జూనియర్, డిగ్రీ కాలేజీలకూ ‘సన్నబియ్యం’ | thin rice for jr degree collages : eetala | Sakshi
Sakshi News home page

జూనియర్, డిగ్రీ కాలేజీలకూ ‘సన్నబియ్యం’

Published Sat, Dec 17 2016 3:10 AM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM

జూనియర్, డిగ్రీ కాలేజీలకూ ‘సన్నబియ్యం’ - Sakshi

జూనియర్, డిగ్రీ కాలేజీలకూ ‘సన్నబియ్యం’

పరిశీలిస్తున్నామన్న మంత్రి ఈటల రాజేందర్‌
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో కూడా సన్నబియ్యం పథకాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు  పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శాసనసభలో ప్రకటించారు. ప్రస్తుతం పాఠశాలలు, వసతి గృహాల్లో ఆ పథకం సత్ఫలితాలనిస్తున్న నేపథ్యంలో సభ్యుల సూచన మేరకు విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ మేరకు సంబంధిత శాఖ నుంచి ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 34 వేలకు పైచిలుకు పాఠశాలల్లో అమలు చేస్తున్న ఈ పథకం వల్ల 29.8లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందు తున్నారని, వసతిగృహాల్లో మరో 6 లక్షల మంది విద్యార్థులకూ అమలు చేస్తున్నామని వివరించారు. ఈ బియ్యం కోసం కొంటున్న వడ్లకు రూ.1,800 చొప్పున ధర చెల్లిస్తున్నారని, అలాగే మిగతా రకాలకు కూడా అంతే మొత్తం చెల్లించి రైతులకు అండగా నిలవాలని కాంగ్రెస్‌ సభ్యుడు చిన్నారెడ్డి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement