
కరీంనగర్ జిల్లాలో ఇద్దరికి ఉరిశిక్ష
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా గోదావరిఖని సెషన్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హత్య కేసులో ఇద్దరికి ఉరిశిక్ష విధించింది.
2010 మార్చి 27న నలుగురు హత్యకు గురయ్యారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఇద్దరు నిందితులను దోషులుగా నిర్దారిస్తూ శిక్షను ఖరారు చేసింది. శుక్రవారం మధ్యాహ్నం తుది తీర్పును వెలువరించింది.