ఖమ్మం జిల్లాలో ఓ యువతిపై దుండగులు అత్యాచారానికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కొత్తగూడెం: ఖమ్మం జిల్లాలో ఓ యువతిపై దుండగులు అత్యాచారానికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొత్తగూడెం పట్టణానికి చెందిన ఓ యువతి(21) సోమవారం అర్థరాత్రి తన స్నేహితుడితో కలిసి బైక్పై వస్తోంది. అదే సమయంలో లోతువాగు వద్ద ముగ్గురు వ్యక్తులు వారిని అడ్డగించారు.
ఆమెతోపాటు ఉన్న యువకుడిని తాడుతో బైక్కు కట్టేసి యువతిని పొదల్లోకి లాక్కెళ్లి, అత్యాచారానికి యత్నించారు. అతికష్టంమీద ఆ యువతి వారి నుంచి తప్పించుకుని రోడ్డుపైకి పరుగుతీసింది. అదే సమయంలో అటుగా వస్తున్న పోలీసులకు విషయం తెలపడంతో వారు ఆగంతకుల కోసం గాలించారు. అయితే, అప్పటికే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.