హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆకస్మిక వర్షంతో పాటు పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో కురిసిన వర్షాలకు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వర్షాల కారణంగా మామిడి, వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కాగా వర్షాల కారణంగా కంది పంటను అమ్ముకోవడానికి అదిలాబాద్ మార్కెట్కు వచ్చిన రైతులకు వరుణుడు తీరని నష్టాన్ని మిగిల్చాడు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కందులు తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో అకాల వర్షాలు...
Published Thu, Mar 16 2017 9:45 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement