గుంటూరు జిల్లా మాచర్ల మునిసిపల్ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 29వ వార్డులో తాజా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు.
మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్ల మునిసిపల్ ఎన్నికల సందర్భంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 29వ వార్డులో తాజా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించి ఈవీఎంను పగలగొట్టారు. పోలీస్ సిబ్బంది, ఇతర పార్టీల ఏజెంట్లను దుర్భాషలాడారు. ఓ దశలో లక్ష్మారెడ్డి బూతులు తిడుతూ.. నరుకుతా అంటూ బెదిరించారు. దీంతో అక్కడ ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు జోక్యం చేసుకుని లక్ష్మారెడ్డిని పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు పంపించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. సాయంత్రంలోపు లక్ష్మారెడ్డిని అరెస్ట్ చేసే అవకాశముంది.