ప్రపంచ పెట్టుబడి దారుల సమ్మేళనం చెన్నైలో ప్రారంభమైంది. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి జయలలిత, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమ్మేళనాన్ని ప్రారంభించారు.
చెన్నై: ప్రపంచ పెట్టుబడి దారుల సమ్మేళనం చెన్నైలో ప్రారంభమైంది. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి జయలలిత, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమ్మేళనాన్ని ప్రారంభించారు. రెండు రోజులపాటు ఈ సమ్మేళనం కొనసాగనుంది. ఈ సందర్భంగా రూ.లక్ష కోట్ల పెట్టుపడిని తమిళనాడు సర్కార్ ఆహ్వానించింది.
ఈ సమ్మేళనంలో కెనడా, రష్యా, బ్రిటన్, కొరియా, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, సింగపూర్ వాణిజ్యవేత్తలు పాల్గొన్నారు. రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో లక్షన్నర ఉద్యోగాలను కల్పించాలనే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం ఈ సమ్మేళనం నిర్వహిస్తోంది.