Cotton farmer
-
రోడ్డెక్కిన పత్తి రైతు
నాదెండ్ల: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులకు మద్దతు ధర లభించటం లేదని, సాకులు చెబుతూ పత్తిని కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారంటూ సోమవారం రైతులు రోడ్డెక్కారు. పల్నాడు జిల్లా గణపవరంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న వెంకటకృష్ణ ఎంటర్ప్రైజెస్లో ఇటీవల సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. నిబంధనల పేరుతో 90 శాతం పత్తి లోడులను తిరస్కరిస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి.. పత్తి లోడు ట్రాక్టర్లను జాతీయ రహదారికి అడ్డంగా నిలిపి దిగ్బంధనం చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తేమ 12 శాతం మించిందని, పత్తిలో కాయ ఉందని, తడిసిపోయిందంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజు కూడా రైతులకు న్యాయం జరగలేదని వాపోయారు. గత ప్రభుత్వంలో సీసీఐ కొనుగోలు కేంద్రంలో రైతులకు పూర్తిగా న్యాయం జరిగిందని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షానికి ఎకరాకు 2–3 క్వింటాళ్ల మేర దిగుబడి నష్టపోయామని, కూలి ధరలు పెరిగి సాగు భారంగా మారిందన్నారు. రైతులు ఆందోళనకు దిగారన్న సమాచారంతో రూరల్ సీఐ సుబ్బానాయుడు సిబ్బందితో చేరుకుని రైతులతో మాటా్లడారు. సీఐ తాను ఉన్నతాధికారులతో మాట్లాడతానని సర్దిచెప్పి ఆందోళన విరమింపచేశారు. అనంతరం సీసీఐ బయ్యర్ రమే ష్ బాబు, రైతులతో సంప్రదింపులు చేశారు. -
అమృత్ పత్తి.. ఎకరానికి 20 క్వింటాళ్ల దిగుబడి! ఎలా సాగు చేయాలంటే?
పత్తి దిగుబడుల పరంగా ఎకరానికి 20 క్వింటాళ్లు సాధించిన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారికి చెందిన యువ రైతు ఫడ్ విజయ్ ఆదర్శంగా నిలుస్తున్నారు. రెట్టింపు దిగుబడి సాధించిన విషయం ఆ నోటా ఈ నోటా తెలుసుకొని పరిసర గ్రామాల రైతులు ఆసక్తిగా పొలాన్ని చూసి వెళ్తున్నారు. సాధారణ సాగులో కొంత మందికి 6 నుంచి 8 క్వింటాళ్లు, మరికొంత మందికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే, ఈ రైతు ఏకంగా రెట్టింపు కంటే అధిక దిగుబడి సాధించడమే రైతులను ఆకర్షిస్తోంది. ఫడ్ విజయ్కు మహరాష్ట్రలోని యవత్మాల్ జిల్లా అంబోడ గ్రామంలో చుట్టాలు ఉన్నారు. ఒకసారి ఆ గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ అమృత్ ప్యాటర్న్లో సాగు చేయడాన్ని గమనించాడు. దిగుబడి అధికంగా వస్తుందని ఆ రైతులు చెప్పడంతో ఆ వైపు మొగ్గు చూపాడు. అమృత్ పద్ధతి అంటే..? యవత్మాల్ జిల్లా మహాగావ్ తాలూకా అంభోద గ్రామానికి చెందిన రైతు శాస్త్రవేత్త అమృత్రావు దేశ్ముఖ్ తన క్షేత్రంలో అనేక ఏళ్లపాటు ప్రయోగాలు చేసి ఈ సాగు పద్ధతిని రూపొందించారు. అందువల్లనే అమృత్ ప్యాటర్న్ అని పేరు వచ్చింది. ఏకంగా 50 క్వింటాళ్ల వరకు ఎకరంలో పత్తి దిగుబడి సాధించిన ఘనత ఆయనిది. ఆదిలాబాద్ జిల్లాలో సాధారణంగా పత్తి సాగులో రైతులు మొక్కల మధ్య కొంచెం అటూ ఇటుగా ఒక అడుగు, వరుసల మధ్య 3 నుంచి 4 అడుగులు లేదా 4 నుంచి 5 అడుగుల దూరం పాటిస్తారు. అమృత్ ప్యాటర్న్లో మొక్కల మధ్య దూరం కచ్చితంగా ఒక అడుగు ఉండే చూస్తారు. ఒక వరుస మధ్య 4 అడుగులు, ఆ పక్కన వరుస మధ్య దూరం 6 అడుగుల దూరం పాటిస్తారు. అంటే.. మొదటి రెండు వరుసల మధ్య దూరం నాలుగు అడుగులు.. రెండు, మూడు వరుసల మధ్య ఆరు అడుగుల దూరం అనుసరిస్తారు. ఇదే తీరులో చేనంతా పాటిస్తారు. ఇదే విధానాన్ని విజయ్ అవలంభించారు. నెల తర్వాతే ఎరువులు.. పత్తి సాగులో మొదటి నెల రోజుల పాటు ఎలాంటి ఎరువులు, పురుగుమందులు వాడలేదు. ఇలా చేయటం వల్ల మొక్కకు కొమ్మలు ఎక్కువగా వస్తాయి. విత్తిన నెల తర్వాత ఎకరాకు ఒక బ్యాగు 10:26:26 వేశారు. ఆ తర్వాత నెలలోనూ అదే మోతాదులో అదే ఎరువుతో పాటు అతి తక్కువ ధరకు లభ్యమయ్యే పురుగుల మందు వాడినట్టు వివరించారు. మూడో నెల తర్వాత 5 కేజీల సల్ఫర్, ఆ తర్వాత 25 కేజీల మెగ్నీషియం నెలకు అందిస్తే సరిపోతుందని విజయ్ తెలిపారు. తద్వారా ప్రతి మొక్కకు వచ్చే కొమ్మలైనా ప్రధాన కొమ్మ, పిల్ల కొమ్మలు చాలా తక్కువ దూరంలో వస్తాయని తెలిపారు. పూత, కాత ఎక్కువగా రావడంతో పాటు రాలిపోకుండా ఉంటాయని విజయ్ వివరించారు. సాళ్ల మధ్య ఎక్కువ దూరం పెట్టడం వల్ల గాలి, వెలుతురు బాగా తగిలి అధిక దిగుబడి వస్తోంది. చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని అనుభవపూర్వకంగా విజయ్ చెబుతున్నారు. ఎకరానికి రూ. 20 వేలు ఖర్చయ్యింది. 20 క్వింటాళ్ల పత్తి తీసిన తర్వాత మళ్లీ నీటి తడి ఇచ్చారు. ఫలితంగా మున్ముందు కూడా మరికొంత పత్తి దిగుబడి రావచ్చని విజయ్ ఆశిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి అమృత్ పద్ధతిని అవలంభించడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధ్యమవుతుంది. ఎరువులు, పురుగుల మందులు ఎక్కువగా వాడే అవసరం పడదు. కలుపు తీయడంతో పాటు ఎరువులు, మందుల ఖర్చుల్లో చాలా ఆదా అవుతుంది. అధిక సాంద్రతతో పూత, కాత రావడం జరుగుతుంది. – సాయిప్రణీత్(96768 83233), వ్యవసాయ విస్తరణాధికారి, కొల్హారి గ్రామం సాగు పద్ధతి మార్చుకొని అధిక దిగుబడి సాధించా... రెండేళ్ల కింద పత్తి సాగులో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. మహరాష్ట్రలో కొంతమంది రైతులు అవలంభిస్తున్న అమృత్ ప్యాటర్న్లో గతేడాది పత్తి సాగు చేశాను. కొన్ని కాయలు కూడా కుళ్లిపోయాయి. అప్పుడు 9 నుంచి 11 క్వింటాళ్ల మధ్య దిగుబడి వచ్చింది. అమృత్ విధానాన్ని పూర్తిస్థాయిలో పాటించకపోవడంతో దిగుబడి అంతకు పరిమితమైంది. రెండో ఏడాది.. గడిచిన వానా కాలంలో ఈ విధానంలో అమృత్ ప్యాటర్న్లో అన్ని పద్ధతులను పూర్తిస్థాయిలో అవలంభించాను. ఎకరానికి 20 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. – ఫడ్ విజయ్ (77024 42958), ఇన్నోవేటివ్ పత్తి రైతు, కొల్హారి గ్రామం, గుడిహత్నూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా – గొడిసెల కృష్ణకాంత్ గౌడ్, స్టాఫ్ రిపోర్టర్, సాక్షి, ఆదిలాబాద్. చదవండి: Goat Farming: మేకలు, నాటు కోళ్ల పెంపకం.. ఏడాదికి రూ. 8–9 లక్షల నికరాదాయం! మరి ఖర్చు? Red Rice Health Benefits: బియ్యంపై పొరలో ‘ప్రోయాంతో సైనిడిన్’..అందుకే అలా! ఎర్ర బియ్యం వల్ల.. -
Photo Feature: కరోనా వ్యాక్సిన్ చెక్పోస్ట్ చూశారా!
ఎన్నికలు జరిగేటప్పుడు లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గ్రామ శివార్లలో పోలీసులు వాహనాలను తనిఖీ చేయడం మనకు తెలిసిందే. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి రాజాపురం గ్రామంలో వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తిచేయాలనే లక్ష్యంతో ఎర్రగుంట పీహెచ్సీ సిబ్బంది వినూత్న ఆలోచన చేశారు. గ్రామంలోకి ప్రవేశించే చోట తాళ్లు కట్టి.. వచ్చివెళ్లే ప్రతీ ఒక్కరినీ వ్యాక్సినేషన్పై ఆరా తీశారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిని మాత్రమే ఆ దారి ద్వారా అనుమతించి.. లేని వారికి అక్కడికక్కడే వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఇరవై మందికి పైగా టీకా పంపిణీ చేశారు. – అన్నపురెడ్డిపల్లి పురి విప్పిన నెమలి కాదు గుస్సాడీ కిరీటం దీపావళి పండగ సందర్భంగా ఆదివాసీలు ప్రత్యేకంగా నిర్వహించుకునే దండారి ఉత్సవాలకు గిరిజనులు సన్నద్ధమవుతున్నారు. తరతరాలుగా వస్తున్న తమ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించేందుకు దండారీలో కీలకమైన గుస్సాడీ కిరీటాలను తయారు చేయిస్తున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం పిట్టగూడలో నెమలి పింఛాలతో గుస్సాడీ కిరీటాలను తయారు చేశారు. వాటిని ఆదివాసులు ద్విచక్ర వాహనాలపై ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం నర్సాపూర్కు తీసుకొచ్చారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ రామా... కనవేమిరా... అయితే మార్కెట్.. లేదంటే ప్రకృతి.. రైతునెప్పుడూ కన్నీరు పెట్టిస్తూనే ఉంది. ఈసారి పత్తికి ధర బాగుంది అని సంతోషించేలోపే ప్రకృతి కన్నెర్రజేసింది. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో చెట్టుమీదే పత్తి తడిచి పచ్చిముద్దయ్యింది. తడిసిన పత్తిని ఏరి కల్లాల్లోనో, ఇళ్ల ముందో ఆరబెడుతున్నారు రైతులు. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో మంగళవారం ఓ రైతు పత్తి పంటను రామాలయం ముందు ఇలా ఆరబెడుతూ కన్పించాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ఈ నామ్.. గందరగోళం
జమ్మికుంట(హుజూరాబాద్) : జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో మొదటి సారిగా పత్తి బస్తాలకు ఈ నామ్ పద్ధతిలో కొనుగోళ్లకు మంగళవారం అన్నిఏర్పాట్లు చేయగా మార్కెట్కు వచ్చిన పత్తి బస్తాలను ప్రధాన వ్యాపారులు ఎవరు ఆన్లైన్ కొనుగోళ్లకు ముందుకు రాలేదు. దీంతో బీ టైప్ వ్యాపారులు ఆన్లైన్ కొనుగోళ్లలో పాల్గొన్నారు. పోటీ లేక రైతులకు కనీస ధర లభించలేదని రైతులు వాపోయారు. జమ్మికుంట పత్తి మార్కెట్కు వివిధ ప్రాంతాల నుంచి 200 వాహనాల్లో రైతులు లూజ్ పత్తిని మార్కెట్కు తీసుకురాగా మార్కెటింగ్ శాఖ అధికారులు వాటికి వేలంపాటతో కొనుగోళ్లు జరిపారు. దీంతో గంట వ్యవధిలోనే లూజ్ పత్తి వాహనాలు మార్కెట్ యార్డు నుంచి వెళ్లిపోయాయి. బస్తాల్లో వచ్చిన పత్తికి మాత్రమే అధికారులు ఈ నామ్ పద్ధతి మొదలు పెట్టడంతో రైతులు మధ్యాహ్నం 1 గంటవరకు యార్డులో ఎదురు చూపులు తప్పలేదు. నామ్కు విరుద్ధంగా తూకాలు.. ఈ నామ్ పద్ధతిని అమలుకు శ్రీకారం చుట్టిన క్రమంలో మార్కెట్కు వచ్చిన పత్తి బస్తాలను ఆన్లైన్ కాకముందే యార్డులో అడ్తిదారులు కొందరు ధరలు నిర్ణయించి తూకాలు మొదలు పెట్టారు. దీంతో మార్కెట్ సూపర్వైజర్ గౌస్ తూకాలను నిలిపివేసి అడ్తిదారుల తీరుపై మండిపడ్డారు. నామ్ కొనుగోళ్లు ప్రారంభిస్తే ఎందుకు తుకాలు వేస్తున్నారని ప్రశ్నించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు పొద్దంతా యార్డులో ఏలా ఉంటారని, లూజ్ పత్తి తీసుకువచ్చిన రైతులు అమ్మకాలు పూర్తిచేసుకుని మార్కెట్ బయటకు వెళ్తుంటే బస్తాల రైతులు ఏం పాపం చేశారని అడ్తిదారులు ప్రశ్నించారు. ఒక్క, బస్తా, రెండు బస్తాలు తీసుకు వచ్చిన రైతులు అన్లైన్ కోసం గంటల కొద్ది ఎదురు చూస్తారా అంటూ సూపర్వైజర్ను నిలదీశారు. దీంతో అడ్తిదారులు తూకాలను నిలిపివేసి ఈ నామ్ వరకు ఎదురు చూడక తప్పలేదు. ముందుకు రాని వ్యాపారులు.. మార్కెట్లో ఈ నామ్ అమల్లోకి రావడం...అందులో కేవలం బస్తాలకే అమలు చేయడంతో ప్రధాన వ్యాపారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. దీంతో బీ టైపు వ్యాపారులు ఇష్టానుసరంగా రైతులు తీసుకువచ్చిన బస్తాల పత్తికి ఆన్లైన్లో ధరలు నిర్ణయించారు. క్వింటాల్కు రూ.4,170 పత్తి మార్కెట్కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు 96 క్వింటాళ్ల పత్తిని బస్తాల్లో తీసుకరాగా బీ టైప్ వ్యాపారులు ఆన్లైన్ క్వింటాల్ పత్తికి గరిష్ట ధర రూ. 4,170 నిర్ణయించారు. మోడల్ ధర రూ. 3,900, కనిష్ట ధర రూ. 3,500 చెల్లించారు. -
దగా చేసిన ధనుష్
వత్సవాయి మండలంలోని భీమవరం, మక్కపేట, ఇందుగపల్లి, వత్సవాయిలో ధనుష్–3, 4, 6 రకం వంగడాలతో 500 ఎకరాల్లో పత్తిసాగు చేపట్టారు. మొక్కలు ఏపుగా పది అడుగుల ఎత్తు∙పెరిగి కొమ్మలతో విస్తరించాయి. పైరును చూసిన రైతులు అధిక దిగుబడులు ఖాయం అని సంతోషించారు. అయితే ఆశించిన స్థాయిలో పూత, పిందె రాలేదు. అరకొరగా కాసిన కాయలు సన్నగా ఉండటంతో ఎకరానికి ఒకటి రెండు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. కోత ఖర్చులు కూడా రావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సాక్షి, భీమవరం (వత్సవాయి) : ఆరుగాలం కష్టపడి సాగు చేసినా ఎకరాకు క్వింటా కూడా దిగుబడి రాలేదు. తాము సాగు చేసింది కల్తీ విత్తనాలు అని తెలిసి తెల్లబోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని మొరపెట్టుకుంటున్నారు. మండలంలోని భీమవరం, మక్కపేట, ఇందుగపల్లి, వత్సవాయి గ్రామాలలో ఈ ఏడాది కొత్తగా వచ్చిన ధనుష్–3, 4, 6 రకం విత్తనాలను సుమారు 500 ఎకరాల్లో సాగు చేశారు. భీమవరం 250 ఎకరాలు, మక్కపేట 100, ఇందుగపల్లిలో 100, వత్సవాయిలో 50 ఎకరాలలో సాగు చేశారు. ఈ విత్తనాలను వత్సవాయి గ్రామంలోని ఒక షాపు నుంచి, భీమవరం గ్రామంలోని ఓ ప్రైవేటు వ్యక్తి నుంచి కొనుగోలు చేసి సాగు చేశారు. మొదట్లో పత్తి మొక్కలు ఏపుగా పది అడుగులకుపైగా పెరిగాయి. పంట ఎత్తు మాత్రం పెరిగింది కానీ పూత, పిందె మాత్రం ఆశించినంతగా రాలేదు. అక్కడక్కడా కాసిన పత్తి కాయలు కూడా సన్నగా కాశాయి. ఎకరానికి క్వింటా, రెండు క్వింటాళ్లు మాత్రమే దిగుబడులు రావడంతో రైతులకు ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. వేరే కంపెనీలకు చెందిన విత్తనాలను నాటిన రైతులకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తుండడంతో కల్తీ విత్తనం వల్లనే నష్టపోయామని గ్రహించారు. ఎకరానికి లక్ష పెట్టుబడి పత్తి పంట సాగుచేయడానికి ఎకరానికి లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. సరాసరి కౌలు ఎకరానికి 30 వేలు కాగా ట్రాక్టర్ కిరాయి, విత్తనాలు, కూలీలు, పురుగుమందులు, ఎరువులు కలిపి మరో రూ.70 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ఎకరానికి 1, 2 క్వింటాళ్లు వస్తుండడంతో తీత కూలి ఖర్చులు కూడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి తీతకు ఆసక్తి చూపని కూలీలు ఈ రకం విత్తనం సాగు చేసిన రైతులకు పత్తి తీసేందుకు కూడా కూలీలు రావడం లేదని చెబుతున్నారు. కాయ సన్నగా ఉండడంతోపాటు సక్రమంగా పగలకపోవడంతో కూలీలకు కూలి గిట్టుబాటు కావడంలేదు. పత్తిని తీసేందుకు కూలీలు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కల్తీ విత్తనాల వల్లనే నష్టపోయామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మండల వ్యవసాయాధికారి పీఎం కిరణ్ను వివరణ కోరగా భీమవరం, మక్కపేట, ఇందుగపల్లి గ్రామాల నుంచి ధనుష్ విత్తనం వల్ల నష్టపోయాం తమను ఆదుకోవాలని 60 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. -
'కాంగ్రెస్ నేతలే పంటలను తగులబెడుతున్నారు'
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పత్తికి కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సారి పత్తి రైతులకు మంచి మద్దతు ధర వస్తుందని ఆశిస్తున్నామని సీఎం చెప్పారు. 48 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారని తెలిపారు. ఇప్పటికీ 5 శాతం లోపే పత్తి మార్కెట్లోకి వచ్చిందన్నారు. కొన్ని చోట్ల మంచి పత్తికి కనీస మద్దతు ధర కంటే ఎక్కువనే ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. మద్దతు ధర కోసమే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. పంట కాలనీలు వేసి.. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ నేతలే పంటలను తగులబెట్టే కార్యక్రమం చేపడుతున్నారని సీఎం పేర్కొన్నారు. రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటే నాలుగు సంవత్సరాల బడ్జెట్ కూడా సరిపోదని సీఎం తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించాం. నాణ్యమైన కరెంట్ను అందిస్తున్నాం. రుణాలు మాఫీ చేయడంలో విజయం సాధించామని సీఎం తెలిపారు. -
దగాపడ్డ పత్తి రైతు
సాక్షి, పెద్దపల్లి: పత్తి రైతుకు మళ్లీ కష్టకాలం వచ్చింది. ఆరుగాలం కష్టపడి, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పండించిన పంటకు కనీస ధర రాని దుస్థితి నెలకొంది. వ్యాపారులు కుమ్మక్కై రైతులను దోచుకునేందుకు సిద్ధమయ్యారు. నాణ్యత, తేమ శాతం సాకుతో క్వింటాల్కు రూ. వెయ్యి మాత్రమే ఇస్తామంటూ నిలువు దోపిడీకి తెరతీశారు. దీంతో గుండెలు మండిన రైతులు నిరసనకు దిగారు. పత్తి ఏరడానికైన కూలీ కూడా రావడం లేదంటూ రోడ్డెక్కారు. పత్తిని తగలబెట్టడమో.. మందు తాగి చావడమో తప్ప తమకు గత్యంతరం లేదని ఆందోళన చేశారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ దీనికి వేదికైంది. పత్తి కొనుగోళ్లు చేపట్టిన తొలిరోజే.. తేమ శాతం ఎక్కువగా ఉందంటూ సీసీఐ చేతులెత్తేయగా, వ్యాపారులు కుమ్మక్కై దారుణంగా ధర తగ్గించడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. నిర్ఘాంతపోయిన రైతన్న పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే రైతులు తెచ్చిన పత్తిలో తేమ 12 శాతం కన్నా అధికంగా ఉందంటూ సీసీఐ అధికారులు కొనుగోలు చేయలేదు. సాంకేతిక లోపం పేరుతో ఆన్లైన్నూ పక్కన పెట్టారు. ఇదే అదనుగా వ్యాపారులు దోపిడీకి దిగారు. క్వింటాల్కు రూ.1,000 నుంచి రూ.1,500 ఇస్తామని రైతులకు షాకిచ్చారు. మొదటి రోజు మార్కెట్కు 297 మంది రైతులు పత్తి తీసుకురాగా.. 89 మంది రైతులకు సంబంధించిన పత్తికి రూ.1,000 నుంచి రూ.1,500 వరకే ధర నిర్ణయించారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. పెద్దపల్లి టౌన్ సీఐ వచ్చి రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపచేశారు. అటు వ్యాపారులు కూడా రూ.2 వేల పైన చెల్లించి పత్తి కొనుగోలుకు ముందుకువచ్చారు. ఇదో పెద్ద కుట్ర వాస్తవానికి పత్తి మద్దతు ధర క్వింటాల్కు రూ.4,320. నాణ్యత లేకుంటే సాధారణంగా రూ.2 వేల నుంచి రూ. 3 వేల వరకు చెల్లిస్తుంటారు. కానీ సోమవారం పెద్దపల్లి మార్కెట్లో వ్యాపారులు కేవలం రూ.1,000 మాత్రమే చెల్లిస్తామనడం వెనుక కుట్ర ఉందని రైతులు పేర్కొంటున్నారు. కొంతమంది మిల్లర్లు, మార్కెట్లోని వ్యాపారులు కుమ్మక్కై కావాలనే ధరను తగ్గించేశారని.. దాంతో రైతులు మార్కెట్దాకా రాకుండా మిల్లర్లకే విక్రయిస్తారన్న ఉద్దేశంతో కుట్ర పన్నారని మండిపడుతున్నారు. మార్కెట్లో తాము ధర పెంచి కొనుగోలు చేసినా.. తర్వాత మిల్లర్లు కొనకపోతే నష్టపోతామని, అందుకే వాళ్లు చెప్పినట్లు చేస్తున్నామని ఓ వ్యాపారి బహిరంగంగానే పేర్కొనడం గమనార్హం. ఖమ్మంలోనూ ఆందోళన ఖమ్మం వ్యవసాయం: పత్తికి తగిన ధర కల్పించాలని, సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు, వామపక్షాల నేతలు సోమవారం ధర్నా చేశారు. తేమ నిబంధనను సడలించి పత్తి కొనుగోళ్లు చేయించాలని.. క్వింటాల్కు రూ.7 వేలు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. పత్తి కొనుగోళ్లలో అన్యాయం, సీసీఐ కేంద్రం ప్రారం భంపై మాట్లాడేందుకు రైతులు, నేతలు సోమవారం యార్డులోని కార్యాలయానికి వెళ్లగా సూపర్వైజర్లు మాత్రమే ఉండడంతో.. మార్కెట్ అధికారి రావాలంటూ ధర్నాకు దిగారు. మార్కెట్ కార్యదర్శి, సీసీఐ అధికారి యార్డుకు చేరుకుని రైతులు, నేతలతో మాట్లాడారు. రెండు రోజుల్లో రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. మా రక్తం తాగుతరా? ఈ మార్కెట్ ఎందుకు?.. మమ్మల్ని మోసం చేయడానికా? మా రక్తం తాగడానికి పెట్టిన్రా.. క్వింటాల్కు వెయ్యి ఇస్తరా.. పత్తి ఏరడానికి కూలీలకైన ఖర్చు కూడా కాదు.. ఇగ మందు తాగి చావడమే దిక్కు.. – మహిళా రైతు దామ కనకవ్వ, పెద్దపల్లి జిల్లా సబ్బితం నాణ్యత లేనందునే.. ఇటీవలి వర్షాలతో పత్తి నాణ్యత దెబ్బతిన్నది. దాంతో ధర పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొద్దిరోజులైతే మళ్లీ రైతులు అనుకున్నంత ధర వస్తుంది.. – గంట రమేశ్, ట్రేడర్, పెద్దపల్లి -
చెక్కులు వద్దంటూ రైతుల నిరసన
పరకాల: వరంగల్ రూరల్ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతులకు అడ్తిదారులు చెక్కులు ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. నగదు రూపంలో ఇవ్వకుండా చెక్కులు, ఆన్లైన్ చెల్లింపులు జరపడంతో బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోందంటూ మార్కెట్ అధికారులతో వాగ్వాదానికి దిగడంతో కొంత సేపు కొనుగోళ్లు నిలిచిపోయారుు. పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలతో చాలాకాలం తర్వాత రైతులు మార్కెట్కు సరుకులను తీసుకొస్తున్నారు. మార్కెట్కు సరుకులను తీసుకొచ్చిన రైతులకు నగదు రూపంలో ఇవ్వకుండా చెక్కులు, ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరపాలని మార్కెట్ కమిటీ నిర్ణరుుంచింది. దీంతో కొంతమంది రైతులు గేటుకు తాళం వేసే ప్రయత్నించగా, వారిని చైర్మన్ అడ్డుకుని నచ్చజెప్పారు. ధర విషయంలో కూడా అత్యధికంగా రూ. 5,100లతో కొనుగోళ్లు చేరుుంచారు. -
అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య
జయశంకర్జిల్లా: అప్పుల బాధ తాళలేక ఓ పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని గిద్దెముత్తారం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పంచిక శంకర్(30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పంట దిగుబడి సరిగ్గా రాకపోవడం.. చేసిన అప్పులు తీర్చే దారికానరాక తన పత్తి చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో పత్తి రైతు మృతి
పొలంలో దున్నుతున్న రైతు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్నకు గురై మృతి చెందాడు. వివరాలివీ... ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గ్రామానికి చెందిన తెల్లబోయిన వెంకటేశ్వర్లు(53) రెండెకరాల్లో పత్తి సాగు చేశాడు. మంగళవారం మధ్యాహ్నం కలుపు తీతలో భాగంగా దున్నుతున్నాడు. నాగలికి పక్కనే స్తంభం నుంచి ఉన్న జీ వైర్ తాకటంతో షాక్తో వెంకటేశ్వర్లు పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురికీ వివాహాలయ్యాయి. -
పత్తిగింజలు మొలకెత్తకపోవడంతో.. ఆగిన రైతు గుండె
పత్తిగింజలు మొలకెత్తలేదనే మనోవేదనతో రైతు గుండె ఆగిన ఘటన వరంగల్ జిల్లా ఆత్మకూరులో ఆదివారం జరిగింది.మండల కేంద్రానికి చెందిన బుచ్చికొండ సమ్మిరెడ్డి(56) తనకున్న మూడెకరాల్లో వారం రోజుల క్రితం పత్తి విత్తనాలు వేశాడు. అప్పటి నుంచి వర్షాలు కురవకపోవడంతో 10 శాతం కూడా మొలకెత్తలేదు. వ్యవసాయం కోసం చేసిన అప్పు ఇప్పటికే రూ. 2 లక్షలు ఉన్నాయి. ఈ ఏడాది బ్యాంకుల్లో రుణం కోసం ప్రయత్నించి విఫలమయ్యూడు. ఇలా ఆవేదనకు గురవుతూ ఆదివారం ఉదయం భార్య వనమ్మతో కలిసి చేనుకు వెళ్లాడు. గింజలు మొలకెత్తక పోవడంతో ఆవేదనతో అలాగే కుప్పకూలిపోయూడు. పొరుగున ఉన్న రైతులు 108ను పిలిపించేలోపే మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. -
పత్తి బీమాకు ధీమా కరువు!
♦ ఈ నెల 14 వరకు ప్రీమియం చెల్లింపు గడువు ♦ బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో చెల్లించని రైతులు సాక్షి, హైదరాబాద్: పత్తి రైతు మీద కత్తి కట్టినట్లుగా ఉంది పరిస్థితి. బీమాకు ధీమా కరువైంది. ఖరీఫ్ ఇంకా ఊపందుకోలేదు. పత్తి పంట బీమా గడువు మాత్రం సమీపిస్తోంది. ఈ నెల 14వ తేదీ నాటికి పత్తి పంట బీమాకు ప్రీమియం చెల్లించాలి. లేకుంటే వారికి ఒక్క పైసా బీమా సొమ్ము చేతికందదు. తెలంగాణ సర్కారే స్వయంగా ఈ తేదీని గడువుగా నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా గత ఖరీఫ్లో 42 లక్షల ఎకరాల్లో పత్తినే సాగు చేశారు. ఈసారి పత్తి సాగును తగ్గించాలని సర్కారు భావిస్తున్నా రైతులు ఇతర పంటలవైపు మరలడంలేదు. పత్తి పంటకు నష్టం జరిగితే వాతావరణ ఆధారిత బీమా పథకం (డబ్ల్యుబీసీఐఎస్) కింద రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు తీసుకునే రుణం నుంచే బ్యాంకులు ప్రీమియం సొమ్మును మినహాయించుకుంటాయి. బ్యాంకులు ఇప్పటికీ కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు చాలామంది ప్రీమియం చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం రుణం తీసుకునే రైతుల వివరాలు ఇస్తే వారు ప్రీమియం చెల్లించినట్లుగా భావించి బీమా జాబితాలో చేర్చుతామని బీమా కంపెనీలు చెప్పినా బ్యాంకులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. మూడో విడత రుణమాఫీ సొమ్ము విడుదల చేయకుండా ఏమాత్రం కొత్త రుణాలు ఇవ్వబోమని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయి. మరోవైపు ప్రీమియం గడువు పెంపుపైన సర్కారు శ్రద్ధ చూపడంలేదు. పత్తికి బీమా ప్రీమియాన్ని రైతులు మొత్తం బీమా సొమ్ములో 5 శాతం చెల్లించాలి. మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్రాలు భరించాల్సి ఉంది. తమ వాటాను భరించడానికి సిద్ధంగా లేకపోవడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ ప్రారంభం కాకముందే ప్రీమియం చివరి తేదీ ప్రకటించిందన్న విమర్శలూ ఉన్నాయి. తద్వారా రైతుల సంఖ్యను, రాయితీ సొమ్ము తగ్గించుకోవచ్చనేది సర్కారు ఆలోచన. అనుకూలమైన గడువు తేదీలు ప్రకటించుకోవాలని కేంద్రం స్పష్టం చేసినా రాష్ట్ర సర్కారు మాత్రం ఈ నెల 14ని చివరి గడువుగా ప్రకటించిందన్న విమర్శలున్నాయి. -
పత్తిరైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక పత్తిరైతు ఉరి వేసుకొని తనువు చాలించాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా డిండి మండలం దాసరనెమలిపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శీనయ్య(38) పత్తి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. వాటిని తీర్చే దారికానరాక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చే సుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నదాత ఆత్మహత్య
నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం నంబాపురం గ్రామ పంచాయతీ పరిధి బూడిదగట్టు గ్రామంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దేపావత్ పాండునాయక్(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పత్తి సాగు కోసం, కుటుంబ అవసరాల కోసం మొత్తం రూ.4లక్షలు అప్పు చేశాడు. వర్షాభావ పరిస్థితులకు దిగుబడి రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో సోమవారం రాత్రి ఉంట్లోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. -
పత్తి రైతు ఆత్మహత్య
అప్పుల బాధ భరించలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా హాలియా మండలం రంగుండ్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పుల్లచెరువు మండలానికి చెందిన రమావత్ శివ(30) ఐదేళ్ల క్రితం రంగుండ్లకు వలస వచ్చాడు. అప్పటి నుంచి గ్రామంలో ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. ఈక్రమంలో అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పొలంలో రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో మనస్తాపం చెందిన ఓ రైతు నల్లగొండ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. మేళ్లచెర్వు మండలం మల్లారెడ్డిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బూక్యా కోట్య (50) పత్తి, మిరప సాగు చేశాడు. పత్తి పంట ఎండిపోగా, మిరపకు తెగులు సోకింది. దీంతో రూ.6 లక్షల అప్పులు తీర్చలేనేమోనని మనస్తాపం చెందిన కోట్య శనివారం రాత్రి పొలంలో పురుగుల ముందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. పొలంలో విగత జీవిగా పడిఉన్న కోట్యాను ఆదివారం పొరుగు రైతులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పులబాధతో పత్తి రైతు ఆత్మహత్య
చింతపల్లి: పత్తి పంట పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో పాటు కూతురు వివాహం కోసం చేసిన అప్పు ఎక్కువవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కొక్కిరాల తండలో శనివారం చోటు చేసుకుంది. తండాకు చెందిన కొర్ర భాను(44) తనకున్న రెండున్నర ఎకరాల భూమితో పాటు మరో ఐదున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో.. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పలు పెరిగిపోయాయి. దీనికి తోడు వారం రోజుల క్రితమే కూతురు వివాహం కోసం కూడా అప్పు చేశాడు. అవి తీర్చడం గురించి మధన పడుతున్న భాను ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య
చందంపేట: నల్గొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగుమ్ము గ్రామంలో ఓ పత్తిరైతు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన యాదయ్య(40) అనే రైతు తనకున్న 3 ఎకరాల పొలంలో పత్తి పంట వేశాడు. వర్షాభావంతో పంట ఎండిపోవడంతో అప్పుల బాధ ఎక్కువైంది. దీంతో మనస్థాపం చెందిన యాదయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు -
పత్తిరైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక పత్తి రైతు తనువు చాలించాడు. తెచ్చిన అప్పులు తీర్చే దారి కానరాక పోవడంతో.. బలవంతంగా తనువు చాలించాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలోని యానంబయలు పంచాయతి పరిధిలోని మందెరకలపాడు గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కాటి నారాయణ(38) నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గుండెపోటుతో పత్తిరైతు మృతి
హాలియ: అప్పుల బాధ ఎక్కువై ఓ పత్తి రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా హాలియ మండలం రంగుండ్ల గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బల్లు(48) అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాలతో పాటు ఐదెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. పత్తి పంట ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో రెండు మూడు రోజులుగా అన్యమనస్కంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం గుండెపోటుకు గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తి రైతు ఆత్మహత్య
రాయికల్: అప్పుల బాధ తాళలేక పత్తి రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రాయికల్ మండలం మైథాపూర్లో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లారెడ్డి (50) అనే రైతు పత్తి సాగు చేశాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. అప్పు తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తి రైతు ఆత్మహత్య
అప్పుల బాధ భరించలేక మరో అన్నదాత బలయ్యాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా హాలియ మండలం రంగుండ్ల గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బానోతు పర్ష్యా(25) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది తనకున్న ఐదెకరాల భూమిలో పత్తి సాగు చేశాడు.. ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడంతో.. అప్పులు తీర్చే దారి కానరాక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
పత్తి రైతు ఆత్మహత్య
చందుర్తి: అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పత్తి పంట దిగుబడినివ్వక పోవడంతో.. తెచ్చిన అప్పులు తీర్చే దారి కానరాక పత్తి రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్యాల దేవయ్య(55) పత్తి పంట సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెరిగిపోయిన అప్పులు తీర్చే దారి కనపడక పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నల్లగొండ జిల్లా హాలియా మండలం అనుములకు చెందిన ఓ పత్తి రైతు అప్పుల భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన కృష్ణయ్య(60) తనకున్న ఆరెకరాల్లో పత్తి సాగు చేశాడు. అయితే, ఈ ఏడాది పత్తి దిగుబడులు సరిగ్గా రాలేదు. పెపైచ్చు మంచిధర కూడా లభించకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దాదాపు రూ.5 ల క్షల వరకు అప్పులున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని తనువు చాలించాడు. -
పత్తిరైతు ఆత్మహత్య
పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పుటు రైతు పీక మీద కత్తిలా దాపరించడంతో.. వాటిన తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా డిండి మండలం కానాపూర్ పంచాయతి పరిధిలోని జోత్యతండాలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నామర్ల శ్రీను(36) తనకున్న ఎనిమిదెరాలతో పాటు మరో ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం భారీ మొత్తంలో ప్రైవేటు వ్యక్తులనుంచి అప్పు తీసుకొచ్చాడు. కానీ పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో.. అప్పులు తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
అప్పులు తీరేమార్గం లేదని మనస్తాపం చెందిన ఓ రైతు ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంట్ తీగను పట్టుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదం రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండల పరిధిలో పులుసుమామిడి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కేశపల్లి గోపాల్రెడ్డి(50), రత్నమ్మ దంపతులు. వీరికి సంతానం స్వప్న, సందీప్రెడ్డి ఉన్నారు. గోపాల్రెడ్డి తనకున్న ఎకరంన్నర పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం కూతురు వివాహం కోసం రూ. 2 లక్షలు అప్పు చేశాడు. కుమారుడు సందీప్రెడ్డి చదువు కోసం కూడా కొంతమేర రుణం తీసుకున్నాడు. వర్షాభావ పరిస్థితులతో మూడేళ్లుగా సరిగా పంటలు పండడం లేదు. ఖరీఫ్లో సాగుచేసిన పత్తిపంట చేతికి రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైయ్యాడు. 15 రోజులుగా సరిగా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిసున్నాడు. అప్పటి నుంచి భార్య రత్నమ్మ గోపాల్రెడ్డిని కనిపెట్టుకుంటూ ఉంది. శనివారం ఉదయం 6 గంటలకు రైతు పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పక్క పొలంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ తీగను చేతితో పట్టుకున్నాడు. దీంతో విద్యుదాఘాతానికి గురైన ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. వికారాబాద్లోని గొల్కోండ బ్యాంక్లో రూ. 23 వేలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద మరో రూ. 3 లక్షల అప్పు ఉందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పులు తీర్చలేక రైతు ఆత్మహత్య
నల్లగొండ జిల్లా వేములపల్లి మండం తోపుచర్ల గ్రామంలో ఓ రైతు అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వల్లపుదాసు శ్రీను (35) తనకున్న రెండెకరాలతోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. అయితే, సాగు కోసం గతంలోను, ఇప్పుడు కలిపి మొత్తం రూ.2 లక్షల మేర అప్పులు చేశాడు. పంట దిగుబడి రాని పరిస్థితి కనిపిస్తుండడంతో అప్పులు తీర్చలేనమోనని దిగులుతో శనివారం అర్ధరాత్రి తన ఇంటివద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. -
యువ రైతు బలవన్మరణం
అప్పుల బాధ తాళలేక ఓ పత్తి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం చండ్రాలగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పూనెం పుల్లయ్య(27) రెండేళ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది 8 ఎకరాల్లో పత్తి పంట వేశాడు. అయితే, పూత కాయ సరిగా లేకపోవటంతో దిగుబడి ఆశించినంత రాలేదు. సాగు కోసం చేసిన రూ.2.50 లక్షలను తీర్చేదారి తెలియక తీవ్ర ఆందోళన చెందిన పుల్లయ్య గురువారం ఉదయం చేనులోనే పురుగు మందు తాగాడు. కొత్తగూడెం ఆస్పత్రికి తరలిస్తుంగా మార్గ మధ్యలో మృతి చెందాడు. అతనికి భార్య ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మరో అన్నదాత ఆత్మహత్య
అప్పులబాధ భరించలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మేళ్ల చెరువు మండలం ఎల్లటూరు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బంటు కిష్టయ్య(45) తనకున్న ఐదెకరాల భూమిలో పత్తి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు పెరిగి పోవడంతో వాటిని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తిరైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం ఆదిలాబాద్ జిల్లా లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం తేజాపూర్ గ్రామానికి చెందిన బద్దం కిష్టారెడ్డి(50)తనకున్న 12ఎకరాల భూమిలో పత్తి సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం, బోర్లు వేయడం కోసం రూ. 9 లక్షలు అప్పు చేశాడు. దీంతో వాటిని తీర్చే దారి కానరాక తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. -
అప్పుల బాధ తాళలేక...
అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్నగర్ జిల్లా వెల్దండ మండలం అజిల్లాపూర్లో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన బంగారి ఎల్లయ్య 47 తనకున్న ఏడు ఎకరాల భూమిలో పత్తిపంట సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సాగు కోసం కొత్తగా అప్పు తెచ్చి రెండు బోర్లు వేశాడు.. కానీ వాటిలో నీళ్లు పడకపోవడంతో.. పంట ఎండిపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఎల్లయ్య పంట చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సుమారూ రూ. 5 లక్షల వరకు అప్పులు ఉండటంతోటే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. -
పత్తిరైతు ఆత్మహత్య
అప్పుల భారం మరో అన్నదాతను బలితీసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన కొండ యాదయ్య(50) తనకున్న ఏడెకరాల భూమిలో పత్తిపంట సాగు చేశాడు.. పెట్టుబడి కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో వాటిని తీర్చే దారి కానరాక శుక్రవారం రాత్రి చేనులోనే పురుగులమందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పులే కాల్చేశాయి..
అప్పుల భారం ఓ రైతును నిలువెల్లా దహించింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ జిల్లాలో దేవరకద్ర మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన నీలి రాములు(27)కు రెండెకరాల పొలం ఉంది. అందులో ఏటా పత్తి సాగు చేస్తున్నాడు. ఈ ఏడు పత్తి ఆశాజనకంగా లేకపోవటంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. దీనికి తోడు రూ.లక్ష వరకు అప్పు ఉంది. ఈ నేపథ్యంలో అతడు గురువారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి సమీపంలోనే కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకున్నాడు. అతనిని ఎవరూ గమనించక పోవటంతో తీవ్ర గాయాలతో చనిపోయాడు. రాములుకు భార్య మంజుల, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో పత్తిరైతు ఆత్మహత్య
కరీంనగర్ : అప్పుల బాధ తాళలేక ఓ పత్తి రైతు బలవన్మరణం చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కాటారంలో మంగళవారం చోటు చేసుకుంది. కాటారం గ్రామానికి చెందిన గోగుల రాజు (43) పత్తి పంటను తనకున్న రెండెకరాల్లో సాగుచేస్తున్నాడు. పంట దిగుబడి సరిగా లేకపోవడం చేసిన అప్పుల తీరకపోవడంతో రాజు తీవ్ర మనస్తాపం చెందాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. -
పత్తి రైతుకు విత్తనం దెబ్బ
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో అన్ని రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశం అనంతరం వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించినా ఇప్పటి వరకు పత్తి విత్తనాలు సరఫరా కాలేదు. ప్రభుత్వం ధర నిర్ణయించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతు సంఘాలు ఆరోపిస్తు న్నాయి. ధరపై స్పష్టత ఇవ్వకపోవడంతో బీటీ పత్తి విత్తనాలు తయారు చేసిన కంపెనీలు విత్తనాలను జిల్లాలకు సరఫరా చేయలేదు. మే ఆఖరు నుంచి జూన్ రెండో వారం దాకా ఎప్పుడైనా కురిసే తొలకరి వర్షాలకు విత్తేది పత్తి విత్తనాలనే. ఈ నేపథ్యంలో ధరలపై స్పష్టత ఇవ్వకపోవడం, సంబంధిత జీవో జారీ కాపోవడం వల్ల నకిలీ విత్తనాలు మార్కెట్ను ముంచెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో పత్తి సాగే అధికం... రాష్ట్రంలో పత్తి సాగు అధికంగా ఉంటుంది. ఆ తర్వాతే వరిని సాగు చేస్తారు. ఈ ఏడాది సుమారు 44.46 లక్షల ఎకరాల్లో పత్తి సాగు ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇంత భారీగా సాగు చేసే పంటకు పత్తి విత్తనాలన్నింటినీ నూటికి నూరు శాతం ప్రైవేటు కంపెనీలే సరఫరా చేస్తాయి. ప్రభుత్వం ధర నిర్ణయించడంలో ఆలస్యమవుతున్న నేపథ్యంలో కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరను నిర్ణయించి రైతులను దోచుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. సాధారణంగా ప్రతీ ఏడాది మార్చి నెలలోనే పత్తి విత్తనాల ధర నిర్ణయం చేస్తారు. గత ఫిబ్రవరి 4న జరిగిన సమావేశంలో పత్తి విత్తన ధరను పెంచాలని కంపెనీలు కోరాయి. బీటీ కాటన్ విత్తనాన్ని సరఫరా చేసేందుకు మోనొశాంటో కంపెనీకి రూ. 90 రాయల్టీని ప్రభుత్వం నిర్ణయించగా... ఆ కంపెనీ మాత్రం తమ నుంచి రూ. 185 వరకు వసూలు చేస్తున్నం దున ధర పెంచాలని ఆ సమావేశంలో స్థానిక పత్తి విత్తన కంపెనీలు కోరాయి. అయితే ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. మరోవైపు మోనొశాంటో కంపెనీ రాయల్టీ పెంచాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిందని... ఈ కేసును వెంటనే వాపసు తీసుకుంటే ధరల పెంపుదల అంశాన్ని పరిశీలిస్తామని అప్పట్లో వ్యవసాయశాఖ సూచించింది. ఇలా అనిశ్చితి ఉండటంతో కొన్ని కంపెనీలు పత్తి విత్తనాలను ప్యాకింగ్ చేయలేదని తెలిసింది. ఇప్పటికిప్పుడు ధరపై నిర్ణయం తీసుకున్నా ప్యాకింగ్ చేయడానికి.. వాటిపై కనీస విక్రయ ధరను ముద్రించడానికి సమయం పడుతుంది. పాత ధరే ఉంటుంది పత్తి విత్తనాల ధర పెంచేది లేదు. పాత ధర ప్రకారమే విత్తనాలు సరఫరా చేస్తాం. ఈ విషయాన్ని కంపెనీలకు ఇప్పటికే స్పష్టంచేశాం. కొన్ని కంపెనీలు జిల్లాలకు సరఫరా చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చాం. ఎవరైనా సరఫరా చేయకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తాం. -ప్రియదర్శిని, వ్యవసాయశాఖ డెరైక్టర్ -
పింజ తక్కువట.. తేమ ఎక్కువట!
పత్తిరైతు చిత్తు మే వరకూ మార్కెట్లకుపత్తి వచ్చే అవకాశం మార్చి రెండో వారం నాటికే కొనుగోళ్లు నిలిపివేసిన సీసీఐ సీసీఐ కేంద్రాల మూతతో వ్యాపారుల ఇష్టారాజ్యం క్వింటాల్కు రూ. 400 వరకూ తగ్గింపు పత్తిరైతు నిలువునా దోపిడికీ గురవుతున్నాడు.. మార్కెట్ మాయాజాలంలో ఘోరంగా ఓడిపోతున్నాడు.. కొనుగోళ్లు చేసినంతకాలం ఏదో ఒక నిబంధన పేరుతో రైతులకు చుక్కలు చూపిన సీసీఐ.. మార్కెట్కు పత్తి రావడం ఇంకా ఆగిపోకముందే దుకాణం కట్టేసింది.. వ్యాపారులు, దళారులకు తలుపులు బార్లా తెరిచి, రైతన్న నోట మట్టి కొట్టేసింది. ఇదే అదనుగా వ్యాపారులు దగా దందా మొదలుపెట్టేశారు. క్వింటాల్ పత్తికి రూ. ఐదారు వందల వరకూ తక్కువ చెల్లిస్తూ నిలువునా దోపిడీ చేస్తున్నారు. దిక్కుతోచని రైతులు ఆవేదనలో మునిగిపోతున్నారు. కన్నీళ్లతోనే వచ్చినకాడికి అమ్ముకుంటున్నారు. - సాక్షి, హైదరాబాద్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో... రాష్ట్రంలో పత్తి ధరలు భారీగా పడిపోయాయి. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 4,050 కాగా.. వ్యాపారులు రూ. 3,600 నుంచి రూ. 3,700కు మించి చెల్లించడం లేదు. తక్కువ ధర వస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సాధారణంగా రైతులు మే నెల వరకు పత్తి విక్రయాలు చేస్తూనే ఉంటారు. ఈ లెక్కన కనీసం ఏప్రిల్ 15వ తేదీ వరకైనా సీసీఐ కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి మార్చిలోనే సీసీఐ కేంద్రాలను ఎత్తివేయడం.. అసలే కరువుతో అల్లాడుతున్న రైతులకు శరాఘాతంగా మారింది. సింహభాగం పత్తిదే రాష్ట్రంలో పత్తిసాగు అధికం. ఈ ఖరీఫ్లో 8.173 లక్షల హెక్టార్లలో వరి సాగు కాగా.. పత్తిని ఏకంగా 16.763 లక్షల హెక్టార్లలో సాగుచేశారు. ఖరీఫ్లో ఆహారధాన్యాల సాగు 83 శాతానికి తగ్గగా... పత్తి సాగు 109 శాతానికి పెరిగింది. ప్రధానంగా ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో పత్తిసాగు ఎక్కువ. సాధారణంగా పత్తి ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాలి. కానీ వర్షాలు సరిగా కురవక.. పత్తి దిగుబడి 3 నుంచి 7 క్వింటాళ్లకు పడిపోయింది. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 35 లక్షల టన్నుల వరకు పత్తిని రైతులు విక్రయించారు. మరో 10 లక్షల టన్నుల వరకు పత్తిని నిల్వ ఉంచారు. గత సీజన్లో ఇలా నిల్వ ఉంచిన రైతులకు కనీస మద్దతు ధరకు మించి క్వింటాల్కు రూ. 5,200 వరకు ధర పలికింది. ఈ సారి కూడా అలా జరుగుతుందని ఆశించారు. కానీ వారి ఆశలపై సీసీఐ నీళ్లు చల్లుతూ కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసింది. అంతర్జాతీయంగా ఎగుమతులు లేకపోవడంతో ధరలు తగ్గాయంటూ వ్యాపారులు తక్కువ ధర చెల్లిస్తున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా రైతులు తమ పత్తిని మహారాష్ట్రకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. పింజ పొడవు సాకు.. రైతులు పత్తి తీతను దాదాపు పూర్తిచేశారు. కానీ ధర ఎక్కువ వస్తుందన్న ఆశతో నిలువ ఉంచారు. కానీ పింజ పొడవు తక్కువగా ఉం దని పేర్కొంటూ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా పింజ పొడవు 29.5 మిల్లీమీటర్ల నుంచి 30.5 మిల్లీమీటర్ల వరకు ఉన్న పత్తికి పూర్తిస్థాయి ధర చెల్లిస్తారు. కానీ పత్తి తీత పూర్తయిన తర్వాత వస్తున్న సరుకుకావడంతో... పూర్తి నాణ్యంగా ఉన్నా కూడా పింజ పొడవు తక్కువ ఉందం టూ వ్యాపారులు సాకులు చెబుతున్నారు. దీని కి తోడు తేమ శాతం పేరిట తక్కువ ధర చెల్లిస్తున్నారు. ఈ విషయంలో సీసీఐ వ్యాపారుల తో కుమ్మక్కు అయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగానే కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసిందనే వాదన వినిపిస్తోంది. మేమేమీ ఆదేశాలు ఇవ్వలేదు ‘‘సీసీఐ కొనుగోలు కేంద్రాలను నిలిపివేయాలని మేం ఆదేశాలు ఇవ్వలేదు. సీసీఐ నేరుగా అలాంటి ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చు. ఈ విషయం నాకు తెలియదు.’’ - ప్రియదర్శిని, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కమిషనర్ -
పత్తిరైతు చిత్తు
పత్తి రైతు దగా పడుతున్నాడు. రైతులకు మద్దతు ధర కల్పించి అండగా నిలవాల్సిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనూ దళారులదే రాజ్యమవుతోంది. కేంద్రాల్లో నిబంధనలతో విసిగి వేసారిన రైతులు తప్పనిసరై దళారులకు పత్తిని విక్రయిస్తూ నష్టపోతున్నారు. ఫలితంగా ప్రభుత్వ మద్దతు ధర కాగితాలకే పరిమితమవుతోంది. క్వింటాకు రూ.400 నుంచి రూ.500 వరకు రైతులు నష్టపోతున్నారు. - సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇక్కట్లు - మద్దతు ధర కరువు - బినామీ పేర్లతో వ్యాపారుల అమ్మకాలు - కాగితాలకే పరిమితమవుతున్న మద్దతు ధర ఒంగోలు టూటౌన్: ప్రస్తుతం మార్కెట్లో పత్తికి పెద్దగా డిమాండ్ లేదు. దీంతో ఇప్పటికే తీవ్రనష్టాల్లో ఉన్న పత్తిరైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో క్వింటా పత్తికి రూ.3,750 నుంచి రూ.4,050 మధ్య చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ మద్దతు ధర రైతులకు దక్కడం లేదు. వ్యాపారులే రైతుల అవతారం ఎత్తి సర్కారు మద్దతు దక్కించుకుంటున్నారు. సీసీఐ కేంద్రాల్లో సమస్యల వలన రైతులు గిట్టుబాటు పొందలేకపోతున్నారు. చెల్లింపుల జాప్యం, తేమశాతం, రంగు మారిందన్న సాకుతో ధరల్లో కోత పెడుతుండటం రైతులను నిరాశకు గురిచేస్తోంది. దీన్ని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రైవేట్ వ్యాపారులు రూ.3,500 క్వింటాకు ఇవ్వడంతో గత్యంతరం లేక అక్కడే అమ్ముకుంటున్నారు. ఫలితంగా క్వింటాకు రూ.400 నుంచి రూ.500 వరకు పత్తిరైతులు నష్టపోతున్నారు. ఏటా ఇదే తంతు కొనసాగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో అలవిమాలిన నిర్లక్ష్యం విహ స్తోంది. జిల్లాలో ఖరీఫ్, వేసవి పత్తి 56,167 హెక్టార్లు లక్ష్యం కాగా రెండూ కలిపి 75,571 హెక్టార్లు సాగు చేశారు. ఇందులో సమ్మర్ కాటన్ 12,517 హెక్టార్ల కన్నా ఎక్కువే సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులు, పెరిగిన ఖర్చులు, పరిస్థితులు అనుకూలించక దిగుబడులు సగానికి సగం పడిపోయాయి. దీనికి తోడు కూలీల డిమాండ్ పెరిగిపోవడంతో కొన్నిచోట్ల పొలాల్లోనే దిగుబడిని వదిలేశారు. నష్టాలబాటలో అవస్థలు ఎదుర్కొంటున్న పత్తిరైతుకు మద్దతు ధర ఇవ్వాల్సింది పోయి సీసీఐ కేంద్రాలు ఇంకా కష్టాలు, చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. తేమశాతం, రంగుమార్పు, ధ్రువీకరణ పత్రం వంటి నిబంధనలతో వేధిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలు రూ.4,050 పొందాలంటే అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలో ఎనిమిది సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించిన చోట దళారులు రాజ్యమేలుతున్నారు. పత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కాగితాలకే పరిమితమవుతోంది. నిబంధనల పేరుతో ఓవైపు సీసీఐ కేంద్రాల్లో పత్తిని సక్రమంగా కొనుగోలు చేయడంలేదు. ఇదే అదునుగా దళారులు ఇష్టారాజ్యంగా ధర నిర్ణయిస్తూ కొనుగోలు చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నిబంధనలతో బెంబేలు: సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకుందామని గంపెడాశతో వచ్చిన రైతులు ఇక్కడి నిబంధనలు చూసి బెంబేలెత్తుతున్నారు. తేమ 12 శాతం కంటే తక్కువ ఉండాలనే నిబంధన రైతుల పాలిట శాపమైంది. అసలే శీతాకాలం కావడం, మార్కెట్కు రైతులు రాత్రిపూట పత్తిని తీసుకువస్తుండటంతో మంచు కారణంగా తేమ శాతం పెరుగుతోంది. దీన్ని అడ్డంపెట్టుకొని తేమశాతం ఎక్కువగా ఉందనే పేరుతో సీసీఐ సరుకును మద్దతు ధరకు కొనుగోలు చేయడంలేదు. కేవలం రూ.3,200 నుంచి రూ.3,300 మధ్యే కొనుగోలు చేయడం రైతులను కుంగదీస్తోంది. దళారుల పన్నాగం: సీసీఐ నిబంధనలను దళారులు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. తేమశాతం, రంగు మారడం, డబ్బు చెల్లింపుల్లో ఆలస్యం..తదితర ఇబ్బందులు సీసీఐ కేంద్రాల్లో రైతులకు ఎదురవుతుండటంతో దీనిని అసరాగా చేసుకుని దళారులు రైతుల నుంచి క్వింటాలు రూ.3,500 లోపు ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో కొనుగోలు చేసిన పత్తిని బినామీ రైతుల పేర్లతో దళారులు, కొందరు కమీషన్ వ్యాపారులు సీసీఐ కేంద్రాలకు తరలిస్తున్నారు. అధికారుల అండదండలతో ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం: జిల్లాలో 15 ఏఎంసీలు ఉండగా వాటి పరిధిలో పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, అద్దంకి, పూసపాడుల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. నవంబర్లో ఒకటి, రెండు కేంద్రాలు ఏర్పాటు చేయగా..మరికొన్ని జనవరిలో ప్రారంభించారు. ఇప్పటి వరకు 16 లక్షల 4 వేల క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. ప్రైవేట్ వ్యాపారులు దాదాపు 2 లక్షలకు పైగా క్వింటాళ్లు వరకు కొనుగోలు చేస్తుంటారని అధికారులు చెబుతున్నారు. సకాలంలో కేంద్రా లు ఏర్పాటు చేయకపోవడం, వెంటనే డబ్బులు చెల్లించకపోవడం, తేమ శాతం అడ్డంకి, ఇలా పలు కారణాలు, రైతుల ఆర్ధిక ఇబ్బందుల దృష్ట్యా రూ.3,500 లకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. పైగా ప్రైవేట్ వ్యాపారులు వెంటనే డబ్బు చెల్లిస్తుండటంతో అప్పుల బాధ తాళలేక కొంతమంది రైతులు అటువైపే మొగ్గుచూపుతున్నారు. రైతుల నుంచి కొన్న పత్తిని రైతుల పేరుమీదనే సీసీఐకి అమ్మి దళారులు సొమ్ము చేసుకుంటూ లాభపడుతున్నాడు. పంట పండించిన రైతు గిట్టుబాటు ధర పొందలేక దిగజారిపోతున్నాడు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం లేదు: మార్కెట్ ఏడీ సయ్యద్ రఫీ అహ్మద్ పత్తిని రైతుల నుంచి దళారులు కొన్నా..చెక్పోస్టుల ద్వారా మార్కెట్ ఫీజు వసూలు చేస్తాం. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం ఉండదు. నిబంధనల ప్రకారమే పత్తిని సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నారు. రూ.3,880 నుంచి రూ.3,900 వరకు కొంటున్నారు. ప్రస్తుతం కొనుగోళ్లు చివరి దశకు వచ్చాయి. -
కొత్త దోపిడీ..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పత్తి రైతులను నిండా ముంచడానికి సీసీఐ (భారత పత్తి సంస్థ) మరో కుట్ర పన్నింది. రైతుల కష్టాన్ని అందిన కాడికి దోచుకునేందుకు కొత్త సంవత్సరంలో లేని నిబంధనలను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం రైతులు తెస్తున్న పత్తిలో నాణ్యత (పింజ పొడవు-స్టేఫుల్ లెన్త్) తగ్గిందనే సాకుతో ధరలో మరింత కోత పెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం చెల్లిస్తున్న కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4,050 ఇకపై చెల్లించడం కుదరదని, క్వింటాలుకు రూ.వంద తగ్గించి రూ.3,950 చొప్పున కొనుగోలు చేస్తామని సీసీఐ ఆదిలాబాద్ బ్రాంచ్ మేనేజర్ అర్జున్దవే జిల్లా మార్కెటింగ్ శాఖకు ఇటీవల ఓ లేఖ రాశారు. ఈ నిర్ణ యం సోమవారం నుంచి అమలుచేస్తామని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే మాయిశ్చర్ పేరుతో కనీస మద్దతు ధరలో భారీగా కోత పెట్టి నిండా ముంచుతున్న సీసీఐ, కొత్త సాకు చూపి మరింత దోపిడీ చేయడం సరికాదని అంటున్నారు. ఏ జిల్లాలో లేని నిబంధన.. ఈ సీజన్లో సీసీఐ తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్తోపాటు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్లో పత్తిని కొనుగోలు చేస్తోంది. ఏ జిల్లాలో లేని విధంగా ఒక్క ఆదిలాబాద్లోనే పత్తి నాణ్యత తగ్గిందని ధరను తగ్గిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన పత్తిలో స్టేఫుల్లెన్త్ 34 ఎం.ఎం. ఉందని, ఇప్పడు వస్తున్న పత్తిలో ఈ పొడవు 29.5 ఎంఎంకు తగ్గిందని సీసీఐ పంపిన లేఖలో పేర్కొంది. ఈ స్టేఫుల్ లెన్త్తో కలిగిన పత్తితో తయారు చేసిన బేళ్లకు అంతర్జాతీయ మార్కెట్లో ఆశించిన ధర పలకదనే సీసీఐ సాకు చూపుతోందనే విమర్శ వ్యక్తమవుతోంది. నిండా మునుగనున్న పత్తి రైతులు.. : సీసీఐ ధర తగ్గింపు నిర్ణయంతో పత్తి రైతులపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. ఇప్పటికే వాతావరణం అనుకూలించక పత్తి రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు లేక ఒక్కో రైతు రెండు మూడు సార్లు విత్తనాలను విత్తుకోవాల్సి వచ్చింది. దీంతో విత్తన భారం మీద పడింది. దీనికి తోడు ఎరువులు, పురుగు మందుల ధర విపరీతంగా పెరుగడంతో సాగు వ్యయం తడిసిమోపెడైంది. మరోవైపు దిగుబడి పడిపోయింది. దీంతో ప్రస్తుతం సీసీఐ చెల్లిస్తున్న ధర రూ.4,050తో రైతులకు సాగు ఖర్చులు కూడా రావడం లేదు. ఇప్పుడు ఈ ధరలో కూడా కోత పెడితే పత్తి రైతు పరిస్థితి ఆగమ్య గోచరంగా మారనుంది. కుదరదని చెప్పాం : శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ ఏడీ సీసీఐ కొనుగోలు చేస్తున్న పత్తి ధరను క్వింటాలుకు రూ.వంద చొప్పున తగ్గిస్తామని సీసీఐ ఆదిలాబాద్ బ్రాంచ్ కార్యాలయం నుంచి ఇటీవలే ఓ లేఖ వచ్చింది. సోమవారం నుంచి ఈ నిర్ణయం అమలు చేస్తామని సీసీఐ లేఖలో పేర్కొంది. ధర తగ్గిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని, అలా తగ్గించడం కుదరదని సీసీఐ అధికారులకు చెప్పారు. ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాం. ఈ స్టేఫుల్ లెన్త్ విషయంలో సాంకేతిక నిపుణులు పరిశీలించాల్సి ఉంది. ఈ అంశంపై ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. -
పత్తి రైతు ఆత్మహత్య
లక్సెట్టిపేట : మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు ఆవునూరి బాలయ్య(55) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఆకుల అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలయ్య తన సొంత భూమిలో ఎకరం పది గుంటల్లో పత్తి సాగు చేశాడు. రూ.30వేలు పెట్టుబడి పెట్టాడు. దిగుబడి సరిగా రాకపోవడంతో మనస్తాపం చెందాడు. బుధవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలయ్య గురువారం సాయంత్రం చనిపోయాడు. ఆయనకు భార్య గౌరమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
వి‘పత్తి’!
పరిగి: ఆరుగాలం కష్టించిన అన్నదాతకు ప్రభుత్వ ‘మద్దతు’ కరువైంది. పత్తి రైతుకు చివరికి పుట్టెడు దుఃఖం తప్ప ఏమీ మిగలని పరిస్థితి ఎదురవుతోంది. రైతులకు అందుబాటులో ఉండేలా సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలు మూణ్నాళ్ల ముచ్చటే అవుతున్నాయి. దీంతో దళారులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తోంది. పరిగి వ్యవసాయ మార్కెట్లో గత నెల మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ఆర్భాటంగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మరుసటిరోజే కొనుగోలు కేంద్రం అడ్డా మార్చేశారు. మహబూబ్నగర్ జిల్లా కొందుర్గు మండలం లాల్పహాడ్లోని ఓ ప్రైవేటు జిన్నింగ్ మిల్లులో కొనుగోళ్లు జరుపుతున్నారు. రైతులు తమ పంటను అంత దూరం తీసుకెళ్లేందుకు వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. ఒకవేళ కష్టపడి అక్కడి వరకు పత్తి తీసుకెళ్లినా. మిల్లు వద్ద ట్రాక్టర్లతో రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ అవస్థలు పడలేని రైతులు గత్యంతరం లేక గ్రామాల్లోకి వచ్చే దళారులకే పత్తిని విక్రయిస్తున్నారు. దళారులు, జిన్నింగ్ మిల్లు యాజమాన్యంతో సీసీఐ అధికారులు కుమ్మక్కై కొనుగోలు కేంద్రాన్ని మార్చారని ఆరోపిస్తున్నారు. సీసీఐ తీరును నిరసిస్తూ సోమవారం పరిగి మార్కెట్కు చేరుకున్న రైతులు మార్కెట్ సెక్రటరీ చంద్రశేఖర్ను నిలదీశారు. కొనుగోళ్లు పరిగిలోనే జరపాలని డిమాండ్ చేశారు. నష్టపోతున్న రైతులు.. పత్తి కొనుగోలు ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. లాల్పహాడ్ జిన్నింగ్ మిల్లులో స్థలం లేదంటూ వారానికి మూడు రోజులు సెలవు ప్రకటిస్తున్నారు. పత్తి తీసుకుని మిల్లుకు వెళ్లాక సీసీఐ సిబ్బంది రైతుల నుంచి తీసుకోవడానికి నిరాకరిస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితి తలెత్తుతోంది. జిన్నింగ్మిల్లు యజమానులు క్వింటాలుకు రూ.3,500 నుంచి 3,600 చెల్లించి పత్తిని కొనుగోలు చేస్తున్నారు. రైతులు అంతదూరం పత్తిని తీసుకెళ్లి తిరిగి రాలేక అయిన కాడికి అక్కడే ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో క్వింటాలుకు రూ. 400 నుంచి రూ.500 వరకు నష్టపోతున్నారు. రోజుల తరబడి నిరీక్షణ.. పత్తి కొనుగోలు కేంద్రం పరిగిలో ఏర్పాటు చేసి తూకాలు మహబూబ్నగర్ జిల్లా లాల్పహాడ్ వద్ద చేస్తుండడం పలు విమర్శలకు తావిస్తోంది. కొనుగోలు కేంద్రం బోర్డును మాత్రం పరిగి వ్యవసాయ మార్కెట్లో తగిలించారు. అక్కడికి రైతులు పత్తి తీసకువస్తే ఇక్కడ కాదు లాల్పహాడ్కు వెళ్లమంటున్నారు. అంతదూరం వెళ్లాక పంటతో తిరిగి వెనక్కి వెళ్లలేరు కాబట్టి ఏం చేసినా నడుస్తుందులే అనుకుని తేమ సాకుతో ధర నిర్ణయిస్తున్నారు. మిల్లులోనే తూకాలు వేసి పత్తిని కొనుగోలు చేస్తున్నారు. రైతులు వాహనాలు వెతుక్కుని.. అందులో పత్తి నింపి.. ఆ తరువాత పరిగిలోని కొనుగోలు కేంద్రానికి, అక్కడి నుంచి లాల్పహాడ్కు వెళ్లి.. తేమ చూపించుకుని.. తూకాలు వేయించుకుని విక్రయించటం తతంగా మారింది. మరోవైపు రోజుల తరబడి ఉండాల్సి రావడంతో తీసుకెళ్లిన వాహనకిరాయి తడిసి మోపెడవుతోంది. ఇంత చేసినా పత్తి కొనుగోలు చేశాక మరోవారం రోజులకు గానీ చెక్కులలివ్వడంలేదు. ఇవేం తిప్పలు..? గత శనివారం పత్తి ట్రాక్టర్లో నింపుకుని పరిగికి వస్తే లాల్పహాడ్ వెళ్లమన్నారు. అక్కడికి వెళ్లాక తీసుకునేందుకు సీసీఐ వారు ఒప్పుకోలేదు. ఇదేమని నిలదీస్తే స్థలం లేదు.. అందుకే మూడు రోజులు సెలవులిచ్చామన్నారు. చేసేదిలేక అక్కడే జిన్నింగ్ మిల్లు యజమానులకు విక్రయించాం. ఇంత దూరం వచ్చాక ఎలాగూ తిరిగి వెళ్లలేరు కదా అని క్వింటాలుకు రూ.3,600కు కొనుగోలు చేశారు. దళారులు తీసుకువస్తే మాత్రం వెంటనే కొనుగోలు చేస్తున్నారు. - హన్మంతురెడ్డి, రైతు, రాఘవాపూర్ -
తెల్లబోతున్న తెల్లబంగారం
చేవెళ్ల: పత్తి రైతు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఖరీఫ్ సీజన్కు సంబంధించి పెట్టుబడులు కూడా వెనక్కి వచ్చే పరిస్థితి కనబడటం లేదు. తగ్గిన దిగుబడులకు తోడు ధరలు కూడా లేకపోవడంతో రైతన్న తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో ఎకరానికి కనీసం మూడు నుంచి నాలుగు క్వింటాళ్లకు మించి దిగుబడి రాకపోవడంతో రైతన్న ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మరోవైపు పత్తి ధర కూడా విపరీతంగా తగ్గిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. చేవెళ్ల డివిజన్లో ప్రధానపంట పత్తి గత మూడు దశాబ్దాలుగా చేవెళ్ల వ్యవసాయ డివిజన్ ప్రాంతంలో ఖరీఫ్లో పత్తిని ప్రధాన పంటగా పండిస్తున్నారు. వ్యవసాయ డివిజన్ పరిధిలోని చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్లతోపాటు పరిగి నియోజకవర్గంలోని కొన్నింటిని కలుపుకొని మొత్తం పది మండలాల్లో ఖరీఫ్లో భారీ విస్తీర్ణంలో పత్తిని సాగుచేస్తున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్లో చేవెళ్ల మండలంలో 4200 హెక్టార్లు, షాబాద్ మండలంలో 6750 హెక్టార్లు, శంకర్పల్లి మండలంలో 3120 హెక్టార్లు, మొయినాబాద్ మండలంలో 870 హెక్టార్లలో పత్తి పంటను సాగుచేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో పత్తి దిగుబడి దారుణంగా పడిపోయింది. దిగుబడి తగ్గితే.. ధరలూ తగ్గాయ్ ఎకరా పత్తి సాగుకు రూ. 6 వేల నుంచి రూ. 8 వేలకు ఖర్చుఅవుతుంది. వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఎకరానికి పది క్వింటాళ్లనుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కానీ ఈసారి వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో దిగుబడి ఎకరానికి మూడు నుంచి నాలుగు క్వింటాళ్లకు మించి వచ్చే సూచనలు కనిపించడంలేదు. దిగుబడులు తగ్గినప్పటికీ పత్తి ధరలు పెరగకపోవగా ఇంకా తగ్గడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గతేడాది ప్రభుత్వ కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర క్వింటాలుకు రూ. 4000గా నిర్ణయించారు. అయితే ఈసారి గతేడాది కంటే కూడా కేవలం రూ. 50 పెంచి మద్దతు ధరను రూ. 4050గా నిర్ణయించారు. అదే సమయంలో గతేడాది బహిరంగ మార్కెట్లో పత్తి క్వింటాలు ధర రూ. 4500 నుంచి ప్రారంభమై సీజన్ చివరి నాటికి రూ. 6వేలకుపైగా పలికింది. దీంతో రైతులు అధికశాతం చివరిదశలో బహిరంగమార్కెట్లో పత్తిని విక్రయించి లాభాలనార్జించారు. కానీ ప్రస్తుతం మాత్రం బహిరంగ మార్కెట్లో పత్తి ధర రూ. 3900 మించి పలకడం లేదు. దిగుబడులు తగ్గినా ధరలు పెరగకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఈఏడాది విత్తనాలు, ఎరువులు, కూలీలు, రవాణా ఖర్చు భారీగా పెరిగడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ధరలతో తాము పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
అక్రమ దందాకు సీఛీఐ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పత్తి రైతుకు భరోసా ఇవ్వాల్సిన సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) దళారులు, వ్యాపారులకు అండగా నిలుస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల పత్తిని మాత్రమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ జిన్నింగ్ మిల్లుల యజమానులు, దళారుల పత్తిని యథేచ్ఛగా అక్రమంగా కొనుగోలు చేస్తోంది. వీరితో కుమ్మక్కవుతున్న సీసీఐ అధికారులు పెద్ద ఎత్తున అక్రమ దందాకు తెరలేపారు. రైతులు తీసుకువచ్చిన పత్తిలో తేమ అధికంగా ఉందంటూ తిరస్కరిస్తున్న సీపీవోలు (కాటన్ పర్చేస్ ఆఫీసర్లు).. తమతో కుమ్మక్కైన వ్యాపారుల పత్తి నాణ్యతను ఏ మాత్రం పరిశీలించకుండానే కొనుగోళ్లు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ అక్రమాల్లో ఆ సంస్థలోని కింది నుంచి పైవరకు స్థాయిని బట్టి ముడుపులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాల్లో సీపీవోలు కీలకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ కొనుగోళ్లు.. 30 శాతానికి పైనే.. ఈ కొనుగోలు సీజన్లో సీసీఐ జిల్లాలో 22 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 5.14 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్లు మార్కెటింగ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పత్తి విలువ సుమారు రూ.208 కోట్ల వరకు ఉంటుంది. ఇలా సీసీఐ కొనుగోలు చేసిన పత్తిలో సుమారు 30 శాతం పైగా పత్తిని దళారులు, వ్యాపారుల వద్దే కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ అక్రమ కొనుగోలు చేసిన పత్తి విలువ సుమారు రూ.50 కోట్లకుపైగానే ఉంటుందంటే.. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఏ మేరకు అక్రమాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. బినామీ రైతుల పేరుతో.. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తికి కనీస మద్దతు ధరైనా దక్కుతుందనే ఎంతో ఆశతో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. తీరా ఇక్కడికి వచ్చాక పత్తిలో తేమ శాతం 12 మించి ఉందంటూ కాటన్పర్చేజ్ అధికారులు రైతుల పత్తిని కొనుగోలును తిరస్కరిస్తున్నారు. చేసేదేమీ లేక ఆ రైతులు ఆ పత్తిని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధరలో రూ.300 నుంచి రూ.400 వరకు కోత విధించి క్వింటాల్కు రూ.3,500 నుంచి 3,600 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇలా రైతుల వద్ద కొనుగోలు చేసిన ఇదే పత్తిని బినామీ రైతుల పేరుతో సీసీఐకి రూ.4,050 (కనీస మద్దతు ధర) చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కో క్వింటాల్పై సుమారు రూ.400 చొప్పున సీసీఐ అధికారులు, వ్యాపారులు కలిసి పంచుకుంటున్నారు. ఇలా నిత్యం వేల క్వింటాళ్ల అక్రమ కొనుగోళ్లతో రూ.లక్షలు దండుకుంటున్నారు. బోగస్ పట్టాదారు పాసుపుస్తకాల జిరాక్స్లను పెట్టి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. చెక్కుల విధానంతో అక్రమాలకు ఊతం.. రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తికి సంబంధించిన డబ్బుల చెల్లింపుల్లో ప్రస్తుతం చెక్కుల విధానం అమలవుతోంది. కానీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే విధానం ఉంటే ఈ అక్రమ కొనుగోళ్లకు చాలా వరకు చెక్ పడుతుంది. కానీ ఈ ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయడంలో సీసీఐ అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విధానం అమలయ్యేలా చూడాల్సిన జిల్లా అధికార యంత్రాం గం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గతేడాది సీజన్లో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే పత్తి డబ్బులు జమ చేసే వారు. దీంతో ఈ అక్రమాలకు చెక్ పడింది. కానీ ఈ ఏడాది కొనుగోలు సీజన్ ఊపందుకున్నా ఆన్లైన్ చెల్లింపుల విధానం ఇంకా అమలు చేయడం లేదు. విజిలెన్స్ దృష్టి సారించాలి.. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమ దందాపై కాటన్ కార్పొరేషన్ విజిలెన్స్ విభాగం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొనుగోళ్ల తీరుపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే రూ.కోట్లలో జరుగుతున్న అక్రమ దందా వెలుగు చూస్తుందని పత్తి రైతులు పేర్కొంటున్నారు. సీసీఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడం జిల్లాలో అడిగే నాథుడే లేకపోవడంతో అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా తయారైందనే ఆరోపణలున్నాయి. -
రైతుకు కష్టం
కంచికచర్ల మార్కెట్ యార్డులో తడిసిన 2 వేల క్వింటాళ్ల పత్తి ఈ ఏడాది అసలే తగ్గిన దిగుబడిపెరిగిన సాగు వ్యయం తడిసిన పత్తి రంగు మారుతుందని ఆందోళనలో రైతులు కంచికచర్ల : అకాల వర్షంతో పత్తి రైతుకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పత్తిని ఎన్నో ఆశలతో సీసీఐ కొనుగోలు కేంద్రానికి తరలిస్తే.. మంగళవారం రాత్రి ఊహించనివిధంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో స్థానిక మార్కెట్ యార్డులోని పత్తి బోరాలు తడిసిపోయాయి. పత్తి బోరాల రక్షణకు ఏఎంసీ అధికారులు కొంతమంది రైతులకు మాత్రం నామమాత్రంగా పరదాలు ఇచ్చారు. అసలే ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల వల్ల పత్తి పంటకు ఆశించినంత దిగుబడి రాలేదు. పత్తి సాగుకు అధిక వ్యయం కావడంతో అప్పు చేసి మరీ సాగుచేసిన రైతులు వాటినుంచి బయటపడేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రానికి అమ్మకం కోసం పత్తి బోరాలను తీసుకొచ్చారు. 24.8 మిల్లీమీటర్ల భారీ వర్షం కురవడంతో అవి పూర్తిగా తడిసిపోయాయి. తడిసిన 1500 పత్తి బోరాలు... సుమారు 1500 పత్తి బోరాలు ఈ వర్షానికి తడిసిపోయాయి. తడిసిన పత్తి రెండు వేల క్వింటాళ్ల వరకు ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపునీరు బయటకు వెళ్లకుండా నిలిచిపోవడంతో పత్తి బోరాలు నీటిలోనే నానుతున్నాయి. రాత్రివేళ వర్షం కురవడంతో పత్తిని రక్షించుకునేందుకు కూడా రైతులకు అవకాశం లేకుండా పోయింది. మార్కెట్ యార్డు వైఫల్యంతోనే... పత్తిని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కనీస వసతులు కల్పించలేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. వర్షాలు పడే సమయంలో పత్తిని కాపాడుకునేందుకు రైతులకు పరదాలు అందజేయాల్సిన బాధ్యత ఏఎంసీదేనని చెబుతున్నారు. కొద్దిమందికి మాత్రమే పరదాలు అందజేయడంతో మిగిలిన పత్తి బోరాలన్నీ తడిసిపోయానని పేర్కొంటున్నారు. గిట్టుబాటు ధర దక్కేనా? కాటన్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం 8 శాతం తేమ ఉన్న పత్తికి మాత్రమే రూ.4,050 మద్దతు ధర లభిస్తుంది. గరిష్టంగా తేమ 12 శాతం వరకు మాత్రమే అనుమతిస్తారు. తేమ శాతాన్ని అనుసరించి పత్తి ధరలో క్వింటాలుకు రూ.40 చొప్పున కోత విధిస్తారు. వర్షానికి తడిసిన పత్తి పరిస్థితి ఏమిటనేది అర్థం కాకుండా ఉందని రైతులు పేర్కొంటున్నారు. పత్తిని ఆరబెట్టాలని అధికారులు సూచిస్తున్నారని, ఆరబెట్టిన పత్తి రంగుమారే అవకాశమున్నందున గిట్టుబాటు ధర దక్కుతుందో లేదోనని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంట చేతికొచ్చి.. అమ్ముకునే దశలో ఈ పరిస్థితి ఏర్పడటంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అసలే మార్కెట్లో పత్తికి సరైన మద్దతు ధర ప్రభుత్వం నుంచి రావడం లేదని, కేవలం రూ.4,050 మద్దతు ధర ప్రకటించిందని చెబుతున్నారు. ఈ ఏడాది దిగుబడి తగ్గి సాగు ఖర్చు పెరిగిన నేపథ్యంలో రూ.6 వేలు మద్దతు ధర ప్రకటిస్తే తమకు గిట్టుబాటయ్యేదని రైతులు అంటున్నారు. కనీసం పంట సాగుకైనా చేసిన అప్పులు తీరుతాయని అమ్ముదామని భావిస్తే వర్షం తమను మరింత ఇబ్బందుల్లోకి నెట్టిందని వాపోతున్నారు. కల్లాల్లోనే తడిసిన మొక్కజొన్న విత్తనాలు నందిగామ రూరల్ : నందిగామ ప్రాంతంలోనూ మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కల్లాల్లోని మొక్కజొన్న విత్తనాలతో పాటు తీతలకు సిద్ధమైన పత్తి తడిసి ముద్దయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. -
పత్తి రైతులకు సీసీఐ ఆన్లైన్ చెల్లింపులు
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో శ్రీకారం సాక్షి, హైదరాబాద్: పత్తి రైతులకు ఊరట కలిగించే అంశం ఇది. ఇప్పటి వరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాల వద్ద పత్తి అమ్మకాలు చేసిన రైతులకు పదిహేను రోజుల నుంచి నెల రోజుల మధ్య నగదు చెల్లింపులు చేసేవారు. ఇప్పుడు వెంటనే రైతులకు నగదు చెల్లించేందుకు సీసీఐ ముందుకు వచ్చింది. రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసిన 48 గంటల్లోగా వారి బ్యాంకు ఖాతాల్లోకి గిట్టుబాటు ధర సొమ్మును జమచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీసీఐ అంగీకరించిందని వ్యవసాయశాఖ కమిషనర్ బి.జనార్దన్రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఇటీవల సీసీఐ ఎండీ సి.కె.మిశ్రా హైదరాబాద్ వచ్చి వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అందులో ఆన్లైన్ చెల్లింపుల అంశం చర్చకు వచ్చింది. వెంటనే ఆయన ఢిల్లీ నుంచి సీసీఐ డెరైక్టర్ చొక్కలింగం ఆధ్వర్యంలోని బృందాన్ని రాష్ట్రానికి పంపించారు. సోమవారం ఈ బృందం వరంగల్ మార్కెట్ను సందర్శించింది. రాష్ట్ర వ్యవసాయశాఖ విజ్ఞప్తి మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఆన్లైన్లో పత్తి రైతుల బ్యాంకు ఖాతాలోకి నగదు చెల్లింపులు చేయాలని సీసీఐ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని పెలైట్ ప్రాజెక్టుగా చేపట్టి మున్ముందు దేశవ్యాప్తంగా ఆన్లైన్ చెల్లింపులు చేస్తామని అధికారులు చెప్పారు. రాష్ట్రంలో 78 సీసీఐ కేంద్రాలకు గాను ఇప్పటివరకు 63 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
పత్తి రైతులను దోపిడీ చేయడం ...
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పత్తి రైతులను దోపిడీ చేయడం షురువైంది. ప్రైవేటు వ్యాపారుల ఎత్తుగడలు ఫలించాయి. ధరలో కోత విధించి దండుకోవడానికి అధికారికంగానే లైన్ క్లియరైంది. రాష్ట్రంలో ఏ మార్కెట్లోనూ లేనివిధంగా తేమ శాతం పేరుతో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోళ్ల నుంచి తప్పుకోవడంతో పత్తి రైతులకు ప్రైవేటు వ్యాపారులే దిక్కయ్యారు. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు ధర దోపిడీ పర్వానికి తెరలేపారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పత్తి పంటకు కనీస మద్దతు ధర కల్పించండి మహాప్రభో అంటూ మూడు రోజులుగా రోడ్డెక్కి నెత్తినోరు మొత్తుకున్నా పత్తి రైతుల ఆవేదన చివరకు అరణ్య రోదనగానే మిగిలిపోయింది. రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర అందేలా వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు దగ్గరుండి కనీస మద్దతు ధరలో కోత విధిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. కొనుగోళ్లతోపాటే దోపిడీ ప్రారంభం.. రెండు రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడి మంగళవారం ఎట్టకేలకు పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటే.. ప్రారంభమైంది కొనుగోళ్లు కాదని, ప్రైవేటు వ్యాపారుల దోపిడీ అని పత్తి రైతులు లబోదిబోమంటున్నారు. ధరలో రూ.350 చొప్పున కోత విధించడంతో మార్కెట్ యార్డుకు పది క్వింటాళ్లు తెస్తున్న రైతులు సగటున రూ.3,500 నుంచి రూ.5,000 వరకు నష్టపోవాల్సి వస్తోంది. పెరిగిన సాగు వ్యయానికి, వచ్చిన రాబడికి భారీ మొత్తంలో తేడా ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. సీసీఐ ధర క్వింటాల్కు రూ.3,885.. కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.4,050 చొప్పున కొనుగోలు చేయాల్సిన సీసీఐ తేమ పేరుతో రూ.3,885కి ధర తగ్గించింది. తేమ శాతం 17కు మించి ఉన్న పత్తిని అసలు కొనుగోలు చేయడం లేదు. అంతకుమించి తేమ ఉన్న పత్తిని వ్యాపారులు తీసుకుంటున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో 20 శాతానికి మించి తేమ ఉంటుండటంతో రైతులకు ప్రైవేటు వ్యాపారులే దిక్కవుతున్నారు. దీంతో యార్డుకు వస్తున్న పత్తిలో కనీసం ఐదు శాతానికి మించి సీసీఐ కొనుగోలు చేయడం లేదు. నేటి నుంచి కొనుగోళ్లు బంద్.. ప్రారంభమైన ఒక్క రోజులోనే పత్తి కొనుగోళ్లకు బ్రే క్ పడింది. సోమవారం అసలు కొనుగోళ్లే ప్రారంభం కాలేదు. మంగళవారం నుంచి తూకాలు వేస్తున్నారు. ఇంతలోనే దీపావళి పండుగ పురస్కరించుకుని ఈ నెల 22 నుంచి 26 వరకు మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు జరగవని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎ.కిష్టాగౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. -
పత్తి రైతు మళ్లీ చిత్తు!
సాక్షి, హైదరాబాద్: పత్తి రైతు మళ్లీ చిత్తవుతున్నాడు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) అందక మార్కెట్ మాయాజాలంలో కుదేలవుతున్నాడు. ఖరీఫ్లో వేసిన పంటల్లో ముందుగా మార్కెట్కు వచ్చేది పత్తే. వారం రోజులుగా ఈ పంట మార్కెట్కు వస్తోంది. అయితే పంటకు వ్యాపారులు సరైన ధర ఇవ్వకుండా రైతులను దోపిడీ చేస్తున్నారు. కనీస మద్దతు ధర రూ.4,050 ఉండగా... కేవలం రూ.3 వేలకు కొనుగోలు చేస్తున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడుతోంది. వరి కంటే రెట్టింపు సాగు తెలంగాణలో పత్తి సాగు అధికం. వరికి రెట్టింపు స్థాయిలో సాగవుతుంది. ఈ ఏడాది 8.173 లక్షల హెక్టార్లలో వరి సాగు కాగా... పత్తి 16.763 లక్షల హెక్టార్లలో వేశారు. ఈ ఖరీఫ్లో ఆహార ధాన్యాల సాగు కేవలం 83 శాతమే ఉంటే... పత్తి సాగు 109 శాతం ఉంది. తెలంగాణలో పత్తికి ఇస్తున్న ప్రాధాన్యం ఎంతో ఈ లెక్కలను బట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే వర్షాలు సరిగా లేకపోవడంతో పత్తి దిగుబడి తగ్గుతుందని అంచనా. సహజంగా ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు పత్తి దిగుమతి కావాలి. కానీ సరైన వర్షాలు లేకపోవడంతో అది 7 క్వింటాళ్ల వరకు పడిపోవచ్చని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. దిగుబడి తగ్గినా కనీసం మద్దతు ధర అయినా వస్తుందన్న ఆశ రైతుల్లో ఉంది. కానీ క్వింటాలుకు రూ.వెయ్యి వరకు తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో రైతుల ఆశలు అవిరవుతున్నాయి. అంతర్జాతీయంగా ఎగుమతులు లేకపోవడంతో ధరలు తగ్గాయని వ్యాపారులు సాకులు చెబుతున్నారు. అటు ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఇటు సీసీఐ కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో తెరిపించకపోవడంతో వ్యాపారులు చెప్పిందే రేటు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. గతేడాది క్వింటాలుకు ఏకంగా రూ.5,200 వరకు కొనుగోళ్లు జరిగాయి. ఇప్పుడు మాత్రం వ్యాపారులు రూ.3 వేలే అనడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. స్వామినాథన్ సిఫార్సులు ఏమయ్యాయి? పదేపదే స్వామినాథన్ సిఫార్సులను ప్రస్తావించే పాలకులు.. ఆయన సిఫార్సులను అమలు చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం... రైతు ఒక పంటకు పెట్టిన పెట్టుబడి, ఆ ఖర్చులో సగం మొత్తం కలిపితే ఎంత వస్తుందో దాన్నే కనీస మద్దతు ధరగా ప్రకటించాలి. ఆ ప్రకారం చూస్తే అధికారిక లెక్కల ప్రకారం క్వింటాలు పత్తికి రైతు పెట్టే పెట్టుబడి ఖర్చు రూ.5,200. అందులో సగం రూ.2,600. ఈ రెండింటినీ కలిపితే రూ.7,800. ఇదే పత్తి కనీస మద్దతు ధర కావాలి. కానీ కేంద్రం దాన్ని పట్టించుకోలేదు. కనీసం అందులో సగం ధరకైనా వ్యాపారులు కొనుగోలు చేయడంలేదు. వైఎస్ ప్రభుత్వంలో క్వింటాలుకు రూ.7,200 చొప్పున కొనుగోలు చేశారు. ఇన్నేళ్లు గడిచినా ఆ ధర కాదు కదా కనీస మద్దతు ధర కూడా రైతులకు అందించడంలో సర్కారు విఫలమవుతోంది. -
సీసీఐ మీనమేషాలు..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పత్తి రైతుకు ఈ ఏడాది ‘మార్కెట్’ కష్టాలు తప్పేలా లేవు. ఈ సీజనులో పత్తి కొనుగోళ్లకు ప్రైవేటు వ్యాపారులు ప్రస్తుతానికి ఆసక్తి చూపకపోవడంతో రైతులు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)పైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ప్రభుత్వ రంగ సంస్థ పత్తి కొనుగోళ్లను ప్రారంభించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ నెల 27 వరకు కొనుగోళ్లు ప్రారంభించే ప్రసక్తే లేదని సంస్థ అధికారులు తేల్చిచెబుతున్నారు. దీంతో పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఖరీఫ్ ప్రారంభంలో కరువు.. తర్వాత అధిక వర్షాలు.. ఇలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని రైతులు పత్తిని పండించి అమ్ముకుందామంటే దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వెంటనే పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని గురువారం హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కానీ.. సీసీఐ తీరును పరిశీలిస్తే ఈ ఆదేశాలు ఇప్పట్లో అమలుకు నోచుకునే పరిస్థితి కనిపించడం లేదు. రైతులు మాత్రం పత్తిని మార్కెట్ యార్డులకు తరలిస్తున్నారు. సోమవారం నుంచి ప త్తిని ఆదిలాబాద్ మార్కెట్ యార్డు కు తీసుకువస్తామని రైతు సంఘాల నాయకులు కలెక్టర్ ఎం.జగన్మోహన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అదే జరి గితే యార్డుకు వచ్చిన పత్తిని కొనుగోలు చేసే వారెవరో తెలియక మా ర్కెటింగ్ శాఖ అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. బేల, తల మడుగు, ఆదిలాబాద్ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు పత్తిని మార్కెట్ యార్డుకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. పత్తి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4,050లుగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఈసారి కూడా పత్తి రైతుకు కనీస మద్దతు ధర లభించే అవకాశాలు కనిపించడం లేదు. జిల్లాలో ప్రధానంగా ఆదిలాబాద్తోపాటు, భైంసా మార్కెట్ యార్డుకు రైతులు ఎక్కువగా పత్తిని తీసుకువస్తారు. 21 కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు.. ఈ సీజన్లో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 21 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే స్తామని సీసీఐ ఆదిలాబాద్ బ్రాంచ్ మేనేజర్ అర్జున్ధవా పేర్కొన్నారు. ఈ మేరకు సీసీఐ ఆయా కేంద్రాల పరిధిలో ఉన్న జిన్నింగ్ మిల్లులతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ.. కొనుగోళ్లు మాత్రం మరో పక్షం రో జుల తర్వాతేనని ఆ సంస్థ అధికారు లు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం ఈ ఖరీఫ్ సీజ న్లో ఆదిలాబాద్ జిల్లాలో 3.18 లక్ష ల హెక్టార్లలో పత్తి సాగు చేసినట్లు అంచనాకొచ్చారు. ఈ లెక్కన సు మారు 35 నుంచి 40 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్కు వచ్చే అవకాశాలున్నట్లు మార్కెటింగ్ శాఖ అంచనా. అయితే.. ఈ సీజనులో పత్తి కొనుగోళ్లపై ఇటీవల అఖిలపక్ష నాయకులతో సమావేశం నిర్వహించిన జి ల్లా అధికార యంత్రాంగం, ఈనెల 14న ప్రైవేటు వ్యా పారులతో సమావేశం కావాలని నిర్ణయించారు. -
పత్తి రైతు చిత్తు!
కామారెడ్డి: వర్షాల్లేక పత్తి రైతు కళ్లు తేలేస్తున్నాడు. ఆపై తెగుళ్లు దాడి చే స్తుండడంతో పంట చేతికొచ్చే పరిస్థితులు కానరావడం లేదు. గడచిన 45 రోజులుగా వర్షాలు లేకపోవడంతో తెగుళ్లు పట్టుకుంటున్నాయి. తెగుళ్ల నుంచి పంటను రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నా కనీసం పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. వర్షాలపై ఆధారపడి పత్తి సాగు చేసిన రైతులు తమ కళ్లముందే పంట నాశనమవుతుండడంతో కంటతడి పెడుతున్నారు. ఎకరా పత్తి సాగుకు రూ. 20 వేలకు పైగా రైతులు ఖర్చు చేశారు. ఈ యేడు జిల్లాలో 20 వేల ఎక రాల్లో పత్తిపంట సాగైంది. విత్తనం నాటిన నుంచి ఎంతో శ్రద్ధతో పంటను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా విత్తనం మొలకెత్తిన తరువాత కలుపు మొక్కలు తీసేయడం నుంచి మొక్కకు కావలసిన ఎరువులు, పురుగు మందులను క్రమం తప్పకుండా అందించారు. అయితే సరైన వర్షాలు లేకపోవడం వల్ల పంటకు రకరకాల తెగుళ్లు సోకుతున్నాయి. పత్తి చెట్టు ఆకులు ఎర్రబడి రాలిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తికి సోకిన తెగుళ్లను పోగొట్టడానికి రైతులు రకరకాల క్రిమిసంహారక మందులను పిచికారి చేశారు. అయినా లాభం లేకుండాపోయింది. చాలా చోట్ల మొక్కలు కాయ కాసే దశలో వర్షాలు కురవకపోవడంతో తెగుళ్లు దాడి చేస్తున్నాయి. వర్షాలు పడి ఉంటే తెగుళ్లు తక్కువగా ఉండేవని రైతులు పేర్కొంటున్నారు. దిగుబడిపై ప్రభావం.. పత్తికి అవసరమైన సమయంలో వర్షాలు కురవకపోవడం వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. పంట బాగుంటే ఎకరాకు 12 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. క్వింటాళుకు పత్తి ధర రూ. 4 వేల వరకు పలుకుతుండడంతో కనీసం ఎకరాకు రూ. 50 వేల వరకు ఆదాయం వచ్చేది. పెట్టుబడులకు అన్ని కలిపి ఎకరాకు రూ. 30 వేలు ఖర్చయినా తక్కువలో తక్కువ రూ. 20 వేలు మిగిలేవి. అయితే ఈ సారి వర్షాభావ పరిస్థితులతో తెగుళ్లు దాడి చేస్తుండడంతో దిగుబడిపై ప్రభావం చూపుతోంది. కొన్ని గ్రామాల్లో పత్తి పంట బాగానే ఉన్నా కాయకాసే సమయంలో వర్షాలు లేక కాయ రాలిపోయే ప్రమాదం ఉంది. -
పత్తి రైతు బలవన్మరణం
యాలాల, న్యూస్లైన్: ఆరుగాలం కుటుంబమంతా కలిసి చెమటోడ్చి నా ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాలేదు. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు కుప్పలవుతున్నాయి. వాటి ని తీర్చే మార్గం కానరాకపోవడంతో మనోవేదనకు గురైన ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మండల పరిధిలోని ఎన్కెపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ కిష్టప్ప, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నట్టల చిన్న నర్సప్ప(35)కు స్థానికంగా పదెకరాల పొలం ఉంది. ఆయన నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేసి మిగతాది బీడుగా ఉంచాడు. పెట్టుబడి కోసం నర్సప్ప తెలిసిన వారి వద్ద రూ.85 వేలు అప్పు చేశాడు. జంటుపల్లిలోని ఆంధ్రా బ్యాంకులో రూ.70 వేలు తీసుకున్నాడు. ఆరుగాలం అంతా కుటుంబంతో కలిసి కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. వరుస తుపానులు పంటను దెబ్బతీశాయి. దీంతో మూడు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చింది. అది కూలీల ఖర్చులకు కూడా సరిపోలేదు. రోజురోజుకు అప్పునకు వడ్డీలు పెరుగుతున్నాయి. రుణం తీర్చే మార్గం కానరావడం లేదని నర్సప్ప ఇటీవల భార్య పద్మమ్మతో వాపోతూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈక్రమంలో పొలానికి వెళ్తున్నానని శుక్రవారం ఉదయం ఇంట్లో చెప్పి వెళ్లాడు. ఉదయం 11గంటల సమయంలో స్థానికులు చూడగా నర్సప్ప తన పొలంలో ఓ చెట్టుకు విగత జీవిగా వేలాడుతూ కనిపించాడు. కిందికి దించి పరిశీలించగా అప్పటికే ప్రా ణం పోవడంతో కుటుంబసభ్యులకు విషయం తెలి పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య పద్మమ్మతో పాటు కొడుకు భానుప్రసాద్, కూతురు భారతి ఉన్నారు. నర్సప్ప మృతితో కుటుంబీ కులు గుండెలుబాదుకుంటూ రోదించారు. నర్సప్ప ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం వీధినపడిందని గ్రామస్తులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం నర్సప్ప మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పత్తి రైతుకు గిట్టుబాటు ధర చెల్లించాలి
వైఎస్సార్సీపీ రైతు విభాగం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం డిమాండ్ చేసింది. ప్రభుత్వ విధానాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా రెండేళ్లుగా పత్తి రైతు సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్. నాగిరెడ్డి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నిర్ణయించిన విత్తనోత్పత్తి ధరను రైతులకు విత్తనకంపెనీలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. 2008-09 లో పత్తి క్వింటాలు ధర రూ. 6,500 ఉందని.. లాభసాటిగా ఉండడంతో సాగు విపరీతంగా పెరిగి పోయిందన్నారు. ఫలితంగా ఇపుడు కనీస మద్దతు ధర లభించక రైతులు నష్టపోతున్నారని చెప్పారు. గతేడాది క్వింటాలు పత్తి ఉత్పత్తికిరూ. 5,760 వ్యయం కాగా, ప్రభుత్వం కేవలం రూ. 3,900 మద్దతు ధర ప్రకటించిందని.. చివరికి రైతుకు వచ్చిన ధర రూ. 3,500 మాత్రమేనని వివరించారు. ప్రస్తుతం ఉత్పాదక వ్యయం క్వింటాలుకు రూ. 5,950 ఉంటే, మద్దతు ధర రూ. 4,000గానే ఉందన్నారు. రైతుల వద్ద నుంచి 80శాతం పత్తి వెళ్లి పోయాక మార్కెట్ ధర రూ.5,000 దాటిందన్నారు. ఏటా ఇలాగే జరిగితే రైతుల పరిస్థితి ఏమిటని నాగిరెడ్డి ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణం తరువాత రాష్ట్ర ప్రభుత్వం బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్ ధరను రూ. 830 (బీజీ-1రకం), రూ. 930 (బీజీ-2రకం)కు పెంచేసిందని గుర్తుచేశారు. విత్తనోత్పత్తి రైతులకు రూ. 290 చెల్లించాల్సి ఉండగా విత్తన కంపెనీలు మాత్రం రూ. 70 వరకు కోత విధిస్తున్నాయని చెప్పారు. పత్తి రైతుల విషంయలో ఇలా జరుగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇలా అయితే ఎలా?
పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో కేంద్ర సర్కారు జిల్లా రైతులకు మొండి చేయి చూపింది. రాష్ట్రవ్యాప్తంగా 91 సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, జిల్లాకు మాత్రం ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. దీంతో సుమారు 50 వేల ఎకరాలలో పత్తిని సాగు చేస్తున్న జిల్లా రైతాంగం ప్రయోజనాలను గాలికొదిలేసినట్లయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, నిజామాబాద్: జిల్లాలో మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం తదితర మండలాలలో రైతులు ఎక్కువగా పత్తి పంటను సాగు చేస్తుంటారు. ఇక్కడి రైతులకు ఖరీఫ్లో పత్తి ప్రధాన పంట. తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఆరుగాలం శ్రమించి పండించిన ఈ పంటకు గిట్టుబాటు ధర అందక రైతులు ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు. చేతి కందిన పంటను విక్రయించడానికి అనేక ఇబ్బందులు పడాల్సివస్తోంది. సీసీఐ కొనుగోలు కేంద్రం అందుబాటులో లేకపోవడంతో వారు ప్రైవే టు వ్యాపారులను ఆశ్రయి ంచక తప్పడం లేదు. దీన్ని ఆసరగా చేసుకుని వ్యాపారులు ధరలో కోత పెడుతున్నారు. తేమ శాతం అధికంగా ఉందని, స్టేఫుల్లెంత్ (నాణ్యత) తక్కువగా ఉం దంటూ ధర తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఎందుకు ఇలా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం అందుబాటులో ఉంటే వ్యాపారుల దోపిడీకి చెక్ పడే అవకాశాలుంటాయి. పక్కనే ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు 18, కరీంనగర్, నల్గొండకు 12 చొప్పున, మెదక్లో ఐదు, వరంగల్లో 11 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకోగానీ నిజామాబాద్ జిల్లాను మాత్రం విస్మరించింది. ఒక్క కేంద్రాన్ని కూడా మంజూరు చేయలేదు. ప్రస్తుతం మద్నూర్ మార్కెట్ యార్డులో పత్తి క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. గురువారం ఈ మార్కెట్కు 875 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా, క్వింటాళుకు రూ. 4365 నుంచి రూ.4430 వరకు ధర పలికింది. ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర క్వింటాళుకు రూ. 4,000గా ప్రకటించింది. ప్రస్తుతానికి ధర నిలకడగా ఉన్నప్పటికీ, కొనుగోలు కేంద్రం మంజూరు కాకపోవడంతో వ్యాపారులు రానున్న రోజుల్లో ధర తగ్గించే అవకాశాలున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రం రైతులకు అందుబాటులో ఉంటే స్థానిక వ్యాపారులు జిమ్మిక్కులకు పాల్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధర తగ్గితే రైతులు పత్తిని పక్క జిల్లాలకు తీసుకెళ్లి విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాఫెడ్ కొనుగోళ్లు నామమాత్రమే గత ఏడాది సీజనులో కూడా ప్రభుత్వం జిల్లాలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. నాఫెడ్ ద్వారా పత్తిని కొనుగోళ్లు చేస్తామని ప్రకటించింది. కేవలం వారం పది రోజులలోనే ఈ కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో రైతులు చేసేదేమీ లేక వ్యాపారులకే పత్తిని విక్రయించాల్సి వచ్చింది. ఈసారి కూడా కొనుగోలు కేంద్రం మంజూరు కాకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రస్తుతానికి కనీస మద్దతు ధర అందుతోందని, అలా అందని పక్షంలో నాఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని మార్కెటింగ్శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. -
‘చితికి’ పోతున్న... పత్తి రైతు
ఊరించిన పత్తి .. ఉసురు తీస్తోంది. తెల్లబంగారం విలువైన ప్రాణాలు హరిస్తోంది. కేవలం రెండు వారాల వ్యవధి.. పదకొండుమంది రైతుల బలవన్మరణం.. మహిళా.. మైనారిటీ.. గిరిజన.. కౌలు .. ఇలా అన్ని విభాగాల రైతులు పురుగుల మందును ఆశ్రయించారు.. పంట నష్ట పరిహారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాక ఆందోళన చెందారు.. ప్రభుత్వ అధికారులు.. ప్రజాప్రతినిధులు.. వ్యవసాయ సంఘాలు.. ఏవీ అన్నదాతకు భరోసా కల్పించే ప్రయత్నాలు చేయ లేదు... ఫలితంగా పదకొండు కుంటుంబాల్లో దీపాలు ఆరిపోయాయి..!! సాక్షి ప్రతినిధి, నల్లగొండ ముందు మురిపించిన వానలు పత్తి పంట సాగు చేసేలా రైతులను ఊరించాయి. అధికారుల అంచనాలకు మించి ఈ సారి జిల్లాలో పత్తి సాగైంది. సాధారణ సాగు విస్తీర్ణం కన్నా ఇది రెట్టింపు కావడం విశేషం. తీరా పంట చేతికి వస్తుందనగా అయిదు రోజుల పాటు అతలాకుతలం చేసిన తుపాను అన్నదాతను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టింది. తెంపడానికి సిద్ధంగా ఉన్న పత్తిపంట పూర్తిగా తడిచి, నల్లగా మారి పనికి రాకుండా అయ్యింది. పంటల సాగు కోసం చేసిన అప్పులు భయపెట్టగా, ఆదుకునే వారు లేక అన్నదాతలు క్రిమిసంహారక మందును ఆశ్రయించారు. ఇలా, జిల్లాలో గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 7వ తేదీ వరకు, కేవలం పదమూడు రోజుల వ్యవధిలోనే దేవరకొండ, చండూరు, మునుగోడు, చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూరు, వలిగొండ, భువనగిరి, మఠంపల్లి మండలాల్లో ఎనిమిది మంది పత్తి రైతులు, తిప్పర్తి మండలంలో ఒక వరి రైతు బలవన్మరణాలకు పాల్పడ్డారు. జిల్లాలో ఈ సారి 6,87,823 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. అయితే, ఇటీవల కురిసిన తుపాను వల్ల 3,80,283 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ అంచనా మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. కేవలం ఇంతవరకే పరిగణనలోకి తీసుకున్నా 23.93లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి పోయినట్టే. తద్వారా రైతులు సుమారు రూ.1037కోట్ల ఆదాయం కోల్పోతున్నారు. పంటల సాగు కోసం చేసిన పెట్టుబడులు అప్పులుగా మిగిలాయి. దీంతో ధైర్యం కోల్పోయిన పత్తి రైతులు ఆత్మహత్యలను ఆశ్రయించారు. ఇక, వరి పంట విషయానికి వస్తే 3,61,156ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయగా, భారీ వర్షాల కారణంగా 92వేల ఎకరాల విస్తీర్ణంలో పంట దెబ్బతిన్నది. ఫలితంగా 20.25లక్షల క్వింటాళ్ల దిగుబడిని పూర్తిగా నష్టపోయినట్టే. దీనివల్ల రమారమి రూ.300కోట్ల మేర రైతులు ఆదాయం కోల్పోతున్నారు. తిప్పర్తి మండలంలో వరి సాగుచేసిన ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా, ప్రభుత్వం ఇంకా అంచనాలు వేసే దశలోనే ఉంది. అధికార వర్గాల సమాచారం మేరకు శుక్రవారం పంట నష్టం అంచనాల కోసం పది కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. అయితే, ఈ బృందాలు ఏఏ ప్రాంతాల్లో పర్యటిస్తాయో మాత్రం ప్రకటించలేదు. పంట నష్టపోయిన రైతాంగానికి భరోసా కల్పించేందుకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు విస్తృతంగా పర్యటించాల్సింది పోయి ఎవరి బిజీలో వారున్నారు. -
‘శంఖారావం’ సభకు జిల్లా నుంచి 50 వేల మంది
విజయవాడ సిటీ, న్యూస్లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహించే సమైక్య శంఖారావం సభకు 800 బస్సులు, వందలాది కార్లలో భారీగా తరలివెళుతున్నట్టు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ పత్రికాప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 16 నియోజకవర్గాల నుంచి 50 వేల మంది ఈ సభకు హాజరవుతారని అంచనావేసినట్టు తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 50 బస్సులు ఏర్పాటుచేశామని, కార్లు, ఇతర వాహనాల్లో వెళ్లేవారి సంఖ్య 15 వేల పైచిలుకు ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. వీరందరికీ అవసరమైన ఏర్పాట్లను ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలే చూసుకుంటారని, వీటికి అనుబంధంగా రాష్ట్ర పార్టీ కూడా సహకరిస్తుందని తెలిపారు. హైదరాబాద్లో ఇందిరా పార్క్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, పబ్లిక్ గార్డెన్స్లో వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రాజధానిలో వసతి ఏర్పాట్లు.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ వచ్చే కార్యకర్తలకు హయత్నగర్లోని ధనుంజయ గార్డెన్స్లోను, పెడన, నందిగామ నియోజకవర్గాల నుంచి వచ్చేవారికి నాచారం పోలీస్స్టేషన్ పక్కన ఉన్న సి.కె. గార్డెన్స్లోను, మచిలీపట్నం నుంచి వచ్చే కార్యకర్తలకు ఉప్పల్ బస్టాండ్ (బోడుప్పల్) దగ్గర్లోని శబరి గార్డెన్స్లో వసతి ఏర్పాట్లు చేస్తున్నామని భాను తెలిపారు. జగ్గయ్యపేటతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి రామోజీ ఫిలింసిటీ వద్ద గల అన్నమాచార్య కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్లో ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా నుంచి వచ్చే ప్రతి కార్యకర్త 25వ రాత్రికే హైదరాబాద్ వచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. రాష్ర్టం నలుమూలల నుంచి సుమారు ఆరు లక్షల మంది ఈ సభకు హాజరయ్యే అవకాశముందని రాష్ట్ర పార్టీ అంచనావేస్తున్నట్టు తెలిపారు. పాస్ల వివరాలు.. సీఈసీ, సీజీసీ సభ్యులు, తాజా, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు, పార్టీ జిల్లా కన్వీనర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, పార్లమెంట్ పరిశీలకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర అనుబంధ కమిటీల కన్వీనర్లకు వీవీఐపీ పాసులు ఇస్తారని తెలిపారు. మండల కన్వీనర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధికార ప్రతినిదులు, అనుబంధ విభాగాల కన్వీనర్లు, రాష్ర్ట పార్టీ సభ్యులకు వీఐపీ పాసులు ఇస్తారని పేర్కొన్నారు. వీరంతా తమ గుర్తింపుకార్డులు విధిగా తీసుకునిరావాలని ఉదయభాను సూచించారు. -
ముంచెత్తుతున్న వానలు.. కర్షకుడికి కన్నీళ్లే
వాయుగుండం రైతులపాలిట దినదినగండంగా మారింది. పగబట్టిన ప్రకృతి కర్షకుడికి కన్నీళ్లను మిగులుస్తోంది. మూడు రోజులుగా జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. వరుణుడి ప్రతాపానికి పంటలు నీటిపాలవుతున్నాయి. పత్తి, మొక్కజొన్న మొలకలు వచ్చి రైతుల ఆశలను తుంచేస్తున్నాయి. నీటమునిగిన వరిచేలు రైతును కన్నీటిపాలు చేస్తున్నాయి. సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో రైతులు ప్రస్తుత సార్వా సీజన్లో 6.42 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. వాటిలో మూడు లక్షల ఎకరాల్లో బీపీటీ 5204(సాంబామసూరి), రెండున్నర లక్షల ఎకరాల్లో ఎంటీయూ 1061, సుమారు లక్ష ఎకరాల్లో ఎంపీటీయూ 1001, బాసుమతి, మిగిలిన రకాలు వేశారు. ఇప్పటికే విత్తన రకాలు ఈనిక పూర్తి చేసుకుని గింజలు పాలుపోసుకున్నాయి. మరికొద్ది రోజుల్లో అవి కోతకు రానున్నాయి. ఆలస్యంగా నాట్లు వేసిన అవనిగడ్డ, నాగాయలంక, చల్లపల్లి, మోపిదేవి, కోడూరు, ఘంటసాల మండలాలతోపాటు గూడూరు, బందరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, కలిదిండి మండలాల్లో పైరు నిలదొక్కుకునే దశలో ఉంది. ఈనిక దశలోను, పాలుపోసుకునే దశలో ఉన్న చేలకు ప్రస్తుత వర్షాలు తీవ్ర నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడూరు, బందరు, ముదినేపల్లి తదితర మండలాల్లో 1500 ఎకరాల వరిచేలు నీట మునిగాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆక్వాకూ అవస్థలే.. జిల్లాలో 75 వేల ఎకరాల్లో చేపలు, 35 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వల్ల ఆక్వా చెరువుల్లో ఆక్సిజన్ లోపం తలెత్తుతోంది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటే నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరు, బందరు, కృత్తివెన్ను, అవనిగడ్డ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలు కాసి, ప్రస్తుతం మబ్బులు, వర్షం పడడంతో రొయ్యలు, చేపల చెరువుల్లో ఆక్సిజన్ లోపం తలెత్తిందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. చెరువుల్లో ఆక్సిజన్ సమతుల్యత కోసం ఏరియేటర్లను తిప్పడం, చేపల చెరువుల్లో డీవోబీ సమస్య రాకుండా మందులు చల్లడం, మేతలు తగ్గించడం వంటి చర్యలను ఆక్వా రైతులు చేపట్టారు. పత్తి పంటకు రూ.2 కోట్ల నష్టం.. జిల్లాలో లక్షా 35 వేల ఎకరాల్లో సాగు జరుగుతున్న పత్తి ప్రస్తుతం పూత, కాయ, పంట దశల్లో ఉంది. ప్రస్తుత వర్షాలతో దాదాపు పది శాతం వరకు పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నష్టం 30 శాతం వరకు ఉంటుందని రైతులు వాపోతున్నారు. భారీ వర్షాల కారణంగా పత్తికాయలకు బూజు తెగులు వచ్చి దూదిపింజలు పగలకుండా కుళ్లిపోతాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విచ్చుకున్న పత్తి వర్షాలకు తడిసి రంగుమారే ప్రమాదం ఉంది. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో సుమారు రూ.2 కోట్ల విలువైన పంట నష్టపోయినట్టు అంచనా. ఎకరాకు సుమారు రూ.10 వేల వరకు నష్టం ఉంటుందని రైతులు చెబుతున్నారు. కొన్నిచోట్ల పత్తి చేలల్లో నీరు నిల్వ ఉండటంతో మొక్కలు ఎర్రబారి ఎండిపోతున్నాయి. దీని కారణంగా నష్టం మరింత పెరిగే ప్రమాదం ఉంది. మొక్కజొన్న, కూరగాయల పంటలకూ నష్టమే.. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి, నందిగామ, మైలవరం ప్రాంతాల్లో మొక్కజొన్న చేలు నేలవాలాయి. ఆరబెట్టిన మొక్కజొన్నలు తడిసి మొలకలు వచ్చేశాయి. అవనిగడ్డ, మోపిదేవి, తోట్లవల్లూరు, పామర్రు, ఉయ్యూరు, కంకిపాడు మండలాల్లో లేతగా ఉన్న బీర, దోస, కంద పొలాల్లోకి నీరు చేరడంతో మొక్కలు చనిపోయే ప్రమాదం ఏర్పడింది. నీట మునిగిపోవడంతో బీర, దోస, కంద పూత రాలిపోవడం, కాయలు చనిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. పసుపు చేలల్లో నీరు రెండు మూడు రోజులు నీరు నిల్వ ఉంటే దుంప కుళ్లిపోయే ప్రమాదం ఉంది. టమాటా తోటలో నీరు చేరే ప్రమాదం ఉంది. ఈ ప్రభావంతో ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. కంకిపాడు, తోట్లవల్లూరు మండలాల్లోని తమలపాకుల తోటల్లో నీరు నిల్వ ఉండడంతో పంట దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టాలను అంచనా వేస్తున్నాం : జేడీఏ భారీ వర్షాలకు జరిగిన పంట నష్టాలను అంచనా వేస్తున్నట్టు ఇన్చార్జి జేడీఏ బాలూనాయక్ ‘సాక్షి’కి చెప్పారు. చల్లపల్లి, నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ మండలాల్లో బుధవారం ఆయన పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఇప్పటికే వరిచేలు నీట మునిగాయని, వర్షం పెరిగితే నష్టం పెరుగుతుందని అన్నారు. పత్తి 10 శాతానికి పైగా నష్టం ఉంటుందని అన్నారు. విచ్చుకున్న పత్తికాయలు తడిసిపోతే రంగుమారిపోతుందన్నారు. తయారైన కాయల్లోకి నీరుచేరి కుళ్లిపోయే ప్రమాదం ఉందని అన్నారు. పత్తి పూత రాలిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. దీనికి సంబంధించి పంట నష్టాలు అంచనాలు వేయాల్సి ఉంద న్నారు. కాగా వరిలో పెద్దగా నష్టం లేదని చెప్పారు. ఈ చర్యలు తీసుకోండి.. జిల్లాలో అధిక వర్షాల కారణంగా నీట మునిగిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ఈ చర్యలు తీసుకోవాలని జిల్లా ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ బి.మహేశ్వర ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరి చేలల్లోని నీటిని బయటకు తోడి, నేలవాలిన వరిదుబ్బులను సుడులు కట్టుకుని నిలబెట్టాలి. నీట మునిగిన వరిపైరు దుబ్బు దశ నుంచి అంకురం ఏర్పడే దశలో ఉంటే పాముపొడ తెగులు వచ్చే ప్రమాదం ఉంది. దీని నివారణకు ఒక లీటరు నీటిలో రెండు మిల్లీలీటరు హెక్సాకోనాజోల్ మందు లేదా ఒక మిల్లీలీటరు ప్రోపికొనజోల్ లేదా రెండు మిల్లీలీటర్ల వాలిడామైసిన్ మందు వాడాలి. అగ్గి తెగులు నివారణకు ఒక లీటరు నీటిలో 0.6గ్రాముల ట్రైసైక్లోజోల్ మందును పిచికారీ చేయాలి. దోమ, ఆకుముడత తెగులు నివారణకు ఒక లీటరు నీటిలో 1.5 గ్రాముల ఎసిఫెట్ మందు పిచికారీ చేయాలి. పత్తి పొలంలోని నీటిని వీలైనంత త్వరగా బయటకు తోడాలి. ఎకరానికి 20కిలోల యూరియాతోపాటు 10 కిలోల పొటాషియం నైట్రేట్ను చల్లాలి. తెగుళ్ల నివారణకు మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్, ఒక గ్రాము కార్బన్డిజమ్ లీటరు నీటిలో కలిపి చల్లాలి. వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు మొక్కలు పూర్తిగా తడిసేటట్టు పిచికారీ చేయాలి. కూరగాయల పంటల్లో, పాక్షికంగా దెబ్బతిన్న మిరప చేలో రెండు శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి. పక్కకు వంగిపోయిన మిరప మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మట్టిని ఎగదోయాలి. పాక్షికంగా దెబ్బతిన్న పసుపు పంట పొలంలో 0.5 శాతం పొటాషియం నైట్రేట్ను వారం రోజుల్లో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలి. భూమి ఆరిన తర్వాత 50 గ్రాముల ఎంవోపీ, 250 గ్రాముల వేపపిండి మొక్క దగ్గర వేయాలి. ప్రొపికోనజోల్ ఒక మిల్లీలీటరు చొప్పున వారం వ్యవధిలో రెండు పర్యాయాలు పిచికారీ చేసుకోవాలి.