షోలాపూర్-రాయచూర్’ను ముందే బుక్ చేసుకున్న పొరుగు రాష్ట్రం
సాక్షి, హైదరాబాద్: షోలాపూర్-రాయచూర్ లైను ద్వారా అదనపు విద్యుత్ను పొంది, కరెంటు కష్టాల నుంచి బయట పడదామనుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తమిళనాడు అడ్డంగా ‘బుక్’ చేసింది. ఈ లైను ద్వారా సరఫరా అయ్యే సుమారు 1250 మెగావాట్ల విద్యుత్లో ఏకంగా 1000 ఎంవీని ఇప్పటికే ఆ రాష్ట్రం తన్నుకుపోయింది. ఇక ఇందులో మిగిలిన 250 మెగావాట్ల విద్యుత్ కోసం ఐదు దక్షిణాది రాష్ట్రాలు పోటీపడాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో తెలంగాణ, ఏపీలు మరి కొన్నేళ్లు విద్యుత్ కష్టాలు భరించాల్సిందేనన్న విషయం స్పష్టమైపోయింది.
తమిళనాడు తన్నుకుపోయింది!
Published Sat, Jul 26 2014 3:19 AM | Last Updated on Mon, Oct 22 2018 8:37 PM
Advertisement
Advertisement