'మేక్ ఇన్ తెలంగాణలో భాగస్వాములు కండి' | Telangana Minister ktr meeting with nri's in dallas | Sakshi
Sakshi News home page

'మేక్ ఇన్ తెలంగాణలో భాగస్వాములు కండి'

Published Sun, May 10 2015 8:41 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

'మేక్ ఇన్ తెలంగాణలో భాగస్వాములు కండి' - Sakshi

'మేక్ ఇన్ తెలంగాణలో భాగస్వాములు కండి'

హైదరాబాద్: మేక్ ఇన్ తెలంగాణలో భాగస్వాములు కావాలని ఆ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు ఎన్నారైలకు పిలుపునిచ్చారు.  యూఎస్ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఆదివారం డల్లాస్లో నిర్వహించిన ఐటీ సర్వ్ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ కంపెనీ ప్రతినిధులు, ఎన్నారైలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలపై కేటీఆర్ ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

తెలంగాణలో కంపెనీలు పెడితే ప్రభుత్వపరంగా అన్నివిధాల సహకారం అందిస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా ఎన్నారైలకు హామీ ఇచ్చారు. కేటీఆర్ రెండు వారాల అమెరికా పర్యటనలో మే 5వ తేదీ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే.  ఆయన మే 16వ తేదీన భారత్ తిరిగి ప్రయాణం అవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement