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఎంసెట్-2 పరీక్షల్లో నిజమైన ర్యాంకర్లకు అన్యాయం జరగకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. ఎంసెట్ రద్దు చేస్తున్నామని వస్తున్న వార్తలతో విద్యార్థులు మనోవేదన చెందుతున్నారని వారికి చదువుపై ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ల పేరుతో విద్యార్థులను తప్పు దారి పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
గడ్డపోతారంలో ఘనంగా హరితహారం
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 46 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో ప్రభుత్వం హరితహారం చేపట్టిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం మెదక్ జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో పరిశ్రమలు, డ్రగ్స కంట్రోలర్ అధికారుల ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా ఐదు వేల మొక్కలు నాటే కార్యక్రమానికి మంత్రి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. పారిశ్రామిక వాడలో మంత్రి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం ఓ ఉద్యమంలా సాగుతోందన్నారు. -
24 గంటలు వైద్య సేవల కోసం స్పెషల్ యాప్
-
హర్షితకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్ : కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్సకు డబ్బులు లేక మెర్సీ కిల్లింగ్కు అనుమతించాలని కోరుతూ హెచ్ఆర్సీని ఆశ్రయించిన బాధితురాలు హర్షిత(11)కు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. హర్షితకు శస్త్రచికిత్స చేసేందుకు ఓ కార్పొరేట్ ఆస్పత్రి ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. అందుకోసం ఆరోగ్యశ్రీ నుంచి రూ.10.50 లక్షలు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. బంజారాహిల్స్లోని విరంచి ఆస్పత్రి రూపొందించిన వి కనెక్ట్ విరంచి మొబైల్ యాప్ను శుక్రవారం మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరంలో అధునాతన హంగులతో 600 పడకల సామర్థ్యంతో ఈ ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని విరంచి ఆసుపత్రి యాజమాన్యాన్ని కొనియాడారు. ఇదిలా ఉంటే మంత్రి విజ్ఞప్తికి విరంచి ఆస్పత్రి చైర్మన్ విష్ కొంపెల్లా స్పందించారు. సామాజిక సేవలో భాగంగా తమ ఆస్పత్రిలో ప్రతి నెలా ఒకరికి ఉచితంగా అవయవ మార్పిడి శస్త్ర చికిత్స చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. తమ ఆస్పత్రిలో మరో నెల రోజుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు ప్రారంభమవుతాయన్నారు.ఈ కార్యక్ర మంలో చైర్ పర్సన్ మాధవీలత కొంపెల్లా, సీఎంవో శ్రీనివాస్ మైన, మెడికల్ డెరైక్టర్ ఎన్ఎస్వీవీ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఎంసెట్-2 ర్యాంకులు
-
నేడు ఎంసెట్-2 ర్యాంకులు
- విడుదల చేయనున్న మంత్రి లక్ష్మారెడ్డి - ప్రాథమిక కీపై పదిలోపే అభ్యంతరాలు - సెట్ కన్వీనర్ రమణారావు వెల్లడి - ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 9న నిర్వహించిన ఎంసెట్-2 ర్యాంకులను బుధవారం సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేయనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ఖరారు చేయనున్నారు. ఈ నెల 9న ప్రకటించిన ప్రాథమిక కీపై మంగళవారం మధ్యాహ్నం 2 గం. వరకు పది లోపే అభ్యంతరాలు వచ్చినట్లు ఎంసెట్-2 కన్వీనర్ ప్రొ. ఎన్వీ రమణారావు వెల్లడించారు. అవి కూడా 2 ప్రశ్నలకు సంబంధించినవేనని పేర్కొన్నారు. మొత్తంగా పరీక్షలో ఇచ్చిన ప్రశ్నపత్రంలో ఎలాంటి తప్పులు దొర్లలేదని నిపుణుల కమిటీ తేల్చినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 56,153 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా 50,964 మంది పరీక్షకు హాజరయ్యారు. అర్హత సాధించిన అందరికీ ర్యాంకులను ఇచ్చేందుకు ఎంసెట్ కమిటీ చర్యలు చేపట్టింది. హైదరాబాద్ జోన్లో పరీక్ష రాసేందుకు 20,648 మంది రిజిస్టర్ చేసుకోగా 19,356 మంది హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పరీక్ష రాసేందుకు 17,939 మంది దరఖాస్తు చేసుకోగా 15,523 మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఎంసెట్-2 ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయాల్సి ఉంది. అయితే ఆ రోజున మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్లో అందుబాటులో ఉండడం లేదు. దీంతో 13నే ఫలితాలు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఎంసెట్ కమిటీని ఆదేశించినట్లు తెలిసింది. -
‘టైమంతా కెమిస్ట్రీకే సరిపోయింది’
సాక్షి, హైదరాబాద్: ‘కెమిస్ట్రీలో సమస్యాపూరక ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడం, వాటికే ఎక్కువ సమయం పట్టింది.. ఫిజిక్స్లో అన్వయ సంబంధ అంశాలపై ప్రశ్నలు వచ్చాయి... బయాలజీలో తికమక పెట్టేలా ప్రశ్నలు ఉన్నాయి. వీటిన్నిటితో వాటికే ఎక్కువ సమయం అయిపోయింది..’. ఇది శనివారం నిర్వహించిన ఎంసెట్-2కు హాజరైన విద్యార్థుల మనోగతం. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన ఎంసెట్-2 పరీక్షకు 90.76 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ప్రశ్నల విషయంలో చూస్తే.. సిలబస్ ప్రకారమే ప్రశ్నలు వచ్చాయని, తెలుగు అకాడమీ పుస్తకాల్లోని ప్రశ్నలనే ఇచ్చారని సబ్జెక్టు నిఫుణలు వెల్లడించారు. ప్రశ్నల్లో తప్పులేమీ లేవని పేర్కొన్నారు. అయితే ఈ ప్రశ్నలకు ప్రతిభావంతులైన విద్యార్థులే వేగంగా జవాబులను గుర్తించి రాయగలిగేలా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక పరీక్ష ప్రాథమిక కీని శనివారం సాయంత్రం ఎంసెట్ కమిటీ విడుదల చేసింది. దానిని ఎంసెట్-2 వెబ్సైట్లో (med.tseamcet.in) అందుబాటులో ఉంచింది. ఈ కీపై ఈనెల 12వ మధాహ్నం 2 గంటల వరకు అభ్యంతరాలను మెయిల్ ద్వారా (keyobjectionstseamcet2016@gmail.com) స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు వెల్లడించారు. ఇక ర్యాంకులను ఈనెల 14న ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదని, ఎలాంటి తప్పులు దొర్లలేదని పేర్కొన్నారు. పరీక్షకు ‘ఆర్’ సెట్ కోడ్ కలిగిన ప్రశ్నాపత్రాన్ని ఉదయం 6 గటలకు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేశారు. -
ఉన్నచూపూ పోయింది
► ఆపరేషన్ తర్వాత కంటిచూపు కోల్పోయిన ఏడుగురు.. సరోజినీదేవి ఆసుపత్రిలో దారుణం ► సర్జరీ అనంతరం వాడిన సెలైన్ బాటిల్లో బ్యాక్టీరియానే కారణం! ► ప్రాథమికంగా తేల్చిన వైద్యులు, వైద్య ఆరోగ్యశాఖ ► ఈ ఘటనపై సమగ్ర విచారణకు ముగ్గురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ ► బ్యాక్టీరియా ఉన్న 13.07 లక్షల బాటిళ్లు రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులకు సరఫరా ► సెలైన్ బాటిళ్లు సరఫరా చేసింది నాగ్పూర్కు చెందిన హసీబ్ ఫార్మాసూటికల్స్ కంపెనీ ► కంపెనీని బ్లాక్లిస్ట్లో పెట్టిన ప్రభుత్వం ► బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతాం: లక్ష్మారెడ్డి ► వైద్యులపై హుమాయూన్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు సాక్షి, హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యమో... సెలైన్ బాటిల్లో బ్యాక్టీరియానో... కారణం ఏదైతేనేం.. ఏడుగురి జీవితాల్లో చీకట్లు అలముకున్నాయి! కంటిచూపు మందగించిందని ఆసుపత్రికి వెళ్తే ఉన్న చూపూ పోయింది! కంటి శుక్లాలకు చేసే క్యాటరాక్ట్ ఆపరేషన్తో ఆ అభాగ్యులు వెలుగులకు దూరమయ్యారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆపరేషన్ వికటించి చూపు కోల్పోయిన వారంతా 50 ఏళ్లకు పైబడిన వారే. శస్త్రచికిత్స అనంతరం కళ్లను శుభ్రం చేసేందుకు వాడిన సెలైన్ బాటిల్లో బ్యాక్టీరియా వల్లే కంటి చూపు పోయిందని వైద్యఆరోగ్యశాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. సెలైన్ బాటిళ్లను సరఫరా చేసిన కంపెనీని బ్లాక్లిస్టులో పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఆ కంపెనీ సరఫరా చేసిన సెలైన్ బాటిళ్లు ఇంకా ఎక్కడెక్కడికి సరఫరా అయ్యాయో గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎలా జరిగింది..? చూపు మందగించడంతో బాధితులు జూన్ 28న సరోజినీదేవి కంటి ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు వారిని పరీక్షించి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని సూచించారు. 30న రెండు ఆపరేషన్ థియేటర్లలో మొత్తం 21 మందికి ఆపరేషన్ చేశారు. మొదటి ఆపరేషన్ థియేటర్లో తొమ్మిది మందికి, రెండో ఆపరేషన్ థియేటర్లో 12 మందికి సర్జరీ చేశారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ కవిత, డాక్టర్ కిషోర్ల వైద్య బృందం రెండో థియేటర్లో సత్యనారాయణ(60), పీసీ మండల్(67), అంజిరెడ్డి(70), నూకాలమ్మతల్లి(60), మాణిక్యం(75), ప్రభావతి(65), అర్పిణిబాయి(65), కృష్ణయ్య(60), సరళారాణి(76), బీములు(60) నాగలక్ష్మి(65), దోబ్రూ(60)లకు క్యాటరాక్ట్ సర్జరీ చేశారు. ఆపరేషన్ చేసిన రెండ్రోజుల తర్వాత బాధితుల కంటికి తీవ్ర ఇన్ఫెక్షన్ సోకింది. కన్నువాచిపోయి భరించలేని నొప్పితోపాటు కంటి నుంచి రక్తం కారింది. దీంతో వైద్యులు వారిని మరోసారి పరీక్షించారు. వైద్యపరమైన నిర్లక్ష్యం లేదని నిర్ధారించుకున్న తర్వాత ఆపరేషన్ గదుల్లోని పరికరాలను, వాడిన మందులను పరిశీలించారు. రెండో ఆపరేషన్ గదిలో కంటిని శుభ్రం చేసేందుకు వాడిన సెలైన్ బాటిల్ను పరీక్షించగా అందులో ‘క్లెప్సెల్లా’ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఇదే విషయాన్ని వైద్యులు వివరిస్తూ వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) రమణికి బుధవారం లేఖ రాయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. బాధితుల్లో సత్యనారాయణ, పీసీ మండల్, అంజిరెడ్డి, నూకాలమ్మతల్లి ఎడమ కన్ను, మాణిక్యం, ప్రభావతి, అర్పిణిబాయిల కుడి కన్ను చూపును కోల్పోయారు. వీరిలో ప్రస్తుతం ఇద్దరికి కార్నియా మార్పిడి(ఆప్టికల్ కెరిటోప్లాస్ట్) చేసి చూపును ప్రసాదించే అవకాశం ఉందంటున్నారు. మిగిలిన ఐదుగురు మాత్రం శాశ్వతంగా చూపుకు దూరం కానున్నారు. ఇదే ఆపరేషన్ గదిలో సర్జరీ చేయించుకున్న మిగతా ఐదుగురికి కూడా ఇన్ఫెక్షన్ సోకినా వారికి కంటిచూపు పోలేదని వైద్యులు చెబుతున్నారు. మొదటి ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయించుకున్న తొమ్మిది మంది కంటి చూపు బాగానే ఉంది. ఈ ఇన్ఫెక్షన్ల కేసులు వెలుగుచూడడంతో జూలై ఒకటో తేదీ నుంచి ఆస్పత్రిలో క్యాటారాక్ట్ సర్జరీలు నిలిపివేశారు. పూర్తిస్థాయి విచారణకు కమిటీ ఎంతో పేరున్న సరోజినీదేవి ఆసుపత్రిలో ఈ ఘటన జరగడంతో వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. బాధితులకు నష్టపరిహారం అందించాల్సిందిగా డీఎంఈ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణకు నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ మనోహర్, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి, డ్రగ్ కంట్రోల్ విభాగానికి చెందిన వెంకటేశ్వర్లతో ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. డ్రగ్ కంట్రోల్ విభాగాన్ని కూడా విచారణ చేయాల్సిందిగా కోరారు. ఈ బాటిళ్లను కంపెనీ నుంచి కొని ఆసుపత్రులకు సరఫరా చేసిన తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) పాత్రపైనా సర్కారు విచారణ చేస్తోంది. ఇక సెలైన్ బాటిళ్లలో బ్యాక్టీరియా ఉందని డీఎంఈ ప్రభుత్వానికి నివేదించగా.. అందులో ఎలాంటి బ్యాక్టీరియా లేదని టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్ మరో నివేదిక ఇచ్చారు. ఎక్కడివి ఆ బాటిళ్లు.. ఎన్ని కొన్నారు? రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నింటికీ మందులు, వైద్య పరికరాలను టీఎస్ఎంఎస్ఐడీసీనే సరఫరా చేస్తుంది. టెండర్లు పిలిచి వివిధ కంపెనీల నుంచి మందులు, పరికరాలను కొనుగోలు చేస్తుంది. గతేడాది కాంపౌండ్ సోడియం లాక్టేట్ ఇంజెక్షన్ ఐపీ 500 ఎంఎల్/బీఎఫ్ఎస్/ఎఫ్ఎఫ్ఎస్ (సెలైన్) సరఫరా చేసే బాధ్యతను నాగ్పూర్కు చెందిన హసీబ్ ఫార్మాసూటికల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు. ఈ సెలైన్ను రింగర్ లాక్టేట్ అని కూడా పిలుస్తారు. ఈ సెలైన్ బాటిళ్లను సరఫరా చేయాల్సిందిగా టీఎస్ఎంఎస్ఐడీసీ గతేడాది డిసెంబర్ 31న ఆ కంపెనీకి ఆర్డర్లు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 2న వివిధ బ్యాచ్లకు చెందిన 7.95 లక్షల సెలైన్ బాటిళ్లు రాష్ట్రానికి వచ్చాయి. అందులో మూడు బ్యాచ్లకు చెందిన 1,200 సెలైన్ బాటిళ్లు సరోజినీదేవి ఆసుపత్రికి అందజేశారు. వాటిల్లో 16,385 బ్యాచ్కు చెందినవి 816 బాటిళ్లు, 16,386 బ్యాచ్వి 144 బాటిళ్లు, 16,387 బ్యాచ్కు చెందిన 240 బాటిళ్లు ఆసుపత్రికి అందాయి. రెండో థియేటర్లో ఉపయోగించిన ఏడు బాటిళ్లలోని సెలైన్ నమూనాలను పరీక్షకు పంపించారు. వీటిలో రెండింటిలో బ్యాక్టీరియా ఉందని గుర్తించారు. ఆసుపత్రికి వచ్చిన 1,200 బాటిళ్లలో ఇప్పటివరకు 624 బాటిళ్లను ఉపయోగించారని తేలింది. ఇంకా 576 బాటిళ్లు ఆసుపత్రిలోనే ఉన్నాయి. వాటిని సీజ్ చేశారు. 624 బాటిళ్లను పలువురికి ఉపయోగించినందున వారి పరిస్థితి ఎలా ఉందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ కంపెనీ నుంచి వచ్చినవి 13.07 లక్షల బాటిళ్లు నాగ్పూర్కు చెందిన కంపెనీ నుంచి ఈ ఏడాది ఇప్పటివరకు రెండు విడతలుగా 13.07 లక్షల సెలైన్ బాటిళ్లను సరఫరా చేసింది. మొదటి విడత 7.95 లక్షల బాటిళ్లు, రెండో విడత 5.11 లక్షల బాటిళ్లు సరఫరా చేసింది. మొత్తం 128 బ్యాచ్లుగా అవి రాష్ట్రానికి చేరాయి. అయితే వాటిని రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాలకు తరలించారు? వాటిలో ఎన్ని వాడారన్న సమాచారం తెలియాల్సి ఉంది. సదరు కంపెనీని బ్లాక్లిస్టులో పెట్టినందున ఆసుపత్రులకు చేరిన లక్షలాది సెలైన్ బాటిళ్లను ప్రభుత్వం సీజ్ చేయాలని నిర్ణయించింది. వాటిని వాడొద్దని ఆదేశాలిచ్చినట్లు టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్ తెలిపారు. పోలీస్స్టేషన్లో బాధితుల ఫిర్యాదు తమ కంటిచూపు పోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. జూనియర్ వైద్యులతో శస్త్రచికిత్స చేయిం చినట్లు వెల్లడించారు. ఇందుకు కారణమైన బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుల బంధువులు హుమాయూన్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైద్యులపై ఐపీసీ 338 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు సరోజినీదేవి ఆస్పత్రికి వెళ్లి సెలైన్ బాటిళ్లు, వాటిని నిల్వ చేసిన తీరు, ఎక్స్పైరీ డేట్ వంటి అంశాలపై ఆరా తీశారు. ఆ కాస్తా చూపు పోగొట్టారు వైద్య పరీక్షలు చేయించుకొని అవసరమైతే కంటి అద్దాలు పెట్టుకుందామని ఇక్కడికి వచ్చాను. రెండు, మూడు సార్లు ఆపరేషన్ చేశారు. కట్లు విప్పాక ఏమీ కన్పించలేదు. వైద్యులు నాకు సర్జరీ చేసి ఉన్న ఆ కొద్దిపాటి చూపు కూడా పోగొట్టారు. - ప్రభావతి, జీడిమెట్ల, హైదరాబాద్ బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతాం: లక్ష్మారెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం సాయంత్రం సరోజినీదేవి ఆస్పత్రిని సందర్శించారు. ఆపరేషన్లు వికటించడంపై ఆరా తీశారు. ‘‘సెలైన్ బాటిళ్లను సరఫరా చేసిన కంపెనీని బ్లాక్లిస్టులో పెట్టాం. ఘటనకు బాధ్యులైన వారిపై, సంస్థలపై క్రిమినల్ కేసులు పెడతాం. మొత్తం 13 మందికి ఆపరేషన్ చేయగా.. వారిలో ఆరుగురు మంచి చూపుతో ఇంటికెళ్లారు. ఐదుగురికే ఒక కన్ను మాత్రమే పోయింది. మరో ఇద్దరు ఇంటి నుంచి ఆసుపత్రికి వస్తున్నారు. ఒక కన్ను పోయిన ఐదుగురికి కూడా పూర్తిగా ఒక కన్ను పోయిందని చెప్పలేం. వారికి ప్రభుత్వ పరంగా బయటి డాక్టర్లను తెప్పించి లేదా వేరేచోట వైద్యం చేయిస్తాం. రెండో థియేటర్లోని సెలైన్లో బ్యాక్టీరియా ఉందని తేలింది. మరో థియేటర్లో ఎలాంటి బ్యాక్టీరియా బయటపడలేదు. వాడిన ఏడు బాటిళ్లను పరీక్షలకు పంపగా... రెండింటిలో బ్యాక్టీరియా బయటపడింది’’ అని చెప్పారు. నగరంలో 30 ఆసుపత్రులకు 30 వేల బాటిళ్లు.. హైదరాబాద్లో మొత్తం 30 ఆసుపత్రులకు ఇలాంటివే 30,840 సెలైన్ బాటిళ్లను సరఫరా చేశారు. ఈ బ్యాచ్లకు చెందిన బాటిళ్లలోనే బ్యాక్టీరియా బయటపడింది. వాటిల్లో ఇప్పటివరకు ఎన్నింటిని వాడారన్నది తేలా ల్సి ఉంది. నగరంలో బార్కాస్ సామాజిక ఆరోగ్య కేంద్రం, కోఠి ఈఎన్టీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, గోల్కొండ ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ సాధారణ చెస్ట్ ఆసుపత్రి, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి, కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రి, అంబర్పేట, లాలాపేట, పానీపుర, సీతాఫల్మండి, అడ్డగుట్ట, బైబిల్ హౌస్, బోరబండ, డీఆర్ పాల్ దాస్, గడ్డి అన్నారం, గరీబ్నగర్, కిషన్బాగ్, తార్నాక, పాన్ బజార్, పురాన్పూల్-1, ఆర్ఎఫ్పీటీసీ, తుకారాంగేట్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, మలక్పేట, మల్లేపల్లి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రుల్లో, నయాపూల్, సుల్తాన్బజార్ మెటర్నిటీ ఆసుపత్రుల్లో, సరోజినీదేవి కంటి ఆసుపత్రి, శాలిబండ మున్సిపల్ సామాజిక ఆసుపత్రిలో ఈ బాటిళ్లను సరఫరా చేశారు. కన్ను తెరిచి చూస్తే ఏమీ కన్పించలేదు కంటిచూపు మందగించడంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చా. ఆపరేషన్ తర్వాత కళ్లు తెరిచి చూస్తే ఏమీ కనపడ లేదు. కంటి చూపు పూర్తిగా పోయింది. పెద్ద ఆసుపత్రని వస్తే నన్ను గుడ్డిదాన్ని చేశారు. - నూకాలమ్మతల్లి, నర్సీపట్నం, విశాఖపట్నం. రెండుసార్లు ఆపరేషన్ చేశారు అక్షరాలు సరిగా కన్పించక పోవడంతో వైద్యుడికి చూపించుకుందామని వచ్చా. ఆపరేషన్ చేశారు. రెండ్రోజుల తర్వాత మళ్ల్లీ రమ్మాన్నారు. చెకప్కు వెళ్తే మరోసారి ఆపరేషన్ చేశారు. - అర్పిణిబాయి, గోల్కొండ , హైదరాబాద్ ఇంత దూరం వచ్చి తప్పు చేశా.. మా ఊళ్లో డాక్టర్లు చెబితే ఇక్కడికి వచ్చాను. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటే సరే అన్నాను. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని గుడ్డివాణ్ణి అయ్యాను. - మాణిక్యం, కుకునూరు, మెదక్ ఇలా అవుతుందని అనుకోలేదు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఉన్న కంటిచూపు పోయింది. ఈ వయసులో గుడ్డివాడిగా ఎలా జీవిం చాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి. - అంజిరెడ్డి, పలుగుట్ట, చేవేళ్ల కళ్లు తెరిస్తే అంతా చీకటే నా కూతురు సలహా మేరకు కంటి పరీక్షల కోసం ఇక్కడికి వచ్చాను. డాక్టర్లు ఆపరేషన్ చేశారు. వారం తర్వాత కళ్లు తెరిస్తే అంతా చీకటే. ఉన్న చూపు పోయింది. - పి.సి.మండల్, కోల్కతా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నా కంటిచూపు పోయింది. నాకు డాక్టర్లు రెండుసార్లు ఆపరేషన్ చేశారు. చివరికి నన్ను ఇలా గుడ్డివాణ్ణిలా తయారు చేశారు. - సత్యనారాయణ, కార్వాన్, హైదరాబాద్ -
‘102’ వాహనాల ద్వారా గర్భిణులకు సేవలు
మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘102’ అమ్మ ఒడి వాహనాల ద్వారా గర్భిణులకు ఉచిత సేవలందిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో మంగళవారం ఆయన అమ్మ ఒడి వాహనాలను, మార్చురీ వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘102’ వాహనాల ద్వారా గర్భిణులను ఇంటి నుంచి ఆస్పత్రికి, ఆస్పత్రి నుంచి ఇంటికి ఉచితంగా తరలిస్తామన్నారు. ప్రస్తుతం‘102’ వాహనాలు 41 వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే మార్చురీకి మరో 50 కొత్త అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వీటిని గాంధీ, ఉస్మానియా, జిల్లా ఆసుపత్రుల దగ్గర ఏర్పాటు చేస్తామని చెప్పారు. వైద్య రంగాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, పేదల ఆరోగ్య రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమణి తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో వెయ్యి నర్స్ పోస్టుల భర్తీ: లక్ష్మారెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వెయ్యి నర్స్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణరాష్ట్ర నర్స్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సులదినోత్సవాన్ని గురువారం హైదరాబాద్ కోఠిలోని ఐఎంఏ ఆడిటోరియంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి లక్ష్మారెడ్డి నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో నర్స్ల డైరెక్టరేట్ను ఏర్పాటు చేస్తామని, కాంట్రాక్ట్ నర్స్లను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. -
రూపురేఖలు మార్చేస్తా
ప్రభుత్వ ఆస్పత్రులపై లక్ష్మారెడ్డి హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పా రు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టపర్చే కార్యాచరణ రూపొందించి అమలు చేయనున్నామన్నారు. నగరంలోని గాంధీ ఆస్పత్రిని శుక్రవారం ఆయన సందర్శిం చారు. సుమారు 8 గంటలపాటు ఆస్పత్రిలో ఉన్న మంత్రి అక్కడి లోటుపాట్లను తెలుసుకు న్నారు. వైద్యసేవలపై రోగులను ఆరా తీశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, ఇతర సిబ్బంది, ఆరోగ్యశ్రీ సీఈవో, టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులతో సమీక్ష నిర్వహించా రు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం బడ్జెట్లో రూ.5966కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. తెలంగాణకు రెండు కళ్లుగా ఉన్న ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. ఉస్మానియా ఆస్పత్రి లో నూతన భవన సముదాయాల నిర్మాణాలకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. రూ.600 కోట్లతో రాష్ట్రంలోని ల్యాబోరేటరీలను పటిష్ట పరుస్తామన్నారు. కో ఆర్డినేషన్ ఆఫీసర్ల నియామకం.. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఉస్మానియా, గాంధీ, ఎంజేఎం వంటి పెద్ద ఆస్పత్రుల్లో కోఆర్డినేషన్ ఆఫీసర్లను నియమించే ఆలోచన ఉందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. కోఆర్డినేషన్ ఆఫీసర్లు ఆయా ఆస్పత్రుల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో లోపాలు, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యల వంటి అంశాలను తన దృష్టికి తెస్తారన్నారు. కాగా, రాష్ట్రంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ స్టాఫ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాలరావు, ఆరోగ్యశ్రీ సీఈవో చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఆసుపత్రుల్లో ఖాళీలు భర్తీ చేస్తాం: లక్ష్మారెడ్డి
హైదరాబాద్: రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తావుని వైద్య ఆరోగ్య శాఖ వుంత్రి సి.లక్ష్మారెడ్డి తెలిపారు. అలాగే ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న అన్ని రకాల ఉద్యోగాలనూ భర్తీ చేస్తామన్నారు. బుధవారం ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తమిళనాడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోంది. మన రాష్ట్రంలో కూడా త్వరలో ఆ స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి తెస్తాం. అంతేకాకుండా ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలను ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ నలువైపులా ఆధునిక వసతులతో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మిస్తాం. చరిత్రాత్మక ఉస్మానియా భవనాన్ని కూల్చివేయకుండా సమీపంలోనే నూతనంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి అందులో దవాఖానా అందుబాటులోకి తెస్తాం’ అని మంత్రి చెప్పారు. ఆసుపత్రిలో ఇటీవల అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకున్న ఇద్దరు పేషెంట్లు మహేష్, రమేష్లను మంత్రి పరామర్శించారు. -
26న తమిళనాడుకు కేబినెట్ ఉపసంఘం
సాక్షి, హైదరాబాద్: వైద్య రంగంలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ నెల 26, 27 తేదీల్లో తమిళనాడులో పర్యటించనుంది. మంత్రివర్గ ఉపసంఘంలోని మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తదితరులు ఆ రాష్ట్రంలో పర్యటించి అక్కడి ఉన్నతాధికారులతో చర్చిస్తారు. రెండు నెలల క్రితమే ఉపసంఘం తమిళనాడులో పర్యటించాల్సి ఉండగా అక్కడ భారీ వరదల కారణంగా వాయిదా పడి ంది. తమిళనాడులో వైద్య ఆరోగ్య సేవలు ఆదర్శంగా ఉన్నాయని భావించిన మంత్రులు అక్కడ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేస్తారు. వివిధ ఆసుపత్రులను సందర్శిస్తారు. -
టీ వైద్యులకు అన్యాయం జరగనివ్వం
ప్రభుత్వ వైద్యులకు మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి హామీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యుల విభజనలో తెలంగాణ వైద్యులకు అన్యాయం జరగనివ్వబోమని మంత్రులు కె.తారకరామారావు, లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. విభజనలో తమకు తీరని అన్యాయం జరిగిందంటూ ఇటీవల వైద్యులు ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంపై ప్రభుత్వ వైద్యులు మంగళవారం స్టీరింగ్ కమిటీగా ఏర్పడి మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డిలను కలిశారు. భార్యాభర్తల (స్పౌస్) అంశం ఉంటే తప్ప ఏ రాష్ట్రం వారిని ఆ రాష్ట్రానికి కేటాయించాలని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారని స్టీరింగ్ కమిటీ నేత డాక్టర్ లాలూ ప్రసాద్, గెజిటెడ్ వైద్య ఉద్యోగుల నేత జూపల్లి రాజేందర్ తెలిపారు. తమ భేటీ సందర్భంగా కేటీఆర్ సీఎం కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారన్నారు. సీఎం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మను మంత్రులతోపాటు తామూ కలిశామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు అన్యాయం జరగకూడదని, ఆంధ్రప్రదేశ్ సీఎస్తో సమావేశమై ప్రభుత్వ వైద్యుల విభజన ప్రక్రియను పరిష్కరించాలని కేటీఆర్ సీఎస్ రాజీవ్శర్మను కోరినట్లు వారు తెలిపారు. కాగా, కమలనాథన్ కమిటీ సిఫార్సు ప్రకారం తయారుచేసిన వైద్యుల విభజన జాబితాలో తెలంగాణ వారికి అన్యాయం జరిగిందని స్టీరింగ్ కమిటీ నేతలు సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. ఆ జాబితాను రద్దు చేయాలన్నారు. సీఎస్ను, మంత్రులను కలసిన వారిలో డాక్టర్లు పల్లం ప్రవీణ్, బి.రమేష్, రమేష్రెడ్డి, ఉమాశంకర్, వినోద్ తదితరులున్నారు. -
గాంధీని సందర్శించిన మంత్రి
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి స్వైన్ ఫ్లూ భయం చుట్టేయడంతో.. గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూ బాధితుల చికిత్స కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. గత వారం రోజులలో గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూతో ఐదుగురు మృతిచెందిన నేపథ్యంలో.. బుధవారం సాయంత్రం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్వైన్ఫ్లూ వార్డును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆకస్మిక తనఖీ చేశారు. వైద్యులతో మాట్లాడి బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
'మేం మా బిడ్డలకు గోరు ముద్దలు పెట్టొద్దా'
-
'మేం మా బిడ్డలకు గోరు ముద్దలు పెట్టొద్దా'
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఇంకా భూముల ఆక్రమణ దాహం తీరనట్లుందని రైతు కూలి సంఘం నేత లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా విజయవాడ సీఆర్ డీఏ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ధర్నాలో ఆయన మాట్లాడుతూ తమ భూములు లాక్కోవద్దని మూకుమ్మడిగా చెప్తున్నా ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. ఇదే మట్టిలో నుంచి పండించిన పంటలు చంద్రబాబు తల్లి ఆయనకు గోరు ముద్దలు తినిపించిందని, అలాంటి నేలలో పంటలు పండించుకొని తమ బిడ్డలకు మేం గోరు ముద్దలు పెట్టుకోవద్దా అని నిలదీశారు. అసలు అక్రమంగా ఎన్ని భూములు తీసుకుంటారని ప్రశ్నించారు. తమలాంటి పేద రైతుల కష్టాలను గుర్తించి అండగా ఉండేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చారని, ఆయనకు తాము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. -
జడ్చర్లలో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం
జడ్చర్ల టౌన్ (మహబూబ్నగర్ జిల్లా): వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని డాక్టర్కాదంటూ వాఖ్యలు చేసిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను జడ్చర్ల మండల టీఆర్ఎస్ నాయకులు సోమవారం అంబేద్కర్ చౌరస్తాలో దహనం చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద కొద్దిసేపు దిష్టిబొమ్మను ఊరేగింపు చేసిన టీఆర్ఎస్ నాయకులు రేవంత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కోడ్గల్యాదయ్య, నాయకులు పిట్టల మురళిలు మాట్లాడుతూ 1994లో రేవంత్రెడ్డి ఏం చేశారో బహిర్గతపర్చాలని, తరువాత ఎలా ఎదిగారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీహెచ్ఎంఎస్ పూర్తిచేసిన తమ నాయకుడిపై మరోసారి నోరు జారితే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇమ్మడి యాదయ్య, శ్రీకాంత్, శంకర్నాయక్, రఘుపతిరెడ్డి, ఇంతియాజ్, ఉమాశంకర్ గౌడ్, ఇబ్రహీం, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి'లివ్ వెల్ ఎక్స్పో'ను ప్రారంభించిన మంత్రి
-
సీఎం వరాల జల్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో రెండ్రోజుల పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలిరోజు హుస్నాబాద్, మానకొం డూరు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించడంతోపాటు పలు వరాలు కురిపించారు. హుస్నాబాద్ సమగ్రాభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటానని చెప్పిన కేసీఆర్ ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున నియోజకవర్గంలోని 121 గ్రామ పంచాయతీలకు రూ.12.10 కోట్లు మంజూరు చేస్తున్నుట్ల ప్రకటించారు. దీంతోపాటు హుస్నాబాద్ పంచాయతీ భవన్ నిర్మాణానికి రూ.కోటి కేటాయిస్తామన్నారు. వీటికి సంబంధించి రెండ్రోజుల్లోనే జీవో విడుదల చేయిస్తానని చెప్పారు. హుస్నాబాద్ సభా వేదికపైకి వస్తుండగా కేసీఆర్కు పాత మిత్రుడు, ఉపాధ్యాయ సంఘ నాయకుడు లక్ష్మారెడ్డి ఎదురుపడ్డారు. స్థానికం గా ఉన్న మహాసముద్రానికి గండి పడటంతో ఇబ్బందులున్నాయని, ఆదుకోవాలని కోరారు. అనంతరం కేసీఆర్ సభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘‘ఉపాధ్యాయ నాయకుడు లక్ష్మారెడ్డి నాకు పాత మిత్రుడు. వేదికపైకి వస్తుంటే మహాసముద్రం అనే గండి పడింది. దానిని బాగు చేస్తే 15 గ్రామాలు బాగుపడతాయన్న డు. దానికి వెంటనే అంచనాలు రూపొందిస్తా. రూ.4 కోట్లు మంజూరు చేయిస్తా. యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తా. ఇలాంటి మంచి పనులేమైనా ఉంటే చెప్పండి. చేసేస్తా’’ అని అన్నారు. హుస్నాబాద్లో ప్రతి ఇంటికీ సాగు, తాగునీరు తెచ్చే బాధ్యత నాదే. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా... ఈ ప్రాంతం బాగు పడాలని ఆకాంక్షించారు. నాగసముద్రం వద్ద మోడల్ స్కూల్లో మొ క్కలు నాటుతుండగా సర్పంచ్ పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేదని ప్రస్తావించారు. వెంటనే ఆ స్కూల్కు ప్రహారీగోడకు అయ్యే నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నాగసముద్రానికి రోజుకు ఒకే ట్రిప్పు బస్సు వస్తోందని స్థానికులు చెప్పగా, అవసరమైనన్ని ట్రిప్పులు తిరిగేలా ఆర్టీసీ అధికారులకు ఆదేశాలి వ్వాలని కలెక్టర్ నీతూప్రసాద్కు సూచించారు. అక్కడి నుండి చిగురుమామిడి మండలం చిన ముల్కనూరు గ్రామానికి వచ్చిన సీఎం ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తాను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తానని, హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేసుకుంటానని చెప్పారు. తక్షణమే రూ.50 లక్ష లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మానకొండూరు నియోజకవర్గం లోని నుస్తులాపూర్కు వచ్చిన సీఎం 16ఎకరాల్లోనున్న ప్రభుత్వ పాఠశాలకు ప్రహారీగోడను నిర్మించేందుకు తగిన నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అక్కడి నుండి అలుగునూరు వచ్చిన కేసీఆర్ ఆ గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తమకు ఇళ్లులేవని పేర్కొంటూ కొందరు స్థానికులు సీఎంకు వినతిపత్రం ఇవ్వగా వెంటనే స్పందిస్తూ ‘‘అలుగునూరులో ఇల్లులేని వారికి ఎస్సారెస్పీ పరిధిలోని రెండెకరాల స్థలంలో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తా’’అని హామీ ఇచ్చారు. -
‘ప్రైవేటు ఎం-సెట్’పై సర్కారు సీరియస్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ప్రత్యేక పరీక్ష వ్యవహారంలో ప్రైవేటు వైద్య కళాశాలలపై సర్కారు కొరడా ఝుళిపించింది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే ప్రత్యేక ప్రవేశ పరీక్ష (ఎం-సెట్)కు కన్వీనర్ ఎంపిక, నోటిఫికేషన్ జారీ చేయడంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. కనీసం తనకు కూడా సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’లో మూడు రోజులుగా ప్రచురితమైన కథనాలు రాష్ట్రంలో ప్రకంపనలు పుట్టించాయి. సీఎం కేసీఆర్ కూడా ప్రైవేటు కళాశాలల తీరుపై, నోటిఫికేషన్ ఇచ్చిన పద్ధతిపై ఆరా తీసినట్లు సమాచారం. దీంతో సీఎం ఆదేశాల మేరకు మంత్రి లక్ష్మారెడ్డి మంగళవారం పలు చర్యలు చేపట్టారు. ప్రైవేటు వైద్య కాలేజీల యాజమాన్యాలను పిలిపించి మందలించారు. విచిత్రమేమిటంటే మంత్రికి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై విమర్శలు రావడంతో... కాలేజీల యాజమాన్యాలు మంత్రి వద్దకు వచ్చి ‘ఇతనే మా క న్వీనర్’ అంటూ రాజేంద్రప్రసాద్ను పరిచయం చేశారు. నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పి, దానికి ఆమోదం తెలపాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డితో చర్చించి.. ఓ నిర్ణయానికి వచ్చారు. తాము సూచించిన స్వచ్ఛంద సంస్థకే ప్రశ్నపత్రం తయారీ, పరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్ బాధ్యతలు అప్పగించాలన్న ప్రైవేటు వైద్య కాలేజీల విజ్ఞప్తిని మంత్రి తిరస్కరించారు. హైదరాబాద్ జేఎన్టీయూ ఆధ్వర్యంలో ప్రశ్నపత్రం తయారీ, సెంట్రలైజ్డ్ సింగిల్ విండో కౌన్సెలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు ఆన్లైన్లో పరీక్ష నిర్వహణ బాధ్యతను అప్పగిస్తామని.. ప్రశ్నపత్రం ఎంపిక బాధ్యతను ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో చేపడతామని చెప్పారు. పరీక్ష పర్యవేక్షణ బాధ్యతను కూడా ఉన్నత విద్యా మండలి చేపడుతుంది. ఇక ‘ప్రైవేటు’ ఎం-సెట్ దరఖాస్తులకు ఈనెల 28 చివరి తేదీగా పేర్కొన్నా.. దానిని పొడిగించాలని, పరీక్ష తేదీని మార్చాలని సర్కారు ఆదేశించింది. అయితే వైద్య విద్యా మండలి (ఎంసీఐ) నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు ఈ ప్రవేశ పరీక్షకు ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా 3,200 దరఖాస్తులు వచ్చాయి. -
108 ఉద్యోగుల సమ్మె విరమణ
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ సాక్షి, హైదరాబాద్: సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో ‘108’ ఉద్యోగులు తమ సమ్మె విరమించారు. దీంతో 11 రోజులుగా జరుగుతున్న సమ్మెకు తెరపడింది. ఉద్యోగులు విధుల్లో చేరారు. తెలంగాణ ‘108’ ఉద్యోగుల సంక్షేమ సంఘం, జీవీకే-ఈఎంఆర్ఐ ప్రతినిధులతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి రెండు రోజులు చర్చలు జరిపారు. మంత్రి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, ఉద్యోగుల 15 డిమాండ్ల పరిష్కారానికి పార్లమెంటరీ కార్యదర్శులు వినయ్భాస్కర్, గాదరి కిషోర్లతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. సమ్మె కాలాన్ని వేతనంతో కూడిన సెలవుగా పరిగణిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మహేందర్రెడ్డి, అశోక్ మాట్లాడుతూ రెగ్యులర్గా పెంచే 10 శాతంతో కాకుండా రూ. వెయ్యి అదనంగా వేతనం పెంచుతామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. జీవీకే బదులు ప్రభుత్వమే ‘108’ వ్యవస్థను నిర్వహించాలన్న డిమాండ్పైనా, తొలగించిన 70 మందిపైనా కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. రెండు నెలల్లో కమిటీ నివేదిక సమర్పిస్తుందన్నారు. కమిటీలో సంఘం ప్రతినిధులు కూడా ఉంటారన్నారు. ప్రభుత్వ డాక్టర్ల వేతనాలు పెంచుతాం ప్రభుత్వ డాక్టర్ల వేతనాలు పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. వారికి ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని, అలాగే ప్రభుత్వ వైద్య విధానాన్ని సమూలంగా మార్చుతామన్నారు. ఆస్పత్రులు, కార్యాలయాల్లో సీసీ కెమెరాలు పెట్టే ఆలోచన ఉందన్నారు. ఇప్పటివరకు పరికరాలు, ఔషధాల కొనుగోలులో అనేక అవకతవకలు జరిగాయన్నారు. పరికరాల కొనుగోలుకు సంబంధించి బహిరంగ చర్చ పెడతామని చెప్పారు. పెంటావలెంట్ టీకాను వచ్చే నెల 2న ప్రారంభిస్తామని వెల్లడించారు. మెడ్సెట్ ద్వారానే యాజమాన్య వైద్య సీట్లు రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో తమ కోటా సీట్లన్నింటినీ యాజమాన్యాలు అమ్ముకున్నాయని, ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని మంత్రి లక్ష్మారెడ్డిని ప్రశ్నించగా... ‘ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఉంటుందన్న విషయం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అడ్వాన్సు డబ్బులు తీసుకొని సీట్లను బుక్ చేశారు. ప్రత్యేక ప్రవేశ పరీక్షలో మెరిట్ మార్కులు రాకుంటే ఎవరి డబ్బులు వారికి వాపసు ఇస్తార’ని మంత్రి స్పష్టంచేశారు. ముందు డబ్బులు తీసుకున్నందున పేపర్ లీక్ అయ్యే అవకాశాలుంటాయని ప్రశ్నించగా... అటువంటి పరిస్థితి తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
స్వచ్ఛంద సంస్థతో ప్రత్యేక ప్రవేశ పరీక్ష
ప్రైవేట్ మెడికల్ యాజమాన్య సీట్లపై సర్కారు నిర్ణయం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఏఎఫ్ఆర్సీ ఆధ్వర్యంలో పరీక్ష ? గతేడాదే ఫీజులు పెంచినందున మళ్లీ పెంచబోమన్న మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కళాశాలల ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు ఈ విద్యా సంవత్సరం నుంచే.. స్వచ్ఛంద సంస్థతో ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాదే ఫీజులు పెంచినందున ఈసారి మళ్లీ పెంపు ఉండదని కూడా స్పష్టంచేసింది. ప్రత్యేక ప్రవేశ పరీక్ష, ఫీజుల పెంపు విషయాలపై ఇటీవల ప్రైవే ట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి రెండుసార్లు చర్చించిన విషయం విదితమే. ఈ విషయమై ఆయన సీఎం కేసీఆర్తో చర్చించారు. సీఎం ఆమోదం మేరకు స్వచ్ఛంద సంస్థతో ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగానే.. స్వచ్ఛంద సంస్థతో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్న మంత్రి అదెలా ఉంటుందో మాత్రం స్పష్టంగా పేర్కొనలేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని సీట్లకు, ఎలా పరీక్ష నిర్వహిస్తుందో.. ఇక్కడ కూడా అలాగే చేస్తామన్నారు. కాగా, తెలంగాణలో మొత్తం 2,950 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 2,100 సీట్లు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం 35 శాతం ప్రైవేట్ యాజమాన్య కోటా సీట్లుగా నిర్ణయించి దానికే ప్రత్యేక ప్రవేశ పరీక్ష చేపట్టింది. ఆ ప్రకారం తెలంగాణలో 35 శాతం యాజ మాన్య కోటా కింద 735 సీట్లకు ప్రత్యేక పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది. స్వచ్ఛంద సంస్థగా స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రవేశ పరీక్ష చేపట్టింది. పర్యవేక్షణ బాధ్యతను అడ్మిషన్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) అప్పగించింది. మన ప్రభుత్వం కూడా వాటి ద్వారానే ఈ పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కౌన్సిలిం గ్ను ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వర్సిటీకే అప్పగించింది. మన ప్రభుత్వమూ అదే చేసే అవకాశం ఉంది. కౌన్సెలింగ్లో ప్రైవేట్ యాజ మాన్యాలు కూడా పాల్గొనే వెసులుబాటు ఉండే అవకాశాలున్నాయి. -
చెరువులు నిండాలి... బతుకులు పండాలి
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డి వంగూరు : చెరువులు నిండి రైతుల బతుకులు పండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు రాష్ట్రంలో చెరువులన్నింటినీ పునరుద్ధరించేందుకు నిర్ణయించారని, రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెంచేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి వంగూరు మండలం చారకొండ గ్రామ పెద్ద చెరువు పనులను, చారకొండ ఉన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పునఃనిర్మాణంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడుతున్నారన్నారు. ఎమ్మెల్యే గువ్వల బాల్రాజ్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు భీముడు నాయక్, సర్పంచులు శిల్పాదేవీలాల్, రాంకొండ, సువర్ణ తిరుమలేష్, ఎంపీటీసీ సభ్యులు చెన్నమ్మ, చిన్న ఇదమయ్య, చరిత, టీఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, హమీద్, విజయేందర్గౌడ్, గురువయ్యగౌడ్, సురేందర్రెడ్డి, శ్రీపతిరావు, జేసీబీ వెంకటయ్య, రమేష్, ప్రవీణ్రెడ్డి, కర్ణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యాభై పడకల ఆసుపత్రికి మంత్రి శంకుస్థాపన
ఆదిలాబాద్ (ఆసిఫాబాద్): ఆసిఫాబాద్ మండల కేంద్రంలో యాభై పడకల ఆసుపత్రి నిర్మాణానికి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మా రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ ఆసుపత్రిని రూ.11 కోట్లతో నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రితో పలువురు జిల్లా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బర్డ్ఫ్లూపై ఆందోళన అక్కర్లేదు: మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల టౌన్ (మహబూబ్నగర్): బర్డ్ప్లూపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ముందస్థు జాగ్రత్తలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. బుధవారం జడ్చర్ల పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో బర్డ్ప్లూ నిర్దారణ అయ్యిందని, అందుకోసం అక్కడి వైద్య ఆరోగ్యశాఖ- పశుసంవర్ధక శాఖలు సంయుక్తంగా నివారణ చర్యలు చేపట్టాయన్నారు. బర్డ్ప్లూ సోకిన కోళ్లను చంపి పూడ్చిపెట్టడం జరుగుతోందని, కోళ్ల ఫారాల్లో పనిచేసే వారికి తగిన జాగ్రత్తలు వివరించటం జరిగిందన్నారు. బుధవారం ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రత్యేక బృందం క్షేత్ర స్థాయిలో పరిశీస్తుందని చెప్పారు. కోళ్లఫారాలు, చికెన్లకు దగ్గరగా ఉండే వారు జాగ్రత్తగా ఉండాలని, మాస్క్లు ధరిచటంతోపాటు జలుబు, జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వైరస్ నివారణకు తగినన్ని టామిఫ్లూ మాత్రలను అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు. -
ఎయిమ్స్, నిమ్స్ రెండూ కావాలి!
బీబీనగర్ నిమ్స్పై శాసనసభలో చర్చ ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు నిమ్స్ అవసరం లేదన్న వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సాక్షి, హైదరాబాద్: బీబీనగర్ నిమ్స్ స్థానం లో ఎయిమ్స్ ఏర్పాటు అంశంపై శాసన సభలో వాడివేడి చర్చ జరిగింది. ఈ అంశంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీత, వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీఎల్పీ నేత కె.లక్ష్మణ్ లేవనెత్తిన ప్రశ్నపై శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అధికార టీఆర్ఎస్- కాంగ్రెస్, బీజేపీ సభ్యులు పరస్ప రం ఆరోపణలు చేసుకున్నారు. ఎయిమ్స్ను మరోచోట ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రజలకు నిమ్స్, ఎయిమ్స్ రూపంలో రెండు పెద్ద ఆస్పత్రుల సేవలు అందుబాటులోకి వచ్చేవని చిం తల రామచంద్రారెడ్డి(బీజేపీ) ప్రభుత్వాన్ని నిలదీశారు. బీబీనగర్ నిమ్స్ భవన నిర్మాణం పూర్తైదని, కేవలం పరికరాలు, వైద్యులను అందుబాటులోకి తెస్తే సరిపోతుందన్నారు. రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు అంగీకరిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ స్వయంగా లేఖ రాసినా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ స్పత్రికి కావాల్సిన భూసేకరణ జరపకుండా ఆలస్యం చేయడం వల్లే ఈ బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయించలేకపోయిందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తప్పుబట్టారు. ఎయిమ్స్ వచ్చే వరకైనా బీబీనగర్ నిమ్స్ ఆధ్వర్యంలో ఆస్పత్రిని ప్రారంభించి వైద్య సేవలు అందించాలని జీవన్రెడ్డి(కాంగ్రెస్)డిమాండ్ చేశారు. ఈ అంశంపై అధికార పక్షం విపక్షాలపై ఎదురుదాడి చేసింది. బీబీ నగర్ నిమ్స్ ఆస్పత్రి స్థాపన నీరుగార్చడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఇప్పుడా ప్రాంతంలో నిమ్స్ ఆస్పత్రి అవసరం లేదన్నారు. చుట్టుపక్కల ఉన్న 4 జిల్లాల అవసరాలను దృష్టిలో పెట్టుకునే నిమ్స్ స్థానంలో ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని నిర్ణ యం తీసుకున్నామన్నారు. పునర్విభజన చట్టంలో ఎయిమ్స్ ఏర్పాటుపై హామీ లేకపోయినా సీఎం కేసీఆర్, తమ ఎంపీల చొరవతో కేంద్రం అంగీకరించిందన్నారు. బీబీ నగర్ నిమ్స్కు 150 ఎకరాలు ఉన్నాయని, అక్కడే ఎయిమ్స్ను నెలకొల్పేందుకు కావాల్సిన మరో 50 ఎకరాలను సేకరిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతిపాదనలు కేంద్రం వద్ద పరిశీలనలో ఉన్నాయన్నారు. ఉమ్మడిజాబితాలో జేఎన్టీయూలేదు పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 10లోని ఉమ్మడి సంస్థల జాబితాలో ‘జేఎన్టీయూ హెచ్’ వర్శిటీ లేనందునే రాష్ట్ర విద్యార్థుల కోసం ప్రత్యేక ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రలకు వేర్వేరుగా ఎంసెట్ నిర్వహణ ఎందుకు? అని పువ్వాడ అజయ్ కుమార్(కాంగ్రెస్) అడిగిన ప్రశ్నకు ఆయనపై విధంగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని మూడేళ్లలో 25 నుంచి 35 శాతానికి వృద్ధి చేసేందుకు హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రం లో 25.43 లక్షల హెక్టార్లలో అడవులున్నాయన్నారు. టీఆర్ఎస్ సభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి, కె.విద్యాసాగర్, చింతా ప్రభాకర్, వీరేశం, ఆరూరి రమేష్, రాథోడ్ బాపూరావు అడిగిన ప్రశ్నకు మంత్రి జోగురామన్న పైవిధంగా స్పందించారు. ఠ ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆస్పత్రిని వాకారాబాద్లోని అనంతగిరి హిల్స్లో ఉన్న టీబీ శానిటోరియంకు మార్చాలని నిర్ణయం తీసుకున్న విషయం వాస్తవమేనని వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఎర్రగడ్డ ఆస్పత్రి స్థలంలో అత్యాధునిక సచివాలయ సముదాయం నిర్మించనున్నామన్నారు. -
విఐపి రిపోర్టర్ - జడ్చర్గ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
-
మూడేళ్లలో మిగులు విద్యుత్
విద్యుత్శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మారెడ్డి డీడీ కట్టిన వెంటనే రైతులకు కొత్త కనెక్షన్ ఇస్తామని హామీ సాక్షి, హైదరాబాద్: మూడేళ్లలో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని విద్యుత్ శాఖ నూతన మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. భవిష్యత్తులో డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) చెల్లించిన వెంటనే రైతులకు కొత్త విద్యుత్తు కనెక్షన్లు అందించేందుకు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా చెప్పారు. రైతులు అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా ఈ విధానం అమలు చేస్తామన్నారు. కొత్త కనెక్షన్లకోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులు ఏళ్ల తరబడిగా పరిష్కారానికి నోచుకోలేదని... ప్రస్తుతం రాష్ట్రంలో 80 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని మంత్రి చెప్పారు. వీలైనంత తొందరగా ఈ కనెక్షన్లు మంజూరు చేస్తామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టులు పూర్తి కాకపోవటంతో... తెలంగాణలోని రైతులు బోర్లు, బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉందని.. దీన్ని అధిగమించటంతో పాటు మూడేళ్ల వ్యవధిలో అదనపు విద్యుత్ లభ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విద్యుత్ కేంద్రాలతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా కరెంటు కొరతను అధిగమిస్తామని అన్నారు. ప్రస్తుతమున్న తరుణంలో అత్యంత కీలకమైన విద్యుత్ శాఖను అప్పగించటంతో తనపై బాధ్యత మరింతగా పెరిగిందన్నారు. మహబూబ్నగర్ నుంచి మంత్రిగా తనకు అవకాశం కల్పించినందుకు ఆయన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.కె.జోషి, టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకర్రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ, జెన్కో, ట్రాన్స్కో డెరైక్టర్లు, వివిధ విభాగాల అధికారులు మంత్రికి అభినందనలు తెలిపారు. -
పాలమూరును తీర్చిదిద్దుతాం
కొత్తూరు : వలసల జిల్లాగా మారిన పాలమూరు జిల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్ శాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు తెలిపారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం వారు బుధవారం తొలిసారిగా జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా కొత్తూరు మండలం తిమ్మాపూర్ చెక్పోస్టు వద్ద షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, వీర్లపల్లి శంకర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రులు స్థానిక వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మంత్రులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పలు గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, నాయకులు, ప్రజాప్రతినిధులు మంత్రులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారని.. దానిని నేరవేర్చడానికే మంత్రివర్గంలో జిల్లాకు ప్రాధాన్యం కల్పించినట్లు చెప్పారు. జిల్లాను అభివృద్ధి పరిచే అంశంలో తాము ప్రతిపక్షాల సూచనలు, సలహాలు కూడా తీసుకుంటామని.. వారు కూడా తమకు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని కోరారు. అంతేకాకుండా జిల్లాలో మరిన్ని బహుళజాతి పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. స్థానికులందరికీ ఉద్యోగాలు వచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు విద్యారంగంలో మార్పులు తేనున్నట్లు వివరించారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా విద్యుత్ సమస్యను అధిగమించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నట్లు వివరించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేసీఆర్ ఎన్నో ఏళ్ల నుంచి మరమ్మతులకు నోచుకోని చెరువులకు మరమ్మతులు చేపట్టే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే ఖరీఫ్ సీజన్ వరకు ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీటి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాసగౌడ్, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, వైస్ చైర్మన్ నవీన్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్రావు ఆర్యా, నాయకులు వీర్లపల్లి శంకర్, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, రవీందర్రెడ్డి, ఆర్డీఓ హన్మంతరెడ్డి, కోస్గి శ్రీనివాస్, ఏనుగు మహేందర్ రెడ్డి, అయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కొత్త మంత్రులు ఏమన్నారంటే..
సాక్షి హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణలో భాగంగా తెలంగాణ రాష్ర్ట తొలి కేబినెట్లో చోటు సాధించడం తమ అదృష్టమని కొత్త మంత్రులు పేర్కొన్నారు. మంగళవారం ప్రమాణస్వీకారం అనంతరం సచివాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ కేబినెట్లో స్థానం కల్పించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలపడంతోపాటు, మంత్రులుగా తెలంగాణ పునర్నిర్మాణం కోసం కృషిచేస్తామని చెప్పారు. కొత్త మంత్రుల అభిప్రాయాలు వారి మాటల్లోనే... రాష్ట్ర అభివృద్ధికి పోరాడతా: ఇంద్రకరణ్ తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్లో స్థానం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు. తెలంగాణ కోసం ఎంతో పోరాడా... స్వరాష్ర్టం అభివృద్ధికి మరింత పోరాడతాను. తెలంగాణ అభివృద్ధిలో సహకరించాలనే సీఎం ఆహ్వానం మేరకు టీఆర్ఎస్లో చేరా. జిల్లా అభివృద్ధి కోసం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలతో కలసి పనిచేస్తాను. శభాష్ అనిపించుకుంటా: తుమ్మల తెలంగాణ పునర్నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించడమే నా ప్రధాన లక్ష్యం. ఎప్పుడో వందల ఏళ్ల క్రితమే తెలంగాణలో చెరువుల నిర్మాణం ద్వారా 260 టీఎంసీల నీటి నిల్వ జరిగింది. ఇప్పుడు ఆ వ్యవస్థను పునరుద్ధరిస్తాం. రహదారులు, విద్య, వైద్యం వంటి రంగాల్లో ప్రభుత్వం, ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించి శభాష్ అనిపించుకుంటా. నా అదృష్టం: లక్ష్మారెడ్డి పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ పునర్నిర్మాణంలోనూ అదే పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తాం. నవ తెలంగాణ నిర్మాణానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. 50 ఏళ్లలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేయలేకపోయిన అభివృద్ధిని 5 ఏళ్లలో చేసి చూపిస్తాం. ఉద్యమనేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం ఆనందకరం. అలాంటి నేత నేతృత్వంలో పనిచేయడం నా అదృష్టం. పెండింగ్ ప్రాజెక్టులను కూడా వేగంగా పూర్తి చేస్తాం. -
'కేసీఆర్ ఎజెండానే నా ఎజెండా'
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో 90 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్కు అన్ని జిల్లాలు సమానమేనని వెల్లడించారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలు అన్న తారతమ్యాలు తమకు లేవని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని పదవులు పొందిన నేతలంతా కలసి పని చేస్తామని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఎజెండానే తన ఎజెండా అని తెలిపారు. తెలంగాణ, మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని లక్ష్మారెడ్డి చెప్పారు. -
ఈవీఎం పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
-
ఈవీఎం పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
మాచర్ల: పోలింగ్ స్టేషన్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఈవీఎంను పగలగొట్టిన గుంటూరు జిల్లా మాచర్ల తాజా ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేశారు. పోలింగ్ స్టేషన్లో లక్ష్మారెడ్డి బూతులు తిడుతూ బెదిరించిన సంఘటనలు టీవీ చానెళ్లలో ప్రసారం కావడంతో ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ అరెస్ట్కు ఆదేశించింది. మాచర్ల మునిసిపల్ ఎన్నికల సందర్భంగా 29వ వార్డులో లక్ష్మారెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించి ఈవీఎంను పగలగొట్టారు. పోలీస్ సిబ్బంది, ఇతర పార్టీల ఏజెంట్లను దుర్భాషలాడారు. ఓ దశలో లక్ష్మారెడ్డి బూతులు తిడుతూ.. నరుకుతా అంటూ బెదిరించారు. దీంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
ఈవీఎం పగలగొట్టి.. నరికేస్తానంటూ..!
-
ఈవీఎం పగలగొట్టి.. నరికేస్తానంటూ మాజీ ఎమ్మెల్యే వీరంగం
మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్ల మునిసిపల్ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 29వ వార్డులో తాజా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించి ఈవీఎంను పగలగొట్టారు. పోలీస్ సిబ్బంది, ఇతర పార్టీల ఏజెంట్లను దుర్భాషలాడారు. ఓ దశలో లక్ష్మారెడ్డి బూతులు తిడుతూ.. నరుకుతా అంటూ బెదిరించారు. దీంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు జోక్యం చేసుకుని లక్ష్మారెడ్డిని పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు పంపించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. సాయంత్రంలోపు లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేసే అవకాశముంది. -
‘రాయల తెలంగాణ’పై.. భిన్న వాదనలు!
‘రాయల్’గా ఉంటాం కర్నూలు, అనంతపూర్ జిల్లాలతో ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయడం సహేతుకం. నదీ జలాలు, విద్యుత్ తదితర సమస్యలు కూడా ఈ జిల్లాల కలయికతో సర్దుకుంటాయి. ఇటు బొగ్గు, అటు ఇనుము వంటి సహాజ వనరులు ఉండడం వల్ల రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అభివృద్ధి అసమానతలు తొలిగిపోతాయి. మొదట్నుంచి నేను వాదిస్తున్నట్లు ఇరు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలు సమంగా ఉంటాయి. రాయల తెలంగాణతో రాజకీయంగా కూడా కాంగ్రెస్కు కలిసివస్తుంది. - కేఎల్లార్, మేడ్చల్ ఎమ్మెల్యే కిరికిరి చేస్తే ఊరుకోం పది జిల్లాలతో కూడిన తెలంగాణకే నా మద్దతు. పూట కో పేచీతో తెలంగాణకు అడ్డంకులు సృష్టిస్తే చూస్తూ ఊరుకోం. రాజకీయ ప్రయోజనాలను ఆశించి రాయలసీమను కలపాలని ప్రయత్నం మంచిది కాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం కిరికిరిలు పెడితే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు. - పి.మహేందర్రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మళ్లీ దగా పడతాం సంపూర్ణ తెలంగాణకే మా మద్దతు. సీమలోని రెండు జిల్లాలను కలిపితే తెలంగాణకు న్యాయం జరగదు. ఫ్యాక్షనిస్టుల దోపిడీతో మరోసారి మోసం పోతాం. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలి. - కేఎస్ రత్నం, చేవెళ్ల ఎమ్మెల్యే ఇది సరైన సమయం కాదు రాష్ట్ర విభజన విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మొదట్నుంచి చెబుతూ వస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రకటనపై గ్రేటర్ ఎమ్మెల్యేల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం అధిష్టానం చేయలేదు. కొత్త రాష్ట్రాన్ని ప్రకటించి.. చివరి నిమిషంలో ఇప్పుడు మా అభిప్రాయాన్ని కోరడం అర్ధరహితం. - దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సంపూర్ణ తెలంగాణ 57 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పడుతున్న తెలంగాణను అడ్డుకునే ప్రయత్నమే రాయల తెలంగాణ ప్రతిపాదన. హైదరాబాద్ రాజధానిగా ఏర్పడే తెలంగాణకే మా మద్దతు. రాయలసీమను విచ్ఛిన్నం చేసి.. తెలంగాణలో కలపాలని చూస్తే ప్రజా ఉద్యమం తప్పదు. - మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే