ఈత సరదాతో ఇద్దరు బాలలు మృతి | two minors died in water tank | Sakshi
Sakshi News home page

ఈత సరదాతో ఇద్దరు బాలలు మృతి

Published Wed, Apr 1 2015 11:16 PM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

two minors died in water tank

మండలంలోని గాంధీనగర్ గ్రామంలో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది.

గ్రామానికి చెందిన దోమలపల్లి వెంకటమ్మ కుమారుడు సాయిక్రిష్ణ (14), దోమలపల్లి లింగమ్మ కుమారుడు సందీప్ (12)లు గ్రామానికి సమీపంలోని లయోలా స్కూల్‌లో చదువుతున్నారు. సాయిక్రిష్ణ, సందీప్లు మరో ముగ్గురు స్నేహితులతో కలసి గ్రామ సమీపంలోని నీటి ట్యాంక్‌లో ఈత కొట్టేందుకు వెళ్ళారు. ఎక్కువ సేపు ఈత కొట్టటం వారికి చేతకాకపోవటంతో నీటిలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement