minors
-
HYD: ఐమాక్స్ వద్ద న్యాయవాదిపై దాడి.. ఇద్దరు మైనర్ల అరెస్టు
సాక్షి,హైదరాబాద్: ఐమాక్స్ వద్ద అడ్వకేట్ కల్యాణ్పై ఇద్దరు దాడి చేసి మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితులిద్దరూ మైనర్లని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో బుధవారం(నవంబర్ 13) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబిడ్స్,సైఫాబాద్ ఏసీపీలు చంద్రశేఖర్, సంజయ్ కేసు వివరాలు వెల్లడించారు.మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అబిడ్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని గన్ఫౌండ్రిలోని ప్రసాద్ అపార్ట్మెంట్ వాచ్మెన్ను కత్తితో బెదిరించిన ఇద్దరు మైనర్లు మొబైల్ ఫోన్ను ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి ఐమాక్స్ వద్దకు వెళ్లారు. 5 గంటల సమయంలో అక్కడ వాకింగ్ చేస్తున్న న్యాయవాది కల్యాణ్ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. కల్యాణ్ వారిని అడ్డుకోవడంతో కత్తితో బెదిరించారు.ఈ క్రమంలో మైనర్ల చేతిలో కల్యాణ్ గాయపడ్డారు.సెంట్రల్ జోన్ పరిధిలో ఒకేరోజు గంటల వ్యవధిలో రెండు ఇదే తరహా కేసులు నమోదు కావడంతో డీసీపీ యాదవ్ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రాంనగర్ ఫిష్ మార్కెట్ వద్ద ఓ మైనర్ను అదుపులోకి తీసుకొని విచారించారు.అతని వద్ద ఉన్న వాచ్మెన్ మొబైల్ ఫోన్ను పోలీసులు తొలుత స్వాధీనం చేసుకున్నాం.నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా చాంద్రాయణగుట్ట బండ్లగూడ వద్ద మరో మైనర్ను అదుపులోకి తీసుకున్నాం. అతని వద్ద న్యాయవాది కల్యాణ్ స్మార్ట్ ఫోన్, దాడికి ఉపయోగించిన కత్తి, వారు వాడిన హోండా యాక్టివా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాం. వారి ఆధార్ కార్డుల ప్రకారం మైనర్లుగా తేలిందని..అయితే, వారి వయసును నిర్ధరించేందుకు ఉస్మానియా ఆస్పత్రిలో టెస్టుల కోసం పంపించాం. గతంలో వారిపై ఇదే తరహాలో ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ స్నాచింగ్ కేసు నమోదైంది’ అని పోలీసులు తెలిపారు.ఇదీ చదవండి: ట్యాపింగ్ కేసులో భుజంగరావుకు షాక్ -
పిల్లలకూ పెన్షన్!
న్యూఢిల్లీ: పిల్లల పేరిట పింఛను పథకం ప్రారంభించి, ఇన్వెస్ట్ చేయడానికి వీలుగా ‘ఎన్పీఎస్ వాత్సల్య’ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ఈ పథకాన్ని 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఎన్పీఎస్ పథకం మెరుగైన రాబడులను అందిస్తోందని, భవిష్యత్ ఆదాయం కోసం ఇందులో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కలి్పస్తున్నట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. ఎన్పీఎస్లో ఈక్విటీ విభాగంలో 14 శాతం, కార్పొరేట్ డెట్లో 9.1 శాతం, జీ–సెక్లలో 8.8 శాతం చొప్పున రాబడులు ఉన్నట్టు వివరించారు. ‘పీఎం వాత్సల్య పథకాన్ని అమలు చేసే క్రమంలో దీన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటాం’అని ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ సరీ్వసెస్ విభాగం కార్యదర్శి నాగరాజు మద్దిరాల తెలిపారు. ఎవరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు..? ఆన్లైన్లో లేదంటే ఆఫ్లైన్లో బ్యాంక్ శాఖ లేదా పోస్టాఫీస్కు వెళ్లి రూ.1,000తో ఎన్పీఎస్ వాత్సల్య పథకం ప్రారంభించొచ్చు. ఆ తర్వాత నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు పిల్లల పేరుమీద ఖాతా తెరిచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వెంటనే వారి పేరు మీద రెగ్యులర్ ఎన్పీఎస్ ఖాతాగా అది మారుతుంది. వారికి 60 ఏళ్లు నిండే వరకు కొనసాగుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇప్పటికే ఎన్పీఎస్ వాత్సల్య ప్రారంభించేందుకు పీఎఫ్ఆర్డీఏతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ముంబైలో ఈ పథకాన్ని ప్రారంభించి, కొందరు పిల్లలను పేరిట ఖాతాలు తెరిపించింది. పిల్లల పేరిట ఈ ఖాతాను ప్రారంభించడం ద్వారా వారి భవిష్యత్తుకు తల్లిదండ్రులు భరోసా కల్పించినట్టు అవుతుంది. పెట్టుబడి దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రభావంతో మంచి సంపదగా మారుతుంది. -
పల్లవి ప్రశాంత్ కేసు.. నలుగురు మైనర్లు అరెస్ట్!
బిగ్ బాస్ సీజన్ - 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. రియాలిటీ షో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన గొడవ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్తో పాటు అతని సోదరుడు, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా కొల్గూరులో బుధవారం ప్రశాంత్తో పాటు అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అదే రోజు రాత్రి జరిగిన గొడవలో టీఎస్ ఆర్టీసీ బస్సులపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. బస్సులతో పాటు మరికొందరు కంటెస్టెంట్స్ అయిన అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్ల అద్దాలు సైతం పగలగొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరో 16 మందిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్టైన వారిలో నలుగురు మైనర్లు కూడా ఉన్నారు. మరో 12 మంది మేజర్లను వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజర పరచనున్నారు. నలుగురు మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగిదంటే... అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి మరో గేటు నుంచి పంపారు. కానీ ఆ సమయానికే ప్రశాంత్ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్ తన మిత్రుడు వినయ్ ద్వారా రెండు కార్లను అద్దెకు తెచ్చుకున్నారు. ఇది గమనించిన పోలీసులు ఇప్పటికే ఇక్కడ పరిస్థితి గొడవలతో నిండి ఉంది.. ఈ సమయంలో ర్యాలీ అంటే కష్టం.. బయటకు వెళ్లి ఎక్కడైన సభ పెట్టుకోండి అని చెప్పి.. ఆ కార్లను పక్కనపెట్టి పోలీసులు వేరే వాహనంలో ప్రశాంత్ను పంపించారు. అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంత్ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దె కార్లతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ మళ్లీ జోక్యం చేసుకుని ప్రశాంత్ను రావొద్దని చెప్పినా.. ప్రశాంత్ వినిపించుకోలేదని ఆయన తెలిపారు. ప్రశాంత్ను అడ్డగించి పంపించేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్లపై దాడితో పాటు రెండు పోలీసుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. అంతటితో ఆగని అల్లరి మూకలు ఆరు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలకొట్టారు. -
ఉగ్ర నెట్వర్క్లోకి చిన్నారులు, మహిళలు..!
శ్రీనగర్: భారత్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) మరో ప్రమాదకర పన్నాగాన్ని అమలు చేస్తోంది.కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల సంప్రదాయ సమాచార నెట్వర్క్ను సైన్యం దాదాపు నిర్వీర్యం చేసింది. దీంతో ఐఎస్ఐ మరో ప్రత్యామ్నాయాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం ఉగ్ర మూకల మధ్య సమాచార మార్పిడికి మహిళలు, బాలికలు, మైనర్లను పావులుగా వాడుకుంటోంది. ఇటీవలి కాలంలో ఇందుకు సంబంధించిన పలు ఆధారాలు తమకు దొరికాయని శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ అమన్దీప్ సింగ్ అవుజ్లా తెలిపారు. ముఖ్యంగా సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు, డ్రగ్స్, ఆయుధాల రవాణాకు మహిళలు, బాలికలు, మైనర్లను వాడుకోవడం అనే కొత్త ప్రమాదం వచ్చిపడిందన్నారు. ఉగ్రమూకలు సమాచార బట్వాడాకు ప్రస్తుతం సెల్ఫోన్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాయని చెప్పారు. లోయలో ప్రశాంతతకు భగ్నం కలిగించేందుకు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉగ్ర మూకలు వ్యూహాలు పన్నుతుండటంతో బలగాలు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉన్నాయన్నారు. కశ్మీర్లో చొరబాట్లు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ, పీర్ పంజాల్ దక్షిణ ప్రాంతం, పంజాబ్ల్లో పెరిగాయన్నారు. ఉత్తర కశ్మీర్లోని మచిల్లో ఇటీవలి చొరబాటుయత్నమే ఇందుకు తాజా ఉదాహరణ అని చెప్పారు. హింస పట్ల స్థానిక ప్రజల్లోనూ మార్పు కనిపిస్తుండటం ప్రశంసనీయమైన విషయమన్నారు. భద్రతా బలగాలకు కశ్మీర్ ప్రజలు సహకరిస్తున్నారని తెలిపారు. -
మైనర్ల పేరుతో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు: నిబంధనలు మారాయి
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్లో మైనర్ పేరిట సంరక్షకులు చేసే పెట్టుబడులకు సంబంధించిన నిబంధనల్లో సెబీ మార్పులు చేసింది. దీని కింద మైనర్ పేరిట చేసే పెట్టుబడులకు.. వారి ఖాతా లేదా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఖాతాల నుంచి ఏ రూపంలో అయినా చెల్లింపులను మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అనుమతించాలి. తల్లిదండ్రి లేదా సంరక్షకులతో జాయింట్ అకౌంట్ నుంచి చెల్లింపులు చేసినా ఆమోదించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: 18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్మెంట్ జూన్ 15 నుంచి ఇందుకు అవకాశం కల్పించేందుకు కావాల్సిన ఏర్పాట్లను, సవరణలను చేసుకోవాలని అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలకు (ఏఎంసీలు) సెబీ ఆదేశాలు జారీ చేసింది. పెట్టుబడుల ఉపసంహరణ మొత్తాన్ని మైనర్ ఖాతా లేదా తల్లిదండ్రి, సంరక్షకులతో జాయింట్ ఖాతాకు మాత్రమే జమ చేయాల్సి ఉంటుంది. -
ఖాజీపేట రైల్వేస్టేషన్లో తనిఖీలు.. 34 మంది బాలలు సికింద్రాబాద్కు
సాక్షి, వరంగల్: ఖాజీపేట రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో దర్భంగా ఎక్స్ప్రెస్ రైలులో అక్రమంగా తరలిస్తున్న మైనర్లను అధికారులు గుర్తించారు. మొత్తం 34 మంది మైనర్ బాలలను అధికారులు రెస్క్యూ చేశారు. వీరిని బిహార్ నుంచి సికింద్రాబాద్కు పని కోసం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పిల్లలందరినీ తాత్కాలికంగా స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. వీరితోపాటు నలుగురు దళారులను అదుపులోకి తీసుకున్నారు. వివిధ పరిశ్రమలలో పని చేయించడానికి తరలిస్తున్న బాలలను గుర్తించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు అనిల్ చందర్రావు తెలిపారు. ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కాజీపేట ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కాజీపేట మీదుగా హైదరాబాద్ న్యూఢిల్లీ వెళ్లే ట్రైన్లలో అక్రమంగా తరలించే బాలలను గుర్తించాలని, వివిధ శాఖలు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో సమావేశం ఏర్పాటు చేసుకొని సమావేశ నిర్ణయాల ప్రకారం బుధవారం దర్భంగా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలులో లో 34 మంది బాల కార్మికులను గుర్తించినట్లు తెలియజేశారు. పిల్లల వివరాలను కనుక్కొని సదరు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. అప్పటివరకు తాత్కాలిక వసతి నిమిత్తం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశాల మేరకు పిల్లలందరినీ స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు పేర్కొన్నారు -
షాకింగ్ వీడియో.. బైక్ను వెంబడించి మరీ.. యువకుడిని కత్తితో పొడిచి..
భోపాల్: ఆరుగురు మైనర్లు ఓ బైక్ను వెంబండించి మరీ కాలేజీ విద్యార్థిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపారు. రోడ్డుపై జరిగిన చిన్న వాగ్వాదం కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో డిసెంబర్ 31న చోటుచేసుకుంది. భన్వర్ కౌన్ ప్రాంతంలో ఆయుష్(22) అనే యువకుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్పై వెళుతున్నాడు. రద్దీగా ఉన్న రోడ్డుపై కొంత మంది అబ్బాయిలు నిలబడి వాహన రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు. దీంతో హారన్ కొట్టిన ఆయుష్..దారి క్లియర్ చేసి వాహనాలను వెళ్లేందుకు దారి ఇవ్వాల్సిందిగా వారిని కోరాడు. ఈ క్రమంలో మైనర్లకు, యువకుడికి మధ్య గొడవకు దారితీసింది. అనంతరం కొంతమంది మైనర్లు బైక్ వెనక పరుగెత్తి బైక్పై వెనకాల కూర్చున్న ఆయుష్పై కత్తితో దాడి చేశారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. రద్దీగా ఉన్న రోడ్డుపై కొంతమంది యువకుల బృందం బైక్ వెనకాల పరుగెడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. చివరికి బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తిని పట్టుకొని కత్తితో పొడిచారు. అనంతరం వారందరూ అక్కడి నుంచి వెనక్కి పరుగెత్తారు. ఈ ఘటన అనంతరం ఆయుష్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బాధితుడు మరణించారు. నిందితులైన ఆరుగురు మైనర్లను పోలీసులు అరెస్ల్ చేశారు. అందరిపై హత్యా కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. मध्यप्रदेश इंदौर में रात पौने तीन बजे युवक की हत्या, हार्न बजाने की बात पर हुआ था विवाद#Indore #MadhyaPradesh #MPNews pic.twitter.com/SWpWlC6jB2 — manishkharya (@manishkharya1) January 1, 2023 -
Telangana: ఆధార్ ఉంటేనే ‘నిఖా’
సాక్షి, హైదరాబాద్: మైనర్ల వివాహాలకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. మైనార్టీ తీరనివారికి పెళ్లి జరిపిన ఖాజీలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రతి ‘షాదీ’ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని వక్ఫ్ బోర్డును ఆదేశించింది. మ్యారేజ్ సర్టిఫికెట్లను కూడా ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. యుక్త వయసు రాకముందే పెళ్లిళ్లు జరుగుతుండడం.. కొందరు షేక్లు గుట్టుగా నగరానికి వచ్చి పేద పిల్లలను వివాహం పేరిట మోసగిస్తున్న ఘటనలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ షాదీల వెనుక కీలక పాత్ర వహిస్తున్న ఖాజీలను నియంత్రించేందుకు.. పెళ్లి చేసుకునే వరుడు, వధువు ఆధార్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. గతంలో మాదిరిగా ఖాజీలు ఏదో ఒక దస్తావేజు తీసుకొని పెళ్లి చేయడానికి వీలు లేదని తేల్చిచెప్పింది. ఆధార్ నమోదైన వివరాలకు అనుగుణంగా మైనరా? మేజర్? అనే విషయాన్ని నిర్దేశించుకోవాలని.. పెళ్లిళ్ల వివరాలను వక్ఫ్ బోర్డు కార్యాలయంలో అందజేయాలని సూచించింది. మైనర్, కాంట్రాక్ట్ పెళ్లి చేసే ఖాజీలపై చట్టరీత్యా చర్యలు తప్పవని హుకుం జారీ చేసింది. మరోవైపు గతంలో మాదిరిగా ఖాజీల నియామకం నేరుగా మైనార్టీ సంక్షేమ శాఖ చేయదు. జిల్లా కలెక్టర్లు ఖాజీలకు సంబంధించి వివరాలన్ని పరిశీలించిన అనంతరం వచ్చే ప్రతిపాదనల ఆధారంగా ఖాజీల నియామకం చేయాలని ఆదేశించింది. మ్యారేజ్ సర్టిఫికెట్లూ ఆన్లైన్లోనే.. షాదీకి సంబంధిచిన సరి్టఫికెట్లను ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. పెళ్లి సర్టిఫికెట్ కోసం ప్రస్తుతం అన్ని వ్యవహారాలు రాతపూర్వకంగానే జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి ఎక్కుడ జరిగినా మ్యారేజ్ సర్టిఫికెట్లకు హైదరాబాద్ హజ్హౌస్లోని నాజిరుల్ ఖజాత్ కార్యాలయానికి రావాల్సి వస్తుంది. ఆన్లైన్ సర్టిఫికెట్కు పెళ్లి సందర్భంగా ఇచ్చే పెళ్లి పుస్తకం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. దరఖాస్తు ఆన్లైన్లో అందిన తర్వాత అధికారులు తమ వద్ద ఉన్న రికార్డులను పరిశీలించి సర్టిఫికెట్ను ఆన్లైన్లో పెడతారు. ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమైతే దేశంలో ఎక్కడ నుంచైనా మ్యారేజ్ సర్టిఫికెట్ డోన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దేశంలోనే తొలిసారిగా.. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ముస్లింల షాదీ వివరాలు ఆన్లైన్లో నమోదవుతున్నాయి. గతంలో జరిగిన వాటితో పాటు ప్రస్తుతం జరుగుతున్న ప్రతి షాదీనీ వక్ఫ్ బోర్డు కార్యాలయలయంలో నమోదు చేస్తున్నారు. దీంతో మోసాలను కట్టడి చేసేందుకు వీలు ఉంటుంది. – ఎండీ మసీవుల్లా ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ -
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు
-
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఐతే.. ఎమ్మెల్యే కొడుకును మాత్రం జువైనల్గా పరిగణించాలని పేర్కొంది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లుగా పేర్కొంటూ కేసు నమోదు కాగా.. జువైనల్ కోర్టు తీర్పు కీలకంగా మారనుంది. ఇదీ కేసు.. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్లో మే 28 ఓ బాలికను ట్రాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు నిందితులు. అందులో ఒకరు మేజరు కాగా.. ఐదుగురు మైనర్లుగా పోలీసులు తేల్చారు. బాలికను రోడ్డు నెంబర్ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో గ్యాంగ్ రేప్ చేసి.. ఆ తర్వాత సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర వదిలిపెట్టారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్ ప్రకారం.. జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ప్లాన్ ప్రకారమే జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ ఘటన.. మైనర్లు ఉన్నందున పేర్లు కుదరదన్న సీపీ -
గ్రేట్ లవర్స్.. ఫేస్బుక్ లవ్ మ్యారేజ్ చివరకు ఇలా..
సాక్షి, హైదరాబాద్: క్షణ కాలం ఆవేశం వారి ప్రాణాలను బలిగింది. సికింద్రాబాద్లో మైనర్ ఫేస్బుక్ ప్రేమ జంట వివాహం విషాదంతో ముగిసింది. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల ప్రకారం.. శ్రీకాంత్కు ఫేస్బుక్లో ఓ యువతికి మధ్య పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే జూన్ 4వ తేదీన ఇంట్లో నుంచి పారిపోయి పెద్దలకు తెలియకుండా పెళ్లిచేసుకున్నారు. అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న మైనర్ జంటకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కాగా, యువతిని వారి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్లడంతో శ్రీకాంత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రెండు రోజుల పాటు ఇంట్లోనే ఉన్న శ్రీకాంత్ మనోవేదన చెందాడు. ఈ క్రమంలో తన ప్రేయసి ఆగస్టు 15న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి షాక్కు గురయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయి ఇక లేదన్న విషయాన్ని తట్టుకోలేని శ్రీకాంత్.. అమ్ముగూడ రైల్వే ట్రాక్పై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి మరణాలతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఇది కూడా చదవండి: సంచలనంగా మారిన తమ్మినేని మర్డర్ కేసు.. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు దుర్మరణం
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్లు మృత్యువాత పడ్డారు. సత్తెనపల్లి మండలం కంకణాపల్లికి చెందిన ఆవుల వెంకయ్య, శివలక్ష్మిల కుమారుడు ఆవుల తిరుమలరావు(17), గండికోటయ్య, ప్రభావతిల కుమారుడు గండి మహేష్బాబు(17), వావిలాల నగర్కు చెందిన శ్రీధర్, సత్యవాణిల కుమారుడు సత్యంశ్రీధర్(17) మిత్రులు. బెల్లంకొండ మండలం కందిపాడుకు వెళ్లేందుకు కంకణాలపల్లి నుంచి బైక్పై బయల్దేరారు. ధూళిపాళ్ల వద్ద ఆర్టీసీ బస్సును దాటేందుకు ప్రయత్నించగా.. ఎదురుగా మరో ఆర్టీసీ బస్సు రావడంతో బైక్ వేగాన్ని తగ్గించారు. కాగా, వీరిముందు ఉన్న బస్సుకు బైక్ హ్యాండిల్ తగలడంతో రోడ్డుకు కుడివైపున పడిపోయారు. దీంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి మీదుగా వెళ్లడంతో తిరుమలరావు, సత్యంశ్రీధర్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన గండి మహేష్బాబును గుంటూరు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. ఆవుల తిరుమలరావు పదో తరగతి పూర్తి చేసి సిమెంటు పనులకు వెళుతుండగా, సత్యంశ్రీధర్ ఇంటర్, గండి మహేష్బాబు పదో తరగతి చదువుతున్నారు. మహేష్బాబు సోదరి మమతశ్రీకి త్వరలో వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కందిపాడులో నగదు ఇచ్చేందుకు మహేష్బాబుతో పాటు స్నేహితులు బైక్పై వెళుతుండగా దారుణం జరిగింది. ముగ్గురి మృతదేహాలనూ పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సత్తెనపల్లి రూరల్ సీఐ రామిశెట్టి ఉమేష్ చెప్పారు. -
బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసులో ఎన్టీఆర్ కూతురి అల్లుడు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. నిబంధనలకు విరుద్ధంగా పబ్ పార్టీకి మైనర్లను యాజమాన్యం అనుమతించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అభిషేక్, అనిల్ను అరెస్ట్ చేయగా.. అర్జున్, కిరణ్రాజ్ పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఏ1 అనిల్, ఏ2 అభిషేక్, ఏ3గా ఎన్టీఆర్ కూతురి అల్లుడు అర్జున్ వీరమాచినేని, మాజీ ఎంపీ రేణుకాచౌదరి అల్లుడు కిరణ్రాజ్ను ఏ4 నిందితుడిగా పోలీసులు చేర్చారు. 2017-20 వరకు తన భార్యతో కలిసి కిరణ్రాజ్ పబ్ నడిపాడు. 2020 ఆగష్టులో అభిషేక్, అనిల్కు లీజు ఇచ్చిన కిరణ్రాజ్.. పార్ట్నర్గా కొనసాగుతున్నట్లు సమాచారం. చదవండి: పబ్లో యథేచ్ఛగా మత్తు దందా... డ్రగ్ మారో డ్రగ్ డ్రగ్స్ సరఫరాపై పూర్తి నిఘా.. హైదరాబాద్ డ్రగ్స్ సరఫరాపై పూర్తి నిఘా ఉందని నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ చీఫ్ చక్రవర్తి తెలిపారు. డ్రగ్స్ వినియోగించే స్పాట్స్పై సమాచారం ఉందన్నారు. పబ్బులు, క్లబ్లు, రెస్టారెంట్, రిసార్ట్స్పై పూర్తి నిఘా ఉంచామన్నారు. గోవా నుంచి డ్రగ్స్ రవాణా అవుతున్నట్లు గుర్తించామన్నారు. డార్క్ నెట్ ద్వారా విదేశాల నుంచి డగ్ర్స్ రవాణా అవుతుందన్నారు. డార్క్ నెట్ ఢీకోడ్ చేసే టెక్నాలజీ తమ వద్ద ఉందన్నారు. డక్స్ ఫెడ్లర్స్, కంజూమర్స్పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ కేసు నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరతూ నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రాడిసన్ హోటల్ లైసెన్స్ రద్దు రాడిసన్ హోటల్ లైసెన్స్ను ప్రభుత్వం రద్దు చేసింది. పబ్, లిక్కర్ లైసెన్స్లను రద్దు చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 24 గంటలపాటు లిక్కర్ సప్లైకి రాడిసన్ హోటల్ అనుమతి తీసుకుంది. జనవరి 7న లిక్కర్ లైసెన్స్కి అనుమతి తీసుకోగా, రూ. 56 లక్షల బార్ ట్యాక్స్ చెల్లించి లైసెన్స్ పొందింది. 2బీ బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అనుమతి తీసుకుంది. పబ్లో డ్రగ్స్ బయటపడటంతో లైసెన్స్ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నం.6లో ఉన్న ర్యాడిసన్ బ్లూ ప్లాజా హోటల్కు చెందిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో ఆదివారం తెల్లవారుజామున నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. పెద్ద మొత్తంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని.. పబ్ సిబ్బంది సహా 148 మందిని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఇందులో 90 మంది యువకులు, 38 మంది యువతులు, 18 మంది స్టాఫ్, ఇద్దరు నిర్వాహకులు ఉన్నారు. చదవండి: పబ్లతో తారల బంధం! వీరిలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా సిద్ధార్థ్, సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, బిగ్బాస్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఉన్నారు. పబ్బులో డ్రగ్స్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్రను సస్పెండ్ చేశారు, ఆ ఏరియా ఏసీపీ మంత్రి సుదర్శన్కు చార్జ్మెమో జారీ చేశారు. -
రష్యా అకృత్యాలు.. మాటలు రావడం లేదు
Ukrainian Member of Parliament Lesia Vasylenk: ఉక్రెయిన్ పై నెలరోజులకు పైగా దాడులు కొనసాగిస్తున్న రష్యా ఇప్పుడు మరింత దారుణమైన అకృత్యాలకు పాల్పడుతోంది. రష్యా బలగాలను వెనక్కి మళ్లించి సైనిక దాడిని తగ్గించింది అనుకునేలోపే ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పుడు యుద్ధ నేరాలకు పాల్పడుతోంది రష్యా. ఉక్రెయిన్ రాజధాని కైవ్కి సమీపంలో బుచా నగరంలో రష్యా బలగాలు పౌరులపై అత్యంత దారుణంగా కాల్పులు జరపడమే కాకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెనియన్ ఎంపీ, పార్లమెంటు సభ్యురాలు లెసియా వసిలెంక్ ట్విట్టర్లో రష్యా ఆగడాల పై విరుచుకుపడ్డారు. రష్యా సైనికులు ఉక్రెయిన్లోని ప్రజలను దోచుకోవడమే కాకుండా అత్యాచారాలు చేసి చంపుతున్నారని ఆక్రోశించారు. రష్యాని అనైతిక నేరాల దేశంగా అభివర్ణించారామె. మైనర్లని కూడా చూడకుండా అత్యాచారాలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పార్ట్లను నాశనం చేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైగా రేప్ చేసి శరీరాలపై స్వస్తిక్ ఆకారంలోని ముద్రలు వేస్తున్నారని చెప్పారు. అత్యాచారం చేసి చంపేసిన మహిళ మృతదేహం ఇది. మాటలు రావడం లేదు. నా మనస్సు కోపం, ద్వేషంతో స్తంభించిపోయింది అని ట్వీట్ ఆమె చేశారు. యుద్ధానికి సంబంధించిన ముఖ్యాంశాలు: ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దాడి చేసింది. అప్పటి నుంచి నిరవధిక దాడులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతూనే ఉంది. యుద్ధంలో వేలాది మంది పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోగా, 4 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. రాజధాని కైవ్ చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లి ఉక్రెయిన్ తూర్పు భాగాలపై దృష్టి సారిస్తామని రష్యా గత వారం ప్రకటించింది. రష్యా బలగాల తిరోగమనం నేపథ్యంలో వారు విధ్వంసాన్ని విడిచిపెట్టి నరమేథానికి పాల్పడుతున్నారు. ఈ మేరకు ఉక్రెయిన్లో బుచా నగరం చుట్టూ అనేక మృతదేహాలు పడి ఉన్నాయి. రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిందని ఉక్రెయిన్ ఆరోపించగా, రష్యా ఆరోపణలను ఖండించింది. Russian soldiers loot, rape and kill. 10 y.o. girls with vaginal and rectal tears. Women with swastika shaped burns. Russia. Russian Men did this. And Russian mothers raised them. A nation of immoral criminals — Lesia Vasylenko (@lesiavasylenko) April 3, 2022 (చదవండి: భయానకం: ఉక్రెయిన్ బుచాలో శవాల గుట్టలు.. అత్యాచార బాధితుల శవాలు!) -
భారత్పై విషం చిమ్మే నజీర్.. ఎట్టకేలకు పాపం పండింది
భారత్పై, ప్రభుత్వ విధానాలపై వీలు చేసుకుని మరీ విషం చిమ్ముతూ.. పాక్ అండతో కశ్మీర్ ప్రచారకర్తగా తనను తాను ప్రచారం చేసుకున్నాడు లార్డ్ నజీర్ అహ్మద్(64). అయితే లైంగిక దాడుల పర్వంలో ఎట్టకేలకు ఈ చీడపురుగు పాపం పండింది. మైనర్లపై లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష పడింది. బ్రిటిష్-పాక్ సంతతికి చెందిన రాజకీయ నేత లార్డ్ నజీర్ అహ్మద్కు పిల్లలపై లైంగిక వేధింపుల కేసులో ఐదున్నరేళ్ల శిక్ష ఖరారైంది. ఈ మేరకు శుక్రవారం షెఫీల్డ్ క్రౌన్ కోర్టు నజీర్ను దోషిగా నిర్ధారించి.. శిక్ష ఖరారు చేసింది. 70వ దశకంలో ఇద్దరు మైనర్లపై నజీర్ అహ్మద్ లైంగిక వేధింపులపై పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. 1971 నుంచి 1974 మధ్య ఈ వేధింపుల పర్వం సాగినట్లు సమాచారం. వేధింపులతో పాటు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. ఇదిలా ఉంటే.. నాలుగు దశాబ్దాలుగా బాధిత కుటుంబాల పోరాటం, మీటూ ఉద్యమం ప్రభావంతో 2019 మార్చిలో ఈ ఆరోపణలకు సంబంధించి నజీర్పై నేరారోపణలు నమోదు అయ్యాయి. కశ్మీర్ను ఉద్ధరిస్తానంటూ.. నజీర్ అహ్మద్ పీఓకేలో జన్మించాడు. అయితే రోథర్హమ్(యూకే)కు తండ్రి వలస వెళ్లడంతో.. నజీర్ అక్కడే పెరిగి, వ్యాపారాలతో రాణించాడు. 1998లో టోనీబ్లేయర్ ప్రధాని సారథ్యంలో నజీర్ హౌజ్ ఆఫ్ ది లార్డ్స్గా పని చేశాడు. 2013లో లేబర్ పార్టీకి రాజీనామా చేసి.. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో 2020లో హౌజ్ ఆఫ్ లార్డ్స్కు రాజీనామా చేశాడు. ఇతగాడి వేధింపులు నిజమేనని హౌజ్ కమిటీ ఒకటి నిర్ధారణ కూడా చేసింది. ఖలీస్థానీ గ్రూపుతో మంచి సంబంధాలు కలిగి ఉన్న నజీర్.. వీలుచిక్కినప్పుడల్లా భారత్పై విషం చిమ్ముతుంటాడు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తోనూ అతనికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసినప్పుడల్లా.. నజీర్ భారత్ మీద విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఒకానొక దశలో ప్రధాని మోదీపైనా వివాదాస్పద ప్రకటన ఇచ్చాడు నజీర్. కశ్మీర్ క్రూసేడర్ అంటూ తనకు తాను ప్రగల్భాలు పలికే నజీర్.. పీవోకే ప్రాంతాన్ని ఉద్దరిస్తానంటూ ఫండింగ్ చేయడం ప్రారంభించాడు. సంస్కరణల పేరుతో కశ్మీర్ మహిళలను బలవంతంగా లోబర్చుకున్నట్లు నజీర్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో లండన్లో ఉండే కశ్మీర్ కమ్యూనిటీ మీటూ తరహా ఉద్యమంతో నజీర్ పీఠాన్ని కదిలించారు కూడా. నజీర్పై జైలు శిక్ష పడడంపై కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. చదవండి: అడుగు పెట్టకముందే ఇమ్రాన్ ఖాన్కు షాకిచ్చిన చైనా -
Google: టీనేజర్ల బ్రౌజింగ్.. గూగుల్ కీలక నిర్ణయం
Google Blocks 18 Below Target Ads: ఫ్లస్ విషయంలో బ్రౌజింగ్కు గూగుల్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయదు. కానీ, 13 ఏళ్లలోపు వాళ్లు మాత్రం ఉపయోగించడానికి వీల్లేదని చెబుతోంది. అయినప్పటికీ అండర్ఏజ్ను గుర్తించే ఆల్గారిథమ్ లేకపోవడంతో చాలామంది తమ ఏజ్ను తప్పుగా చూపించి గూగుల్ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న మోసాలను కట్టడి చేసేందుకు గూగుల్ కీలక నిర్ణయం ఒకటి తీసుకుంది. టీనేజర్ల విషయంలో యాడ్ టార్గెటింగ్ స్కామ్ను నిలువరించే ప్రయత్నం చేయనున్నట్లు ప్రకటించింది గూగుల్. ఈ మేరకు పద్దెనిమిది ఏళ్లలోపు యూజర్లపై టెక్ దిగ్గజం నిఘా వేయనుంది. సాధారణంగా వయసు, లింగ నిర్ధారణ, యూజర్ల ఆసక్తుల ఆధారంగా యాడ్ కంపెనీలు యాడ్లను డిస్ప్లే చేస్తుంటాయి. ఈ క్రమంలో మోసాలు జరుగుతుంటాయి కూడా. అయితే 18 బిలో ఏజ్ గ్రూప్ వాళ్ల విషయంలో ఈ స్కామ్లు జరుగుతుండడంపై గూగుల్ ఇప్పుడు ఫోకస్ చేసింది. ఈ తరహా యాడ్లను నిలువరించేందుకు బ్లాక్ యాడ్ ఫీచర్ను తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది గూగుల్. ఈ మేరకు యూజర్ యాడ్ ఎక్స్పీరియెన్స్ను నియంత్రించేందుకు ఈ ఏడాదిలో పలు చర్యలు చేపట్టబోతున్నాం అంటూ గూగుల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే పిల్లలకు, టీనేజర్లకు సురక్షితమైన బ్రౌజింగ్ అనుభూతి కోసం, ఏజ్ సెన్సిటివిటీ యాడ్ కేటగిరీలను నిరోధించేందుకు చర్యలు చేపట్టాం. ఇక మీద 18 ఫ్లస్ లోపు వాళ్ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తాం అని సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎబౌట్ దిస్ యాడ్ లాంటి మెనూలతో పాటు ఆ యాడ్లు ఎందుకు డిస్ప్లే అవుతున్నాయో, ఎవరు దానిని ప్రదర్శిస్తున్నారో తెలియజేస్తూ ఫీచర్స్ను ఇప్పటికే తీసుకొచ్చింది గూగుల్. చదవండి: ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ స్మార్ట్ఫోన్! -
స్కూల్లో అందరు చూస్తుండగా.. విద్యార్థి దారుణ హత్య
రాయ్పూర్: ఇటీవల సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తుంటే వయసుతో సంబంధం లేకుండా దారుణాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ తరహాలో చదువులు, ఆటలు మధ్య గడపాల్సిన ఇద్దరు మైనర్ల బాల్యం తాము చేసిన హత్య కారణంగా కటకటాల్లోకి నెట్టేసింది. ఈ ఘటన ఛతీస్గఢ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రాయ్గఢ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఇంతలో 17 ఏళ్ల వయసు గల ఇద్దరు బాలురు అక్కడికి వచ్చి ఆ విద్యార్థితో వాగ్వాదానికి దిగారు. అది కాస్త ముదిరి వారిద్దరు అతన్ని తీవ్రంగా కొట్టి పొడిచారు. అనంతరం వాళ్లు స్కూలు సిబ్బందిని కత్తితో బెదిరించి ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నారు. బాధితుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం రాయ్గఢ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిషేక్ మీనా నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అదే రోజు రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని, కానీ ప్రేమ వ్యవహారం దీనికి కారణమని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ -
పోకిరీ మైనర్.. అమ్మాయిల్ని వేధిస్తున్న వారిలో 11.11% వీరే
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ ప్లేసుల్లోకి వస్తున్న అతివల్ని వేధిస్తున్న పోకిరీల్లో మైనర్లు పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. ఈ ఏడాది ఆరున్నర నెలల కాలంలో నగర షీ టీమ్స్ బృందాలు పట్టుకున్న వారిలో 11.11 శాతం వీళ్లే ఉండటం ఆందోళనకర అంశం. లాక్డౌన్ పూర్తిగా తొలగిపోయి, సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో అతివలకు వేధింపులు పెరిగే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలోనే నిఘా ముమ్మరం చేయాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆదేశించారు. షీ టీమ్స్ పని తీరుపై ఆయన బుధవారం భరోసా కేంద్రంలో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వివరాలు వెల్లడించారు. ► ఈ ఏడాది జనవరి నుంచి జూలై 15 వరకు షీ టీమ్స్ను మొత్తం 889 మంది బాధితులు ఆశ్రయించారు. తీవ్రత ఆధారంగా వీటిలో 97 ఫిర్యాదులను ఎఫ్ఐఆర్లుగా నమోదు చేయగా మరో 22 పెట్టీ (చిన్న స్థాయి) కేసులుగా మారాయి. ►మొత్తం 288 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 201 మందిని మందలించి విడిచిపెట్టారు. మరో 87 మందిని మాత్రం ఆయా పోలీసుస్టేషన్లకు అప్పగించారు. మిగిలిన ఫిర్యాదులను దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచి్చన అంశాల ఆధారంగా మూసేశారు. ►బహిరంగ ప్రదేశాల్లో రెచి్చపోయే పోకిరీలకు చెక్ చెప్పడానికి షీటీమ్స్కు చెందిన బృందాలు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. వీటిలో పట్టుబడిన 135 మందిలో 15 మంది (11.11 శాతం) మైనర్లే ఉన్నారు. వీరికి అధికారులు భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ►బాధితుల్లో 41 శాతం మంది నేరుగా భరోసా కేంద్రానికి వచ్చి షీటీమ్స్కు ఫిర్యాదు చేస్తున్నారు. మిగిలిన వారిలో 30 శాతం మంది వాట్సాప్ ద్వారా, 14 శాతం మంది మెయిల్ ద్వారా, 12 శాతం మంది క్యూ ఆర్ కోడ్స్ స్కాన్ చేయడం ద్వారా, మిగిలిన వారు హాక్ఐ యాప్, ఫేస్బుక్, 100 ద్వారా ఆశ్రయించారు. ►వీటిలో 21 శాతం కేసులు ఫోన్ ద్వారా వేధింపులకు సంబంధించినవే ఉన్నాయి. 17 శాతం కేసులు నేరుగా వెంటపడి వేధించడం, 9 శాతం కేసులు పెళ్లి పేరుతో మోసాలు, 14 శాతం కేసులు బ్లాక్ మెయిలింగ్, మిగిలినవి ఫొటోల మార్ఫింగ్, ప్రాంక్ కాల్స్ తదితరాలు ఉన్నాయి. ఆధునిక టెక్నాలజీ వాడండి మహిళలపై జరుగుతున్న వేధింపుల తరహా నేరాల్లో నిందితుల్ని పట్టుకోవడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించండి. చిక్కిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోండి. బాధితురాళ్లు సైతం ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేలా అవగాహన పెంచండి. – షీ టీమ్స్తో నగర కొత్వాల్ -
మైనర్లకు ‘ప్రేమ’ పాఠాలు.. ఆపై వీడియోలతో బెదిరింపులు
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్ క్లాసులను ఆసరాగా చేసుకుని... సోషల్మీడియా ద్వారా మైనర్లకు ఎర వేస్తూ.. అందినకాడికి దండుకోవడంతో పాటు బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతూ హయత్నగర్ పోలీసులకు చిక్కిన బచ్చనబోయిన సాయికుమార్ అలి యాస్ సాయి వర్ధన్ యాదవ్ కేసులో మరికొందరూ నిందితులుగా ఉండి ఉంటారని పోలీసులు అను మానిస్తున్నారు. ఇతడి బారినపడిన వారిని గుర్తించడంపై దృష్టి పెట్టారు. బాధితులు అంతా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం సాయిని న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ► సాయి ప్రధానంగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, షేర్చాట్ వంటి యాప్స్ను వినియోగించాడు. ఆకర్షణీయమైన ఫొటోలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. ఇటీవల దాదాపు అన్ని పాఠశాలలు ఆన్లైన్ విధానంలో విద్యను బోధిస్తుండటంతో ఇతడికి కలిసి వచ్చింది. ► ప్రధానంగా మైనర్లను టార్గెట్గా చేసుకున్న సాయి తొలుత వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు, ఆపై హాయ్ అంటూ పలకరింపు సందేశాలు పంపించేవాడు. వీటిని స్పందించిన వారితో పరిచయం పెంచుకుంటూ సెంటిమెంట్తో కూడిన తియ్యటి మాటలు చెప్తూ ముందుకు వెళ్లి ఆపై అసలు కథ మొదలెట్టేవాడు. ► ఆరు, ఏడు, ఎనిమిదో తరగతులు చదవుతున్న వారితోనూ ప్రేమ, పెళ్లి ప్రస్తావనలు తీసుకువచ్చేవాడు. వారిని పూర్తిగా తన ట్రాప్లోకి తెచ్చుకోవడానికి ‘నీవు కాదంటే చచ్చిపోతా’, ‘నీవు లేకపోతే బతకలేను’ అంటూ చాటింగ్స్ చేసేవాడు. కొందరు బాలికలకు సాయి అసభ్యకర సందేశాలు పంపి వేధించినట్లు అనుమానాలున్నాయి. ► ఇతడి చేష్టలకు భయపడకుండా ఎవరైనా ఎదిరు తిరిగితే ఇక వారి జోలికి వెళ్లేవాడు కాదు. అలా కాకుండా తన వల్లోపడిన వారిని ఏకాంతంగా గడిపే వరకు తీసుకువెళ్లి ఆ ఫొటోలు, వీడియోలు, సెక్స్ చాటింగ్స్తో బెదిరింపులకు దిగేవాడు. ఇలా వారి నుంచి అందినకాడికి దండుకునే వాడు. ► ఇతడి వల్లోపడిన వారిలో అనేక మంది బాలికలు తమ ఇళ్లల్లోనే చోరీలు సైతం చేశారని పోలీసులు చెప్తున్నారు. కొందరు నగదు, మరికొందరు బంగారు ఆభరణాలు తీసుకువెళ్లి సాయికి అప్పగించారు. ఇతడి వ్యవహారం గుట్టురట్టయింది కూడా ఓ బాలిక చేసిన ఇలాంటి చోరీ తోనే కావడం గమనార్హం. ► ఈ వ్యవహారంలో సాయితో మరికొందరు జట్టు కట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ► సాయి ఫోన్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపడం ద్వారా బాధితులను, అతడికి సహకరించిన వారికి పట్టుకోవడానికి రాచకొండ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ముఠాలో కనీసం ఐదారుగురు ఉండి ఉంటారని, వారంతా సాయి స్నేహితులు లేదా క్లాస్మేట్స్ అని భావిస్తున్నారు. ► ఆన్లైన్ యాక్టివిటీస్ నేపథ్యంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులూ తమ పిల్లల వ్యవహారశైలిపై కన్నేసి ఉంచాలని పోలీసులు కోరుతున్నారు. -
ప్రేమ మోజులో పడి యువత పెడదోవ పడుతోంది
-
ఈ వయసులో పెళ్లి సరి కాదన్నందుకు..
సాక్షి, మిడ్జిల్(జడ్చర్ల): మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలోని వేములలో ఆదివారం ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యాదయ్య, శారదమ్మల రెండో కుమారుడు శ్రీకాంత్(20) ఇంటర్ వరకు చదివాడు. అదే గ్రామానికి చెందిన శ్రీను, ఈశ్వరమ్మ కూతురు అఖిల (15) మిడ్జిల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసింది. వీరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి విషయం ఇరు కుటుంబసభ్యులకు తెలియడంతో.. ఈ వయస్సులో పెళ్లి సరికాదని మందలించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఇద్దరు కలిసి ఇంటి నుంచి వెళ్లి.. గ్రామానికి దూరంగా ఓ మామిడి తోట దగ్గర వేప చెట్టుకు ఉరి వేసుకున్నారు. రాత్రి తోట దగ్గర కాపలా ఉండే వ్యక్తి చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. తమ పిల్లలు విగత జీవులుగా చూసి వారి తల్లిదండ్రులు విలపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణం: 9 ఏళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు...!
చెన్నై: సమాజంలో ఆడవారికి రక్షణ కరువైంది. ప్రభుత్వాలు ఎన్ని నూతన చట్టాలు తీసుకొస్తున్నా.. కఠిన శిక్షలు విధిస్తున్నా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. పుట్టిన బిడ్డ నుంచి రేపో మాపో చనిపోయే పండు ముసలి వరకు ఎవరినీ వదలకుండా వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. 14 సంవత్సరాల బాలుడు అభం శుభం తెలియని 9 ఏళ్ల బాలికపై అత్యాచారాయత్నానికి ప్రయత్నించి, ప్రతిఘటించడంతో కొట్టి చంపిన ఘటన తమిళనాడులోని మణప్పరై పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆ బాలిక మూడవ తరగతి చదువుతుండగా.. అదే పాఠశాలలో ఆ బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చదవండి: జోతిష్యుడు చెప్పాడని.. భార్య కడుపుపై అభం శుభం తెలియని ఆ చిన్నారిపై కన్నేసిన బాలుడు మాయమాటలు చెప్పి గ్రామ సమీపంలోని మల్లెతోటలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ చిన్నారి తీవ్రంగా ప్రతిఘటించడంతో కోపంతో బాలిక తలపై బండరాయితో మోదాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం తనకేమీ తెలియదన్నట్లు గ్రామంలోకి వచ్చిన బాలుడు తోటలో బాలిక అపస్మారక స్థితిలో ఉన్నట్లు స్థానికులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడకు చేరుకున్న గ్రామస్థులు బాలికను ఎమ్జీఎమ్జీహెచ్ ఆస్సత్రికి తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలుడిపై అనుమానంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. మైనర్ బాలికపై అత్యాచారయత్నం, హత్య చేసిన బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించారు. చదవండి: అత్యాచారయత్నం!.. సోషల్ మీడియాలో పోస్టు -
సౌదీలో మైనర్లకు మరణశిక్ష రద్దు
దుబాయ్: నేరగాళ్లకు బహిరంగంగా కఠిన శిక్షలు అమలు చేస్తూ విమర్శలనెదుర్కొంటున్న సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. నేరాలకు పాల్పడిన మైనర్లకు మరణశిక్షను రద్దు చేసింది. కొరడా దెబ్బలకు బదులుగా జైలు శిక్ష, జరిమానా, సామాజిక సేవను శిక్షలుగా విధించాలని రాజు సల్మాన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే కనీసం పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన వారికి సంబంధించిన కేసులను సమీక్షించాలని, శిక్షలను తగ్గించాలని సల్మాన్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం. దీని ఫలితంగా షియా వర్గానికి చెందిన ఆరుగురు మైనర్లకు మరణ శిక్ష తప్పినట్లయింది. సంప్రదాయాలకు, ఇస్లామిక్ చట్టాలకు పెద్ద పీట వేసే సౌదీ అరేబియాలో రాజు సల్మాన్ తాజా నిర్ణయం వెనుక ఆయన కుమారుడు, మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రమేయం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, మహిళా హక్కుల కార్యకర్తలు, సంస్కరణ వాదులపై అణచివేత చర్యలు ఆయన పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. 2018లో సౌదీ రచయిత జమాల్ ఖషొగ్గీని టర్కీలో హత్య చేయించడంపై సల్మాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. -
అక్కా చెల్లెలిపై ఐదుగురి లైంగికదాడి..
దూద్బౌలి: అభం..శుభం తెలియని మైనర్ విద్యార్థినులకు మాయమాటలు చెప్పి వారిని మోసం చేసి లైంగిక దాడికిపాల్పడ్డారు ఐదుగురు దుర్మార్గులు. నిందితుల్లో ముగ్గురు మైనర్లే.ఈ సంఘటన కామాటిపురా పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రాంబాబు తెలిపిన మేరకు.. హుస్సేనీఆలం పోలీస్స్టేషన్ పరిధిలో నివసించే ఓ కుటుంబం తమ ఇద్దరు కూతుళ్లను బంధువుల వద్ద ఉంచి చదివిస్తున్నారు. కొంతకాలం క్రితం బంధువుల ఇంటికి వచ్చిన అక్కాచెల్లెలు స్థానికంగా ఉంటూ సాయంత్రం సమయంలో ట్యూషన్ కోసం వెళ్లేవారు. ఇంటి నుంచి ట్యూషన్కు వెళుతున్న సమయంలో అదే ట్యూషన్లో చదువుతున్న మరో ముగ్గురు విద్యార్థులు అమ్మాయిలతో మాటలు కలిపేందుకు ప్రయత్నించారు. స్నేహంగా మాట్లాడుతున్నారని భావించిన అక్కాచెల్లెళ్లు వారితో మాటలు కలిపారు. ఇదే అదునుగా భావించిన మరో విద్యార్థి ప్రేమ వల విసిరాడు. ఒకే ట్యూషన్లో తరగతులు కావడంతో ముగ్గురు విద్యార్థులతో కలిసి వచ్చి వెళ్లేవారు. విద్యార్థులు ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఎవరికీ అనుమానం రాకుండా ముగ్గురు మైనర్ విద్యార్థులు బాలికలపై లైంగికదాడికి పాల్పడ్డాఉ. ఈ విషయం ఎక్కడైన చెబితే పరిణామాలు దారుణంగా ఉంటాయని బెదిరించారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ పరిణామాలు అలుసుగా తీసుకున్న నిందితులు తమ స్నేహితులైన తాళం చేతుల రిపేర్ చేసే షఫిక్ (19), ఇంటర్మీడిట్ విద్యభ్యాసం కొనసాగిస్తున్న సైఫ్ అలీ (18)తో కలిసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అక్కాచెల్లెలు ట్యూషన్ నుంచి ఆలస్యంగా వస్తున్న విషయాన్ని గమనించి ఆరా తీయగా వారిపై జరుగుతున్న వేధింపులను వివరించారు. దీంతో బాధితుల బంధువులు కామాటిపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని లైంగిక దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని ఇన్స్పెక్టర్ రాంబాబు తెలిపారు. -
2018లో మైనర్లపై నేరాలు పెరిగాయ్
సాక్షి, అమరావతి: 2018.. రాష్ట్రంలో బాలలకు నరకం చూపించిన సంవత్సరం. చంద్రబాబు సర్కారు హయాంలో మైనర్లపై నేరాలు పెరిగిన ఏడాది ఇది. అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మైనర్లపై అకృత్యాలు పెరిగిపోయాయి. జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ)–2018 నివేదిక వెల్లడించిన వాస్తవమిది. ఆ నివేదిక ప్రకారం... 2016, 2017, 2018 సంవత్సరాల్లో 18 ఏళ్ల లోపు బాల బాలికలపై నేరాలు పెరుగుతూనే వచ్చాయి. 2017తో పోలిస్తే 2018లో నేరాలు ఏకంగా 33.5 శాతం పెరిగాయని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేసింది. మైనర్లపై నేరాలకు సంబంధించి 2016లో 1,847 కేసులు, 2017లో 2,397, 2018లో 2,672 కేసులు నమోదయ్యాయి. 2018లో 2,672 ఘోరాల్లో 2,804 మంది మైనర్లు బాధితులుగా ఉన్నారు. ఎన్సీఆర్బీ–2018 నివేదికలోని ముఖ్యమైన అంశాలు - ఏపీలో 2018లో 40 ఘటనల్లో 52 మంది బాలలు హత్యకు గురికాగా, ఒక బాలిక అత్యాచారం అనంతరం హత్యకు గురైంది. 14 మంది బాలలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బాల కార్మిక నిరోధక చట్టం కింద 143 కేసులు నమోదయ్యాయి. బాలలపై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలో ఒక సైబర్ కేసు నమోదైంది. - వ్యభిచారం రొంపిలో దించేందుకు 22 మంది బాలికలను అక్రమ రవాణా చేస్తున్న వారిపై ప్రాస్టిట్యూషన్ అండర్ ఇమ్మోరల్ ట్రాఫిక్(ప్రివెన్షన్) యాక్ట్–1956 కింద 14 కేసులు నమోదు చేశారు. - 19 మంది బాలికలకు వివాహాలు చేయడంపై బాల్య వివాహాల నిరోధక చట్టం కింద బాధ్యులపై కేసులు నమోదయ్యాయి. - జువైనల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ కింద కేసుల నమోదు పెరిగింది. 49 ఘటనల్లో 50 మంది బాధిత బాలికలున్నారు. - ఏపీలో బాలికలపై లైంగిక వేధింపులు, అత్యాచార నిరోధక చట్టం(పోక్సో యాక్ట్) కింద 261 కేసులు నమోదు కాగా, 366 మంది బాధితులుగాఉన్నారు. - 2018లో బాలలపై జరిగిన నేరాల్లో ఏపీ పోలీసులు 81.06 శాతం కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారు. - చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల్లో నింధితులుగా ఉన్న 2,805 మంది పురుషులు, 136 మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. నేరస్తులపై కఠిన చర్యలు చేపట్టాలి ‘‘బాలలపై నేరాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకరం. ఈ తరహా కేసుల్లో ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. కేసులు నమోదు చేయడంతోనే సరిపెట్టకుండా తగిన సాక్ష్యాధారాలతో నేరాన్ని నిరూపించి, కోర్టులో నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా ప్రభుత్వం, పోలీసులు శ్రద్ధ చూపాలి. నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయనే భయం, నైతిక విలువలను పెంపొందించడం ద్వారా సమాజంలో నేర ప్రవృత్తిని తగ్గించవచ్చు’’ – ఎన్.రామ్మోహన్, ‘హెల్ప్’ స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ -
పెళ్లి చేసుకుంటామన్న మైనర్లు..
సాక్షి, సీతానగరం: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని జాలిమూడికి చెందిన ఇద్దరు మైనర్లు పెళ్లి చేసుకుంటామంటూ పెద్దలను ఎదిరించడంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కు వెళ్లింది. వివరాల్లోకి వెళితే.. జాలిమూడికి చెందిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటామని గురువారం రాత్రి పెద్దలకు చెప్పారు. 100 నంబర్కు కాల్ వెళ్లడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న అమ్మాయి, ఎదురింటిలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న అబ్బాయి ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి తల్లి విదేశాల్లో ఉండడంతో మేనమామ ఇంటి వద్ద ఉంటోంది. పెళ్లి విషయం వ్యతిరేకించిన మేనమామతో గొడవపడి ఎదురింటిలోని అబ్బాయి ఇంటికి వెళ్లింది. దీంతో గొడవ జరుగుతుందని భావించిన అబ్బాయి తరఫు వారు 100 నంబర్కు కాల్ చేయడంతో స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి, సర్టిఫికెట్లు పరిశీలించి నాలుగు నెలలో అబ్బాయికి, ఇరవై రోజుల్లో అమ్మాయికి మైనార్టీ తీరుతుందని చెప్పి, ఇరు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇరు కుటుంబాలవారు వివాహం చేసేందుకు ఒప్పుకొన్నారు. చదవండి: స్ర్కీన్ మీదనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే..! -
యువతి దుస్తులు చింపి..
సాక్షి, బంజారాహిల్స్ : ‘దిశ’ ఘటనను మరిచిపోకముందే ముగ్గురు మైనర్లు ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బంజారాహిల్స్లో చోటుచేసుకుంది. రోడ్ నంబర్ 10లోని గఫార్ఖాన్ కాలనీలో నివసిస్తున్న ఓ యువతి సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తోంది. సోమవారం రాత్రి ఫిలింనగర్లో దర్శక, నిర్మాతలతో మాట్లాడి స్నేహితుడితో కలసి కారులో బసవతారక కేన్సర్ ఆసుపత్రి నుంచి జహీరానగర్ వైపు వస్తుండగా వెనుకాల నుంచి వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఆ కారు డ్రైవర్ అజీజ్కు, వీరికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అజీజ్కు చెందిన ముగ్గురు మైనర్లు అక్కడకు చేరుకుని యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె దుస్తులు చించేశారు. కారులో కూర్చున్నాక చేతులు లోపలికి పెట్టి ఆమె ను తాకుతూ హింసించారు. ఈ ఘటన జరుగుతుండగా ఆమె 100కు డయల్ చేసింది. అనంతరం స్థానిక ఎస్ఐకి సమాచారం ఇచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి కోసం గాలిస్తున్నారు. -
మరో ఘోరం : కిడ్నాప్, గ్యాంగ్రేప్
కోల్కతా: మహిళలపై జరుగుతున్న వరుస ఆఘాయిత్యాలతో దేశం వణికిపోతోంది. హైదరాబాద్ షాద్నగర్లో డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుండగా మరిన్ని ఘోరాలు వెలుగు చూశాయి. కోల్కతాలో ఇద్దరు బాలికల సామూహిక అత్యాచార ఉదంతం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. దక్షిణ కోల్కతాలోని కాలీఘాట్ ఆలయం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో కూడా మైనర్ బాలురు నిందితులు కావడం గమనార్హం. వివరాల్లోకి వెళితే కాలీఘాట్ ఆలయం వద్ద బాధిత బాలికలు భిక్షాటన ద్వారా జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంత్రం ముగ్గురు మైనర్ బాలురు వీరిని అపహరించుకొని తీసుకెళ్లారు. అనంతరం మాచండి ఆశ్రమానికి సమీపంలో (దాదాపు 75 కిలోమీటర్ల దూరం) ఉన్న ఆది గంగా వద్ద సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు. దీంతో బాధిత బాలికల తల్లిదండ్రులు కాలిఘాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం కోసం తరలించామని పోలీసు అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని, మరొకరి కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం నేరం జరిగిన ప్రదేశం నుంచి మరిన్ని ఆధారాలు సేకరించడానికి ప్రయత్నిస్తోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. -
బెజవాడ: అల్లరి మూకల చిల్లర చేష్టలు!
భయం.. భయం...భయం. బెజవాడ శివారుల్లో ఇప్పుడు వినినిపిస్తున్న మాటలు ఇవే. కనిపిస్తున్న దృశ్యాలు కూడా అవే. దొంగలెవరో, దొరలెవరో ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో.. ఎప్పుడు ఏ ఇల్లు దోపిడీకి గురౌతుందో తెలియని పరిస్థితి. ఏ దుకాణం లూటీ అవుతుందోనన్న ఆందోళన నగరవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పోలీసులకు సవాల్గా మారిన అల్లరి మూకల చిల్లర చేష్టలపై ప్రత్యేక కథనం.. సాక్షి, విజయవాడ: బెజవాడ... ఒకప్పుడు ఈ పేరు వింటే రౌడీయిజం ముందుగా గుర్తొచ్చేది.. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ తల్లి కూడా ఆ తర్వాతే గుర్తొచ్చేది. విజయవాడ అధికార కేంద్రంగా మారాక.. పోలీసులు పట్టుపెంచాక రౌడీయిజం చాలా వరకు కంట్రోల్ అయ్యింది. నేరాలకు అడ్డుకట్ట పడింది. ఉపాధి కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తలదాచుకునే వారి సంఖ్యా రోజురోజుకి రెట్టింపవుతోంది. అదే సమయంలో విజయవాడ కల్చర్లో కూడా వేగంగా మార్పులు వచ్చాయి. సిటీ స్టైల్ కొందరి వేషభాషల్లో మార్పు తెస్తే... మరికొందరిని తప్పుడు దారుల్లో నడిపిస్తోంది. పెరిగిన పబ్ కల్చర్ వ్యసనాలకు బానిసల్ని చేస్తోంది. తల్లితండ్రుల పర్యవేక్షణ కొరవడటం, చదువు, సంధ్యలు లేకపోవటంతో చెడుదారి పట్టేవారి సంఖ్య పెరుగుతోంది. జల్సాలు తీర్చుకునే ఈజీ మనీ కోసం తప్పుడు మార్గాలను అన్వేషిస్తున్నారు. మద్యానికి బానిసలై, మత్తుపదార్దాల సేవికులై కిక్కు తలకెక్కడంతో తిక్క చేష్టలు చేస్తూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు. ఇటీవల విజయవాడ శివారుల్లో బ్యాడ్ గ్యాంగులు వణుకుపుట్టిస్తున్నాయి. నిస్సహాయులపై బ్లేడ్లతో దాడి చేసి దోచుకుంటున్నారు. మరికొందరు దుకాణాలను టార్గెట్ చేసి రాత్రిళ్ళు లూటీ చేసేస్తున్నారు. తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చొరబడి చోరీలకు పాల్పడుతున్నారు. గంజాయి, మద్యం, వైటనర్, సిగరెట్లు, గుట్కాలు.. అన్నింటినీ ఏకకాలంలో వాడేస్తూ ఎటు చూసినా మద్యంలో జోగేవాళ్లే కనిపిస్తున్నారని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జల్సాలకు అలవాటుపడ్డ యువత ఈజీ మనీ కోసం దోపిడీలకు దిగుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. ఇటీవల అజిత్ సింగ్ నగర్లోని మూడు షాపుల్లోనూ వరుసగా దోపిడీలకు పాల్పడ్డారు. వరుస కంప్లైంట్లతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు మైనర్లను, మరో ఇద్దరు యువకుల్ని పట్టుకున్నారు. ఈ మధ్య ఉల్లిపాయల ధర పెరగడంతో.. చిల్లర గ్యాంగులు వాటిని కూడా ఎత్తుకుపోయి సొమ్ముచేసుకున్నారు. ఆ దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ రెచ్చిపోతున్న పోకిరీ బ్యాచ్ దెబ్బకు అమ్మాయిల్ని ఒంటరిగా బయటికి పంపాలంటే వణికిపోతున్నారు స్థానికులు. శాంతి భద్రతల పరిరక్షణలో సక్సెసైన ఏపీ పోలీసులు పాత నేరస్థులపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ ని కంట్రోల్ చేయటంలో సఫలీకృతులయ్యారు. ఐతే మత్తులో జోగుతూ.. జల్సాల కోసం చోరీలు చేసేవారే ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారారు. స్థానికుల ఆందోళనతో పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
పగటిపూట దొంగతనాలు.. బుడత బ్యాచ్కు చెక్!
సాక్షి, విజయవాడ: పట్టపగలే దొంగతనాలు చేయటంలో ఆరితేరారు ఆ ఐదుగురు మిత్రులు. మూతిమీద మీసం కూడా సరిగ్గా మొలవకముందే వరుస చోరీలతో జనాన్ని బెంబేలెత్తించారు. పోలీసులకూ సవాలు విసిరారు. పాపం పండటంతో ఎట్టకేలకు పట్టుబడి జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. కొద్దిరోజులుగా పగటిపూట దొంగతనాలకు పాల్పడుతూ విజయవాడ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన బుడత బ్యాచ్ని పోలీసులు పట్టేశారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ పంచ పాండవులని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. చెడువ్యసనాలకి బానిసలమై ఈజీ మనీ ఎర్నింగ్ కోసం దొంగల అవతారం ఎత్తామని సదరు ఐదుగురు మిత్రులు పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇప్పటివరకు విజయవాడ, ఉయ్యురు, పెనమలూరు, తోట్ల వల్లూరు ప్రాంతాల్లో పగటిపూట తొమ్మిది దొంగతనాలకు పాల్పడినట్టు ఒప్పుకొన్నారు. వీధుల్లో రెక్కీ నిర్వహించి నిశితంగా పరిశీలించాక ఎవరూ లేరని నిర్ధారించుకొని గొళ్లాలను విరగకొట్టి ఈ ముఠా దొంగతనాలు చేసేదని డీసీపీ తెలిపారు. ఇక, బ్రహ్మోత్సవాల సందర్భంగా సిటీలోకి ఎంట్రీ ఇచ్చి భక్తులను బెంబేలెత్తిస్తున్న జేబు దొంగల ముఠా గుట్టును కూడా పోలీసులు రట్టు చేశారు. మఫ్టీ పోలీస్ బృందాలను ఏర్పాటుచేసి ఈ ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేశారు. వీరు మొత్తం ఎనిమిది నేరాలకు పాల్పడ్డారు. పట్టుబడ్డ రెండుగ్యాంగుల నుంచి పద్దెనిమిది లక్షల రూపాయల విలువచేసే బంగారం, నగదు స్వాధీనం చేసుకొన్నామని, బాలనేరస్థులని జువైనల్ హోమ్కు, పాత నేరస్తులను జిల్లా జైలుకి తరలించామని క్రైమ్ డీసీపీ కోటేశ్వరరావు తెలిపారు. -
అయినవారే ‘అదృశ్య’శక్తులు!
సాక్షి, హైదరాబాద్: వారం క్రితం సోనీ కిడ్నాప్.. రెండు రోజులకు ముందు గజేందర్ అపహరణ.. నగరంలో ఇలా ఏదో ఓ చోట కిడ్నాప్ కేసులు నమోదవుతున్నాయి. ఏటా వందల సంఖ్యలో కిడ్నాప్ కేసులు నమోదవుతుంటాయి. ఇటీవల డబ్బు కోసం జరుగుతున్న కిడ్నాపుల్లో 95 శాతం పరిచయస్తులే సూత్రధారులు. మంగళవారం కొలిక్కి చేరిన గజేంద్ర–అల్మాస్ వ్యవహారం ఈ కోవకు చెందినదే. ఇలాంటి కేసులు సిటీలో గరిష్టంగా 20 నుంచి 30 వరకు నమోదవుతుంటాయి. మిగిలిన కిడ్నాప్ కేసుల్లో అత్యధికం మైనర్ల మిస్సింగ్కు సంబంధించినవే. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. చిన్నారులు అదృశ్య మైన సందర్భంలో కిడ్నాప్ కేసు నమోదు చేస్తుండటంతోనే ఈసంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. -
మైనర్ల ప్రేమ వ్యవహారం... ఒకరి దారుణ హత్య
భీమ్గల్: మైనర్ల మధ్య కలిగిన ప్రేమ వ్యవహారం పెద్దల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ వ్యవహారంలో జరిగిన ఘర్షణ చిలికి చిలికి గాలివానై చివరికి ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. భీమ్గల్ మండలంలోని సిద్దపల్లి గ్రామానికి చెందిన కూనె రాజేశ్వర్(50) గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి కుమారుడు కూనె రవి భీమ్గల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దళితుడైన మృతుడు కూనె రాజేశ్వర్ సమీప బంధువుకు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలుడు గ్రామానికి చెందిన 15 ఏళ్ల మైనర్ బాలిక ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ మైనర్ బాలిక తన తండ్రి ఇంట్లో దాచిన రూ.18 వేల నగదును ఈనెల 4న బైక్ కొనుక్కొమ్మని ప్రియుడికి ఇచ్చింది. దీంతో ఆ బాలుడు భీమ్గల్లో సెకండ్ హ్యాండ్ బైక్ కొనుకున్నాడు. ఈ క్రమంలో బాలిక తండ్రి తన ఇంట్లో డబ్బు గల్లంతైన విషయం గమనించి సదరు మైనర్ బాలుడిపై అనుమానంతో చోరీ నెపం మోపి గ్రామంలో పంచాయతీ నిర్వహించాడు. పెద్దలు విచారించి అసలు విషయం తెలుసుకుని బైక్ అమ్మి నగుదును లింబాద్రికి వాపసు ఇవ్వాలని తెలుపడంతో బాలుడి తరపువారు ఇచ్చేసారు. ఈ విషయాన్ని మనసులో ఉంచుకున్న లింబాద్రి మృతుడు రాజేశ్వర్ను దూషించగా, మీ డబ్బులు ఇచ్చినం కదా ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించాడు. దీంతో రాజేశ్వర్పై మనసులో కక్ష పెంచుకున్న లింబాద్రి నీ అంతు చూస్తా.. అంటూ వెళ్లిపోయాడు. అయితే గురువారం రాత్రి 12 గంటల సమయంలో రాజేశ్వర్ బహిర్భూమి కోసం గ్రామ పొలిమేరల్లోని చెరువు కట్ట వద్దకు వెళ్లాడు. వెనుక నుంచి లింబాద్రి కర్రతో మోది హత్య చేశాడన్నారు. తన తండ్రి ఎంత సేపటికీ రాకపోయే సరికి అనుమానంతో తాను వెళ్లగా లింబాద్రి సీసీ రోడ్డుపై ఉన్న రక్తం మరకలను కడిగివేస్తున్నాడన్నారు. అనుమానంతో ముందుకు వెళ్లి చూడగా తన తండ్రి రక్తం మడుగులో కొట్టుకుంటున్నాడన్నారు. వెంటనే తాను స్థానికుల సాయంతో ఆర్మూర్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారన్నారు. హత్య విషయం తెలిసి ఉదయమే పోలీస్ కమిషనర్ కా ర్తికేయ, ఏసీపీ రాములు, సీఐ సైదయ్యలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. దళిత వ్యక్తిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కర్నె శ్రీధర్ రెడ్డి తెలిపారు. -
హైదరాబాద్ చిలకలగూడలో మైనర్ల స్ట్రీట్ ఫైట్
-
బాల్యానికి శాపం వివాహం
పశ్చిమగోదావరి, నిడదవోలు : తెలిసీ తెలియని వయసులో లోకం పోకడే తెలియని లేలేత వయసులో మూడు ముళ్ల బంధంలో చిక్కుకుంటున్న అభాగ్యాలు ఎందరో. బాలికా వధువులు, చిన్నారి పెళ్లి కూతుళ్లకు వివాహాలు చేసి బాలికల గొంతు కోస్తున్నారు. 12 ఏళ్లకే పెళ్లిళ్లు చేస్తున్న సంఘటనలు గ్రామాల్లో ఏదో మూలన జరుగుతూనే ఉన్నాయి. కట్టుబాట్లకు, కరెన్సీ నోట్లకు బలిపశువులుగా చిన్నారులు మారుతున్నారు. ఆర్థిక పరిస్థితులు, అవగాహన లోపం, ఇంట్లో ఆడపిల్లలను వదిలించుకోవాలనే పేద వర్గాల దృక్పథం, సమాజంలో ఆమ్మాయిల సంఖ్య మగవారికంటే తక్కువగా ఉండటంతో ఇటీవల బాల్య వివాహాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి వివాహాలు వెలుగులోకి వచ్చేవి కొన్నైయితే.. వెలుగులోకి రాకుండా గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్నవి ఎన్నో ఉన్నాయి. బాల్య వివాహల నిరోధక చట్ట ప్రకారం 18 ఏళ్లు నిండని అమ్మాయికి, 21 సంవత్సరాలు నిండని అబ్బాయికి వివాహం చేస్తే ఇరువురి కుటుంబాల పెద్దలకు కఠిక శిక్షలు అమలు కావడంతో పాటు భారీగా జరిమానాలు విధించవచ్చునని చట్టాలు చెబుతున్నాయి. అనాధి నుంచి వస్తున్న దురాచారం విదేశీయులు ఇండియాను పాలించే కాలంలో కొందరు విదేశీ అధికారులు కన్యలను బలవంతంగా వివాహమాడేవారు. మరి కొందరిని చెరిచేవారు. ఇలాంటి దారుణ సంఘటన నేపధ్యంలో భారతీయులు తమ పిల్లలను బాల్యంలేనే వివాహాలు చేసేవారు. దీంతో అప్పటి నుండి బాల్య వివాహాల పరంపర కొపసాగుతూ వస్తుంది. పూర్వం కుటుంబాల మధ్యపరస్పర సంబంధాలను కొనసాగించుటకు మరింతగా పటిష్ట పరుచుకోవడానికి ఆడపిల్ల పుట్టగానే తమ బంధువర్గంలో పలానా వాడికి భార్య పుట్టిందని ఇరువర్గాలు నిర్ణయించుకుని పిల్లలు కొంచెం పెద్దవ్వగానే వివాహాలు చేసేవారు. అలాగే మరణశయ్యపై ఉన్న వృద్ధుల చివరి కోరిక తీర్చేందుకు కూడా ఇలా ఆడపిల్లలకు బాల్యంలోనే వివాహ బంధీఖానాలోకి నెట్టేసేవారు. చిన్నవయసులోనే వివాహం కారణంగా భర్త చనిపోతే బాల వితంతువులుగా మారేవారు. కందుకూరి వంటి సంఘ సంస్కర్తల కృషితో బాల్యవివాహాలను నిషేధించారు. అయినా ఇప్పటికే అక్కడక్కడా మారుమూల గ్రామాల్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. చట్ట ప్రకారం.. 1922లోనే బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని తీసుకువచ్చారు. అయితే 2006 నుంచి దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. ఈ చట్ట ప్రకారం ఆడ పిల్లలకు 18, మగవారికి 21 సంవత్సరాలు నిండిన తర్వాతే పెళ్లిళ్లు జరిపించాలి. ఈ వయసు నాటికే వారిలో శారీరక, మానసిక పరిపక్వత వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతుంటే కలెక్టర్, మెజిస్ట్రేట్, రెవెన్యూ, పోలీసు, అంగన్వాడీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ కేసుల్లో తల్లిదండ్రులు, సంరక్షకులు, పురోహితులు, స్నేహితులు, బాల్య వివాహానికి అనుమతించిన పెద్దలు, సహకరించినవారందరూ నేరస్తులుగానే పరిగణిస్తారు. బాల్య వివాహం చేసినట్టు రుజువైతే రెండేళ్ల కఠిన కారాగారంతో పాటు రూ.లక్ష జరిమానా విధించవచ్చును. దీని ప్రకారం బాల్య వివాహాలను నిలిపివేస్తూ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేయవచ్చును. ఈ నేరాలకు బెయిల్ కూడా ఇవ్వరు. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చట్ట ప్రకారం జిల్లా స్థాయిలో కలెక్టర్, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామస్థాయిలో ఐసీడీఎస్ సూపర్వైజర్, పంచాయతీ కార్యదర్శులు బాధ్యత వహిస్తారు. బాల్య వివాహాలను రూపుమాపేందుకు వివాహ నమోదు చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని న్యాయస్థానాలు చెబుతున్నాయి. వధూవరుల వయసుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అందిస్తేనే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఏడాదిలో 150వివాహాలు నిలిపివేత ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 150 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. చాలా మందికి అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కౌన్సెలింగ్ ఇచ్చినా లెక్క చేయని వారిపై చర్యలు చేపట్టారు. బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం ఇంత వరకు ఐదుకేసులు నమోదయ్యాయి. నిడదవోలు మండలం సమిశ్రగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో నిడదవోలు, చాగల్లు మండలాల్లో రెండు నెలల వ్యవధిలో 15 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. కందుకూరి కృషితో.. చిన్న వయసులోనే వివాహం వలన చదువుకునే అవకాశం బాలికలు కోల్పోతున్నారు. శారీరక నిర్మాణం బలపడకుండానే గర్భవతులు అయితే తల్లితో పాటు పుట్టిన బిడ్డలు కూడా బలహీనంగా ఉంటారు. పూర్వం బాల్య వివాహాలు అంటే ఆరేడేళ్ల వయసు అమ్మాయిలతో 40, 50 ఏళ్ల వ్యక్తులతో జరిగేవి. దీంతో భర్త ముందుగా చనిపోవడంతో బాల వితంతువుల సంఖ్య ఎక్కువగా ఉండేది. కొన్ని కుటుంబాల్లో తలనీలాలు తీసేసి వీధిలోకి రాకుండా ఇంట్లోనే ఉంచేవారు. అభ్యుదయ వాది కందుకూరి కృషితో పునర్వివాహం చేసేందుకు ఉద్యమించారు. ఎన్నో ఉద్యమాల తర్వాత ప్రభుత్వం బాల్య వివాహాల నిషేద చట్టం చేశారు.– కొండ నిర్మల, సీనియర్ సిటిజన్ రాష్ట్ర మహిళాఅధ్యక్షురాలు, నిడదవోలు -
అమ్మాయికి 16... అబ్బాయికి 17
అమలాపురం టౌన్: ఆ బాలికకు 16 ఏళ్లు... ఆ బాలుడికి 17 ఏళ్లు... ఇద్దరూ మైనర్లే. బాలికది అమలాపురం... బాలుడిది గుంటూరు జిల్లా కారంపూడి మండలం గాదేవారిపల్లి. వారిద్దరినీ కలిపాయి స్మార్ట్ ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్. ఆ ఇద్దరికీ వారి వారి తల్లిదండ్రులు ఆ చిరుప్రాయంలోనే స్మార్ట్ ఫోన్లు ఇచ్చేశారు. దీంతో వారు ఫేస్బుక్, వాట్సాప్ల్లో ఆరితేరారు. బాలుడు ఇటీవల కాకతాళీయంగా చేసిన ఓ ఫోన్ కాల్ అమలాపురంలోని ఆ బాలిక ఫోన్కు వచ్చింది. అలా ఇద్దరి మధ్య ముందు మాటలు కలిశాయి. తర్వాత వాట్సాప్లో మెసేజ్లు... ఆ తర్వాత ఫేస్బుక్లో చాటింగ్లు చకా చకా సాగిపోయాయి. ఇక్కడే ట్విస్ట్ చోటుచేసుకుంది. బాలిక వాస్తవానికి తొమ్మిదో తరగతి చదువుతోంది. అయితే వాట్సాప్, ఫేస్బుక్లో తాను మెడికల్ స్టూడింట్గా చెప్పుకుని పరిచయం పెంచుకుంది. బాలుడు చదివేది ఇంటర్మీడియట్ అయితే తానో ఐఐటీ సూడేంట్గా చెప్పుకున్నాడు. అలా ఇద్దరూ రోజూ వాట్సాప్, ఫేస్బుక్ల అనుసంధానంగా ఊహలు, కమ్మని కబుర్లతో గడిపేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఫోన్ కాల్ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇంకేముంది ఓ రోజు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇద్దరూ అప్పటి దాకా ప్రత్యక్షంగా చూసుకున్న పరిస్థితి లేదు. అబద్ధాల చదువులు గొప్పగా చెప్పుకున్నా.. తర్వాత ఏమి అవుతుందని ఆలోచించలేదు. బాలుడు ఆ బాలికను రాజమహేంద్రవరం రమ్మన్నాడు. బాలిక ఇంట్లో చెప్పకుండా రాజమహేంద్రరం వెళ్లింది. గుంటూరు జిల్లా నుంచి ఆ బాలుడు అక్కడికి వచ్చాడు. ఇద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం అటు బాలుడు... ఇటు బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. మైనార్టీ తీరని ఆ ఇద్దరి వైపు తల్లిదండ్రులు పెళ్లికి ససేమిరా అన్నారు. అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు బాలుడిపై బాలిక కిడ్నాపు కేసు నమోదైంది. ఇందులో భాగంగా సీఐ శ్రీరామకోటేశ్వరరావు గుంటూరు జిల్లా నుంచి ఆ బాలుడిని శుక్రవారం రాత్రి కస్టడీలోకి తీసుకున్నారు. అంతకు ముందు బాలుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిన్న వయస్సులోనే తమ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తే పర్యవసనాలు ఇలానే ఉంటాయని సీఐ అన్నారు. పిల్లలు ఇలాంటి నేరాల వైపు రాకుండా ఉండాలంటే తమ పిల్లలు మేజర్లు అయ్యాక స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని..ఆ లోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు ఇవ్వవద్దని సీఐ శ్రీరామ కోటేశ్వరరావు సూచించారు. -
మనుషులు కాదు..రాక్షసులు
-
మైనర్లకు ‘ఉపాధి’ జాబ్ కార్డులు!
పశ్చిమగోదావరి, దెందులూరు : కండ్రిగ నరసింహపురం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలపై జిల్లా కలెక్టర్ భాస్కర్కు గ్రామస్తులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం కేఎన్.పురం కమ్యూనిటీ హాలులో ఉపాధి హామీ పథకం ఏపీడీ వరప్రసాద్ విచారణ చేశారు. కలెక్టర్ భాస్కర్కు ‘మీ కోసం’ కార్యక్రమంలో గ్రామస్తులు చేసిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. 18 సంవత్సరాలు నిండని మైనర్లకు ఉపాధి కూలీలుగా గుర్తింపు కార్డులు (జాబ్ కార్డులు), ఉద్యోగులకు మస్తర్లు, పనికి వెళ్లని వారికి మస్తర్లు వేసి పేదలకు అందాల్సిన ఉపాధి హామీ నగదు అనర్హులకు, పనిచేయని వారికి ఇస్తున్నారని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఉపాధి హామీ ఏపీడీ వరప్రసాద్ను విచారణ నిర్వహించాలని ఆదేశించారు. శుక్రవారం వరప్రసాద్, ఎంపీడీఓ ఆర్. శ్రీదేవి, ఈసీ శ్రీనివాస్లు విచారణ నిర్వహించారు. అయితే విచారణపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన వారు లేకుండా విచారణ చేశారని, వారు ఉంటే విచారణలో మరిన్ని ఆధారాలు, అక్రమాలు వెలుగులోకి వచ్చేవని తెలిపారు. నోటీసు లేకుండా ఏకపక్షంగా విచారణ జరిగినట్టే భావిస్తున్నామని చెప్పారు. మైనర్లకు జాబ్కార్డులు ఇచ్చి, ఉద్యోగస్తులు మస్తర్లు వేస్తూ పేదలకు అందాల్సిన ప్రభుత్వ సొమ్మును దిగమింగుతున్నారని మండిపడ్డారు. -
ప్రేమ పెళ్లి.. అడ్డంగా బుక్కైన జంట
సాక్షి, కడప : ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరని భయపడ్డారు. ఇందుకోసం స్నేహితుల సహకారంతో గుడిలో వివాహం చేసుకునేలా పథకం రచించారు. అనుకున్న ప్రకారం తమ ప్లాన్ అమలు చేశారు. మరికొద్ది సేపట్లో తంతు ముగిసేదే.. ఇంతలో అనుకోని విధంగా వారి పెళ్లి పెటాకులైంది. వివరాలు.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఓ ప్రేమ జంట రహస్య వివాహం చేసుకోవడానికి ఒంటిమిట్ట కోదండ రామాలయానికి వచ్చారు. అయితే వారు తీరుతో అనుమానం వచ్చిన అధికారులు, వారి గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఇద్దరూ మైనర్లుగా ఆలయ అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు వారిని ఒంటిమిట్ల పోలీసులకు అప్పగించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్లోనే కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారి తల్లిదండ్రలకు విషయాన్ని తెలిపి, ఒంటిమిట్ట రావాలని సూచించారు. -
జువైనల్ హోం విద్యార్థుల పరారీ కేసు దర్యాప్తు వేగవంతం
-
బోనులో మైనర్లు
అత్యాచార కేసుల్లో మైనర్లు నిందితులుగా ఉన్న కేసులు ఏడాది ఏడాదికి పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో నిర్భయ అత్యాచార ఘటనలో ఒక మైనర్ కూడా ఉండడం అప్పట్లో తీవ్ర సంచలనమే కలిగించింది. అప్పట్నుంచి లైంగిక దాడుల కేసుల్లో మైనర్ల ప్రమేయం ఎక్కువైపోయిందని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. దీంతో అత్యాచారం, హత్య వంటి కేసుల్లో 16–18 వయసు ఉన్న వారు కూడా మేజర్ల కిందకి తీసుకువస్తూ ది జువైనల్ జస్టిస్ చట్టానికి సవరణలు చేశారు. చట్టాలు ఏ పని ఎలా చేస్తున్నా పట్టుమని పదమూడేళ్లు కూడా నిండని వారు అత్యంత హేయమైన నేరాలకు ఎందుకు పాల్పడుతున్నారనే ప్రశ్నలు వేధిస్తున్నాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ)ప్రకారం అత్యాచారం కేసుల్లో మైనర్లు నిందితులుగా ఉన్న కేసులు 1991–2016 మ«ధ్య 11 రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. 2016 సంవత్సరంలో మైనర్లు నిందితులుగా ఉన్న రేప్ కేసుల్లో ఎక్కువగా మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. రాష్ట్రం మైనర్లు నిందితులుగా ఉన్న అత్యాచారం కేసులు మధ్యప్రదేశ్ 442 (23.2%) మహారాష్ట్ర 258 (13.6%) రాజస్థాన్ 159 (8.4%) ఢిల్లీ 155 (8.1%) ఛత్తీస్గఢ్ 148 (7.8%) ఉత్తరప్రదేశ్ 126 (6.6%) ఒడిశా 122 (6.4%) పశ్చిమ బెంగాల్ 77 (4.0%) హర్యానా 62 (3.3%) తెలంగాణ 54 (2.8%) మైనర్లు ఎన్ని నేరాలు చేశారు, ఎలా చేశారు అన్నదే కాకుండా ఎందుకు చేశారో కూడా తెలుసుకొని వారిలో మార్పు తీసుకురావడానికి కృషి జరగాల్సిన అవసరం ఉందని బాలల హక్కుల్ని పరిరక్షించే ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ హెచ్ఎక్యూ కో డైరెక్టర్ గంగూలీ అభిప్రాయపడ్డారు. అందులోనూ 16–18 ఏళ్ల మధ్య వయసు అత్యంత ప్రమాదకరమైనది. శారీరకంగా మార్పులు వస్తాయి కానీ మానసిక పరిపక్వత అంతగా ఉండదు. విచక్షణా జ్ఞానం అసలే కనిపించదు. ఆ వయసులో తల్లిదండ్రుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం, చుట్టూ నెలకొని ఉన్న పరిస్థితుల ప్రభావంతో వారు చేస్తున్న నేరాలే అధికంగా ఉంటున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నేరం నేరాల సంఖ్య 12 కంటే తక్కువ 12–16 వయసు 16–18 వయసు (నేరం శాతాల్లో) లైంగిక దాడి 1627 0.6 20.2 79.2 అత్యాచారం 2054 1.4 22.6 76.0 అత్యాచార యత్నం 73 2.7 24.7 72.6 అసహజ నేరాలు 218 3.7 42.2 54.1 మహిళల్ని అవమానపరచడం 94 1.1 29.8 69.1 మొత్తం లైంగిక నేరాలు 4066 1.2 22.9 75.9 -
బాల్యాన్ని చిదిమేస్తున్నారు..
దేశంలో పసికూనలపై అఘాయిత్యాలకు కశ్మీర్లోని కతువా ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. జమ్మూకాశ్మీర్లోని కతువాలో ఎనిమిదేళ్ళ పసికూనపై జరిగిన అత్యాచారం కానీ, గుజరాత్లు తీవ్రమైన గాయాలతో బయటపడ్డ తొమ్మిదేళ్ళ చిన్నారి అత్యాచారం కేసు సహా ఉత్తర ప్రదేశ్, ఒరిస్సాల్లో ఈ మధ్యే వెలుగులోకి వచ్చిన ఇద్దరు చిన్నారుల అత్యాచారం కేసుల నేపథ్యంలో ఇటీవలి కాలంలో మైనర్ బాలికలపై అత్యాచారం కేసులను పరిశీలిస్తే మన దేశంలో మైనర్ బాలికలపై అత్యాచారాలు 500 శాతం పెరిగినట్టు తేలింది. గత పదేళ్ళలో మైనర్ బాలికల మీద అత్యాచారాలు 500 శాతం పెరిగినట్టు చైల్డ్ రైట్స్ అండ్ యు (సిఆర్వై) నిర్వహించిన తాజా పరిశోధన తేల్చింది. సిఆర్వై సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో మన దేశంలో 2006లో 18,967 మంది మైనర్ బాలికలు అత్యాచారాల బారిన పడితే 2016కి వచ్చేసరికి అంటే కేవలం పదేళ్ళలో 106,958 మంది మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగినట్టు తేలింది. ఇందులో 50 శాతానికిపైగా నేరాలు కేవలం ఐదు రాష్ట్రాల్లో నమోదైనవే. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనే చిన్నారులపై 50 శాతం అత్యాచార కేసులు నమోదైనట్టు క్రై(సిఆర్వై) చిల్డ్రన్ రైట్స్ అండ్ యు అనే సంస్థ వెల్లడించింది. చిన్నారులపై అత్యాచారాల్లో ఉత్తర ప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండడం ఆ రాష్ట్రంలో చిన్నారులకున్న రక్షణని ప్రశ్నార్థకంగా మార్చింది. మైనర్ బాలికలపై అత్యాచారాలు జరిగినట్టు నమోదైన కేసుల్లో 15 శాతం ఉత్తరప్రదేశ్లోనూ, మహారాష్ట్రలో 14 శాతం, మధ్యప్రదేశ్లో 13శాతం జరిగినట్టు నేర పరిశోధనా గణాంకాలు వెల్లడించాయి. 2016 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2015తో పోలిస్తే మన దేశంలో చిన్నారులపై నేరాల సంఖ్య 14 శాతం పెరిగింది. అదేవిధంగా దేశంలో 2016 ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్స్(పోక్సో) యాక్ట్ ప్రకారం పరిశీలిస్తే చిన్నారులపై జరుగుతోన్న నేరాల్లో మూడొంతులు లైంగిక పరమైనవే. ఈ గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతి 15 నిముషాలకు ఒక పసికూన లైంగిక నేరాల బారిన పడుతోంది. గత ఐదేళ్లలోనే చిన్నారులపై లైంగిక నేరాలు 300 శాతం పెరగడం ప్రమాదం తీవ్రతని ప్రతిబింబిస్తోంది. -
ప్రేమజంట ఆత్మహత్య
తెలిసీ తెలియని పసిమనసులు వారివి. కళ్లు..కళ్లు..కలిశాయి. మాటామాట కలిపారు. అదే ప్రేమ అనుకున్నారు. పెద్దలను ఏమార్చి ఇళ్లు విడిచి వెళ్లిపోయారు. పెద్దలకు ఆగ్రహం తెప్పించారు. పోలీసుల దర్యాప్తుతో మళ్లీ ఇళ్లకు వచ్చారు. కొద్ది రోజుల దూరాన్నే విరహ వేదన అని భావించారు. చివరికి ఆ ప్రేమజంట ప్రాణాలు తీసుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. జయపురం : నవరంగ్పూర్ జిల్లా ఝోరిగాం పోలీస్ స్టేషన్ పరిధి బుణువగుడ గ్రామ పంచాయతీ దేవులకోట గ్రామం సమీపంలో గల ఒక జీడి మామిడి తోటలో ప్రేమికుల జంట చెట్టుకు ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వీరిద్దరూ దేవులకోట గ్రామానికి చెందినవారు. ఇద్దరూ మైనర్లు కావడం గమనార్హం. వీరిద్దరికీ గత ఏడాది నుంచి పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన బాలిక తండ్రి తన కుమార్తెను మరోసారి కలవవద్దంటూ బాలుని హెచ్చరించాడు. గత ఏడాది బాలిక పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో బాలుడు ఆమెను ఎత్తుకుపోయాడు. ఈ విషయం తెలిసిన బాలిక తండ్రి ఝోరిగాం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ఆ బాలుడు ఆ బాలికను తీసుకువచ్చి ఆమె ఇంటిలో విడిచిపెట్టాడు. ఈ కేసులో పోలీసులు బాలుడిని అదుపులోనికి తీసుకుని జువైనల్ కోర్టుకు పంపారు. రెండు నెలల కిందట నిందిత బాలుడు తిరిగి ఇంటికి వచ్చాడు. మళ్లీ వాళ్లిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం పెరిగింది. తరువాత ఏమైందో గానీ గురువారం ఆ గ్రామ సమీపంలో గల జీడి మామిడి తోటలో ఇద్దరూ గావంచాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనపై ఇద్దరి తల్లిదండ్రులు ఝోరిగాం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరుపక్షాల వారి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వైరల్:మైనర్లను దారుణంగా వేధించారు
-
నగ్నంగా 2 కిమీ నడిపించి..
జైపూర్ : రాజస్ధాన్లో దారుణం చోటుచేసుకుంది. పొలంలో పనిచేసేందుకు నిరాకరించినందుకు మైనర్లను కొందరు దుస్తులు విప్పి నగ్నంగా రెండు కిలోమీటర్లు నడిపించిన ఘటన వెలుగుచూసింది. బికనీర్కు సమీపంలోని మోతావ్తా గ్రామంలో అందరు చూస్తుండగా మైనర్లకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ దారుణానికి పాల్పడిన వారు ఘటనను వీడియో తీసినట్టు పోలీసులు తెలిపారు. పొరుగునే ఉన్న పొద్దుతిరుగుడు పంట సాగుకు సహకరించేందుకు నిరాకరించామని తమను కొందరు దారుణంగా కొట్టారని, బట్టలు లేకుండా రెండు కిలోమీటర్లు పైగా నడిపించారని బాధిత బాలుడు చెప్పాడు. ముగ్గురు బాలురను గణేష్ సింగ్ అనే వ్యక్తి మరో నలుగురితో కలిసి పొలం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గ్రామం వరకూ నగ్నంగా నడిపించాడని పోలీసులు తెలిపారు. బాలురను వేధించిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. కాగా, పొలంలో పనిచేసేందుకు నిరాకరించినందుకు మైనర్లను దారుణంగా వేధించారని పోలీసులు చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. కాగా, ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
మైనర్కు వాహనమిస్తే జైలుకే!
సాక్షి, హైదరాబాద్ : ‘మైనర్లు వాహనం నడుపుతూ బయటకు వచ్చారంటే ఆ తప్పు పూర్తిగా వారిదే కాదు. వారికి వాహనాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు, యజమానిదీ తప్పే..’అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసింది. ఇటీవల బహదూర్పుర, మెహదీపట్నం ప్రాంతాల్లో మైనర్ డ్రైవింగ్ ముగ్గురు బాలల్ని చిదిమేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో నగర ట్రాఫిక్ విభాగం మైనర్ డ్రైవింగ్ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ కేసుల్లో వాహన యజమానిపైనా కోర్టుల్లో అభియోగపత్రాలను ట్రాఫిక్ విభాగం అధికారులు దాఖలు చేస్తున్నారు. గడిచిన వారంలో నలుగురు యజమానులకు న్యాయస్థానాలు ఒక్కో రోజు చొప్పున జైలు శిక్ష విధించినట్లు సిటీ ట్రాఫిక్ డీసీపీ–2 ఏవీ రంగనాథ్ తెలిపారు. మరోవైపు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి వివిధ కేసుల్లో మంగళవారం ఒక్క రోజే 55 మందికి జైలు శిక్షలు పడ్డాయి. 18 మంది డ్రైవింగ్ లైసెన్సుల్ని కోర్టులు సస్పెండ్ చేశాయి. ట్రాఫిక్ ఉల్లంఘనల్లో ఒకే రోజు ఇంత మందికి జైలు శిక్షలు పడటం నగర పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి. ఒకవేళ ఆ వాహనం తల్లిదండ్రులదయితే వారు కూడా జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. మూడో కేటగిరీలో మైనర్ డ్రైవింగ్ ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనల్ని ప్రధానంగా మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనం నడిపే వ్యక్తికి ముప్పు కలిగించేవి, ఎదుటి వారికి ముప్పుగా మారేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పును తెచ్చిపెట్టేవి. మైనర్ డ్రైవింగ్ మూడో కేటగిరీ కిందికి వస్తుందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఏటా నగరంలో నమోదవుతున్న ప్రమాదాలను విశ్లేషిస్తే ద్విచక్ర వాహనాల వల్లే ఎక్కువగా జరుగుతున్నాయని తేలింది. యువత ఎక్కువగా వినియోగించేది ఈ వాహనాలే. ఆ తర్వాత స్థానం తేలికపాటి వాహనాలైన కార్లు వంటి వాటిది. ఈ కారణంగానే ప్రమాదాల బారినపడుతున్న, కారణంగా మారుతున్న వాటిలో ద్విచక్ర వాహనాలే ఎక్కువగా ఉంటు న్నాయి. ద్విచక్ర వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో వాహనచోదకులతో పాటు పాదచారులూ ఎక్కువగా మృత్యువాతపడుతున్నా రు. ముఖ్యంగా అనేక విద్యాసంస్థలు నగర శివార్లలో ఉండటంతో సొంత వాహనాలపై వా టికి వెళ్లి వచ్చే క్రమంలో ఎందరో యువకులు మృత్యువాత పడుతున్నారు. దీనికి తోడు రేసింగ్స్ కూడా అనేక మంది ప్రాణాల్ని హరిస్తున్నాయి. ఇలా మరణిస్తున్న వారిలో వాహనాలు డ్రైవ్ చేస్తున్న మైనర్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. నిబంధనలు ఏం చెప్తున్నాయంటే.. భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం(ఎంవీ యాక్ట్) పదహారేళ్ల లోపు వయసు వారు ఎలాంటి వాహనాలనూ నడపకూడదు. వీరు వాహనాలను నడుపుతూ రోడ్ల పైకి రావడం నిషేధం. 16 ఏళ్లు నిండిన వారు గేర్లు లేని సాధారణ వాహనాలు నడిపే అవకాశం ఉంటుంది. పద్దెనిమిదేళ్లు నిండిన తర్వాత మాత్రమే గేర్స్తో కూడిన వాహనాలు నడపడానికి అర్హులు. ఆర్టీఏ అధికారులు వీరికే లైసెన్స్ మంజూరు చేస్తారు. చట్టప్రకారం మైనర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి వాహనాన్ని ఇచ్చిన యజమాని శిక్షార్హుడే. అంటే ఎవరికైనా మన వాహనాన్ని ఇవ్వాలంటే తొలుత వారు మేజరేనా? డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది. చట్టాలపై తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం, అమలుపై యంత్రాంగాలు దృష్టి పెట్టకపోవడంతో ఎన్నో ‘ఇంటి దీపాలు’చిన్న వయసులోనే ఆరిపోతున్నాయి. ఎంవీ యాక్ట్లోని ఆ సెక్షన్ వాడుతున్నారు.. వారం వ్యవధిలో వరుసగా చోటు చేసుకున్న బహదూర్పుర, మెహదీపట్నం ఉదంతాలతో ట్రాఫిక్ పోలీసులు పంథా మార్చారు. అప్పటి వరకు మైనర్ డ్రైవింగ్ కేసుల్లో అత్యంత అరుదుగా.. అదీ వాహనం నడిపే వ్యక్తిపై చార్జ్షీట్ దాఖలు చేసే వారు. మోటారు వాహనాల చట్టంలోని 180 సెక్షన్ ప్రకారం ఓ మైనర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి కానీ వాహనం నడిపితే.. అతడితో పాటు వారికి వాహనం అందించిన దాని యజమానికీ జరిమానా విధించే అవకాశం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటున్న ట్రాఫిక్ పోలీసులు గత వారం రోజుల్లో అనేక మంది ‘వాహన యజమానుల’పై చార్జ్షీట్స్ దాఖలు చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు నలుగురికి ఒక రోజు చొప్పున జైలు శిక్షలు విధించాయి. ఈ నలుగురిలో ముగ్గురు మైనర్ సంబంధీకులే కాగా.. ఒకరు మాత్రం బయటి వారు. ఆరు ఉల్లంఘనలపై చార్జ్షీట్స్.. ట్రాఫిక్ విభాగం అధికారులు గతంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపైనే అభియోగపత్రాలు దాఖలు చేసే వారు. ఇటీవల దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపటం, మైనర్ డ్రైవింగ్, ఈ–చలాన్లు భారీగా పెండింగ్లో ఉండటం(టాప్ వైలేటర్స్), ప్రమాదకరంగా వాహనం నడపటం, సెల్ఫోన్/ఇయర్ ఫోన్తో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం.. వంటి ఉల్లంఘనలపైనా చార్జ్షీట్లు దాఖలు చేస్తున్నారు. మంగళవారం 25 ట్రాఫిక్ ఠాణాల అధికారులు ఆయా ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 304 అభియోగ పత్రాలను కోర్టులో దాఖలు చేసి, ఉల్లంఘనుల్ని హాజరుపరిచారు. చార్జ్షీట్లు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు వీరిలో 55 మందికి జైలు శిక్షలు విధించాయి. ఒక్కోక్కరికీ ఒక రోజు నుంచి 15 రోజుల వరకు జైలు శిక్ష విధించిన కోర్టులు, 18 మంది డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చాయి. -
ఒక్కరోజు.. మూడు అత్యాచారాలు
సాక్షి, లక్నో : ఉత్తర ప్రదేశ్లో మహిళలకు, బాలికలకు ఏ మాత్రం రక్షణ లేదని మరోసారి రుజువైంది. రాష్ట్రంలోని ముజఫరాబాద్, ప్రతాప్గఢ్, బండా జిల్లాల్లో మంగళవారం నాడు నలుగురు మైనర్ బాలికలపై గ్యాంగ్రేప్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రతాప్ గఢ్ జిల్లాలో కేవలం ఆరేళ్ల బాలికపై మృగాళ్లు అత్యంత కిరాతకంగా అత్యాచారం జరిపారు. తల్లిదండ్రులు పొలం పనులకు బయటకు వెళ్లిన సమయంలో.. ఇద్దరు మృగాళ్లు బాలికపై పడి.. నీచంగా అత్యాచారం జరిపారు. బండా జిల్లాలోని ఐదేళ్ల చిన్నారిపై మామ ఓం ప్రకాశ్ అత్యంత కౄరంగా అత్యాచారం జరిపాడు. నిందితుడిపై బాలిక తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఇదిలా ఉండగా.. ఓం ప్రకాశ్.. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కేసును రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముజఫర్నగర్లోని నాగాల బుజరంగ్ గ్రామంలో.. 15 ఏళ్ల యువతిని తుపాకితో బెదిరించి ఇద్దరు యువకులు అత్యాచారం జరిపారు. పోమవారం నాడు ఇద్దరు యువకులు రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించి ఎవరూ లేని సమయంలో.. యువతిని భయపెట్టి అత్యాచారం చేసినట్లు బాధితురాలి తండ్రి పోలీస్లకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు యువకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బాలలపై లైంగిక వేధింపులు ఆందోళనకరం
సాక్షి, హైదరాబాద్: బాలలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయని, వేధింపులకు గురైన బాలలు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటున్నారని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్లో జిల్లా సంక్షేమాధికారులు, సీడీపీఓ, డీసీపీఓల శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాలల రక్షణ బాధ్యతగా తీసుకోవాలని, లైంగిక దాడులను అరికట్టాలన్నారు. బాలల హక్కులను హరిస్తున్నారని, వారి రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోందని శాఖ సంచాలకులు విజయేందిర ఆవేదన వ్యక్తం చేశారు. బాలల హక్కుల రక్షణపై అవగాహన కల్పించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. -
ఏది ప్రేమో..ఏది వ్యామోహమో..
గౌరిబిదనూరు: తెలిసీ తెలియని తనం రెండు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఏది ప్రేమో..ఏది వ్యామోహమో తెలియక ఇద్దరు పిల్లలు తమ జీవితాలను చాలించుకున్నారు. మైనర్ బాలిక, బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాలూకాలోని పెద్దానహళ్లిలో జరిగింది. గ్రామానికి చెందిన గిరీశ్ (18), గానవి (16) ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఇరుకుటుంబాల వారు వీరి ప్రేమను వ్యతిరేకించడంతో దొంగచాటుగా కలుసుకునేవారు. మైనర్లు కావడంతో వీరి పెళ్లికి అంగీకరించలేదు. జీవితంపై విరక్తి చెందిన ఇద్దరూ మంగళవారం తెల్లవారుజామున ఊరి చివరి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు మైనర్ల దారుణ హత్య !
బెట్టియా: రెండు వర్గాలకు చెందిన ఇద్దరు మైనర్లు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో చోటుచేసుకుంది. వీరి హత్యలతో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. వీటిని పరువు హత్యలుగా పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి మృతురాలి కుటుంబీకులను ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెట్టియా ఎస్పీ వినయ్ కుమార్ తెలిపిన వివరాలివీ.. బన్హోరా గ్రామానికి చెందిన వ్యాపారి రవికాంత్షా కుమారుడు ముకేష్కుమార్ 9వ తరగతి చదువుతున్నాడు. ఇతడు పొరుగునే ఉన్న బలువా గ్రామానికి చెందిన నూర్జహాన్ ఖాతూన్తో ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమికులు ఇద్దరు సోమవారం బలువా గ్రామంలో కలుసుకున్నారు. వారు అక్కడున్న విషయం తెలుసుకున్న నూర్జహాన్ సోదరుడు మరో ఇద్దరితో కలిసి ఇద్దరినీ చంపేశారు. చెల్లెలి మృతదేహాన్ని గ్రామానికి సమీపంలోని చంద్రావత్ నది ఒడ్డున ఉప్పుతో నింపిన గుంతలో పాతిపెట్టారు. ఎవరికీ గుర్తు తెలియకుండా పైన బురదపూశారు. బాలుడి మృతదేహాన్ని మొదట బలువా గ్రామ శివారులో, ఆ తర్వాత అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సారే గ్రామం వద్ద పడేశారు. ముకేశ్కుమార్ అదృశ్యమయ్యాడని కుటుంబసభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు మృతదేహాలు వేర్వేరు చోట్ల కనిపించటంతో పోలీసులు బాలిక అన్న అల్లాఉద్దీన్ అన్సారీని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతడు చేసిన దారుణాన్ని అంగీకరించాడు. తన సోదరి వేరే వర్గం బాలుడితో సన్నిహితంగా ఉండటం ఇష్టం లేక ఈ పనికి పూనుకున్నట్లు తెలిపాడు. తనతో పాటు బంధువులు గుల్సనోవర్, అమిర్ మియాలు ఈ హత్యాకాండలో పాలుపంచుకున్నారని వెల్లడించాడు. -
సెల్ బ్యాలెన్సుల కోసం సమాధుల తవ్వకం!
నిడదవోలు : నిడదవోలు పట్టణంలోని 28 వార్డులో ఉన్న క్రైస్తవ శ్మశాన వాటికలోని సమాధులను ధ్వంసం చేసిన కేసులో 10 మంది మైనర్ పిల్లలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆకతాయి తనంతో చేసినట్టు నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక సీఐ కార్యాలయంలో సీఐ ఎం.బాలకృష్ణ శుక్రవారం విలేకరులకు తెలిపారు. పట్టణంలోని క్రైస్తవ శ్మశాన వాటికలోని సమాధులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కన్వీనర్ పిల్లి డేవిడ్ కుమార్, సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు పట్టణ పోలీస్ స్టేష¯ŒSలో చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ కేసులో చర్చిపేటకు చెందిన 10 మంది మైనర్ పిల్లలు ఆకతాయితనంతో సమాధులను ధ్వంసం చేసినట్టు గుర్తించామన్నారు. సమాధులు, సమాధులపై శిలువలో ఉన్న ఇనుప ఊచలను స్థానిక పాత ఐర¯ŒS షాపుల్లో విక్రయించి వచ్చిన డబ్బులతో సెల్ బ్యాలె¯Œ్స వేసుకుని పిల్లలు తప్పుదోవ పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు కొనసాగుతుందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు సీఐ తెలిపారు. ఆకతాయి చిన్నారుల తల్లిదండ్రులను పోలీస్స్టేష¯ŒSకు పిలిపించి వారికి పిల్లల పెంపకం, తీసుకోవాలి్సన జాగ్రత్తలపై కౌన్సెలింగ్ ఇచ్చారు. పట్టణ ఏస్సై జి.సతీష్, సిబ్బంది పాల్గొన్నారు. -
బాలికపై మైనర్ల సామూహిక అత్యాచారం
బనశంకరి (బెంగుళూరు): పొరుగింటి బాలికపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బెంగళూరు నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పీణ్యాకు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. పొరుగింటికి చెందిన బాలుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో అతను నిత్యం పాఠశాల వద్దకు వెళ్లి బాలికను కలిసేవాడు. పాఠశాల ముగిసిన అనంతరం బాలికను హోటల్కు, ఇతర స్ధలాలకు తీసుకెళ్లి సరదాగా తిప్పేవాడు. పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో ఈ నెల 8న బాలికను నమ్మించి సినిమాకు తీసుకెళ్లాడు. సినిమా చూసిన అనంతరం బాలికను పీణ్యాలో నిర్మాణదశలో ఉన్న ఓ కట్టడం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడికట్టాడు. అనంతరం తన స్నేహితులిద్దరిని పిలిపించుకొని ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాలిక తన స్నేహితురాలికి ఫోన్ చేసి.. ఆమె ఇంటికి వెళ్లింది. తల్లికి విషయం తెలిస్తే మందలిస్తుందనే భయంతో బాలిక స్నేహితురాలి ఇంట్లోనే 5 రోజులు గడిపింది. కూతురు ఇంటికి రాకపోవడంతో భయపడిన తల్లి తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారంటూ పీణ్యా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐదు రోజుల అనంతరం ఇంటికి చేరుకున్న బాధితురాలు తల్లి ముందు జరిగిన అకృత్యాన్ని తెలిపింది. దిగ్భ్రాంతికి గురైన తల్లి మళ్లీ పీణ్యాపోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలు తెలిపిన వివరాల మేరకు ముగ్గురు మైనర్ బాలురును అరెస్ట్ చేసి బాలల పరివర్తనా కేంద్రానికి తరలించారు. -
అరగుండు, చెప్పులదండ, నగ్నంగా..
ముంబై: ఆకలేసి తప్పు చేసిన ఇద్దరు మైనర్ బాలురు పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. ముంబైలోని ఉల్హస్ నగర్లో శనివారం ఉదయం ఈ ఉందంతం చోటు చేసుకుంది. స్థానిక షాపులోంచి తినుబండారాలను దొంగిలించిన ఇద్దరు మైనర్ బాలుళ్ల పట్ల ఆ షాపు షాపు యజమాని అవమానకరంగా, నిర్దయగా ప్రవర్తించారు. బాలుర మెడలో చెప్పుల దండ వేసి, నగ్నంగా ఊరేగించారు. పొలీసులు అందించిన సమాచారం ప్రకారం 8,9 సం.రాల ఇద్దరు అబ్బాయిలు మెహమూద్ పఠాన్ (62) దుకాణంలోని చక్కిలాల ప్యాకెట్ను దొంగిలించారు. ఇది గమనించిన పఠాన్, అతని ఇద్దరుకు కొడుకులు ఇర్ఫాన్ (25), సలీ(20) వీళ్లపై విరుచుకుపడ్డారు. తీవ్రంగా కొట్టారు. అనంతరం అరగుండు కొట్టించి, మెడలో చెప్పుల దండ వేసి, వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఇంత జరుగుతున్నా ఆ పిల్లల్ని కాపాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ దృశ్యాలను స్థానినికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్గా మారింది. బాధితుల తల్లదండ్రుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఉల్హస్ నగర్, హిల్ లైన్ పోలీసు స్టేషన్, సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. నిందితులను కోర్టుముందు హాజరు పర్చి, సోమవారం వరకు రిమాండ్ చేసినట్టు చెప్పారు. -
మైనర్లతో బట్టలిప్పించి.. చెప్పుల దండలేసి..
ఠాణే: స్వీట్ షాపులో దొంగతనానికి పాల్పడినందుకు ఇద్దరు మైనర్ల బట్టలిప్పించి వారి మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించిన దారుణ సంఘటన మహారాష్ట్రలోని ఠాణేలో చోటు చేసుకుంది. స్వీట్ షాపుకు చేరువలో ఉండే ఇద్దరు బాలురు షాపు నుంచి ఫుడ్ను దొంగిలించారు. దీంతో ఆగ్రహించిన షాపు యజమాని అతని కుమారుల సాయంతో వారిని పట్టుకున్నాడు. తొలుత పిల్లల జుట్టును కట్ చేయించాడు. అక్కడితో ఆగకుండా వారి బట్టలను తీసేయించాడు. ఆపై చెప్పుల దండలు వేసి వీధిలో ఊరేగించాడు. పిల్లలపై షాపు యజమాని ఒడిగట్టిన దారుణాన్ని తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు స్వీట్ షాపు యజమాని మెహమూద్ పఠాన్(69)తో సహా అతని తనయులు ఇర్ఫాన్(26), సలీమ్(22)లను అరెస్టు చేశారు. -
మైనర్లకు ఉచిత న్యాయ సహాయం
– లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ కర్నూలు(అర్బన్): మైనర్ చిన్నారులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ తెలిపారు. శుక్రవారం స్థానిక సీ క్యాంప్లోని మున్సిపల్ హైస్కూల్లో డా.జె. యధుభూషణ్రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వైన్ఫ్లూ నివారణకు ఉచిత హోమియా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన సోమశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు, స్కూల్ టీచర్లు హోమియో మందులను తప్పక వాడాలన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. న్యాయ పరంగా ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహనను పెంచుకోవాలన్నారు. పిల్లలతో పాటు మహిళలకు కూడా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు. బాలల హక్కులు, అనాథ పిల్లలకు ఎన్జీఓ ఆర్గనైజేషన్స్ అందిస్తున్న సేవలను వివరించారు. ఈ నేపథ్యంలోనే హాజరైన విద్యార్థులు, టీచర్లకు హోమియో మందులను అందించారు. కార్యక్రమంలో న్యాయవాదులు బి. ఆదినారాయణరెడ్డి, పి. నిర్మల, ఎంఏ తిరుపతయ్య, శివసుదర్శన్, స్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్లో ర్యాష్ డ్రైవింగ్
-
మైనర్లపై అత్యాచారం, ఇద్దరు యువకుల అరెస్టు
చంచల్గూడ: మాయమాటలు చెప్పి అక్కచెల్లెళ్లపై(మైనర్లు) అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకుల పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన సోమవారం మాదన్నపేట పోలసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం కుర్మగూడ డివిజన్ వికాస్నగర్కు చెందిన తన కుమార్తెలపై అదే విధీలో నివసించే హన్నన్(20), అఫ్జల్ (22)లు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితుల తల్లి మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఇరువురు బాలికలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
మైనర్స్ డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులకు జైలు...
గన్ఫౌండ్రీ: మైనర్లు ఇకపై వాహనం నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ హెచ్చరించారు. వాహనం నడుపుతూ చిక్కిన మైనర్లతో పాటు ఓవర్ స్పీడ్, వితౌట్ హెల్మెట్, రాంగ్రూట్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్లు సక్రమంగా లేకపోవడంతో పట్టుబడ్డ సుమారు 300 మందికి గోషామహల్లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్లో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ రంగనాథ్ మాట్లాడుతూ... తల్లిదండ్రులు తమ పిల్లలకు డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్పై అవగాహన వచ్చిన తర్వాతే వాహనాలు ఇవ్వాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపితే తల్లిదండ్రులు చంచల్గూడ జైలుకెళ్లాల్సి వస్తుందన్నారు. మొదటిసారి కోర్టులో జరిమానా కట్టాం అంతే కదా అని పొరబడి.. రెండోసారి పట్టుబడితే మైనర్లను జువైనల్ హోమ్కు, తల్లిదండ్రులను జైలుకు పంపిస్తామన్నారు. నెంబర్ ప్లేట్లపై పోలీస్, ఆర్మీ, డిఫెన్స్, ప్రెస్ పదాలను రాస్తే.. ఆ వాహనాలను పూర్తిగా సీజ్ చేస్తామన్నారు. కార్యక్రమంలో గోషామహల్, చార్మినార్ ట్రాఫిక్ ఏసీపీ జైపాల్, భద్రేశ్వర్, గోషామహాల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఇన్స్పెక్టర్ ఎం.శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు హరీష్, కె. శ్రీనివాస్, నరహరి తదితరులు పాల్గొన్నారు. -
చిన్నపిల్లలకు మద్యం అమ్మితే చర్యలు
కుల్కచర్ల: ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న పిల్లలకు మద్యం అమ్మరాదని ఎక్సైజ్ శాఖ జిల్లా విజిలెన్స అధికారి సాంబయ్య అన్నారు. మండల కేంద్రంలోని రెండు వైన్సలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్తో పాటు రోజువారీ రిజిస్టర్లను పరిశీలించారు. 21 సంవత్సరాలలోపు వారికి మద్యం విక్రయిస్తే లెసైన్స రద్దు చేస్తామని హెచ్చరించారు. మద్యం సీసాపై ఉన్న ధరకంటే ఎక్కువకు విక్రరుుంచినా, నకిలీ లిక్కరు అమ్మినా చర్యలు తప్పవన్నారు. అనంతరం మండల పరిధిలోని కిష్టంపల్లి, మరికల్, కొత్తపల్లి గ్రామాల్లో నాటు సారాపై తనిఖీలు చేశారు. కిష్టంపల్లిలో నల్లబెల్లం ఊటలను ధ్వంసం చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కేసులు నమోదు చేయడంతోపాటు జైలుశిక్ష, జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. -
మైనర్లకు మద్యం విక్రయించిన వైన్స్పై కేసు
చైతన్యపురి: మైనర్లకు మద్యం విక్రయించిన వైన్ షాపుపై సరూర్నగర్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. సీఐ లింగయ్య కథనం ప్రకారం... దిల్సుఖ్నగర్ రాజీవ్ చౌక్లోని శిల్పి వైన్షాపు సిట్టింగ్ రూమ్లో బాలురు మద్యం తాగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సదరు వైన్స్పై దాడి చేశారు. మద్యం తాగుతున్న బాలురకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు. మైనర్లకు మద్యం సరఫరా చేసినందుకు వైన్ షాపుపై కేసు నమోదు చేసి యజమాని భరత్గౌడ్, క్యాషియర్ శ్రీకాంత్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
మైనర్ల డ్రైవింగ్పై స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్: మైనర్ల డ్రైవింగ్ పై వెస్ట్జోన్ ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించారు. బుధవారం సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 101 మంది మైనర్లు డ్రైవ్ చేస్తుండగా పట్టుబడ్డారు. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో 33 మంది, బేగంపేట్ పరిధిలో 40, పంజగుట్టలో 13, బంజారాహిల్స్లో 7, జూబ్లీహిల్స్లో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అమీర్పేట్ మైత్రీవనం, సత్యం థియేటర్, ప్యారడైజ్, అమీర్పేట్, ఎంజే కాలేజ్, కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్-45, బంజారాహిల్స్ రోడ్డునెంబర్-12లోని వీఎల్సీసీ వద్ద ఆయా పోలీస్స్టేషన్ల సిబ్బంది స్పెషల్ డ్రైవ్ జరిపారు. వాహనాలను సీజ్ చేసి చలాన్లను విధించారు. వారి తల్లిదండ్రులతో వారికి మూడు రోజుల పాటు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ మసూం బాషా తెలిపారు. గురువారం నుంచి కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు మైనర్లచే వాహనాలు నడిపించవద్దని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్ముందు ఈ స్పెషల్ డ్రై వ్ కొనసాగుతుందన్నారు. -
బాలికను పెళ్లిచేసుకున్న బాలుడికి రిమాండ్
కాచిగూడ (హైదరాబాద్) : ఓ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని వివాహం చేసుకున్న బాలుడిని సోమవారం కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాచిగూడ ఏసీపీ సీహెచ్.లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... నింబోలిఅడ్డా ప్రాంతానికి చెందిన జక్కుల బాలమల్లు కుమారుడు(17) అదే ప్రాంతానికి చెందిన రాంబాబు కూతురు(17) కొంతకాలంగా ప్రేమించుకున్నారు. గత నెల 22వ తేదీన ఇంటి నుంచి ఇద్దరూ పారిపోయి యాదగిరి గుట్టలో పెళ్లి చేసుకున్నారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు బాలుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ కె.సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మాయిలకు ఫోన్లు బంద్!
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో అమ్మాయిలకు మొబైల్ ఫోన్లు నిషేధించారు. మైనర్ బాలికలు ఫోన్లు ఉపయోగించొద్దని ఈ నిబంధనను అతిక్రమిస్తే అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని మెహన్సా జిల్లాలో గల సూరజ్ అనే గ్రామంలో చదువుకుంటున్న మైనర్ బాలికలు ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించొద్దని వాటిని ఉపయోగించడం మూలంగా వారి ప్రవర్తన దెబ్బతింటుందని, చదువులపై తీరని ప్రభావం పడుతుందని పేర్కొంటూ గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రతిపాదన చేశారు. దీనికి ఆ గ్రామ పంచాయతీ మూకుమ్మడిగా ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ నిబంధనను అతిక్రమిస్తే రూ.2100 ఫైన్ చెల్లించాలంటూ స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్లు అమ్మాయిలకు, వారితల్లిదండ్రులకు సమస్యలుగా పరిణమించాయని, వీటి కారణంగా అమ్మాయిలు తేలిగ్గా ప్రేమ అనే మాయలో పడటమే కాకుండా ఇంట్లో నుంచి తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్లిపోతున్నారని వారు ఆ గ్రామస్తులు అంటున్నారు. అందుకే తాము తెచ్చిన ఈ ప్రతిపానకు దళితులు, పటేళ్లు, ఠాకోర్ లు, రాబారిలు దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని, ఇక నుంచి 18 ఏళ్లలోపు అమ్మాయిల చేతుల్లో కనిపించబోవని చెప్పారు. -
ప్రేమపెళ్లిని అడ్డుకున్న అధికారులు
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మాధవనగర్లోని సాయిబాబా మందిరంలో జరుగుతున్న ఓ ప్రేమ పెళ్లిని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. సిరికొండ మండలం పాళ్లరామడుగు గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ యువతీయువకులు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి కులాలు వేరుకావడం, అందులోనూ మైనర్లు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఇంట్లో చెప్పాపెట్టకుండా ఇద్దరూ పారిపోయి సోమవారం సాయిబాబా మందిరంలో పెళ్లి చేసుకోవడానికి వెళ్లారు. ఈ విషయం తెలిసిన అధికారులు పెళ్లిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. -
ఢిల్లీ రేప్ కేసుల్లో 46 శాతం బాధితులు మైనర్లే
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు కలవరపెడుతున్నాయి. గత మూడేళ్లుగా సగటున ప్రతి రెండు రోజులకు ఐదుగురు చొప్పున బాలికలు అత్యాచారానికి గురౌతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం అత్యాచార ఘటనల్లో బాధితులు 46 శాతం మైనర్లే ఉన్నట్లు బుధవారం రాజ్యసభలో కేంద్ర హోం శాఖ ప్రకటించింది. గత మూడేళ్లుగా అత్యాచార కేసుల్లో బాధితుల వివరాలను కేంద్రం వెల్లడించింది. దీని ప్రకారం 2013లో ఢిల్లీలో మొత్తం 1,636 రేప్ కేసులు నమోదు కాగా ఇందులో 757 కేసుల్లో బాధితులు మైనర్లుగా ఉన్నారు. 2014 లో నమోదైన 2,166 రేప్ కేసులకు గాను 1,004 కేసుల్లో బాధితులు మైనర్లుగా ఉన్నారు. ఇక ఈ సంవత్సరం అక్టోబర్ 31 నాటికే రాజధానిలో 1,856 అత్యాచార కేసులు నమోదు కాగా అందులో 824 కేసుల్లో బాధితులు 18 సంవత్సరాల లోపు వారని తెలిపారు. అయితే ఢిల్లీలో అత్యాచారాల నిర్మూలనకు ఢిల్లీ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. మహిళల స్వీయ రక్షణకు శిక్షణ ఇవ్వడానికి చేపట్టిన కార్యక్రమం ద్వారా 2014 సంవత్సరంలో 17,699 మంది తర్ఫీదు పొందినట్లు తెలిపారు. అలాగే మహిళకు వ్యతిరేకంగా జరిగే నేరాలను విచారించడానికి మహిళా అధికారులనే వినియోగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పరాతిభాయ్ చౌదరి రాజ్యసభలో తెలిపారు. -
రాఖీ కొని వస్తుండగా బాలికపై గ్యాంగ్రేప్
ముజఫర్నగర్: రాఖీ కొనుగోలు చేసి ఇంటికి వస్తున్న ఓ బాలికపై ముగ్గురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు ముగ్గురూ 15, 16 ఏళ్ల మధ్యవారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాధితురాలు ముజఫర్ నగర్లో రాఖీ తీసుకుని స్వగ్రామానికి వస్తుండగా, నిందితులు ఆమెను బలవంతంగా నిర్జన ప్రదేశానికి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడ నుంచి పారిపోయారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు. -
పాస్పోర్టు మంజూరులో మైనర్లకు మినహాయింపులు
మర్రిపాలెం(విశాఖపట్నం) : పాస్పోర్ట్ మంజూరు దరఖాస్తు ప్రక్రియలో 18 ఏళ్ల లోపు మైనర్లకు ఆంక్షల వర్తింపులో కేంద్ర ప్రభుత్వం మినహాయింపులు ప్రకటించినట్టు విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయం పాస్పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి తెలియజేశారు. గతంలో మైనర్ పాస్పోర్ట్ దరఖాస్తు పరిశీలన సమయంలో తల్లిదండ్రుల ఒరిజినల్ పాస్పోర్ట్లు తప్పక చూపించాలని ఆంక్షలు ఉన్నాయన్నారు. ఇకపై తల్లిదండ్రుల పాస్పోర్ట్ జెరాక్స్ కాపీలు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ పాస్పోర్ట్ల కాల పరిమితి ముగిసినచో ఏదైనా చిరునామా ధ్రువపత్రం చూపించాలన్నారు. మైనర్ల పాస్పోర్ట్ దరఖాస్తు పరిశీలనకు తల్లిదండ్రులు పాస్పోర్ట్ సేవా కేంద్రాలలో హాజరు కావాలన్నారు. విదేశాలలో ఉన్నట్టయితే ఇండియన్ మిషన్ ధ్రువీకరించిన ‘అనెక్సార్-హెచ్’ ఫారమ్ కలిగి ఉండాలన్నారు. తల్లిదండ్రులలో ఒక్కరే అందుబాటులో ఉన్నచో ‘అనెక్సార్-జి లేక సి’ ఫారమ్ జత చేయాలన్నారు. వైవాహిక జీవితానికి దూరమైన తల్లి లేక తండ్రి సంరక్షణలో ఉన్న మైనర్ జ్యుడీషియల్ లేదా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కాపీ కలిగి ఉండాలన్నారు. అనెక్సార్ సి,హెచ్,జి ఫారమ్లు త్వరలో పాస్పోర్ట్ వెబ్ పోర్టర్లో కేంద్రం అందుబాటులో ఉంచుతుందని పేర్కొన్నారు. -
మైనర్లు పదిహేను మందే.. !
- 55 మందిని ఇంటికి పంపిన పోలీసులు - ఏజెంట్ల కోసం ఆరా సికింద్రాబాద్ : శనివారం రాత్రి ఐదు గంటలపాటు శ్రమించి నార్త్జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్న 70 మంది కార్మికుల్లో పదిహేను మంది మాత్రమే మైనర్లుగా పోలీసులు గుర్తించారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు వస్తున్న జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలులో 200 మంది బాలకార్మికులు వస్తున్నట్టు బాలల హక్కుల కమిషన్ ప్రతినిధులకు అదే రైలులోని ఓ ప్రయాణికుడు సమాచారం అందించారు. స్పందించిన కమిషన్ ప్రతినిధులు 150 మంది పోలీసుల సహకారంతో జన్మభూమి రైలులో వచ్చిన 70 మందిని అదుపులోకి తీసుకుని గోపాలపురం పోలీస్స్టేషన్కు తరలించారు. చత్తీస్ఘడ్, ఒడిసా, బిహార్కు చెందిన వారంతా నగరంలోని దోమల మందు, ప్లాస్టిక్ వస్తువుల తయారీ కర్మాగారాల్లో పనిచేసేందుకు వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. నార్త్జోన్ డీసీపీ ప్రకాష్రెడ్డి గోపాలపురం పోలీస్స్టేషన్కు చేరుకుని ఒక్కో బాలుడితో విడివిడిగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఐదు నుంచి పదివేల వేతనానికి ఏడాది కాలం పనిచేసేందుకు తమను తమ తల్లిదండ్రులే ఏజెంట్ల ద్వారా ఇక్కడికి పంపినట్టు పలువురు బాలలు తెలిపారు. బాలకార్మికుల వద్ద అందుబాటులో ఉన్న ఆధార్కార్డుల ఆధారంగా పోలీసులకు పట్టుబడిన 55 మందికి 18 సంవత్సరాల వయసు దాటినట్టు గుర్తించారు. వారందరిని తమతమ స్వస్థలాలకు వెళ్లిపోవాల్సిందిగా కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. హోమ్కు 15 మంది.. పది హేను మంది బాలలను దివ్య దిశ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల సహకారంతో కూకట్పల్లిలోని ‘స్వధార్’ సంస్థకు చెందిన బాలల ఆశ్రమానికి తరలించారు. పిల్లల తల్లిదండ్రుల వివరాలు స్వీకరించి వారికి సమాచారం అందించామని, వారిని నగరానికి రప్పించి బాలలను అప్పగిస్తామని డీసీపీ ప్రకాష్రెడ్డి చెప్పారు. -
ఈత సరదాతో ఇద్దరు బాలలు మృతి
మండలంలోని గాంధీనగర్ గ్రామంలో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన దోమలపల్లి వెంకటమ్మ కుమారుడు సాయిక్రిష్ణ (14), దోమలపల్లి లింగమ్మ కుమారుడు సందీప్ (12)లు గ్రామానికి సమీపంలోని లయోలా స్కూల్లో చదువుతున్నారు. సాయిక్రిష్ణ, సందీప్లు మరో ముగ్గురు స్నేహితులతో కలసి గ్రామ సమీపంలోని నీటి ట్యాంక్లో ఈత కొట్టేందుకు వెళ్ళారు. ఎక్కువ సేపు ఈత కొట్టటం వారికి చేతకాకపోవటంతో నీటిలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మైనర్లను వినియోగిస్తే గుర్తింపు రద్దు
ముంబై: రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మైనర్లను (బాల, బాలికలను) వినియోగిస్తే... వాటి గుర్తింపును రద్దు చేస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ను రద్దు చేయలేమని, పార్టీల గుర్తులను స్తంభింప జేయడం ద్వారా వాటికిచ్చిన గుర్తింపును వెనక్కి తీసుకునే అధికారం తమకు ఉన్నట్లు బాంబే హైకోర్టుకు మంగళవారం సమర్పించిన అఫిడవిట్లో ఈసీ పేర్కొంది. ఎన్నికల ప్రచారం లేదా ఎన్నికలకు సంబంధించిన పనుల్లో మైనర్లను వినియోగించడం నిషేధమని, దీన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఈసీ 2013 మే, 2014 సెప్టెంబర్లో రాజకీయ పార్టీలకు లేఖలు రాసినట్లు న్యాయవాది రాజగోపాల్ కోర్టుకు తెలిపారు. అయితే, స్వతంత్ర అభ్యర్థులు మైనర్లను వినియోగిస్తే వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారని ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. దీనిపై తదుపరి విచారణ సమయంలో అఫిడవిట్ దాఖలు చేస్తామని న్యాయవాది చెప్పారు. దీంతో ఎన్నికల సమయంలో మైనర్లను వినియోగించడంపై నిషేధం కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణను కోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. -
యువ నాయికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
చెన్నై : ఈ తరం యువ నాయికలకు మద్రాసు హైకోర్టు తీర్పు ఊరటనిచ్చింది. 18 ఏళ్లు దాటని అమ్మాయిలు నాయికలుగా నటించడాన్ని నిషేధించాలన్న పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. తమిళనాడు మక్కల్ కట్చి రాష్ట్ర కార్యదర్శి ముత్తుసెల్వి హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. చలన చిత్రాల్లో 18 ఏళ్లు నిండని అమ్మాయిలను కథానాయికలుగా నటింపజేస్తున్నారని తెలిపారు. ఈ వయసులో అమ్మాయిలు పరిపక్వత ఉండదని, అలాంటివారు మానసికంగా, శారీరకంగా బాధింపులకు గురి అవుతారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. అలాంటివారు అత్యాచారాలకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో నటి సంధ్య, కార్తిక, లక్ష్మీమీనన్, తులసి వంటి నాయకలు 18 ఏళ్ల వయసు నిండకముందే పాఠశాలలో చదువుకుంటూనే నటిగా రంగప్రవేశం చేశారని తెలిపారు. ఇలాంటి బాలికలు నాయికలుగా నటించడం చిన్నారుల న్యాయ చట్టానికి, భారతీయ పిల్లల సంరక్షణ చట్టానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. కాబట్టి 18 ఏళ్ల వయసులోపు అమ్మాయిల్ని నాయికలుగా నటించడంపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు జీవితంలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో సాధించాలన్న లక్ష్యంతో పయనిస్తారని, ఈ విషయంలో న్యాయస్థానం కల్పించుకోదంటూ పిటిషన్ కొట్టివేసింది. -
పిల్లల కోసం ఎస్బీఐ ప్రత్యేక స్కీము
ముంబై: పదేళ్లకు మించిన మైనర్లు సొంతంగా బ్యాంకు అకౌంట్లు ప్రారంభించడానికి, లావాదేవీలు నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతించిన నేపథ్యంలో బాలల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తామని బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వెల్లడించింది. ‘మైనర్ల అకౌంట్లకు సంబంధించి ఓవర్డ్రాఫ్టులపై ఆంక్షలున్నాయి. ఓవర్డ్రాఫ్టులుంటే వాటిని వసూలు చేయలేం. డిపాజిట్లపై ఆంక్షల్లేవు. బాలల కోసం మూడునెలల్లో ప్రత్యేక పథకాన్ని మేం ప్రారంభిస్తాం’ అని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య గురువారం ముంబైలో మీడియాకు తెలిపారు. బ్యాంకింగ్ సౌకర్యాలను అందరికీ అందుబాటులోకి తేవడమే రిజర్వ్ బ్యాంకు ఉద్దేశమని చెప్పారు. ముందుగా చెల్లించే చర వడ్డీ రుణాలపై ప్రీపేమెంట్ పెనాల్టీ వసూలు చేయవద్దంటూ రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన ఆదేశాలు ఎస్బీఐపై ఎలాంటి ప్రభావం చూపుతాయని ప్రశ్నించగా, తమ బ్యాంకులో అలాంటి చార్జీలేవీ లేవని బదులిచ్చారు