మంచంపై కలెక్టరేట్‌కు.. | woman coming to collectorate with handicapped husband | Sakshi
Sakshi News home page

మంచంపై కలెక్టరేట్‌కు..

Published Tue, Feb 27 2018 12:06 PM | Last Updated on Tue, Feb 27 2018 12:06 PM

woman coming to collectorate with handicapped husband - Sakshi

నల్లగొండ: తిప్పర్తి మండలం జంగారెడ్డిగూడానికి చెందిన కొత్త రమేష్‌గౌడ్‌ తాటిచెట్టుపై నుంచి కింద పడడంతో రెండు కాళ్లు విరిగాయి. దీంతో భార్యే కుటుంబానికి పెద్ద దిక్కు అయ్యింది. తనకున్న మూడెకరాల భూమి పక్కన ఉన్న పొలం రైతు మరో బోరు వేశాడు. దీంతో తన బోరు వట్టిపోయి పొలం ఎండిపోయింది. దీనికి ఆర్థికభారం తోడుకావడంతో తిప్పర్తి అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని రమేష్‌ తెలిపాడు. దీంతో లక్ష్మి తన భర్తను మంచంపై పడుకోబెట్టి ముగ్గురు కూతుళ్లతో కలిసి సోమవారం కలెక్టరేట్‌కు తీసుకువచ్చింది. న్యాయం చేయాలని డీఆర్‌ఓ కీమ్యానాయక్‌కు వినతిపత్రం అందజేసింది.    – కంది భజరంగ్‌ప్రసాద్, సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, నల్లగొండ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement