యాదగిరిగుట్ట (నల్లగొండ) : అన్నదాతల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. రైతు బలవన్మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన దుయ్యబట్టారు. శనివారం సాయంత్రం ఆయన నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం సాదువెల్లి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మేకల కరుణాకర్ అనే రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవటం మాని, కేసీఆర్ విదేశాల్లో పర్యటిస్తున్నారని విమర్శించారు.