‘భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలి’ | Telangana DGP Meeting In Mulugu District | Sakshi
Sakshi News home page

‘భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలి’

Published Tue, Jul 23 2019 5:44 PM | Last Updated on Mon, Feb 17 2020 5:16 PM

Telangana DGP Meeting In Mulugu District - Sakshi

సాక్షి, ములుగు: భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రజాప్రతినిధుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా.. డీజీపీ కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం ఉదయం నుంచి ఏడు గంటలపాటు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టుల కదలికలపై పోలీసులు, నిఘావ్యవస్థను అప్రమత్తం చేస్తూ సూచనలు ఇచ్చారు. ఈ నెల 28 నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. 2020లో మేడారం జాతర ఏర్పాట్లు, వీఐపీల భద్రతపై డీజీపీ ఈ అంతర్గత సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షలో వరంగల్ పోలీస్ కమిషనర్, మూడు జిల్లాల ఎస్పీలు, ఆరు జిల్లాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement