జమ్ముకశ్మీర్లో భద్రత బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో భద్రత బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శనివారం సాయంత్రం బుద్గాం జిల్లా హయత్పురా ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.