అప్పులబాధ భరించలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మేళ్ల చెరువు మండలం ఎల్లటూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బంటు కిష్టయ్య(45) తనకున్న ఐదెకరాల భూమిలో పత్తి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు పెరిగి పోవడంతో వాటిని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.