నాతవరం: విశాఖ జిల్లాలో 60 కిలోల గంజాయిని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. నర్సీపట్నం నుంచి కారులో గంజాయిని తరలిస్తుండగా నాతవరం మండలం గాంధీనగర్ సమీపంలో పోలీసులు పక్కా సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిన వారిలో శక్తిస్వామి వరప్రసాద్, బంజర ప్రసాద్, జి.రాజశేషు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని అంచనా.
60 కిలోల గంజాయి పట్టివేత
Published Tue, Aug 11 2015 3:56 PM | Last Updated on Tue, Aug 21 2018 6:22 PM
Advertisement
Advertisement