Investment
-
వెండి @ 1,00,000.. ఇలా పెట్టుబడులు పెట్టండి!
-
అన్ని వివరాలూ ఇవ్వాల్సిందే: సెబీ
పెట్టుబడి సలహాదారులు (ఐఏలు), పరిశోధన విశ్లేషకులు (ఆర్ఏలు) తమ సేవలకు సంబంధించి అన్ని నియమాలు, షరతులను ముందుగానే క్లయింట్లకు వెల్లడించాలని సెబీ ఆదేశించింది. సెబీతో సంప్రదింపుల అనంతరం పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అనలిస్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఆర్ఏఏఎస్బీ) లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్వైజరీ బాడీ (ఐఏఏఎస్బీ) ‘అత్యంత ముఖ్యమైన నిబంధనలు, షరతులను (ఎంఐటీసీ) ఖరారు చేయాల్సి ఉంటుందని సెబీ తన సర్క్యులర్లో పేర్కొంది.ఆర్ఏలు జూన్ 30 నాటికి ఎంఐటీసీని ప్రస్తుత క్లయింట్లకు ఈ మెయిల్ లేదా మరో విధానంలో వెల్లడించాలని ఆదేశించింది. కొత్త క్లయింట్లతో ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. బ్యాంక్ బదిలీ లేదా యూపీఐ ద్వారా స్వీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘‘స్థిర విధానంలో ప్రస్తుతం ఒక క్లయింట్ కుటుంబానికి వార్షిక ఫీజు పరిమితి రూ.1,51,000. ఆస్తుల విలువలో అయితే ఏటా 2.5 శాతం మించకూడదు’’అని సెబీ పేర్కొంది. పెట్టుబడి సలహాదారులు సలహా సేవలకు మాత్రమే చెల్లింపులను అంగీకరించగలరని, క్లయింట్ల తరపున వారి ఖాతాల్లోకి నిధులు లేదా సెక్యూరిటీలను స్వీకరించడం నిషేధించినట్లు కూడా మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. "రీసెర్చ్ అనలిస్టులు వారి ట్రేడింగ్, డీమ్యాట్ లేదా బ్యాంక్ ఖాతాల కోసం క్లయింట్కు సంబంధించిన లాగిన్ వివరాలు లేదా ఓటీపీలను అడగకూడదు. అటువంటి సమాచారాన్ని ఆర్ఏలతో సహా ఎవరితోనూ పంచుకోవద్దని క్లయింట్లకు సూచిస్తున్నాం" అని సర్క్యులర్ స్పష్టంగా పేర్కొంది. -
బంగారం లాభాలపై పన్ను ఎంత?
గోల్డ్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్లలో పెట్టుబడులపై ఏ మేరకు పన్ను ఎలా విధిస్తారు? – గిరిరాజ్మీరు ఏ తరహా బంగారం సాధనంలో ఇన్వెస్ట్ చేశారన్న అంశంపైనే పన్ను ఆధారపడి ఉంటుంది. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్)లో పెట్టుబడులు పెట్టినట్టయితే.. వాటిని రెండేళ్ల పాటు కొనసాగించిన తర్వాత విక్రయిస్తే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. రెండేళ్లలోపు విక్రయిస్తే వాటిని స్వల్పకాల మూలధన లాభాల పన్ను కింద పరిగణిస్తారు. ఈ మొత్తం వార్షిక ఆదాయానికి కలిపి, నిబంధనల మేరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అన్నవి గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెడుతుంటాయి. ఇవి మ్యూచువల్ ఫండ్స్ కనుక స్వల్ప మొత్తం నుంచి సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అదే గోల్డ్ ఈటీఎఫ్లు అయితే ఇవి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ అవుతుంటాయి. ఏడాది తర్వాత పెట్టుబడులు విక్రయిస్తే వచ్చే లాభంపై 12.5 శాతం పన్ను పడుతుంది. ఏడాదిలోపు విక్రయించగా వచ్చిన లాభం ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్లలో ఎక్స్పెన్స్ రేషియో (ఫండ్స్ సంస్థ వసూలు చేసే చార్జీ) తక్కువగా ఉంటుంది. వ్యయాల పరంగా చౌక. కాకపోతే వీటిల్లో ఇన్వెస్ట్ చేసేందుకు డీమ్యాట్, డ్రేడింగ్ అకౌంట్ అవసరం అవుతాయి. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్లో అయితే డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు అవసరం లేకుండానే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో రాబడులపై ఆర్బీఐ వడ్డీ రేట్ల ప్రభావం ఉంటుందా? – ఇస్మాయిల్ ఆర్బీఐ రెపో రేటును 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గించడంతో 6.25 శాతానికి దిగొచ్చింది. దీనికి డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా స్పందిస్తాయో అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని బాండ్లు (అధిక కూపన్ రేటుతో ఉన్నవి) మరింత విలువను సంతరించుకుంటాయి. ఎందుకంటే కొత్తగా జారీ చేసే బాండ్లతో పోల్చినప్పుడు అంతకుముందు కొనుగోలు చేసినవి ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తాయి. ఫలితంగా ఆయా బాండ్ల ధరలు పెరుగుతాయి. దీంతో సంబంధిత డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీ కూడా ఆ మేరకు లాభపడుతుంది. వడ్డీ రేట్ల క్షీణత ప్రభావం లాంగ్ డ్యురేషన్ ఫండ్స్పై ఎక్కువగా ఉంటుంది. ఇదీ చదవండి: ఇవి రీచార్జ్ చేసుకుంటే ఫ్రీగా జియో హాట్స్టార్అధిక రేటు బాండ్లలో చేసిన పెట్టుబడులతో లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్ ఎక్కువ లాభపడతాయి. దీనికి వ్యతిరేకంగా వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో లాంగ్ డ్యురేషన్ ఫండ్స్పై ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా జారీ చేసే బాండ్లు అధిక రేటును ఆఫర్ చేస్తుంటాయి. దీంతో అప్పటికే ఫండ్స్ పోర్ట్ఫోలియోలో ఉన్న బాండ్లపై రేటు తక్కువగా ఉండడంతో అవి ఆకర్షణీయత కోల్పోతాయి. దీంతో ఆయా బాండ్ల ధరలు పడిపోతాయి. దీని ఫలితంగా వాటి ఎన్ఏవీ కూడా క్షీణిస్తుంది. ఈ ధరల ఆధారిత ప్రయోజనానికి అదనంగా.. డెట్ ఫండ్స్కు వాటి నిర్వహణలోని బాండ్ల రూపంలో వడ్డీ ఆదాయం కూడా వస్తుంటుంది. వడ్డీ రేట్లలో మార్పులు చోటుచేసుకున్నప్పుడు డెట్ ఫండ్స్ తిరిగి చేసే పెట్టుబడులపై ఆ మేరకు ప్రభావం ఉంటుంది. ఇవన్నీ ఆయా ఫండ్స్లో పెట్టుబడులపై రాబడులను ప్రభావితం చేస్తుంటాయి. డెట్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఈ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి.- ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
డిజిటల్ ఇన్ఫ్రాపై పెట్టుబడులు పెట్టాలి
న్యూఢిల్లీ: ఐటీ రంగంలో రిమోట్ పని విధానంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ప్రొఫెషనల్స్కు అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ మౌలిక సదుపాయాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అలాగే, అంతర్జాతీయ ప్రాజెక్టులను కూడా అందిపుచ్చుకునేలా ప్రొఫెషనల్స్ నైపుణ్యాలను మెరుగుపర్చడంపైనా, తగిన వేదికలను ఏర్పాటు చేయడంపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దేశ, విదేశ మార్కెట్ల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు జాతీయ స్థాయిలో అయిదు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. రిమోట్ ఐటీ వర్క్తో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని నిపుణులకు అవకాశాలు లభించడంతో ఆదాయ ఆర్జన సామర్థ్యాలు మెరుగుపడి, సమ్మిళిత వృద్ధికి దోహదపడుతుందని టెక్ మహీంద్రా సీవోవో అతుల్ సొనేజా తెలిపారు. సామర్థ్యాల వెలికితీతకు అవకాశం.. చిన్న పట్టణాల్లోని ప్రతిభావంతుల సామర్థ్యాలను వెలికి తీసేందుకు డిజిటల్ ఇన్ఫ్రా, విశ్వసించతగిన ఇంటర్నెట్ కనెక్టివిటీ, కొత్త నైపుణ్యాల్లో శిక్షణా కార్యక్రమాలు అవసరమని జ్ఞానిడాట్ఏఐ సీఈవో గణేష్ గోపాలన్ చెప్పారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను పటిష్టం చేయడం, పరిశ్రమలో భాగస్వామ్యాలను పెంపొందించడం మొదలైనవి చిన్న పట్టణాల్లోని ప్రొఫెషనల్స్ అంతర్జాతీయంగా పోటీపడేందుకు ఉపయోగపడగలవని వివరించారు. -
డిజిటైజేషన్ అంటే నియంత్రణల ఎత్తివేత కాదు
ముంబై: డిజిటైజేషన్ అంటే నియంత్రణల తొలగింపు అన్న తప్పుడు అభిప్రాయం అధికార యంత్రాంగంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్(Ananth Nageswaran) అన్నారు. ప్రత్యామ్నాయ పెట్టుబడుల (ఏఐ) పరిశ్రమ లాబీ గ్రూప్ ఐవీసీఏ ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నాగేశ్వరన్ మాట్లాడారు. ‘‘దేశవ్యాప్తంగా ప్రభుత్వ విభాగాల్లో ఒక తప్పుడు అభిప్రాయం నెలకొంది. వారు ఏదైనా డిజిటల్ ప్లాట్ఫామ్పై ఉంచారంటే, దాన్ని నియంత్రణ తొలగింపుగా భావిస్తున్నారు. కానీ అది నియంత్రణల తొలగింపు కాదు. ఆఫ్లైన్ బదులు ఆన్లైన్లో ఉంచారంతే. అభివృద్ధి చెందాలనుకునే ఏ దేశమైనా చిన్న వ్యాపారాలపై దృష్టి సారించాలి. నియంత్రణల వంటి సవాళ్లను తొలగించాలి. దాంతో నిబంధనల అమలుపై వనరులు వృధా కాబోవు’’అని స్పష్టం చేశారు. ప్రపంచీకరణ స్థానంలో కొత్త నమూనా రానున్న రోజుల్లో భారత్ దేశీ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడడం ద్వారానే మరింత వృద్ధి సాధించగలదన్నారు నాగేశ్వరన్. గ్లోబలైజేషన్ (ప్రపంచీకరణ) గతంలో మాదిరిగా ప్రయోజనాలను అందించలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డీ గ్లోబలైజేషన్ (దేశాల మధ్య అనుసంధానం తగ్గిపోవడం) ధోరణి వంద సంవత్సరాలకు పైగా చూస్తున్నదేనంటూ.. ప్రస్తుత నమూనాలో పరిమితుల దృష్ట్యా కొత్త ధోరణి అవతరించొచ్చన్నారు. రూపాయి ఏటా 3 శాతం క్షీణత ద్రవ్యోల్బణాన్ని గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న 4–5 శాతం శ్రేణి నుంచి 3–4 శాతం శ్రేణికి పరిమితం చేస్తే రూపాయి విలువ క్షీణతను అడ్డుకోవచ్చన్న అభిప్రాయాన్ని అనంత నాగేశ్వరన్ వ్యక్తం చేశారు. దీర్ఘకాలంలో రూపాయి విలువ ఏటా 3 శాతం క్షీణించొచ్చని (డాలర్తో పోల్చితే) చెప్పారు. ఇంధన భద్రత విషయంలో భారత్ రాజీపడకూడదన్నారు. చైనా పాలసీపై సమీక్ష లేదు.. చైనా పెట్టుబడులపై ప్రస్తుతం అమల్లో ఉన్న నిషేధాన్ని సమీప కాలంలో భారత్ సమీక్షించకపోవచ్చని నాగేశ్వరన్ అన్నారు. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాల ప్రాముఖ్యతను గుర్తించినట్టు చెప్పారు. వాణిజ్య అసమానతలపై రెండు దేశాలు సంప్రదింపులు నిర్వహిస్తున్నాయని, పలు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందన్నారు. -
ఇప్పుడు బంగారంపై పెట్టుబడి సురక్షితమేనా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 87,000 దాటేసింది. డొనాల్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా.. స్టాక్ మార్కెట్లో గందరగోళం నెలకొంది. ఓవైపు పసిడి ధరలు పెరుగుతుంటే.. మరోవైపు రూపాయి (డాలర్తో పోలిస్తే) బలహీనపడుతోంది. ఈ సమయంలో చాలామంది పెట్టుబడిదారుల చూపు బంగారంపై పడింది.స్టాక్ మార్కెట్లో వచ్చే నష్టాల నుంచి తప్పించుకోవడానికి లేదా భర్తీ చేసుకోవడానికి బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బంగారం మీద పెట్టుబడి సురక్షితమని నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రజలు తమ పెట్టుబడి సురక్షితంగా ఉండాలని గోల్డ్ మీద పెట్టుబడి పెట్టడం వల్ల.. బంగారానికి డిమాండ్ పెరిగిపోతోంది. డిమాండ్ పెరగడం వల్ల పసిడి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అంతే కాకుండా రష్యా - ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా కూడా చాలామంది బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇవన్నీ బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. రూపాయి పతనం అయినప్పుడు.. ప్రజల చూపు డాలర్ మీద లేక.. బంగారం మీద పడుతుంది.ఇప్పుడు బంగారంపై ఇన్వెస్ట్ చేయొచ్చా?స్టాక్ మార్కెట్ల మాదిరిగానే.. బంగారం భవిష్యత్తు మీద కూడా ఖచ్చితమైన అభిప్రాయాలు లేదు. ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ధరలు ఇలాగే పెరుగుతాయని కూడా ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి బంగారంపై ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి బదులుగా.. రేటు తగ్గిన ప్రతిసారీ తక్కువ మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం ఉత్తమమని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.దీర్ఘకాలికంగా బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. గోల్డ్ ఈటీఎఫ్, సావరిన్ గోల్డ్ ఫండ్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టవచ్చని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా బంగారం కొనేవారు.. ఆభరణాలు లేదా బిస్కెట్స్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. కానీ తయారీ చార్జీలు వంటి వాటిని బేరీజు వేసుకోవాలి.ఇదీ చదవండి: చాట్జీపీటీతో లవ్.. హృదయాన్ని కదిలించిన సమాధానం!ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల పరిస్థితులు ఆశాజనకంగా లేవు, ద్రవ్యోల్బణం కూడా ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి ఇప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇదో మంచి అవకాశం . అయితే ఈ ట్రెండ్ ఇలాగే ఎన్ని రోజులు కొనసాగుతుందో ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. -
యూట్యూబర్పై సెబీ కన్నెర్ర: ఎవరీ అస్మితా పటేల్?
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఆరు సంస్థలను నిషేధించింది. రిజిస్ట్రేషన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇచ్చి, కోర్సులు నిర్వహించి పెట్టుబడిదారుల నుంచి డబ్బులు సేకరించిన కారణంగానే సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (APGSOT) డైరెక్టర్ 'అస్మితా పటేల్' కూడా ఉన్నారు.అస్మితా పటేల్ పెట్టుబడికి సంబంధించిన టిప్స్ చెబుతూ.. కోర్సులు నేర్చుకునే వారి దగ్గర నుంచి భారీగానే వసూలు చేసింది. ఈమె టిప్స్ విన్న పెట్టుబడిదారులు నష్టాలను చవిచూశారు. దీంతో చాలామంది ఇన్వెస్టర్లు వరుసగా ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. దీంతో సెబీ రంగంలోకి దిగింది.టిప్స్ పేరుతో అస్మితా పటేల్ సుమారు రూ. 104 కోట్ల కంటే ఎక్కువ సంపాదించినట్లు సమాచారం. ఈ విషయాలు సెబీ విచారణలో తేలాయి. కోర్సు ఫీజుల కింద ఇన్వెస్టర్లు, స్టూడెంట్స్ నుంచి సేకరించిన రూ.53 కోట్లు.. సంబంధిత ఇన్వెస్టర్లకు తిరిగి ఇచ్చేయాలని సెబీ ఆదేశించింది.అస్మితా పటేల్ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్కు 5.26 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈమెకు ఇన్స్టాగ్రామ్లో 2.9 లక్షల మంది ఫాలోవర్లు, ఫేస్బుక్లో 73,000 మంది, లింక్డ్ఇన్లో 1,900 మంది ఫాలోవర్లు, ఎక్స్ (ట్విటర్)లో 4,200 మంది ఫాలోవర్లు ఉన్నారు.ఇదీ చదవండి: తండ్రికి తగ్గ తనయ.. వేలకోట్ల కంపెనీలో కీలక వ్యక్తి: ఎవరీ నీలిమా?ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఎక్స్ (ట్విటర్)లలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్.. అస్మితా పటేల్ తనను తాను షీవోల్ఫ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్.. 'ఆప్షన్స్ క్వీన్'గా ప్రచారం చేసుకుంటోంది. ఈమె దాదాపు ఒక లక్షమంది స్టూడెంట్లకు, పెట్టుబడిదారులకు ట్రేడింగ్ సలహాలు ఇచ్చినట్లు సమాచారం.ఎవరీ అస్మితా పటేల్?అస్మితా పటేల్.. మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఉన్న అస్మితా పటేల్ గ్లోబల్ స్కూల్ ఆఫ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (AGSTPL)కి డైరెక్టర్. కంపెనీ వెబ్సైట్ ప్రకారం.. ఆమె సాంప్రదాయ గుజరాతీ కుటుంబంలో జన్మించింది. ఈమెకు 17 సంవత్సరాల ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్, పదేళ్లకు పైగా బోధనా నైపుణ్యం ఉందని తెలుస్తోంది. అంతే కాకుండా అనేక అవార్డులను గెలుచుకున్నట్లు చెబుతున్నారు. -
వచ్చే రెండేళ్లలో రూ. 1000 కోట్లు: రియల్టీ దిగ్గజం
చెన్నై: కార్యకలాపాల విస్తరణలో భాగంగా రియల్టీ దిగ్గజం జీ స్క్వేర్ రియల్టర్స్ వచ్చే రెండేళ్లలో రూ. 1,000 కోట్లు పైగా ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం హైదరాబాద్, కోయంబత్తూర్ తదితర నగరాల్లో ప్లాట్లను విక్రయిస్తున్న కంపెనీ ఇక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడువ్యాప్తంగా రెసిడెన్షియల్ విభాగంలోకి విస్తరించాలని భావిస్తోంది. విల్లాలు, అపార్ట్మెంట్లను కూడా నిర్మించనుంది. ప్లాట్ మార్కెట్లో విజయవంతమైన నేపథ్యంలో గృహాల మార్కెట్లోకి కూడా ప్రవేశిస్తున్నట్లు సంస్థ ఎండీ బలరామజయం తెలిపారు. జీ స్క్వేర్ ఇప్పటివరకు 127 ప్రాజెక్టులను పూర్తి చేసిందని, 15,000 మంది పైగా కస్టమర్లకు సేవలు అందించిందని వివరించారు. -
అలాంటి పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం..!
నేను ఒక విశ్రాంత ఉద్యోగిని. నా సర్వీస్ మొత్తం కష్టపడి దాచుకున్న డబ్బుని ఒక ప్రైవేటు స్టాక్ బ్రోకింగ్ కంపెనీ వారు లిస్టింగుకు సిద్ధంగా ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెడితే బ్యాంకు వడ్డీ కన్నా ఎక్కువ వస్తుందని నమ్మించడంతో అందులో పెట్టుబడులు పెట్టాను. 18 నెలల లోపు సదరు కంపెనీలు స్టాక్ లిస్టింగ్ అవ్వకపోతే, తామే తిరిగి మా స్టాక్ కొనుక్కుంటాము అని అగ్రిమెంట్లు కూడా రాసి ఇచ్చారు. నాలాగే చాలామంది చేత కూడా పెట్టుబడులు పెట్టించారు. ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతోంది కానీ ఏం లాభం లేదు పైగా మా స్టాక్ అమ్మేస్తాము అంటే తిరిగి కొనుక్కోవట్లేదు. ఎలా ముందుకు వెళ్ళాలో చెప్పగలరు.– ఒక విశ్రాంత ఉద్యోగి, హైదరాబాద్ పూర్వ అనుభవం, వ్యాపార పెట్టుబడులలో నైపుణ్యం కలిగిన వారు అన్లిస్టెడ్ షేర్లు కొంటూ ఉండటం, స్టార్టప్ కంపెనీలలో ముందుచూపుతో పెట్టుబడులు పెట్టడం కూడా ఒక వ్యాపారమే. ఏంజెల్ ఇన్వెస్టర్స్, క్యాపిటల్ ఇన్వెస్టర్స్ అంటూ వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్ పద్ధతులు అవలంబిస్తుంటారు. నచ్చిన సంస్థలలో వారు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అది వారి హక్కు.అన్లిస్టెడ్ కంపెనీలలో కొన్న షేర్లకు రిస్కు కూడా అధికంగానే ఉంటుంది. దీనిని ఒక వ్యాపారం లాగా చేసే వారు నష్టాలకు కూడా సిద్ధపడి పెట్టుబడులు పెడుతుంటారు. కానీ మీలాగా జీవితం మొత్తం కష్టపడి సంపాదించి రిటైర్ అయిన తర్వాత, కేవలం లాభాలు ఆశించి మాత్రమే అధిక మొత్తంలో ఇలాంటి పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ ఐన కంపెనీలు ఏమైనా ఆర్థిక నేరాలు చేసినా, అవకతవకలు జరిగినా, సెబీకి ఫిర్యాదు చేయవచ్చు. వారిపై కఠిన చర్యలు ఉంటాయి. కంపెనీ నష్టపోతే లేదా దివాలా తీస్తే దానికి ఎవరూ ఏమీ చేయలేరు. మీకు అగ్రిమెంట్ రాసి ఇచ్చింది మీరు షేర్లు కొన్న కంపెనీ అయి ఉండి, మీకు, సదరు కంపెనీ మేనేజ్మెంట్ వ్యవహారాలకు మధ్య ఏదైనా సమస్యలు తలెత్తితే, మీరు కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ద్వారా కూడా కేసు వేయవచ్చు. మీకు అగ్రిమెంట్లు చేసింది మధ్యలో వున్న బ్రోకింగ్ కంపెనీ అయితే, NCLTని ఆశ్రయించలేరు. ఇటీవలే ఒక కంపెనీ వారు మీలాంటి వారి వద్ద అధిక మొత్తంలో పెట్టుబడులను సేకరించి, అగ్రిమెంట్లు చేసి కూడా ఎవరికీ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో, హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదయి, కొందరిని అరెస్టు కూడా చేశారు. ఆ కేసు ఇంకా విచారణ దశ లోనే ఉంది. మీరు కూడా పోలీసులను ఆశ్రయించవచ్చు. మీరు ఏ కంపెనీ షేర్లు అయితే కొన్నారు, వారి పాత్ర కూడా ఏమైనా ఉందా అనే దిశలో దర్యాప్తు చేయవలసిందిగా కోరండి. సివిల్ కేసు ద్వారా కూడా మీ డబ్బులు తిరిగి పొందవచ్చు.గమనిక ఇటీవల కాలంలో ఒక్క హైదరాబాదులోనే సైబర్ నేరగాళ్లు కూడా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్ల పేరుతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారు అంటూ చాలా కేసులే నమోదయ్యాయి. ఆర్థికంగా ఎక్కడైనా పెట్టుబడులు పెడితే అనుభవం కలిగిన వారి సలహా మేరకు, చట్టరీత్యా చేస్తే మంచిది.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.com మెయిల్ చేయవచ్చు. )(చదవండి: పచ్చని పల్లెలో మెచ్చే సర్పంచులు..!) -
సీమాంతర పెట్టుబడులకు ముంబై టాప్
న్యూఢిల్లీ: సీమాంతర పెట్టుబడులకు సంబంధించి ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని టాప్ 10 కీలక మార్కెట్ల జాబితాలో ముంబై, ఢిల్లీ చోటు దక్కించుకున్నాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ ఇండియా నిర్వహించిన సర్వే నివేదికలో ముంబైకి అయిదో ర్యాంకు, న్యూఢిల్లీకి ఎనిమిదో ర్యాంకు లభించింది. ఈ జాబితాలో ముంబై కన్నా ముందువరుసలో టోక్యో, సిడ్నీ, సింగపూర్, హోచిమిన్ సిటీ ఉన్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో సగం మంది పైగా ఇన్వెస్టర్లు 2025లో మరింతగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు వెల్లడించారు.దేశీయంగా రియల్టీలో ఆఫీస్, రెసిడెన్షియల్ స్పేస్తో పాటు పారిశ్రామిక.. డేటా సెంటర్లపై కూడా ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 2024లో భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడులు 54 శాతం పెరిగి ఆల్టైం గరిష్టమైన 11.4 బిలియన్ డాలర్లకు చేరాయి. ‘భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులు 2024లో రికార్డు స్థాయికి చేరాయి. ఇందులో దేశీ ఇన్వెస్టర్ల ఆధిపత్యం ఎక్కువగానే ఉన్నప్పటికీ విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా గణనీయంగా పెరగడమనేది గ్లోబల్ రియల్ ఎస్టేట్ గమ్యస్థానంగా భారత్కి ప్రాధాన్యం పెరుగుతుండటానికి నిదర్శనంగా నిలుస్తుంది‘ అని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. రియల్ ఎస్టేట్లో ప్రస్తుత విభాగాలతో పాటు కొత్త విభాగాల్లోకి సైతం పెట్టుబడుల ప్రవాహం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ–కామర్స్, వేగవంతమైన డెలివరీ సేవలకు డిమాండ్ నెలకొనడమనేది లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ పరిశ్రమకు ఊతమివ్వగలదని అన్షుమన్ చెప్పారు. దీనితో ఇటు డెవలపర్లు, ఇన్వెస్టర్లకు కూడా ఆకర్షణీయమైన అవకాశాలు లభించవచ్చని పేర్కొన్నారు. -
రియల్టీపైనే కుబేరుల కన్ను..
న్యూఢిల్లీ: దేశీయంగా అత్యంత సంపన్నులు (హెచ్ఎన్ఐలు, యూహెచ్ఎన్ఐలు) రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడంపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వచ్చే రెండేళ్లలో రియల్టీపై గణనీయంగా పెట్టుబడులు పెట్టాలని 62 శాతం మంది పైగా కుబేరులు భావిస్తున్నారు. సంపన్నుల పెట్టుబడుల ధోరణులపై లగ్జరీ ప్రాపర్టీలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ఇండియా సోత్బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పెద్ద నగరాలకు చెందిన 623 మంది హెచ్ఎన్ఐలు, యూహెచ్ఎన్ఐలు ఇందులో పాల్గొన్నారు.ఈ సర్వే ప్రకారం, భారత ఆర్థిక వృద్ధిపై ఆశాభావం కాస్త నెమ్మదించినప్పటికీ, వృద్ధి పటిష్టంగానే ఉండగలదనే అంచనాలు ఉన్నాయి. 2024లో ఆశాభావం 79 శాతంగా ఉండగా 2025 సర్వేలో ఇది 71 శాతానికి నెమ్మదించింది. అయినప్పటికీ, దేశ జీడీపీ వృద్ధి 6 శాతం నుంచి 6.5 శాతం వరకు ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో.. భారత్ అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఎకానమీగానే కొనసాగుతుందని చాలా మటుకు హెచ్ఎన్ఐలు, యూహెచ్ఎన్ఐలు విశ్వసిస్తున్నారు.‘ఏడాది, రెండేళ్లలో రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్న సంపన్నుల సంఖ్య 2024లో 71 శాతంగా ఉండగా 2025లో 62 శాతానికి పరిమితమైంది. అయినప్పటికీ పెట్టుబడులకు ఆకర్షణీయమైన సాధనంగా రియల్టీపై ఇంకా గట్టి నమ్మకం ఉండటాన్ని ఇది సూచిస్తుంది‘ అని నివేదిక వివరించింది. రాబడులపై ఆశాభావం.. పెట్టుబడి గణనీయంగా వృద్ధి చెందుతుందనే అంచనాలే, లగ్జరీ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధాన కారణమని సంపన్నులు వెల్లడించారు. 2024లో ఇలా చెప్పిన వారి సంఖ్య 44 %గా ఉండగా ప్రస్తుతం ఇది 55 శాతానికి పెరిగింది. ఇక రియల్టీ పెట్టుబడులపై రాబడులు 12–18% స్థాయిలో ఉంటాయని సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఆశాభావంతో ఉన్నారు. 38% మంది మాత్రం ఇది 12% కన్నా తక్కువే ఉంటుందని భావించగా .. 18 శాతానికి మించి ఉంటుందని 15%మంది అభిప్రాయపడ్డారు.‘కాస్త ఆచితూచి వ్యవహరించే ధోరణి నెలకొన్నా, దేశీయంగా లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి కొనసాగుతుంది. ముఖ్యంగా విశాలమైన ఫార్మ్హౌస్లు, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు మొదలైన వాటికి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాం‘ అని ఇండియా సోత్బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ ఎండీ అమిత్ గోయల్ తెలిపారు. ఒకప్పుడు హోదాకు చిహ్నంగా నిల్చిన లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం మెరుగైన పెట్టుబడి సాధనంగా మారిందని సంస్థ సీఈవో అశ్విన్ చడ్ఢా పేర్కొన్నారు.బిలియనీర్ల బూస్ట్..దేశీయంగా బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం సైతం రియల్టీకి కలిసొస్తోందని నివేదిక పేర్కొంది. యూబీఎస్ నివేదికను ఉటంకిస్తూ, కుబేరుల సమష్టి సంపద 42 శాతం వృద్ధి చెంది ఏకంగా దాదాపు 905 బిలియన్ డాలర్ల స్థాయిని దాటిందని వివరించింది. గత దశాబ్దకాలంలో భారత్లో బిలియనీర్ల సంఖ్య రెట్టింపై 185కి చేరుకోగా, మొత్తం సంపద మూడు రెట్లు పెరిగినట్లు తెలిపింది. దీంతో అంతర్జాతీయంగా అత్యధిక సంఖ్యలో కుబేరులకు కేంద్రంగా అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు వివరించింది -
ఈ పెట్టుబడుల వల్ల వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయి: Revanth Reddy
-
స్వల్పకాల పెట్టుబడికి దారేదీ?
ప్రతి వ్యక్తికి స్వల్పకాల, మధ్య కాల, దీర్ఘకాల లక్ష్యాలనేవి ఉంటాయి. వీటి ఆధారంగానే పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. అన్నింటికీ ఒకే అస్త్రం ఫలితాలనివ్వదు. ప్రతి పెట్టుబడిలోనూ రిస్క్ ఉంటుంది. ఇది తమకు ఎంత వరకు ఆమోదమో పరిశీలించిన తర్వాతే వాటిపై నిర్ణయానికి రావాలి. దీర్ఘకాలానికి ఈక్విటీలు అధిక రాబడులు ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మధ్య కాలిక లక్ష్యాలకు, ఈక్విటీ, డెట్తో కలయికతో ఉండే హైబ్రిడ్ ఫండ్స్ మెరుగైనవి. మరి స్వల్పకాల లక్ష్యాల మాటేమిటి? వీటి కోసం రిస్క్ తీసుకోవడం ఎంత మాత్రం సూచనీయం కాదు. స్వల్పకాలంలో రాబడి కంటే పెట్టుబడి రక్షణ కీలకం అవుతుంది. అదే సమయంలో ఎంతో కొంత రాబడి కూడా రావాలి. ఇందుకు అందుబాటులో ఉన్న మెరుగైన సాధనాలపై అవగాహన కల్పించే కథనం ఇది. స్వల్పకాలం అంటే..? నిజానికి స్వల్పకాలానికి ఇతమిత్థమైన నిర్వచనం లేదు. కొన్ని రోజుల నుంచి నెలల వరకు స్వల్పకాలం కిందకే వస్తుంది. ఏడాది, రెండేళ్లు కూడా స్వల్పకాలం కిందకే వస్తుంది. 3–5 ఏళ్ల కాలాన్ని మధ్యస్థంగా, 10 ఏళ్లు మించితే దీర్ఘకాలంగా పరిగణిస్తుంటారు. ముఖ్యంగా మూడేళ్ల కాలానికి ఈక్విటీలను పరిగణనలోకి తీసుకోకపోవడమే రిస్క్ పరంగా సానుకూలం. ఈక్విటీ పెట్టుబడులకు కనీసం ఐదేళ్లు అయినా ఉండాలన్నది నిపుణుల సూచన. గతంలో మాదిరిగా కాకుండా నేడు ఆర్థిక అస్థిరతలు పెరిగిపోయాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సైతం అధికమయ్యాయి. వీటి ప్రభావం ఈక్విటీలపై ఎక్కువగా ఉంటుంది. కనుక దీర్ఘకాలంలోనే ఈక్విటీల్లో మెరుగైన రాబడులు సాధ్యపడతాయి. మూడేళ్ల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఒకవేళ ఈక్విటీలు బేరిష్ లోకి వెళ్లిపోతే కోలుకునేందుకు ఎంత సమయం అయినా తీసుకోవచ్చు. అందుకుని ఇన్వెస్టర్లు ఈక్విటీలకు బదులు సంప్రదాయ డెట్ సాధనాలను స్వల్ప కాలం కోసం పరిశీలించొచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు... బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీలు).. తాతల కాలం నుంచి ప్రాచుర్యంలో ఉన్న సాధనం. కానీ, నేడు అధిక రాబడుల కాంక్షతో చాలా మంది స్వల్పకాలానికీ ఈక్విటీల వైపు అడుగులు వేస్తున్నారు. దీర్ఘకాలానికి అధిక రాబడిని ఆశించడం సమంజసమే. అదే సమయంలో స్వల్ప కాల లక్ష్యాలకు తక్కువ రాబడిని ఇచ్చే రిస్క్ లేని ఎఫ్డీలను విస్మరించడం సరికాదు. ఫిక్స్డ్ డిపాజిట్తోపాటు, రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) అందరికీ అర్థమయ్యే సాధనాలు. ముఖ్యంగా ఎఫ్డీలపై రాబడి స్థిరంగా ఉంటుంది. అందుకని స్వల్పకాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడి కోసం వీటిని నమ్ముకోవచ్చు. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే.. అప్పుడు ఒకటికి మించిన బ్యాంకుల్లో ఎఫ్డీలు వేసుకోవాలి. ఒక బ్యాంక్లో గరిష్టంగా రూ.5 లక్షలు డిపాజిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక బ్యాంక్ సంక్షోభం పాలైతే ఒక డిపాజిట్దారునికి గరిష్టంగా రూ.5 లక్షల వరకే బీమా కింద లభిస్తుంది. స్వీప్ ఇన్ ఎఫ్డీని సైతం పరిశీలించొచ్చు. ఇది సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు అనుబంధంగా ఉంటుంది. సేవింగ్స్ ఖాతాలో కనీస బ్యాలన్స్ను మించి నగదు చేరిన తర్వాత నిర్ణీత మొత్తం (రూ.1,000 అంతకుమించి) స్వీప్ ఇన్ డిపాజిట్గా మారుతుంది. సేవింగ్స్ ఖాతాలో బ్యాలన్స్పై వడ్డీ రేటు 3–4 శాతం మించదు. అదే స్వీప్ ఇన్లో అయితే 5–6 శాతం వరకు (డిపాజిట్ ఉంచిన కాలాన్ని బట్టి) లభిస్తుంది. డిపాజిట్ రూపంలోకి మారినా కానీ, అవసరమైనప్పుడు వెంటనే ఆ మొత్తాన్ని ఏటీఎం నుంచి అయినా ఉపసంహరించుకోవచ్చు. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లను సైతం పరిశీలించొచ్చు. కార్పొరేట్ ఎఫ్డీలు (కంపెనీలు నిధుల కోసం జారీ చేసేవి), ఎన్బీఎఫ్సీ సంస్థల ఎఫ్డీలకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వీటిలో డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది. అందుకే ఈ డిపాజిట్లలో రాబడి ఎక్కువగా ఉంటుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్డీలను సైతం పరిశీలించొచ్చు. వీటిలో రిస్క్ ఉంటుంది. అయినప్పటికీ ఆర్బీఐ డిపాజిట్ గ్యారంటీ పథకం పరిధిలోకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు కూడా వస్తాయి. కనుక రూ.5 లక్షల డిపాజిట్ వరకు ఢోకా ఉండదు. ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో రూ.5 లక్షలు మించకుండా డిపాజిట్ చేసుకోవచ్చు. పెట్టుబడి ఉద్దేశం? పెట్టుబడిని కాపాడుకోవం, అదే సమయంలో కొంత రాబడిని సమకూర్చుకోవడం స్వల్పకాల పెట్టుబడుల ఉద్దేశంగా ఉండాలి. స్వల్పకాల పెట్టుబడుల కోసం అధిక రాబడులను ఇచ్చే విభాగాలను అస్సలు పరిగణనలోకి తీసుకోకూడదు. అధిక రాబడుల చరిత్ర కలిగిన ఈక్విటీల్లో స్వల్పకాలంలో పెట్టుబడికి సైతం రిస్క్ ఏర్పడుతుంది. దీర్ఘకాలంలోనే అలాంటి సాధనాల్లో రిస్క్ ను అధిగమించి రాబడులు సమకూర్చుకోగలరు. ఎఫ్డీలపై టీడీఎస్.. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే రాబడి ఒక ఆర్థి క సంవత్సరంలో రూ.40,000 మించితే (60 ఏళ్లలోపు వారికి), ఆ మొత్తంపై బ్యాంక్లు 10 శాతం టీడీఎస్ మినహాయిస్తాయి. 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000 మించితే అప్పుడు టీడీఎస్ అమలవుతుంది. కానీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు టీడీఎస్ వర్తించదు. టీడీఎస్ వద్దనుకునే వారు ఎఫ్డీలకు బదులు డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఎఫ్డీల కంటే ఇతర డెట్ ఫండ్స్లోనే పన్ను అనంతరం రాబడి కాస్తంత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్ను గత రాబడుల ఆధారంగా ఎంపిక చేసుకోవడం సరైన విధానం కాదు. తమ పెట్టుబడుల కాల వ్యవధికి అనుకూలంగా ఉండే ఫండ్స్ను, అది కూడా వాటి పెట్టుబడుల పోర్ట్ఫోలియో చూసిన తర్వాత ఎంపిక చేసుకోవాలి. తిరిగి ఫలానా సమయంలో పెట్టుబడిని వెనక్కి తీసుకుంటానన్న స్పష్టత ఉన్న వారికి ఎఫ్డీలు మెరుగైనవి. ఎంత రాబడి వస్తుందో పెట్టుబడి సమయంలోనే తెలుసుకోవచ్చు. ఒకవేళ పెట్టుబడిని ఎప్పుడు వెనక్కి తీసుకోవాలన్న విషయంలో స్పష్టత లోపించినట్టయితే, అప్పుడు ఓవర్నైట్ ఫండ్స్ లేదా లిక్విడ్ ఫండ్స్ లేదా బ్యాంక్ స్వీప్ ఇన్ ఎఫ్డీ ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాలానికి సైతం.. డెట్ సాధనాలు కేవలం స్వల్పకాల పెట్టుబడులకే అనుకోవడం పొరపాటు. దీర్ఘకాల లక్ష్యాల విషయంలోనూ ఎవరైనా 100 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకోవడం సరికాదు. కాల వ్యవధి, తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా అసెట్ అలోకేషన్ విధానాన్ని (వివిధ సాధనాల మధ్య కేటాయింపులు) రూపొందించుకోవాలన్నది నిపుణుల సూచన. 10–20 ఏళ్లకు మించిన కాలానికి ఒకరు తమ పెట్టుబడుల్లో 70 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించుకోవచ్చు. మిగిలిన 30 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. బంగారానికి సైతం 5–10 శాతం మేర కేటాయింపులు చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ వయసు పెరుగుతూ, లక్ష్యానికి చేరువవుతున్న క్రమంలో ఈక్విటీ పెట్టుబడులను క్రమంగా తగ్గించుకుంటూ, డెట్లో పెట్టుబడులు పెంచుకుంటూ వెళ్లాలి. దీని ద్వారా రిస్క్ ను అధిగమించొచ్చు. లాభాలపై పన్ను డెట్ సాధనం ఏదైనా సరే పెట్టుబడిపై వచ్చే లాభం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. ఎంత కాలం పాటు ఇన్వెస్ట్ చేశారన్న అంశంతో సంబంధం లేదు. పెట్టుబడిని విక్రయించగా వచ్చిన లాభం సంబంధిత ఆర్థిక సంవత్సరంలో ఇన్వెస్టర్ ఆదాయానికి కలుస్తుంది. నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో మాదిరి మూడేళ్లు నిండిన పెట్టుబడులు విక్రయించినప్పుడు వచ్చిన లాభంపై ఇండెక్సేషన్ ప్రయోజనం ఇప్పుడు లేదు. ఓవర్నైట్ ఫండ్స్... డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇవి అతి తక్కువ రిస్క్ కలిగినవి. కొన్ని రోజుల పాటు పెట్టుబడికి ఓవర్నైట్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. వీటిలో వార్షిక రాబడి సుమారుగా 5 శాతం ఉంటుంది. కేవలం ఒక రోజులో గడువు తీరే సెక్యూరిటీల్లో ఓవర్నైట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. కేవలం ఒక రోజు వ్యవధిలోనే ఈ పెట్టుబడిని నగదుగా మార్చుకోవచ్చు. ఎక్కువ లిక్విడిటీతో ఉంటాయి. ఆర్బీఐ వడ్డీ రేట్ల సవరణల ప్రభావం వీటిపై ఉంటుంది. ఏరోజుకారోజు ఇవి గడువు తీరిపోతుంటాయి. దీంతో ఫండ్ మేనేజర్లు రోజువారీగా సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కనుక వడ్డీ రేట్ల మార్పు ప్రభావం ఈ పెట్టుబడులపై వెంటనే అమల్లోకి వస్తుందని గుర్తు పెట్టుకోవాలి. ఆర్బీఐ రివర్స్ రెపో రేట్లను తగ్గించినప్పుడు వీటి రాబడులు కొంత వరకు ప్రభావితమవుతాయి. మనీ మార్కెట్ ఫండ్స్ ఏడాది వరకు కాల వ్యవధి తీరే సెక్యూరిటీల్లో (సర్టీఫికెట్ ఆఫ్ డిపాజిట్లు, కమర్షియల్ పేపర్లు, కమర్షియల్ బిల్లులు, ట్రెజరీ బిల్లులు) ఇవి పెట్టుబడులు పెడుతుంటాయి. అధిక లిక్విడిటీకి తోడు మెరుగైన రాబడిని ఇచ్చే విధంగా వీటి పనితీరు ఉంటుంది. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కంటే వీటిలో కాస్త అధిక రాబడి ఉంటుంది. గడిచిన ఏడాది కాలంలో ఇవి సగటున 7.59 శాతం రాబడిని ఇచ్చాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఏడాదికి మించి పెట్టుబడి కొనసాగించేట్టు అయితే ఆర్బిట్రేజ్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. ఇవి ఈక్విటీ ఆర్బిట్రేజ్ అవకాశాల్లో (ధరల వ్యత్యాసం) పెట్టుబడులు పెడుతుంటాయి. గడిచిన ఏడాది కాలంలో (అక్టోబర్ నాటికి) ఆర్బిట్రేజ్ ఫండ్స్ సగటున 6.5–8 శాతం మధ్య రాబడులు ఇచ్చాయి. కానీ, మార్కెట్ అస్థిరతల్లో ఇవి తక్కువ రాబడులు, కొన్ని సందర్భాల్లో ప్రతికూల రాబడులు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఏడాదికి మించిన కాలానికే వీటిని పరిశీలించాలి. అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ ఈ పథకాలు 3–6 నెలల్లో గడువు తీరే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇతర డెట్ పథకాలతో పోల్చినప్పుడు కాస్త సురక్షితమైనవి. అదే సమయంలో ఓవర్నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ కంటే వీటిలో కొంచెం రిస్క్ ఉంటుంది. అంతేకాదు, ఫండ్ మేనేజర్ తక్కువ రేటింగ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తే, డిఫాల్ట్ రిస్క్ కూడా ఎదురుకావచ్చు. కనుక, పెట్టుబడికి ముందు వాటి పోర్ట్ఫోలియోలోని సెక్యూరిటీలను ఒక్కసారి పరిశీలించడం మంచిది. అధిక రేటింగ్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసిన పథకాలనే ఎంపిక చేసుకోవడం సూచనీయం. ఇవి ఏడాది కాలంలో సగటున 7.5 శాతం మేర రాబడులు ఇచ్చాయి. లిక్విడ్ ఫండ్స్... కొన్ని నెలల పాటు పెట్టుబడులకు లిక్విడ్ ఫండ్స్ కూడా అనుకూలమే. అధిక నాణ్యతతో కూడిన డెట్ సెక్యూరిటీల్లో లిక్విడ్ ఫండ్ మేనేజర్లు పెట్టుబడులు పెడతారు. ఒక్కో డెట్ ఇన్స్ట్రుమెంట్ మెచ్యూరిటీ 91 రోజులకు మించకుండా ఉంటుంది. కావాల్సినప్పుడు వేగంగా వెనక్కి తీసుకోవచ్చు. కొన్ని లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్స్టంట్ రిఫండ్ సదుపాయాన్ని (రూ.50 వేల వరకు) అందిస్తున్నాయి. అంటే ఆ మేరకు వెంటనే బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. లేదంటే విక్రయించిన మరుసటి రోజున బ్యాంక్ ఖాతాకు ఈ మొత్తం అందుతుంది. వడ్డీ రేట్ల మార్పుల రిస్క్ వీటిపైనా ఉంటుంది. ఓవర్నైట్ ఫండ్స్తో పోలి్చతే రిస్క్ కాస్తంత ఎక్కువ. వీటిల్లో రాబడులు పెట్టుబడి కాలాన్ని బట్టి 5–6.5 శాతం మధ్య ఉంటాయి. స్వల్పకాలానికి 5 శాతం వరకు ఆశించొచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
బ్యాటరీ రంగంలో భారీ పెట్టుబడులు: ఐఈఎస్ఏ
న్యూఢిల్లీ: బ్యాటరీ, మొబిలిటీ స్టార్టప్ వ్యవస్థలో.. భారతదేశానికి 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు ఏడాదిలో రావొచ్చని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) అంచనా వేసింది.పెట్టుబడులు నూతన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధిని నడిపించడంతోపాటు ఈ స్టార్టప్లు తయారు చేసే ఉత్పత్తుల పురోగతికి దోహదం చేస్తుందని ఐఈఎస్ఏ తెలిపింది. అంతేగాక బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, సేఫ్టీ మేనేజ్మెంట్, విడిభాగాల తయారీ కంపెనీలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని వివరించింది.స్టార్టప్, ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ ద్వా రా అంకుర కంపెనీలను ప్రోత్సహించడానికి ఐఈఎస్ఏ చురుకుగా పని చేస్తోంది. ఇప్పటికే 400 స్టార్టప్లు, యూనిడో, ఐక్రియేట్, ఇండి యా యాక్సిలరేటర్, ఇతర ప్రముఖ సంస్థల తో చేతులు కలిపింది. స్టార్టప్లకు పెట్టుబడి మద్దతు, మార్గదర్శకత్వం, సాంకేతిక ధ్రువీకరణ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యానికి సాయపడుతోంది. -
మీ కూతురి బంగారు భవిష్యత్తు కోసం: ఇవి బెస్ట్ స్కీమ్స్..
ప్రపంచం ఎంత వేగంగా ముందుకు సాగుతున్నా.. ఆడపిల్లల విషయంలో మాత్రం ఇంకా అసమానతలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆడపిల్ల పుట్టకూడదని కోరుకునే తల్లిదండ్రులు లేకపోలేదు. చదువు, పెళ్లి ఇలాంటివన్నీ భారమనుకునేవారు నేటికీ ఉన్నారు. ఈ అసమానతలు తొలగిపోవాలి. ఆడబిడ్డలను కూడా అన్ని రంగాల్లో ఎగదనివ్వాలి. దీనిని దృష్టిలో ఉంచుకునికి, బాలికలను ప్రోత్సహించడానికి.. ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఆడపిల్ల పుడితే.. భారమనుకునే ఆలోచన మారాలి. మగపిల్లలు మాత్రమే కాకుండా.. ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లోనూ తమ ముద్ర వేస్తున్నారు. కాబట్టి వారి ఎదుగుదలకు ఉపయోగపడే కొన్ని పథకాలు గురించి తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాలి.సుకన్య సమృద్ధి యోజనసుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది ప్రభుత్వ మద్దతుతో కూడిన పొదుపు పథకం. ఈ స్కీమ్ కింద 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఆడపిల్లల కోసం సంరక్షులు లేదా తల్లిదండ్రులు.. అమ్మాయి పుట్టిన తేదీ నుంచి 10 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి ఖాతాను 250 రూపాయలతో ప్రారభించవచ్చు. ఇందులో గరిష్టంగా రూ. 1.50 లక్షలు వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ స్కీమ్ ఓపెన్ చేయడానికి పోస్టాఫీస్ను సందర్శించి ప్రారభించవచ్చు.చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్. పిల్లల వివాహం, ఉన్నత విద్య మొదలైన దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గిఫ్ట్ ఫండ్లు.. డెట్ అండ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ల కలయికలో పెట్టే పెట్టుబడి.ఎల్ఐసీ జీవన్ తరుణ్లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఈ 'జీవన్ తరుణ్ స్కీమ్' అందిస్తుంది. దీనిని ప్రత్యేకంగా 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య పిల్లల విద్యకు ఆర్ధిక సహాయం అందించే లక్ష్యంతో తీసుకొచ్చారు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. అంతే కాకుండా చదువుకునే సమయంలో విద్యా అవసరాలకు చెల్లింపులు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా మెచ్యూరిటీ సమయంలో మొత్తం కవరేజ్ లభిస్తుంది.బాలికా సమృద్ధి యోజన (BSY)భారతదేశంలో ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాల బాలికల సంక్షేమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో బాలికా సమృద్ధి యోజన స్కీమ్ ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద, ఆడపిల్ల పుట్టినప్పుడు నగదు ప్రోత్సాహకం అందిస్తారు. ఆ తర్వాత వారు ఉన్నత పాఠశాల వరకు విద్యను పొందేలా చూసేందుకు వార్షిక స్కాలర్షిప్లను సైతం అందించడం జరుగుతుంది.సీబీఎస్ఈ ఉడాన్ పథకంసీబీఎస్ఈ ఉడాన్ స్కీమును భారత ప్రభుత్వ మానవ వనరులు మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRD) సహకారంతో 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్' (CBSE) ప్రారంభించింది. దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో మహిళా విద్యార్థుల నమోదు రేటును పెంచడం దీని లక్ష్యం. -
తెలంగాణకు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి: Mahesh Kumar Goud
-
మౌలిక వసతులకు భారీ నిధులు
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు, అందరికీ సామాజిక భద్రత కోసం మౌలిక వసతులకు ఏటా రూ.15 లక్షల కోట్ల చొప్పున బడ్జెట్(Budget 2025-26) కేటాయింపులు అవసరమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఇలా 25 ఏళ్లపాటు నిధులు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత కేటాయింపులు రూ.11.5 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. ఐఎస్ఎస్ఏ–ఈఎస్ఐసీ అంతర్జాతీయ సదస్సు సందర్భంగా మంత్రి ప్రసంగించారు.2012లో మౌలిక వసతుల కోసం చేసిన బడ్జెట్ కేటాయింపులు రూ.1.2 లక్షల కోట్లుగానే ఉండేవని, 2014లో నరేంద్ర మోదీ సర్కారు రూ.2.4 లక్షల కోట్లకు పెంచినట్టు గుర్తు చేశారు. ‘2024కు వచ్చే సరికి బడ్జెట్ కేటాయింపులు రూ.11.5 లక్షల కోట్లకు పెరిగాయి. దీన్ని రూ.15 లక్షల కోట్లకు తీసుకెళ్లాలి. వచ్చే 25 ఏళ్ల పాటు ఏటా రూ.15 లక్షల కోట్ల చొప్పున ఖర్చు చేస్తే భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: రియల్టీలో మహిళలకు ఉపాధి ఎక్కడ?దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండడంతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతున్నట్టు అభిప్రాయపడ్డారు. ఫలితంగా కొత్త రంగాల్లో ఉద్యోగాల కల్పన ఇనుమడిస్తున్నట్టు చెప్పారు. ఈ కొత్త రంగాల్లో (క్విక్ కామర్స్ తదితర) కార్మికులకు సామాజిక భద్రతను ప్రభుత్వం కల్పించాల్సి ఉందన్నారు. -
అమెజాన్ పెట్టుబడి రూ.60 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)లో రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ పెట్టుబడిని సాధించింది. తెలంగాణలో డేటా సెంటర్లను విస్తరించేందుకు రూ.60 వేల కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్రఖ్యాత అమెజాన్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ‘అమెజాన్ వెబ్ సర్విసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ’ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో జరిపిన భేటీలో ఈ నిర్ణయం వెలువడింది. అమెజాన్తోపాటు మరికొన్ని సంస్థలతోనూ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. భూమి కేటాయించాలని కోరిన అమెజాన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్రంలో ఇప్పటికే మూడు డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. తాజాగా విస్తరణ కోసం అవసరమైన భూమిని కేటాయించాలని ఆ సంస్థ ప్రతినిధులు కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. అమెజాన్ భారీ పెట్టుబడులకు ముందుకు రావడంపై సీఎం రేవంత్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ రైజింగ్ విజన్’తో తమ ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. అమెజాన్ ఒప్పందంతో దేశంలో డేటా సెంటర్ల కేంద్రంగా హైదరాబాద్ గుర్తింపు సాధిస్తుందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. డేటా సెంటర్ల రంగంలో మరిన్ని పెట్టుబడులు ⇒ హైదరాబాద్లో రూ.15వేల కోట్ల పెట్టుబడితో 300 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ఏర్పాటు కోసం అమెరికాకు చెందిన టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏఐ ఆధారిత అప్లికేషన్లు, క్లౌడ్ సేవలు, డేటా ప్రాసెసింగ్కు ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. ⇒ అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ రూ.5వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అత్యాధునిక ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్ను స్థాపించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ⇒ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల్లో అగ్రగామి సంస్థ బ్లాక్స్టోన్ హైదరాబాద్లో రూ.4,500 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. బ్లాక్స్టోన్ అనుబంధ విభాగం జేసీకే ఇన్ఫ్రా 150 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తుంది. ఇన్ఫోసిస్, విప్రో విస్తరణ ప్రణాళికలు కూడా.. ⇒ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని గోపన్పల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ ఏర్పాటుకు విప్రో సంస్థ ముందుకు వచ్చింది. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్బాబులతో జరిగిన భేటీలో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ విప్రో క్యాంపస్ విస్తరణకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. దీనితో 5వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ⇒ ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ హైదరాబాద్లోని పోచారంలో ఉన్న తమ క్యాంపస్లో 17 వేల ఉద్యోగాలు కల్పించేలా విస్తరణ ప్రణాళిక ప్రకటించింది. రూ.75 కోట్ల పెట్టుబడితో నూతన ఐటీ భవనాల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్లో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీతో భేటీ అయిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు -
సీఎం రేవంత్ పర్యటనతో రాష్ట్రానికి పెట్టుబడులు
-
తెలంగాణలో సన్ పెట్రోకెమికల్స్ భారీ పెట్టుబడులు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో సన్ పెట్రోకెమికల్స్ భారీ పెట్టుబడులు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో సన్ పెట్రోకెమికల్స్ సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా సన్ పెట్రో కెమికల్స్ తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. నాగర్ కర్నూల్ ,మంచిర్యాల ,ములుగులో పంప్డ్ స్టోరేజి పవర్ ,సోలార్ పవర్ ప్రాజెక్టును నెలకోల్పనుంది. తద్వారా 7వేల మందికి ఉపాధి లభించనుంది.Big investment : Sun Petrochemicals signs ₹45,500 crore investment MoU with #Telangana to establish large-scale pumped storage Hydro and solar power projects Deal will create over 7,000 jobs, to develop three Pumped Storage Hydro Power projects in Nagarkurnool, Mancherial, and…— Naveena (@TheNaveena) January 22, 2025 -
2030 నాటికి రూ.1000 కోట్లు: బ్రేక్స్ ఇండియా
బ్రేకింగ్ సిస్టమ్స్ తయారీలో ఉన్న బ్రేక్స్ ఇండియా వివిధ ప్లాంట్లలో సామర్థ్యం పెంపునకు 2030 నాటికి రూ.1,000 కోట్లు పెట్టుబడి చేయాలని నిర్ణయించింది. నూతన ప్లాంట్లు సైతం ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ ఎండీ శ్రీరామ్ విజి వెల్లడించారు.రాబోయే 4–5 సంవత్సరాలలో పెద్ద పెట్టుబడులతో సాఫ్ట్వేర్, ఎల్రక్టానిక్ సామర్థ్యాలను మెరుగుపరుస్తామని ఆయన చెప్పారు. జపాన్కు చెందిన ప్రీమియం బ్రేక్ సిస్టమ్ సరఫరాదారు యాడ్విక్స్తో కలిసి జేవీ నెలకొల్పింది. ఈ జేవీలో బ్రేక్స్ ఇండియాకు 51 శాతం వాటా ఉంది.తమిళనాడులోని హోసూరు వద్ద రూ.500 కోట్లతో జేవీ ప్లాంటు ఏర్పాటవుతోంది. తొలి ఉత్పాదన అయిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్స్ను 2027 నుంచి తయారు చేయనున్నారు. సంస్థకు దేశవ్యాప్తంగా 17 ప్లాంట్లు ఉన్నాయి. 2023–24లో రూ.7,500 కోట్ల టర్నోవర్ సాధించింది. -
తెలంగాణలో యూనిలీవర్ పెట్టుబడులు
బ్రెన్ : స్విట్జర్లాండ్ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఇఎఫ్) 2025 వార్షిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వం తొలి ఒప్పందం జరిగింది. దావోస్లో యూనిలీవర్ సీఈఓ హీన్ షూమేకర్తో సీఎం రేవంత్ రెడ్డి బృందం జరిపిన చర్చలు సఫలమయ్యాయి.వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్లలో ఒకటైన యూనిలీవర్ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసిందని చెప్పారు. తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ యూనిలీవర్ ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అంగీకరించిందని చెప్పారు. తెలంగాణలో బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్ బృందం పేర్కొన్నారు. -
మనవడి భవిష్యత్తుకు ఉత్తమ ఫండ్స్
నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతిసారీ నాకు కేటాయించే యూనిట్ల విలువ కొంత తక్కువగా ఉంటుంది. కాకపోతే నా పెట్టుబడులు, నాకు కేటాయించే యూనిట్ల మధ్య వ్యత్యాసం చాలా స్వల్పంగానే ఉంటోంది. ఎందుకు ఇలా? - నంబూద్రి ప్రసాద్మీరు గుర్తించిన ఈ స్వల్ప వ్యత్యాసం అన్నది మీ ప్రతి పెట్టుబడికి సంబంధించి మినహాయించే స్టాంప్ డ్యూటీ. అన్ని మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లకు దీన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పెట్టుబడి విలువపై 0.005 శాతాన్ని స్టాంప్ డ్యూటీ చార్జీ కింద వసూలు చేస్తారు.ప్రతి పెట్టుబడి మొత్తంలో ఈ మేరకు మినహాయించగా, మిగిలిన మొత్తానికి యూనిట్ల కేటాయింపు జరుగుతుంది. ఉదాహరణకు సిప్ రూపంలో రూ.5,000 ఇన్వెస్ట్ చేశారు. ఇందులో 0.005 శాతం అంటే రూ.0.25 అవుతుంది. అప్పుడు రూ.4,999.75 మొత్తం పెట్టుబడి కిందకు వెళుతుంది. సిప్లు, ఏక మొత్తంలో పెట్టుబడులు, డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ లావాదేవీలు అన్నింటికీ వర్తిస్తుంది.ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్లోకి బదిలీ, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల ఉపసంహరణకు స్టాంప్ డ్యూటీ వర్తించదు. చట్టపరమైన ఈ చార్జీల గురించి పెద్దగా ఆలోచించకుండా, పెట్టుబడుల ప్రణాళిక, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించండి. నా మూడేళ్ల మనవడి భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూలించే ఫండ్స్ ఏవి? వాటి విషయంలో ఎలా వ్యవహరించాలి? - రవిగుప్తాపిల్లల ఉన్నత విద్య కోసం ఈక్విటీ, అగ్రెస్సివ్ ఈక్విటీ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈక్విటీ పెట్టుబడుల పట్ల సౌకర్యంగా లేకపోతే అప్పుడు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ను ఎంపిక చేసుకోవచ్చు. దీనికి అదనంగా ఒకటి లేదా రెండు మిడ్క్యాప్ ఫండ్స్ను పరిశీలించొచ్చు. 15 ఏళ్ల కాలంలో మార్కెట్లు ఎన్నో ఎత్తు పల్లాలు చూసినప్పటికీ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో (వైవిధ్యమైన పెట్టుబడులతో కూడిన) మెరుగైన రాబడులు ఇస్తుంది. కాకపోతే పెట్టుబడులు అలాగే కొనసాగించి, మధ్య మధ్యలో వచ్చే మార్కెట్ పతనాలను పట్టించుకోకుండా ఉంటే చాలు.మార్కెట్ ఊగిసలాటల్లో పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే దీర్ఘకాలంలో విజయం సాధించగలరు. మనవడు, మనవరాలి భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేసుకునేందుకు రెండు రకాల విధానాలను అనుసరించొచ్చు. చిన్నారి పేరు మీద బ్యాంక్ ఖాతా తెరవాలి. ఈ ఖాతాలోకి నగదు బదిలీ చేయాలి. తర్వాత ఎంపిక చేసిన పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుతో అద్దె కడుతున్నారా.. ఈ విషయాలు తెలుసా?మనవడి పేరు మీదే ఖాతా ఉంటుంది కనుక 18 ఏళ్లు నిండిన తర్వాత సంబంధిత ఖాతా యాజమాన్య హక్కులు చిన్నారికి బదిలీ చేయవచ్చు. లేదంటే మీ మనవడికి బదులు మీ పేరు మీదే పెట్టుబడులు పెట్టుకోవడం మరొక ఆప్షన్. మనవడికి 18 ఏళ్లు నిండగానే, ఆ పెట్టుబడులను ఉపహరించుకుని ఆ మొత్తాన్ని మనవడికి గిఫ్ట్ కింద బదిలీ చేయవచ్చు. అప్పటి వరకు ఆ పెట్టుబడులకు నామినీగా మనవడి (మైనర్)ని ప్రతిపాదించొచ్చు. -
ట్రేడింగ్లో ఫ్యూచర్స్ & ఆప్షన్స్: ఏది బెస్ట్ అంటే..
స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఈమధ్య ఎక్కువ మంది అనుసరిస్తున్న మార్గం ఫ్యూచర్స్ & ఆప్షన్స్ (ఎఫ్ & ఓ). వీటినే డెరివేటివ్స్ అంటారు. ఈక్విటీలకు మరో ప్రత్యామ్నాయ రూపమే ఈ డెరివేటివ్స్ అన్నమాట. ఈ రెండిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఫ్యూచర్స్ ట్రేడింగ్▸ఈక్విటీల్లో షేర్లు ఎలా కొంటామో ఫ్యూచర్స్లోనూ అదే మాదిరి కొనుక్కోవచ్చు. ▸ఈక్విటీల్లో ఒక్క షేర్ సైతం కొనుక్కునే వెసులుబాటు ఉంటే ఫ్యూచర్స్లో మాత్రం తప్పనిసరిగా ఒక లాట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ▸ఆయా కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే ధరలను బట్టి లాట్ పరిమాణం నిర్ణయమవుతుంది.▸గతంలో ఫ్యూచర్స్లో షేర్లు కొనేటప్పుడు అతి తక్కువ పెట్టుబడి అవసరమయ్యేది. కానీ నిబంధనలు మారిన తర్వాత కొంచెం ఎక్కువ పెట్టుబడి అవసరమవుతోంది.ఉదా: రిలయన్స్ షేర్లు ఫ్యూచర్స్లో కొనాలని అనుకున్నాం. లాట్ సైజు 500. ఇంతే మొత్తం షేర్లను ఈక్విటీల్లో కొనాలంటే రూ. 6,25,000 కావాలి. అదే ఫ్యూచర్స్లో అయితే రూ.1,10,836 సరిపోతుంది.▸ఈక్విటీలు, ఫ్యూచర్స్కి తేడా ఏమిటంటే.. ఈక్విటీల రూపంలో కొన్న షేర్లు మనం ఎన్నాళ్లయినా మన దగ్గర ఉంచుకోవచ్చు. ▸అవి ఒక రకంగా పెట్టుబడి. షేర్ ధర పడిపోయినా ఆందోళన చెందనక్కర్లేదు.▸డబ్బులు అవసరమైనప్పుడు అమ్ముకోవచ్చు, డబ్బులు ఉన్నప్పుడు ధర పడినా/పెరిగినా మరిన్ని షేర్లు కొనుక్కుంటూ మన పోర్ట్ఫోలియోను పెంచుకోవచ్చు. మంచి లాభాలు వచ్చేవరకూ ఎన్నాళ్లయినా ఎదురుచూడొచ్చు.▸ఫ్యూచర్స్లో ఈ వెసులుబాటు ఉండదు. ఫ్యూచర్స్లో కొనే షేర్లను కాంట్రాక్టులుగా పరిగణిస్తారు. ఆ కాంట్రాక్టు నెల రోజుల వ్యవధికే పరిమితమవుతుంది. ▸దీన్ని పెట్టుబడిగా కాక స్వల్పకాలిక ట్రేడింగ్ వనరుగా మాత్రమే పరిగణించాలి.▸నెల రోజుల వ్యవధిలో కాంట్రాక్టు ధర ఎప్పుడు పెరిగినా తగిన ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయాలి.▸కాంట్రాక్టు ధర పడిపోతే మళ్ళీ పెరిగే వరకు అంటే ఆ నెల చివరిదాకా కూడా ఆగొచ్చు. అప్పటికీ పెరక్కపోతే అమ్ముకుని నష్టాన్ని బుక్ చేయాల్సిందే.▸ప్రస్తుతానికి పడినా.. మళ్ళీ పెరుగుతుందనే నమ్మకం ఉంటే నెలాఖరులో ప్రస్తుత కాంట్రాక్టు వదిలించుకుని తరువాతి నెల కాంట్రాక్టు తీసుకోవచ్చు. ఆ నెలలో కూడా కొన్న రేటు రాక ఇంకా పడిపోతే.. మరింత నష్టాన్ని భరించక తప్పదు. లేదంటే ఆ తరవాతి నెలకు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది.▸ఇది కాంట్రాక్టు కాబట్టి మొత్తం డబ్బులు పెట్టక్కర్లేకుండా నాలుగో వంతు ధరకే కొనుక్కునే అవకాశం ఉంటుంది. పైన చెప్పుకున్న రిలయన్స్ ఉదాహరణ చూడండి. ఎక్కువమంది స్వల్పకాలిక అవసరాలు, తక్కువ పెట్టుబడిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు.ఆప్షన్స్ ట్రేడింగ్ఈక్విటీలకు మరో డెరివేటివ్ రూపమే ఆప్షన్స్. ఫ్యూచర్స్తో పోలిస్తే చాలా చాలా తక్కువ పెట్టుబడికి ట్రేడింగ్ చేసుకునే సౌలభ్యం ఇందులో ఉంది. అందుకే ట్రేడర్లలో నూటికి 90 మంది ఈ మార్గాన్ని అనుసరిస్తారు. ఈ 90లో 85 మంది నష్టపోయేవాళ్లే. డబ్బుల సంపాదనకు చాలా సులువైన మార్గంగా కనిపించే ఈ ఆప్షన్స్ అనేవి రిటైల్ ట్రేడర్ల కోట్ల సొమ్ము మింగేస్తున్నాయి. అదెలాగో తర్వాత తెలుసుకుందాం.➜ఆప్షన్స్లోనూ ఫ్యూచర్స్ మాదిరిగానే, అదే పరిమాణంలో లాట్లలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అది కూడా నెలవారీ కాంట్రాక్టుల్లోనే చేయాలి. ఆప్షన్స్లో కొనేవాటికి ప్రీమియం ఉంటుంది. ఆ రేటు పెట్టి కొనుక్కోవచ్చు.దీనికి కూడా పై ఉదాహరణనే పరిశీలిద్దాం.రిలయన్స్ షేర్లు (500) ఈక్విటీల్లో కొంటే.. రూ. 6,25,000 అవసరమవుతాయి. ఫ్యూచర్స్లో కొంటే రూ. 1,10,000 కావాలి. ఆప్షన్స్లో రూ.1250 కాల్ రూ. 27 ఉంది. పెట్టుబడి 27X500 = 13,500 ఉంటే చాలు.అందరూ ఎగబడేది ఇందుకోసమే. ఇంత తక్కువ పెట్టుబడితో కూడా ట్రేడ్ చేసుకునే సదుపాయం ఆప్షన్స్లో ఉంటుంది. షేర్ ధర మారే దాన్ని బట్టి ఈ ప్రీమియం లోనూ మార్పులు జరుగుతాయి.రిలయన్స్ షేర్ ధర ప్రస్తుతం రూ.1,250 వద్ద ఉంది. కాబట్టి రూ.1,250 కాంట్రాక్టు కొన్నాం అనుకుందాం. షేర్ ధర కేవలం 2,3 రోజుల వ్యవధిలోనే రూ. 1,300 కి వెళ్తే ప్రీమియం కూడా దాదాపు రూ. 40 దాకా పెరుగుతుంది. అంటే అదంతా మీకొచ్చే లాభమేనన్న మాట. రూ.40X500 = రూ.20,000. కేవలం రూ. 13,500 పెట్టుబడితో రెండే రెండు రోజుల్లో రూ.20,000 సంపాదించినట్లు అవుతుంది. ఈ షేర్ ధర ఎంత పెరుగుతూ ఉంటే ప్రీమియం కూడా అంత పెరుగుతూ ఆమేరకు లాభాలను అందిస్తూ ఉంటుంది. అదే షేర్ ధర 50 రూపాయలు పెరిగినప్పటికీ... అలా పెరగడానికి పట్టే కాలం ఎక్కువగా ఉంటే... వచ్చే లాభం తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటాం.➜ట్రేడర్లలో అత్యధికులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల్ని.. అది కూడా కేవలం స్వల్ప వ్యవధిలోనే సంపాదించేయాలనే ఉద్దేశంతో ఈ ఆప్షన్స్ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు.➜మార్కెట్ పడుతున్నా.. షేర్ ధర క్షీణిస్తున్నా కూడా ఆప్షన్స్లో లాభాలు సంపాదించవచ్చు. ➜ఆప్షన్స్లో మనకొచ్చే లాభాలు అపరిమితం. ఒక్కోసారి కేవలం రూ. 5,000 పెట్టుబడి కూడా ఒక్క నెల రోజుల వ్యవధిలోనే రూ.5 లక్షలు అయిపోవచ్చు. నష్టం వస్తే మాత్రం పోయేది ఆ రూ. 5,000 మాత్రమే. ఇదేదో బానే ఉంది.. బాగా సంపాదించేయవచ్చు అనుకుంటున్నారు కదూ. లక్షలు లక్షలు ఊరికే వచ్చేయవు. ఇందులో వచ్చే దానికంటే పోయేదే ఎక్కువ ఉంటుంది.ఎందుకలా జరుగుతుంది.. షేర్ ధర పెరిగినా ఆప్షన్స్ ఎందుకు పడిపోతాయి. మన పెట్టుబడి ఎందుకు సున్నా అయిపోతుంది... ఆప్షన్స్లో కాల్స్, పుట్స్ పాత్ర ఏమిటి.. ఆప్షన్స్లో ఉండే 'ఆప్షన్స్' ఏమిటి.. వంటి విషయాలను కూలంకషంగా తదుపరి కథనంలో తెలుసుకుందాం. -బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు. -
Stock Market: ఎన్నాళ్లు ఆగితే.. అన్ని లాభాలు!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి విభిన్న మార్గాలున్నాయి. అందులో ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడం ఒకటి. పరోక్షంగా పెట్టుబడి పెట్టడం రెండోది. అంటే ఈక్విటీ మార్కెట్లో రిస్క్ చేయలేని వ్యక్తులు మ్యూచువల్ ఫండ్స్ మార్గాన్ని ఎంచుకోవడమన్న మాట.అదే ట్రేడింగ్ విషయానికొస్తే... మూడు రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. 1. ఈక్విటీలు 2. ఫ్యూచర్స్ ట్రేడింగ్3. ఆప్షన్స్ ట్రేడింగ్ ఇందులో మొదటిదాని గురించి వివరంగా మాట్లాడుకుందాం.సాధారణంగా మన దగ్గర డబ్బులున్నపుడు వాటిని బ్యాంకుల్లోనో, పోస్ట్ ఆఫీసుల్లోనో దాచుకుంటాం. ఈమధ్య స్టాక్ మార్కెట్ కల్చర్ బాగా పెరిగింది. అయితే చాలామంది ఇన్స్టంట్ లాభాల కోసం ఎగబడుతున్నారు. దీంతో వాళ్ళు ట్రేడింగ్ వైపు చూస్తున్నారే తప్ప భవిష్యత్ భరోసా గురించి ఆలోచించడం లేదు. ట్రేడింగ్ వైపు వెళ్లే వ్యక్తుల్లో నూటికి 95 మంది నష్టాల్లో కూరుకుపోయి లబోదిబో మంటున్నారు. అలాకాకుండా దీర్ఘకాలిక దృక్పథం మార్కెట్లోకి అడుగుపెడితే కచ్చితంగా మంచి ప్రయోజనాలే దక్కుతాయి.ఇందులో కూడా మూడు రకాల మార్గాలు అనుసరించవచ్చు. 1. స్వల్ప కాలిక పెట్టుబడి2. మధ్య కాలిక పెట్టుబడి 3. దీర్ఘకాలిక పెట్టుబడిపెట్టుబడులు పెట్టడానికి బాండ్లు, డిబెంచర్లు, రుణ పత్రాలు వంటి వివిధ మార్గాలు ఉన్నప్పటికీ మనం కేవలం స్టాక్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే పై మూడింటి గురించి వివరంగా చర్చించుకుందాం.స్వల్ప కాలిక పెట్టుబడిసాధారణంగా మూడు నెలల వ్యవధి నుంచి 12 నెలల వ్యవధితో చేసే పెట్టుబడుల్ని స్వల్ప కాలిక పెట్టుబడులుగా పరిగణించవచ్చు. అంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ వెంటనే వాటి అవసరం ఉండకపోవచ్చు. వాటిని మార్కెట్లోకి తరలిస్తే... మన అవసరానికి అనుగుణంగా మంచి ఫండమెంటల్స్ ఉన్న షేర్లను ఎంచుకుని స్వల్ప కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు.ఇలాంటి సందర్భాల్లో మూడు పరిణామాలు చోటు చేసుకోవచ్చు. 1. మన పెట్టుబడి అమాంతం పెరిగిపోయి (మనం ఎంచుకునే షేర్లను బట్టి) మంచి లాభాలు కళ్ళచూడొచ్చు. మనం పెట్టుబడి పెట్టిన కంపెనీలకు సంబంధించి వచ్చే సానుకూల వార్తలు ఇందుకు కారణమవుతాయి. ఉదా: సదరు కంపెనీ రేటింగ్ ను అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు పెంచడం, ప్రభుత్వపరంగా సంబంధిత రంగానికి అనుకూలంగా ప్రకటనలు రావడం, ఆర్ధిక ఫలితాలు అద్భుతంగా ఉండటం.... వంటివి ఇందుకు దోహదం చేస్తాయి.2. మన పెట్టుబడి నష్టాల్లోకి జారిపోవడం. ఒక ఆరు నెలల పాటు మనకు డబ్బులతో పని లేదని వాటిని తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేస్తాం. ఆలోపు వివిధ ప్రతికూల అంశాలు మన పెట్టుబడిని హరించి వేస్తాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రభుత్వాలు పడిపోవడం, ఆర్ధిక అనిశ్చిత పరిణామాలు, సంస్కరణలు పక్కదారి పట్టడం... వంటి అంశాలు మార్కెట్లను పడదోస్తాయి. ఇలాంటి సందర్భాల్లో సదరు షేర్లు కూడా ఎప్పటికప్పుడు పడిపోతూ ఉంటాయి.మీరు పెట్టుకున్న కాల వ్యవధి దగ్గర పడుతూ ఉంటుంది. షేర్లు మాత్రం కోలుకోవు.అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బతుకు జీవుడా... అనుకుంటూ ఆ కాస్త సొమ్ముతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు మన అవసరాలు తీరడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆర్జించడం మాట పక్కన పెట్టి అదనపు భారాన్ని మోయాల్సి ఉంటుందన్న మాట.3. పెట్టిన పెట్టుబడి లో పెద్దగా మార్పులు లేకపోవడం. ఆరు నెలలు గడిచినా మనం కొన్న షేర్లు అనుకున్నట్లుగా పెరగకపోవడమో, లేదంటే స్వల్ప నష్టాల్లో ఉండటమే జరుగుతుంది. దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు.మధ్య కాలిక పెట్టుబడి ఇది సాధారణంగా ఏడాది వ్యవధి మొదలుకొని 5 ఏళ్ల వరకు కాలవ్యవధి తో చేసే పెట్టుబడులు ఈ విభాగంలోకి వస్తాయి. స్వల్ప కాలిక పెట్టుబడులతో పోలిస్తే ఇవి ఒకింత మెరుగైన ప్రతిఫలాన్నే ఇస్తాయి. వ్యవధి ఎక్కువ ఉంటుంది కాబట్టి... ఒక ఏడాది రెండేళ్లపాటు మార్కెట్లో ఒడుదొడుకులు ఎదురైనా.. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఆ తర్వాత షేర్లు కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.అదే సమయంలో మన దగ్గర సొమ్ములున్నప్పుడల్లా మనం కొన్న షేర్లనో, వేరే షేర్లనో కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నందువల్ల రాబడి పెరగడానికి కూడా కచ్చితంగా వీలుంటుంది. మనమంతా మిడిల్ క్లాస్ మనుషులం అవడం వల్ల మన అవసరాలు ఎక్కువగానే ఉంటాయి. అందువాళ్ళ మధ్య కాలిక పెట్టుబడి మార్గాన్ని ఎంచుకుంటే తక్కువ రిస్క్ తోనే గణనీయ ప్రయోజనాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది.దీర్ఘ కాలిక పెట్టుబడి ఇది అన్ని విధాలా శ్రేయోదాయకం. అదెలాగంటే...1. మార్కెట్లు ఏళ్ల తరబడి పడిపోతూ ఉండవు. పడ్డ మార్కెట్ పెరగాల్సిందే. 2. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా పెట్టుబడి పెట్టుకుంటూ పోతాం. 3. వివిధ కంపెనీల షేర్లు కొనుగోలు చేయడం వల్ల ఒకట్రెండు నష్టాల్లో ఉన్నా... మిగతావి లాభాల్లో ఉండటం వల్ల మన పెట్టుబడి దెబ్బతినదు.4 . ఒకేసారి లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టేయాల్సిన అవసరం ఉండదు. 5. మన షేర్లపై సదరు కంపెనీలు డివిడెండ్లు ఇస్తాయి. ఇదో అదనపు ప్రయోజనం. 6. ఆయా కంపెనీలు షేర్లను విభజించడం, బోనస్ షేర్లు ఇవ్వడం వల్ల మన పోర్ట్ ఫోలియో లో షేర్ల సంఖ్యా పెరుగుతుంది. 7. మన అవసరాలు దీర్ఘకాలానికి ఉంటాయి కాబట్టి... భవిష్యత్లో అవసరమైనప్పుడో, లేదంటే ఆ షేరు బాగా పెరిగిందని భావించినప్పుడో మనం కొన్ని ప్రాఫిట్స్ ను వెనక్కి తీసుకోవచ్చు లేదా వేరే పెట్టుబడుల్లోకి మళ్లించవచ్చు. 8. పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇత్యాది సందర్భాల్లో అప్పులు చేయాల్సిన దుస్థితి రాకుండా ఉపయోగపడతాయి.సంప్రదాయ డిపాజిట్లు పొదుపులతో పోలిస్తే... స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనేవి అధిక రాబడి ఇవ్వడానికి ఆస్కారం ఉందన్న విషయం అర్ధమయింది కదూ...అయితే మీరు తీసుకునే నిర్ణయమే... మీ భవిష్యత్ కు దిక్సూచిగా నిలుస్తుంది. మీ అవసరాలు స్వల్ప కాలికమా... మధ్య కాలికమా... దీర్ఘ కాలికమా... అన్నది మీరే నిర్ణయించుకోండి. తదనుగుణమా నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగు వేయండి. ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్పగలను.ఎప్పటికప్పుడు మీ పోర్టు ఫోలియో మీద కన్నేసి.. తగిన లాభాలు రాగానే బయటపడటం అనేదే స్వల్ప, మధ్య కాలాలకు ఉపయుక్తంగా ఉంటుంది. దీర్ఘ కాలిక దృక్పథం తో కొంటారు కాబట్టి... లాంగ్ టర్మ్ పెట్టుబడులు ఎప్పటికీ మంచి ఫలితాలే ఇస్తాయి. అయితే దీర్ఘ కాలానికి కొంటున్నాం కదా అని ఎవరో చెప్పారనో... తక్కువకు దొరుకుతున్నాయనో.. వ్యవధి ఎక్కువ ఉంటుంది కదా.. కచ్చితంగా పెరక్కపోవులే అనో... పనికిమాలిన పెన్నీ స్టాక్స్ జోలికి మాత్రం పోకండి.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
కొత్త ఏడాది సరికొత్త మ్యూచువల్ ఫండ్: జనవరి 16 వరకు ఛాన్స్!
ముంబై: యూటీఐ మ్యూచువల్ ఫండ్ (UTI) తమ యూటీఐ క్వాంట్ ఫండ్ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇది ప్రెడిక్టివ్ మోడలింగ్ను పెట్టుబడుల పరిశోధనల్లో యూటీఐకి గల విస్తృత అనుభవం, పెట్టుబడి ప్రక్రియలో అది పాటించే విధానాలను మేళవించి నిర్వహించబడే ఒక యాక్టివ్ ఈక్విటీ ఫండ్. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మల్చుకుంటూ, ఒడిదుడుకులను అధిగమిస్తూ, విస్తృత సూచీలకు మించిన రాబడులను స్థిరంగా అందించడమనేది ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం. ఈ ఎన్ఎఫ్వో 2025 జనవరి 2న ప్రారంభమై 2025 జనవరి 16న ముగుస్తుంది.యూటీఐ క్వాంట్ ఫండ్ అనేది అధునాతనమైన క్వాంటిటేటివ్ పెట్టుబడుల వ్యూహాన్ని పాటించే ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ స్కీము. బెంచ్మార్క్లను మించిన రాబడులు అందించే లక్ష్యంతో ఈ ఫండ్, ‘మూమెంటం, నాణ్యత, లో వోలటైలిటీ (Low Volatility), విలువ’ అనే నాలుగు అంశాలకు డైనమిక్గా వెయిటేజీని కేటాయించేలా ‘ఫ్యాక్టర్ అలొకేషన్’ విధానాన్ని పాటిస్తుంది.విస్తృత మార్కెట్లో సాధారణంగా కనిపించే హెచ్చుతగ్గులను అధిగమించేందుకు ఈ ఫ్యాక్టర్ మోడల్ సహాయకరంగా ఉంటుంది. మిగతా విధానాలతో పోలిస్తే మరింత మెరుగ్గా రిస్కుకు తగ్గ రాబడులను పొందేందుకు తోడ్పడుతుంది. వివిధ మార్కెట్ సైకిల్స్కి అనుగుణంగా మారగలిగే సామర్థ్యాల కారణంగా మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లు వివిధ ఫ్యాక్టర్స్వ్యాప్తంగా కేటాయింపులను సర్దుబాటు చేసుకునేందుకు వీలవుతుంది.ఎలాంటి మార్కెట్ పరిస్థితుల్లోనైనా ముందుకెళ్లేందుకు ఇది ఒక పటిష్టమైన సాధనంగా ఉపయోగపడగలదు. రిస్కుకు తగ్గట్లుగా రాబడులనిచ్చే విషయంలో నిర్వహించిన పరీక్షల్లో ఈ ఫండ్ పటిష్టమైన పనితీరు కనపర్చింది. కాబట్టి వివిధ మార్కెట్ పరిస్థితులవ్యాప్తంగా మెరుగైన రాబడులు పొందే అవకాశాలను కోరుకునేవారికి ఇది ఆకర్షణీయమైన ఆప్షన్ కాగలదు.“మార్కెట్ సంక్లిష్టతలను అధిగమించి, పెట్టుబడుల విషయంలో మరింత సమాచారంతో తగిన నిర్ణయాలు తీసుకునేలా ఇన్వెస్టర్లకు ఒక క్రమబద్ధమైన మరియు పరిశోధన ఆధారితమైన విధానాన్ని అందించాలనేది మా లక్ష్యం. మా పెట్టుబడి ప్రక్రియ స్కోర్ ఆల్ఫాను (Score Alpha) మా సొంత ఫ్యాక్టర్ అలొకేషన్ మోడల్తో (Factor Allocation Model) మేళవించి ఈ ఫండ్ ఒక ‘సమగ్ర పెట్టుబడుల’ విధానాన్ని అమలు చేస్తుంది.2022 ఏప్రిల్ నుంచి యూటీఐ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ తన ఈక్విటీ పోర్ట్ఫోలియో నిర్వహణ కోసం ఈ ప్రక్రియను అమలు చేస్తోంది. ఈక్విటీ ఫండ్కి సంబంధించి ఈ అనుభవాన్ని & విధానాన్ని మరింతగా అందుబాటులోకి తేవడంపై మేము సంతోషిస్తున్నాం” అని యూటీఐ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ శ్రీ వెట్రి సుబ్రమణియం (Vetri Subramaniam) తెలిపారు.“రుజువుల ఆధారిత వ్యూహాలతో ఇన్వెస్టర్లకు సాధికారత కల్పించేలా యూటీఐ క్వాంట్ ఫండ్ ఉంటుంది. సంప్రదాయ పెట్టుబడి సాధనాలు అందించలేని సరళత్వాన్ని, పరిస్థితులకు తగ్గట్లుగా మారగలిగే సామర్థ్యాలను ఇది అందించగలదు. డైనమిక్గా ఉండే నిధుల కేటాయింపు మోడల్ దన్నుతో ఒకవైపు రిస్కులను జాగ్రత్తగా ఎదుర్కొంటూనే మరోవైపు అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఈ ఫండ్ పనిచేస్తుంది. ఇలా రిస్కులు మరియు రాబడుల మధ్య సమతౌల్యతను పాటించగలిగే సామర్థ్యాల కారణంగా, వివిధ మార్కెట్ పరిస్థితులవ్యాప్తంగా మెరుగైన రాబడులను కోరుకునే వారికి ఈ ఫండ్ ఆకర్షణీయమైన ఆప్షన్గా ఉండగలదని ఆశిస్తున్నాం” అని యూటీఐ ఏఎంసీ హెడ్ (ప్యాసివ్, ఆర్బిట్రేజ్ & క్వాంట్ స్ట్రాటెజీస్) శర్వన్ కుమార్ గోయల్ (Sharwan Kumar Goyal) తెలిపారు.ప్రధాన అంశాలు•ఎన్ఎఫ్వో వ్యవధి: 2025 జనవరి 2 నుంచి 2025 జనవరి 16 వరకు•పెట్టుబడి లక్ష్యం: క్వాంటిటేటివ్ పెట్టుబడి థీమ్ను అనుసరించడం ద్వారా ఈక్విటీ మరియు సంబంధిత సాధనాలలో పెట్టుబడి పెట్టి, దీర్ఘకాలిక మూలధన వృద్ధి ప్రయోజనాలను అందించడం. అయితే, స్కీము యొక్క లక్ష్యాలు నెరవేరతాయనే కచ్చితమైన హామీ ఉండదు.•బెంచ్మార్క్: BSE 200 TRI•కనిష్ట పెట్టుబడి: కనిష్ట పెట్టుబడి రూ.1,000.•పథకాలు: రెగ్యులర్ అండ్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి, రెండింటిలో కూడా గ్రోత్ ఆప్షన్ మాత్రమే ఉంది.•లోడ్ స్వరూపం: సెబీ నిబంధనల ప్రకారం ఎంట్రీ లోడ్ లేదు. అయితే, అలాట్మెంట్ తేదీ నుంచి 90 రోజుల్లోపుగా రిడీమ్/స్విచ్ అవుట్ చేస్తే 1% ఎగ్జిట్ లోడ్ వర్తిస్తుంది, ఆ తర్వాత ఉండదు. -
కొత్త సంవత్సరంలో సమీక్షించాల్సినవి..
దేశానికేకాదు, వ్యక్తులకు వారి పెట్టుబడులకు బడ్జెట్ ప్రణాళికలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఏటా ఆయా ఇన్వెస్ట్మెంట్ల(investments)ను సమీక్షించుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో లేదా కొత్త సంవత్సరం ఆరంభంలో సాధారణంగా చాలామంది తమ పెట్టుబడులను సమీక్షిస్తారని చెబుతున్నారు.విడిగా ఒక లక్ష్యానికి ఎంత కాలంలో, ఎంత మొత్తం సమకూర్చుకోవాలన్నది బడ్జెట్లో రాసుకుంటారు. అందుకు అనుకూలించే ఫండ్స్ను ఎంపిక చేసుకుంటారు. మరి సదరు మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds) పనితీరు మీ రాబడులు ఆకాంక్షలకు అనుగుణంగానే పనితీరు చూపిస్తున్నాయా? లేదా? పనితీరు బాగోలేకపోతే ఆ ఒక్క పథకంలోనే అలా ఉందా లేక ఆ విభాగంలోని మిగిలిన పథకాల పనితీరు కూడా అదే మాదిరిగా ఉందా? అన్నది పరిశీలించుకోవాలి. విభాగం మొత్తం పనితీరు అదే మాదిరిగా ఉంటే ఆందోళన అక్కర్లేదు. మరికొంత వ్యవధి ఇచ్చి చూడొచ్చు. పథకంలో లోపం ఉంటే, అందుకు కారణాలను గుర్తించాలి. అవి సమగ్రంగా లేకపోతే మరో పథకంలోకి మారిపోవడాన్ని పరిశీలించొచ్చు.రిస్క్ను అధిగమించేలా..ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఏదో ఒక విభాగంలోని పెట్టుబడుల విలువ గణనీయంగా వృద్ధి చెందితే, రీబ్యాలన్స్ (Re balance) చేసుకోవాలి. ఒక విభాగం పెట్టుబడుల విలువ అధికంగా వృద్ధి చెందినప్పుడు.. అధిక విలువ ఉన్న చోట నిర్ణీత శాతం మేర పెట్టుబడులు విక్రయించి, తక్కువ విలువ వద్దనున్న విభాగంలోకి మార్చుకోవాలి. దీన్నే అస్సెట్ అలోకేషన్గా చెబుతారు. దీని ద్వారా రిస్క్ను అధిగమించొచ్చు. బీమా కవరేజీపై దృష్టిటర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్(Insurance)లోనూ మార్పులు అవసరం పడొచ్చు. ఉదాహరణకు గృహ రుణం తీసుకున్నారని అనుకోండి.. ఆ మేరకు టర్మ్ కవరేజీని పెంచుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఇతర ఏ రుణం తీసుకున్నా సరే ఆ మేరకు కవరేజీ పెంచుకోవాలి. వివాహం, పిల్లలతోపాటు బాధ్యతలూ పెరుగుతుంటాయి. ఏటా ఆదాయం కూడా వృద్ది చెందుతుంది. వాటికి అనుగుణంగా తమ బీమా కవరేజీని సమీక్షించుకోవాలి. ఆరోగ్య బీమా కవరేజీ ప్రస్తుత కుటుంబ అవసరకాలకు సరిపడా ఉందా? అని సమీక్షించుకోవాలి. లేదంటే అదనపు కవరేజీతో తక్కువ వ్యయానికే సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు.ఇదీ చదవండి: 179 మంది మృతి..‘నాదే పూర్తి బాధ్యత’అత్యవసర నిధి.. వీలునామాలో మార్పులురుణ భారంలో ఉంటే కొత్త ఏడాదిలో దాన్నుంచి బయటపడే మార్గాన్ని గుర్తించాలి. అత్యవసర నిధిలోనూ మార్పులు అవసరమే. జీవన వ్యయాలు పెరుగుతూ ఉంటాయి. కనుక 2–5 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న అత్యవసర నిధి ఇప్పటి అవసరాలకు సరిపోకపోవచ్చు. ప్రస్తుత ఖర్చులను కనీసం ఏడాది పాటు అయినా అత్యవసర నిధి గట్టెక్కించగలదా? అన్నది సమీక్షించుకోవాలి. లేదంటే అదనంగా సమకూర్చుకోవాలి. రెండేళ్ల అవసరాలకు సరిపడా ఏర్పాటు చేసుకుంటే మరింత నిశ్చింతగా ఉండొచ్చు. నామినేషన్లు, వీలునామాలో మార్పులు అవసరం అనుకుంటే ఆ మేరకు మార్పులు చేసుకోవాలి. అవసరమైతే ఏడాదిలో ఒక్కసారి అయినా ఆర్థిక నిపుణులను సంప్రదించి సమగ్రమైన సమీక్ష చేయించుకోవాలి. -
నెలకు రూ. 7వేలతో.. ₹32 లక్షలు: ఎలా అంటే?
తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు రావాలంటే.. 'మ్యూచువల్ ఫండ్స్' (Mutual Funds) ఉత్తమ ఎంపిక. ఇప్పటికే రోజుకు 50 రూపాయల పెట్టుబడితే.. కోటి రూపాయలు ఎలా సంపాదించాలి? నెలకు రూ. 10వేలు పెట్టుబడిగా పెడుతూ.. రూ.7 కోట్లు ఎలా పొందాలి? అనే విషయాలను తెలుసుకున్నాం. ఈ కథనంలో నెలకు రూ.7,000 పెట్టుబడి పెడితే.. రూ.32 లక్షలు ఎలా వస్తాయి? దీని కోసం ఎన్ని సంవత్సరాలు వేచి చూడాలి అనే విషయాలు తెలుసుకుందాం.రూ.7వేలుతో.. 32 లక్షల రూపాయలునెలకు రూ.7000 చొప్పున 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే.. మీ ఇన్వెస్ట్మెంట్ (Investment) రూ. 12,60,000 అవుతుంది. దీనికి 11 శాతం రాబడిని ఆశిస్తే.. రిటర్న్స్ రూ. 19,52,003 వస్తాయి. పెట్టుబడి, రిటర్న్స్ కలిపితే 15 ఏళ్లలో మీకు వచ్చే మొత్తం రూ. 32,12,003.మీరు ఎక్కువ లాభాలను పొందాలంటే.. తప్పకుండా దీర్ఘకాలిక పెట్టుబడులు (Long Term Investment) పెట్టడానికి ప్లాన్స్ వేసుకోవాలి. అంతే కాకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఎంత తొందరగా ప్రారంభిస్తే.. మీకు లాభాలు కూడా అంత వేగంగానే వస్తాయి. ఉదాహరణకు, మీరు 20 ఏళ్ల వయసులో పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తే.. 35 సంవత్సరాలకు రూ.32 లక్షలు వస్తాయి.పెట్టుబడులు ఆలస్యం చేస్తే.. లాభాలను పొందటానికి కొంత ఎక్కువ సమయం వేచి చూడాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించాలి.ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటిగమనిక: పెట్టుబడి పెట్టేవారు, ముందుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి అనేది ఒకరు ఇచ్చే సలహా కాదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం తప్పకుండా నిపుణులను సంప్రదించండి. ఆ తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఎంత డబ్బు వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే వచ్చే డబ్బు రాబడుల మీద ఆధారపడి ఉంటుంది. -
టాప్ 10 పోస్టాఫీస్ స్కీమ్స్.. ఎంచుకో ఓ మంచి ఆప్షన్
పెట్టుబడులు పెట్టడానికి, స్థిరమైన రాబడులు పొందటానికి ఉత్తమైన ఆప్షన్ 'పోస్ట్ ఆఫీస్ పథకాలు'. పొదుపు చేసుకోవడానికి, ఉత్తమమైన రాబడులను అందుకోవడానికి.. అందుబాటులో ఉన్న 10 ఉత్తమమైన పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ (Post Office Scheme) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ (Post Office Savings Account)పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ అనేది రిటైల్ బ్యాంక్ అందించే సేవింగ్స్ ఖాతా. ఈ అకౌంట్ కోసం కనీస 500 రూపాయల బ్యాలెన్స్ అవసరం. ఖాతా ఓపెన్ చేసిన తరువాత రూ.50 నుంచి.. ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద ఖాతాదారులకు 4 శాతం వడ్డీ లభిస్తుంది.నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతాసామాన్య ప్రజలు సైతం ఉపయోగించడానికి ఉత్తమైన పోస్టాఫీస్ సేవింగ్ ఖాతాలలో ఒకటి ఈ 'నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్'. ఇందులో నెలకు 100 రూపాయలు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. దీనికి వడ్డీ మూడు నెలలకు ఒకసారి యాడ్ చేస్తారు. వార్షిక వడ్డీ 6.7 శాతంగా ఉంది.నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్ అనేది ఒకటి, రెండు, మూడు, ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో అందుబాటులో ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ ఖాతాను కనిష్టంగా రూ. 1,000లతో ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో వడ్డీ రేటు కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది.నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారులు తమ అకౌంట్లో రూ.9 లక్షల వరకు ఉంచుకోవచ్చు. అయితే ఉమ్మడి ఖాతాలలో రూ.15 లక్షల వరకు ఉండొచ్చు. స్థిరమైన ఆదాయ వనరు కోసం వెతుకుతున్న వారు లేదా.. పదవీ విరమణ చేసిన వారికి ఇది ఓ మంచి ఎంపిక అవుతుంది. ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారులు సుమారు 7 శాతం వడ్డీ పొందవచ్చు.సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారి కోసం ఈ స్కీమ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో రూ. 1000 నుంచి రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వన్-టైమ్ డిపాజిట్లకు కూడా ఇందులో అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారుడు కొంత ఎక్కువ వడ్డీని పొందవచ్చు. సాధారణ ఖర్చుల కోసం పెట్టుబడి రాబడిపై ఆధారపడే సీనియర్ సిటిజన్లకు అనువైనది.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అకౌంట్దీర్ఘకాలిక పొదుపుల కోసం ఎదురుకి హోసేవారికి ఇది మంచి ఎంపిక. ఇందులో రూ. 500 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్లు ఏక మొత్తంలో లేదా వాయిదాలలో చేయవచ్చు. ఇది రిటైర్మెంట్ ప్రణాళిక మరియు ఇతర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో 7.1 శాతం వడ్డీ లభిస్తుంది.సుకన్య సమృద్ధి అకౌంట్ (SSA)ప్రత్యేకంగా ఆడ పిల్లల కోసం అందుబాటులో ఉన్న స్కీమ్. ఇది వారి విద్య, భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ గరిష్టంగా 8.2 శాతం వడ్డీ అందిస్తుంది. ఫ్లెక్సిబుల్ డిపాజిట్ ఆప్షన్లతో ఒక ఆర్థిక సంవత్సరానికి రూ. 250 నుంచి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పథకాన్ని బేటీ బచావో, బేటీ బడవో కింద 2015లో ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రారంభించారు.నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)భారతీయులలో పొదుపును అలవాటు చేయడానికి కేంద్రం ఈ పథకాన్ని పరిచయం చేసింది. ఇందులో ఖాతాదారులు కనిష్టంగా రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు. ఇందులో ఖాతాదారుడు 7 శాతం కంటే ఎక్కువ వడ్డీని పొందవచ్చు.ఇదీ చదవండి: నెలకు ₹10 వేలు.. రూ.7 కోట్ల ఆదాయం - ఎలాగంటే?కిసాన్ వికాస్ పత్ర (KVP)ఈ స్కీమ్ ద్వారా పెట్టే పెట్టుబడి సుమారు 124 నెలల్లో రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో కూడా పెట్టుబడిపి గరిష్ట పరిమితి అంటూ ఏమి ఉండదు. ఇందులో వడ్డీ రేటు 7 శాతం కంటే ఎక్కువే ఉంటుంది.మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC)మహిళలకు ఆర్థికంగా ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ప్రారభించిన పథకమే ఈ 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్'. ఇందులో కనీస పెట్టుబడి రూ. 1000 కాగా, గరిష్టంగా రూ. 2 లక్షలు. ఆర్థిక భద్రత, వృద్ధిని కోరుకునే మహిళలకు ఇది సురక్షితమైన స్కీమ్.Note: పోస్టాఫీస్ పథకాలలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా వీటి గురించి పూర్తిగా తెలుసుకోండి. ఈ పథకాలకు సంబంధించిన అనుమానాలను లేదా ఇతర వివరాలను తెలుసుకోవడానికి మీ సమీపంలోని పోస్ట్ ఆఫీసును సందర్శించండి. ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరగాళ్లు పెరుగుతున్న తరుణంలో.. పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించడం చాలా అవసరం. -
ఫండ్స్ పెట్టుబడులకు హెడ్జింగ్ వ్యూహం?
ఫండ్స్లో పెట్టుబడులు ఉన్నాయి. హెడ్జింగ్ చేసుకోవడం ఎలా? – శ్యామ్ ప్రసాద్ఈక్విటీ మార్కెట్ నష్టపోయే క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీ, స్మాల్క్యాప్ ఇండెక్స్ ఇలా అన్ని సూచీలు పడిపోతుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో హెడ్జింగ్ ఆప్షన్ అంతర్గతంగా ఉండదు. కనుక పెట్టుబడులను వివిధ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవడమే ఇన్వెస్టర్ల ముందున్న మార్గం. వివిధ సాధనాల మధ్య పెట్టుబడుల కేటాయింపుల (అసెట్ అలోకేషన్) ప్రణాళిక కలిగి ఉండడం ఈ దిశగా మంచి వ్యూహం అవుతుంది.ఉదాహరణకు మీ మొత్తం పెట్టుబడుల్లో 50 శాతాన్ని ఈక్విటీలు లేదా ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. మరో 50 శాతాన్ని డెట్ సెక్యూరిటీలు లేదా డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు పెరగడం కారణంగా ఈక్విటీ పెట్టుబడుల విలువ 70 శాతానికి చేరినప్పుడు.. 20 శాతం మేర విక్రయించి ఆ మొత్తాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈక్విటీ/డెట్ రేషియో 50:50గా ఉంటుంది. ఉదాహరణకు రూ. లక్ష పెట్టుబడిలో రూ.50 వేలను ఈక్విటీల్లో, రూ.50 వేలను డెట్లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. కొంత కాలానికి ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.70 వేలకు చేరి, డెట్ పెట్టుబడుల విలువ రూ.55 వేలకు వృద్ధి చెందిందని అనుకుందాం. అప్పుడు ఈక్విటీల నుంచి రూ.7,500 పెట్టుబడిని వెనక్కి తీసుకుని డెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు రెండు సాధనాల్లో పెట్టుబడులు సమానంగా ఉంటాయి.ఒకవేళ ఈక్విటీ మార్కెట్ల పతనంతో ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.50 వేల నుంచి రూ.40 వేలకు తగ్గి, డెట్ పెట్టుబడులు రూ.55వేలుగా ఉన్నాయనుకుంటే.. అప్పుడు డెట్ పెట్టుబడుల నుంచి రూ.7,500ను వెనక్కి తీసుకుని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక సాధనంలో పెట్టుబడుల విలువ మరో సాధనంలోని పెట్టుబడుల విలువ కంటే 10–15 శాతం అధికంగా ఉన్నప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవాలి. అసెట్ అలోకేషన్ ఆటోమేట్ చేసుకోవడం, రీబ్యాలన్స్ వ్యూహాన్ని సరిగ్గా అమలు చేయడం ద్వారా మార్కెట్ల పతనంపై ఆందోళన చెందకుండా రాబడులను పెంచుకోవచ్చు.రూ.50 లక్షలను 15 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని 12 నెలల సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – శ్రీ కైవల్యకొంత రక్షణాత్మక ధోరణిలో అయితే మూడేళ్ల పాటు నెలసరి సమాన వాయిదాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొంత రిస్క్ తీసుకునే ధోరణితో ఉంటే 18 - 24 నెలల సమాన వాయిదాల్లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మార్కెట్లో దిద్దుబాట్లు పెట్టుబడుల అవకాశాలకు అనుకూలం.ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ మొత్తం విలువ తగ్గిపోతే విచారించాల్సి వస్తుంది. అందుకని ఒకే విడత కాకుండా క్రమంగా నెలకు కొంత చొప్పున కొంత కాలం పాటు ఇన్వెస్ట్ చేసుకోవడం సూచనీయం. వైవిధ్యమైన నేపథ్యంతో ఉండే ఫ్లెక్సీ క్యాప్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి వృద్ధి, రిస్్కను సమతుల్యం చేస్తుంటాయి. దీర్ఘకాల లక్ష్యాలకు ఇవి అనుకూలం. మీ వద్దనున్న మొత్తాన్ని లిక్వి డ్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్లో ముందు ఇన్వెస్ట్ చేసుకోవాలి. వాటి నుంచి ప్రతి నెలా నిరీ్ణత మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా ఎంపిక చేసుకున్న ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవాలి.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
నెలకు ₹10 వేలు.. రూ.7 కోట్ల ఆదాయం - ఎలాగంటే?
డబ్బు ఆదా చేయాలనుకుంటే.. అనేక మార్గాలు కనిపిస్తాయి. కొందరు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే, మరికొందరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకొందరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జిస్తారు. ఈ కథనంలో నెలకు 10,000 రూపాయలు పెట్టుబడి పెడుతూ రూ. 7కోట్లు సంపాదించడం ఎలా? అనే విషయాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం.ఒక వ్యక్తి సిప్లో నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే.. సంవత్సరానికి అతని పెట్టుబడి రూ.1.2 లక్షలు అవుతుంది. ఇలా 30 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం రూ.36 లక్షలు అవుతాయి. మార్కెట్ ఆధారంగా 15 శాతం వార్షిక రాబడి వస్తే.. పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. దీంతో ఆ వ్యక్తి ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి అదనంగా రూ. 66 లక్షల కంటే ఎక్కువ డబ్బు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్, అదనంగా వచ్చిన మొత్తం డబ్బు కలిపితే రూ.7 కోట్ల కంటే ఎక్కువ డబ్బు వస్తుంది.ఇన్వెస్ట్ చేయాలనుకునే వ్యక్తి ముందుగానే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలి. ఉదాహరణకు 20 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే.. 50 ఏళ్ల నాటికి రూ.7 కోట్లు పొందవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే దీర్ఘకాలిక పెట్టుబడులలో మాత్రమే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉండ్తుంది.ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటినోట్: పెట్టుబడి పెట్టేవారు, ముందుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి అనేది ఒకరు ఇచ్చే సలహా కాదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం తప్పకుండా నిపుణులను సంప్రదించండి. ఆ తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఖచ్చితంగా ఇంత డబ్బు వస్తుందని చెప్పలేము. ఎందుకంటే వచ్చే డబ్బు రాబడుల మీద ఆధారపడి ఉంటుంది. -
2024లో ప్రముఖ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసిన సినిమా స్టార్స్
-
యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై సెబీ కొరడా
సామాజిక మాధ్యమాల సాయంతో స్టాక్ మార్కెట్ మోసాలకు పాల్పడే వారిపై సెక్యూరిటీస్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చర్యలు తీసుకుంటోంది. సెబీ నిబంధనలకు వ్యతిరేకంగా యూట్యూబ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ బిజినెస్ సాగిస్తున్న రవీంద్ర బాలు భారతి అనే వ్యక్తిపై చర్య తీసుకుంది. ఏప్రిల్ 4, 2025 వరకు సెక్యూరిటీ మార్కెట్లో పాల్గొనకుండా నిషేధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా తాను సంపాదించిన మొత్తం రూ.9.5 కోట్లను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.19 లక్షల మందికి సలహాలు..నిబంధనల ప్రకారం సెబీ రిజిస్టర్డ్ వ్యక్తులు, ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే పెట్టుబడి సలహాలు ఇవ్వాలి. అందులోనూ చాలా నియామాలున్నాయి. కానీ వీటిని పట్టించుకోకుండా కొన్ని రోజులుగా రవీంద్ర బాలు భారతి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పెట్టుబడి సలహాలు, స్టాక్ సిఫార్సులు చేస్తున్నట్లు సెబీ గుర్తించింది. దాంతో స్టాక్ మార్కెట్పై అనుభవం లేనివారే లక్ష్యంగా చేసుకుని అక్రమంగా డబ్బు సంపాదించినట్లు తెలిపింది. తనకు చెందిన రెండు యూట్యూబ్ ఛానెల్ల్లో దాదాపు 19 లక్షల మంది సబ్స్క్రైబర్లతో పెద్దమొత్తంలో నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టుబడి సలహాలు ఇస్తూ భారీగా నగదు పోగు చేసినట్లు సెబీ పేర్కొంది.రూ.10 లక్షలు జరిమానారవీంద్ర సంపాదించిన డబ్బును రవీంద్ర భారతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్పై ఇన్వెస్ట్ చేసినట్లు సెబీ పేర్కొంది. ఏప్రిల్ 2025 వరకు ఎలాంటి సెక్యూరిటీ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా భారతి, అతని సంస్థ, తన సహచరులపై సెబీ నిషేధం విధించింది. రవీంద్ర, తన సహచరులకు రూ.10 లక్షల జరిమానా విధించింది. తాను ఈ మోసాలతో సంపాదించిన రూ.9.5 కోట్లను తిరిగి ఇవ్వాలని సెబీ ఆదేశించింది.ఇదీ చదవండి: రూ.22,280 కోట్ల ఆస్తుల పునరద్ధరణస్వతహాగా నేర్చుకోవడం ఉండదు..సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ వీడియోల ద్వారా, బంధువులు, స్నేహితులు చెబుతున్నారని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే తాత్కాలికంగా డబ్బులు వచ్చినట్లు కనిపించినా దీర్ఘకాలంలో చాలా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యవహారంతో ఎదుటి వ్యక్తులు, వీడియోలపైనే ఎక్కువగా ఆధారపడే స్వభావం అలవడుతుందని అంటున్నారు. దాంతో మార్కెట్ గురించి స్వతహాగా నేర్చుకునే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. వీడియోలు చూసి ట్రేడింగ్ చేస్తే నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
రూ.1,200 కోట్ల సంపద.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..
వివేక్ ఒబెరాయ్ ప్రముఖ నటుడిగానే అందరికి తెలుసు. కానీ, తన పదహారో ఏటే స్టాక్ మార్కెట్లో శిక్షణ తీసుకుని కమోడిటీ ట్రేడింగ్ చేసేవారని చాలా మందికి తెలియకపోవచ్చు. అలా స్టాక్ మార్కెట్, నట జీవితంలో వచ్చిన డబ్బుతో పాటు విభిన్న వ్యాపారాల వల్ల తాను ప్రస్తుతం రూ.1,200 కోట్ల సంపదను సృష్టించుకున్నారు. అత్యంత సంపన్న నటుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన తన సంపదను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇటీవల తెలియజేశారు.వివేక్ ఒబెరాయ్ చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించడంతోపాటు దాన్ని సమర్థంగా ఎలా నిర్వహించాలనే దానిపై దృష్టి సారించేవారు. తాను సినిమాల్లోకి రాకముందే వాయిస్ఓవర్ అసైన్మెంట్లు, హోస్టింగ్ షోలు చేసేవారు. అందులో వచ్చిన డబ్బును సమర్థంగా పెట్టుబడి పెట్టాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. దాంతో విభిన్న వ్యాపార ఆలోచనలను అన్వేషిస్తూ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించారు. చిన్న వయసులోనే స్టాక్ మార్కెట్ను అర్థం చేసుకోవడానికి స్టాక్ బ్రోకర్లతో శిక్షణ తీసుకున్నట్లు ఓ ఇంటర్వూలో చెప్పారు. తన పదహారో ఏట మార్కెట్లో పోర్ట్ఫోలియోను నిర్మించుకున్నారు. ఎక్కువగా కమోడిటీ ట్రేడింగ్ చేసేవారని చెప్పారు. 19 ఏళ్ల వయసులోనే ఒక టెక్ స్టార్టప్ను ప్రారంభించారు. 22 సంవత్సరాల వయసులో మంచి లాభంతో దాన్ని ఓ బహుళజాతి సంస్థకు విక్రయించినట్లు తెలిపారు.వ్యూహాత్మక పెట్టుబడులుముంబయిలోని మిథిబాయి కాలేజీ నుంచి కామర్స్ గ్రాడ్యుయేషన్లో పట్టా పొందిన వివేక్ ఒబెరాయ్ ప్రస్తుతం తన వద్ద ఉన్న సంపదను రెండు భాగాలు విభజించినట్లు చెప్పారు. 60 శాతం సంపదను స్థిరంగా ఆదాయం సమకూర్చే విభాగాల్లో పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. మరో 40 శాతం సంపదను ప్రైవేట్ ఈక్విటీ, రియల్ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్నట్లు, ఆకర్షణీయ స్టార్టప్ల్లో వెంచర్ క్యాపిటలిస్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలంలో మంచి రాబడులు రావాలంటే భవిష్యత్తుపై స్పష్టమైన అంచనాలతో ప్రయోగాత్మక పెట్టుబడులు పెట్టాలని చెబుతున్నారు.ఇదీ చదవండి: రైల్వే కొత్త రూల్.. ఒరిజినల్ ఐడీ లేకుండా రైలెక్కితే..రియల్ ఎస్టేట్: వివేక్ ఒబెరాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో దృష్టి సారించి కర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను స్థాపించారు.డైమండ్ బిజినెస్: దేశవ్యాప్తంగా 18 స్టోర్లతో సోలిటారియో అనే డైమండ్ కంపెనీని స్థాపించారు.ఈవెంట్ మేనేజ్మెంట్: వివేక్ ‘మెగా ఎంటర్టైన్మెంట్’ అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని స్థాపించారు.ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్: సుమారు రూ.3,400 కోట్ల (సుమారు 400 మిలియన్ డాలర్లు) విలువైన ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ స్టార్టప్ను ప్రారంభించారు.ఫ్యామిలీ కార్యాలయం: ‘ఒబెరాయ్ ఫ్యామిలీ ఆఫీస్’ ద్వారా పెట్టుబడులను మేనేజ్ చేస్తున్నారు. -
మళ్లీ డబ్బు పెడుతున్న ఎఫ్పీఐలు
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీరేట్లను మరింత తగ్గించనుందనే అంచనాలతో భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను పెంచుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారీగా అమ్మకాలు చేసిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్పీఐ) రెండు వారాలుగా తిరిగి ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ను పెంచుతున్నారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.డిసెంబరు మొదటి రెండు వారాల్లో ఎఫ్పీఐలు నికరంగా రూ.22,766 కోట్లను భారతీయ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు. నవంబర్లో వీరు రూ.21,612 కోట్లు, అక్టోబర్లో భారీగా రూ.94,017 కోట్లను ఉపసంహరించుకున్నారు. అంతకుముందు సెప్టెంబరులో ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్ తొమ్మిది నెలల గరిష్టానికి చేరడం విశేషం. ఆ నెలలో నికర పెట్టుబడి రూ.57,724 కోట్లుగా ఉంది.ఇదీ చదవండి: క్లెయిమ్ చేసుకోని నిధులు రూ.880 కోట్లుఎఫ్పీఐలు పెరగడానికిగల కారణాలు..అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతపై అంచనాలు: ఇప్పటికే ఫెడ్ వడ్డీరేట్లను దాదాపు 50 బేసిస్ పాయింట్లకు తగ్గించింది. డిసెంబర్ 19న విడుదలయ్యే ఫెడ్ సమావేశంలో మరో 25 బేసిస్ పాయింట్లను తగ్గించనున్నట్లు అంచనా వేస్తున్నారు. దాంతో ఇతర ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్లను మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.మార్కెట్ సెంటిమెంట్: సానుకూల రాజకీయ పరిణామాలు, కార్పొరేట్ ఆదాయాల్లో రికవరీ, ప్రైమరీ, సెకండరీ మార్కెట్లలో పెరిగిన పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచాయి.సీఆర్ఆర్ తగ్గింపు: క్యాష్ రిజర్వ్ రేషియో(సీఆర్ఆర్) తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం వల్ల మార్కెట్లో లిక్విడిటీ, సెంటిమెంట్ మెరుగుపడనుంది.ద్రవ్యోల్బణం తగ్గుదల: భారత వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం అక్టోబర్లో 6.21 శాతం నుంచి నవంబర్లో 5.48 శాతానికి తగ్గింది. ఇది ఆర్బీఐ ద్రవ్య విధాన సడలింపుపై ఆశలను పెంచింది.చైనా మార్కెట్లలో అనిశ్చితి: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చైనా వస్తువులపై ప్రతిపాదిత సుంకాల పెంపు అంచనాలు భారతీయ ఈక్విటీలకు పాజిటివ్గా నిలుస్తున్నాయి. -
స్టాక్ మార్కెట్లకు ఈ వారం.. ఇవే కీలకం!
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు ప్రధానంగా దేశ, విదేశీ గణాంకాలు దిక్సూచిగా నిలిచే అవకాశముంది. దేశీయంగా టోకు ధరల ద్రవ్యోల్బణం, వాణిజ్యం తదితర గణాంకాలు వెల్లడికానున్నాయి. అంతర్జాతీయంగా యూఎస్ ఆర్థిక వ్యవస్థ పనితీరు, ఆ దేశ కేంద్ర బ్యాంకు పరపతి విధాన సమీక్ష కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ సీనియర్ టెక్నికల్ విశ్లేషకులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు.వీటికితోడు ముడిచమురు ధరలు, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో డాలరు మారకం వంటి అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. సెప్టెంబర్, అక్టోబర్లో అమ్మకాలకే మొగ్గు చూపిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఇటీవల దేశీ స్టాక్స్లో కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న విషయం విదితమే. వెరసి విదేశీ పెట్టుబడులతోపాటు.. రాజకీయ భౌగోళిక అంశాలూ సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గురువారం(19న) పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. ద్రవ్యోల్బణం మందగించడం, ఉపాధి మార్కెట్ పటిష్టత నేపథ్యంలో వడ్డీ రేటులో 0.25 శాతం కోత విధించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గత నెల 7న చేపట్టిన పాలసీ మినిట్స్ సైతం ఇందుకు మద్దతిస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వైస్ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలియజేశారు.ఇక ఇదే రోజున ఈ ఏడాది మూడో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు విడుదలకానున్నాయి. ముందస్తు అంచనాల ప్రకారం యూఎస్ జీడీపీ 2.8 శాతం పుంజుకుంది. నేడు నవంబర్ నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు వెల్లడికానున్నాయి. రేపు(17న) యూఎస్ రిటైల్ సేల్స్, 18న జపాన్ వాణిజ్య గణాంకాలు తెలియనున్నాయి. వారాంతాన(20న) నవంబర్ ద్రవ్యోల్బణ రేటును జపాన్ ప్రకటించనుంది.ఆర్థిక గణాంకాలునేడు(16న) దేశీయంగా నవంబర్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. అక్టోబర్లో డబ్ల్యూపీఐ 2.36 శాతం పెరిగింది. ఇదే రోజు వాణిజ్య గణాంకాలు సైతం విడుదల కానున్నాయి. అక్టోబర్లో వాణిజ్య లోటు 24.1 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ బాటలో హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ, సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. అక్టోబర్లో త యారీ పీఎంఐ 57.5కు చేరగా, సర్వీసుల పీఎంఐ 58.5ను తాకింది. గత వారమిలా శుక్రవారం(13)తో ముగిసిన గత వారం దేశీ స్టాక్ ఇండెక్సులు భారీ ఆటుపోట్ల మధ్య స్వల్పంగా బలపడ్డాయి. సెన్సెక్స్ నికరంగా 424 పాయింట్లు(0.5 శాతం) పుంజుకుని 82,133 వద్ద ముగిసింది. నిఫ్టీ 91 పాయింట్లు(0.4 శాతం) మెరుగై 24,768 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.2 శాతం బలపడితే.. స్మాల్ క్యాప్ ఇదేస్థాయిలో నీరసించింది. గత వారం మార్కెట్ విలువరీత్యా టాప్–10 కంపెనీలలో 5 కంపెనీలు బలపడగా.. మరో 5 దిగ్గజాలు నీరసించాయి.దీంతో వీటి మార్కెట్ విలువ నికరంగా రూ. 1.13 లక్షల కోట్లమేర బలపడింది. ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ. 47,837 కోట్లు, ఇన్ఫోసిస్ విలువ రూ. 31,827 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువ రూ. 11,888 కోట్లు చొప్పున ఎగసింది. ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంక్ విలువకు రూ. 11,761 కోట్లు, టీసీఎస్కు రూ. 9,805 కోట్లు చొప్పున జమయ్యింది. అయితే ఆర్ఐఎల్ మార్కెట్ విలువ రూ. 52,032 కోట్లు, ఎల్ఐసీ విలువ రూ. 32,068 కోట్లు, హెచ్యూఎల్ విలువ రూ. 22,561 కోట్లు చొప్పున క్షీణించింది. -
పెట్టుబడులకు మరోమార్గం... మ్యూచువల్ ఫండ్స్
విత్తనాలు నాటితే మొక్కలు వస్తాయి. చెట్లుగా.. ఆపై వృక్షాలుగా ఎదుగుతాయి. పూలు, పళ్ళు ఇస్తాయి. ఇదంతా ఒక్క రోజులో జరిగిపోదు.డబ్బులకూ అదే సూత్రం వర్తిస్తుంది. డబ్బులు నాటితే డబ్బులు మొలకెత్తుతాయి. ఆపై అవి లక్షలు, కోట్లుగా రూపాంతరం చెందుతాయి. ఇది కూడా ఒక్ కరోజులో జరిగే పని కాదు. మన కష్టార్జితాన్ని ఇంతలింతలు చేసుకోవడానికి ఎలాంటి సాధనాలు ఎంచుకోవాలి అన్నదే ప్రధాన ప్రశ్న.మీరు అధ్యయనం చేసి... నిపుణుల సలహా తీసుకుని..తెలివి తేటలతో వ్యవహరించి పెట్టుబడులు పెట్టగలిగితే.. దీర్ఘకాలంలో మంచి రాబడి పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా మన సొమ్ములు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే సాధనాలు ఏవో తెలిసి ఉండాలి. దాని కంటే ముందే మీదగ్గరున్న డబ్బుల నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారో కూడా మీకు తెలిసి ఉండాలి. లేదంటే ఏళ్ళుగడిచినా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరి మీ జీవితం ఎదుగూ బొదుగూ ఉండదు.తాము చేసే పొదుపు బాగా పెరగాలని, రెట్టింపు అవ్వాలని ఎవరు అనుకోరు చెప్పండి. మీరూ ఇందుకు మినహాయింపు కాదంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... కాస్త రిస్క్ తీసుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉండటం. కొద్దిగా రిస్క్ తీసుకోగలిగి... దీర్ఘకాలంపాటు వేచిఉండేవాళ్ళకు అనువైన పెట్టుబడి సాధనంగా మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పొచ్చు.స్టాక్ మార్కెట్లో 100% రిస్క్ తీసుకోలేనివాళ్లకు ఉపయుక్తమైన పెట్టుబడి మార్గం మ్యూచువల్ ఫండ్స్. మనం ఈ ఫండ్స్లో సరైన వాటిని ఎంచుకుని పెట్టుబడి పెడితే కొన్నాళ్ళకు అవి మంచి రాబడి అందిస్తాయి. ఇందులో రెండు రకాలు ఉంటాయి.1. సిప్స్2. పెద్దమొత్తంలో ఒకేసారి పెట్టుబడిమీరు ఒక మ్యూచువల్ ఫండ్ స్కీను ఎంచుకుని నెలకు కొంత మొత్తం చొప్పున పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. ఇదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్). అధిక మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టలేని వాళ్లకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మీచేతిలో తగినంత మొత్తం ఉండి పెద్దమొత్తంలో పెట్టి దీర్ఘకాలం వేచి ఉంటే మంచి రాబడి పొందడం రెండో మార్గం.ఎలాంటి ఫండ్స్ ఎంచుకోవాలి?మ్యూచువల్ ఫండ్స్ను వివిధ టాటా, బిర్లా, రిలయన్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి ప్రముఖ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. అయితే మనపెట్టుబడికి తగ్గట్టు, స్థిరంగా రాబడి అందివ్వగల ఫండ్స్ను ఎంచుకోవాలి. యాంఫి (AMFI) వెబ్సైటులో ఫండ్స్ కు సంబంధించిన యావత సమాచారం దొరుకుతుంది.ప్రస్తుతం దేశంలో వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందిస్తున్న స్కీంల్లో ప్రధానమైనవాటిగా ఈకింది వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. » ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్» ఆదిత్య బిర్లా సన్ లైఫ్ స్మాల్ & మిడ్ క్యాప్ ఫండ్» టాటా ఈక్విటీ పీఈ ఫండ్» హెచ్డీఎఫ్సీ మంత్లీ ఇన్కమ్ ప్లాన్» ఎల్&టీ టాక్స్ అడ్వాంటేజ్ ఫండ్» ఎస్బీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్» కోటక్ కార్పొరేట్ బాండ్ ఫండ్» కెనరా రోబెకో గిల్టీ పీజీఎస్» డీఎస్పీ బ్లాక్రాక్ బ్యాలెన్స్డ్ ఫండ్» యాక్సిస్ లిక్విడ్ ఫండ్వీటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా పరిశీలించి ఎంతెంత రాబడి అందిస్తున్నాయి, రిస్క్ ఏ స్థాయిలో ఉంటుంది, పెట్టుబడి ఎలా పెట్టాలి, కాలావధి, వివిధ రేటింగ్ సంస్థలు ఇచ్చిన రేటింగ్, గతకాలపు పనితీరు.... ఇత్యాది అంశాలు సంపూర్ణంగా విశ్లేషించుకుని పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.ఇక అధిక రిస్క్తోపాటు అధికరాబడి ఇస్తున్న ఫండ్స్ విషయానికొస్తే... » హెచ్ఎస్బీసీ మిడ్ క్యాప్ ఫండ్» కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్» ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్» యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్» ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్» మిరే అసెట్ మిడ్ క్యాప్ ఫండ్» టాటా మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్పై వాటిని ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు, ఇక మహీంద్రా మేన్యూ లైఫ్ మిడ్ క్యాప్ ఫండ్, సుందరం మిడ్ క్యాప్ ఫండ్ లు 30 శాతంపైగా వార్షిక రిటర్న్ లు అందిస్తున్నాయి. సిప్ పెట్టుబడుల విషయానికొస్తే... గత అయిదేళ్లుగా ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 30 శాతంపైగా రాబడి ఇస్తోంది.మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయి?మ్యూచువల్ ఫండ్స్ మీ దగ్గర సమీకరించిన సొమ్ముల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అలాచేయడానికి ముందే మీ రిస్క్ కెపాసిటీ, మీ ఆలోచనలు, రాబడి అంచనాలు... వంటి సమాచారాన్ని మీ దగ్గర నుంచి సేకరిస్తాయి. తదనుగుణంగా మీ సొమ్ముల్ని వివిధ పెట్టుబడి మార్గాల్లోకి మళ్లిస్తాయి.» సెక్టోరియల్ ఫండ్స్» టాక్స్ సేవింగ్ ఫండ్స్» ఇండెక్స్ ఫండ్స్» డెట్ ఫండ్స్» స్మాల్ క్యాప్ ఫండ్స్» మిడ్ క్యాప్ ఫండ్స్» లార్జ్ క్యాప్ ఫండ్స్ఇలా భిన్నమైన మార్గాల్లో మీ సొమ్ములను ఇన్వెస్ట్ చేస్తాయి. తద్వారా వచ్చే రాబడిని మీకు బదిలీ చేస్తాయి (ట్యాక్స్లు, కమీషన్లు, చార్జీలు వసూలు చేసుకుని).స్టాక్ మార్కెట్తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టే వారికి రిస్క్ తక్కువే ఉంటుంది. కానీ రాబడి కూడా అదేస్థాయిలో ఉంటుంది. కాబట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా ఫండ్ స్కీంలకు సంబంధించిన సమాచారాన్ని మదింపు చేసిన తర్వాతే ముందడుగు వేయడం మంచిది. వివిధ ఫండ్లకు సంబంధించి విశ్లేషణాత్మక సమాచారాన్ని రాబోయే రోజుల్లో తెలుసుకుందాం.-బెహరా శ్రీనివాసరావు, స్టాక్ మార్కెట్ నిపుణులు -
నువామా వెల్త్ చేతికి ఓయో షేర్లు
న్యూఢిల్లీ: ట్రావెల్ టెక్ యూనికార్న్ ఒరావెల్ స్టేస్ లిమిటెడ్లో నువామా వెల్త్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రూ. 100 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఓయో బ్రాండ్ కంపెనీ వాటాను షేరుకి రూ. 53 చొప్పున సొంతం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. సెకండరీ మార్కెట్లో లావాదేవీ ద్వారా కంపెనీ తొలి ఇన్వెస్టర్ల నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాయి. మరోపక్క ఆతిథ్య రంగ కంపెనీలో వాటా కొనుగోలుకి ఇన్క్రెడ్ తదితర సంస్థలు సైతం ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించాయి. ఇందుకు షేరుకి రూ. 53–60 మధ్య ధరను చెల్లించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి కంపెనీ విలువను 5 బిలియన్ డాలర్లకుపైగా మదింపు చేసినట్లు వివరించాయి. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వీటి ప్రకారం ఏప్రిల్–జూన్(క్యూ1)లో సుమారు రూ. 132 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2023–24) క్యూ1లో రూ. 108 కోట్ల నష్టాలు ప్రకటించింది. -
కొఠారి ఇండస్ట్రియల్లో ఎఫ్జేకు వాటా
చెన్నై: నాన్లెదర్ ఫుట్వేర్, డ్రోన్ల తయారీ కంపెనీ కొఠారి ఇండస్ట్రియల్ కార్పొరేషన్లో ఖతార్ సంస్థ ఎఫ్జే గ్లోబల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ 10 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. కంపెనీ బోర్డు ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు కొఠారి ఇండస్ట్రియల్ పేర్కొంది.వెరసి కొఠారి ఇండస్ట్రియల్లో దోహా బ్యాంక్, ఖతార్ ఎయిర్వేస్ సంస్థల ప్రమోటర్ ఎఫ్జే గ్లోబల్ 70,56,000 షేర్లను సొంతం చేసుకోనుంది. రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరునూ రూ. 25 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు కొఠారి వెల్లడించింది. మరోపక్క అధీకృత మూలధనాన్ని రూ. 25 కోట్ల నుంచి రూ. 75 కోట్లకు పెంచేందుకు సైతం బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ తెలియజేసింది.అయితే ప్రమోటర్ రఫీఖ్ అహ్మద్ కంపెనీలో 47 శాతం వాటాను నిలుపుకునేందుకుగాను మరిన్ని పెట్టుబడులు చేపట్టనున్నట్లు పేర్కొంది. కాగా.. ఫుట్వేర్ తయారీ సంస్థ ఫీనిక్స్ కొఠారి ఫుట్వేర్లో అహ్మద్ 30 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు సైతం బోర్డు అనుమతించినట్లు కొఠారి ఇండస్ట్రియల్ వెల్లడించింది. బీఎస్ఈలో కొఠారి ఇండస్ట్రియల్ 2% బలపడి రూ. 72.5 వద్ద ముగిసింది. -
రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటి
ఒక్కో నీటి బిందువే.. మహా సముద్రమైనట్లు, ఒక్కో రూపాయి పోగేస్తేనే కోటీశ్వరులవుతారు. కాబట్టి రోజుకు కేవలం రూ.50 ఆదా చేయడం ద్వారా.. కోటి రూపాయలు సొంతం చేసుకోవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇదెలా సాధ్యం? దీని గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.రోజుకి 50 రూపాయలు ఆదా చేస్తే.. నెలకు రూ.1,500, సంవత్సరానికి రూ.18,000 అవుతాయి. అయితే కోటి రూపాయలు కావాలంటే మాత్రం దీనిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతే కంటే ముందు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అయితే కోటి రూపాయల కోసం దీర్ఘకాలిక పెట్టుబడి అవసరం.రోజుకు రూ.50 పొదుపు చేస్తూ.. రూ.1 కోటి సొంతం చేసుకోవాలంటే, ముందుగానే పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. కనీసం 30 ఏళ్ల వరకు ఇన్వెస్ట్మెంట్లలను కొనసాగించాలి. ఇలా చేస్తూ ఉండటం వల్ల 10 నుంచి 20 శాతం వరకు రాబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కంపౌండింగ్ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.మీరు 25 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, మీరు కోటి రూపాయలు ఎలా పొందుతారో ఇక్కడ చూడండి.➤రోజుకి 50 రూపాయలు కాబట్టి.. 10 సంవత్సరాలలో మీ పెట్టుబడి రూ.1,80,000 అవుతుంది. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.2,13,137 వస్తాయి. కాబట్టి ఈ మొత్తం రూ. 3,93,137.➤ఇదే విధంగా 20 సంవత్సరాలలో, మీ పెట్టుబడి రూ.3,60,000. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.16,14,519. కాబట్టి మొత్తం రూ.19,74,519.➤30 సంవత్సరాలలో.. పెట్టుబడి రూ.5,40,000 అయితే.. దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.77,95,583 వస్తాయి. వీటి మొత్తం రూ.83,35,583.➤32 సంవత్సరాలలో, మీ పెట్టుబడి రూ.5,76,000, దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ.1,04,76,949 అవుతుంది. కాబట్టి మీరు పొందే మొత్తం రూ.1,10,52,949.పైన చెప్పిన విధానం ప్రకారం, మీరు పెట్టే పెట్టుబడి, దానికి ఎంత లాభం వస్తుంది. చివరగా చేతికి ఎంత వస్తుందనే వివరాలు స్పష్టంగా అవగతం అవుతాయి.ఇదీ చదవండి: 15X15X15 ఫార్ములా.. కోటీశ్వరులు అవ్వడానికి ఉత్తమ మార్గం!గమనిక: పెట్టుబడి పెట్టేవారు, ముందుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి అనేది ఒకరు ఇచ్చే సలహా కాదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం తప్పకుండా నిపుణులను సంప్రదించండి. ఆ తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. -
7 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ.. 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: భారతదేశం 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరమని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి పలు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించింది. ఈ మేరకు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా, ‘ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్: రివైవింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్’ శీర్షికన ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘2030 నాటికి భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పరిమాణాన్ని 7 ట్రిలియన్ డాలర్లకు విస్తరించడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2.2 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి అత్యవసరం‘ అని నివేదికలో పేర్కొంది. నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ వివరించిన నివేదికలోని కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తే... → 2030 నాటికి భారత్ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక పరిమాణాన్ని సాధించడానికి దేశం 2024– 2030 మధ్య 10.1 శాతం పురోగతి సాధించాలి. → మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ అభివృద్ధికి కీలకం. ఈ విషయంలో దేశం ఎంతో పురోగతి సాధించింది. పెరిగిన బడ్జెట్ కేటాయింపులతో లాజిస్టిక్స్ పనితీరు సూచిక (ఎల్పీఐ) విషయంలో భారత్ ర్యాంకింగ్ 2023లో 54కు ఎగసింది. 2014లో ఇది సూచీ 54 వద్ద ఉంది. → గత కొన్ని సంవత్సరాలుగా దేశ మౌలిక సదుపాయాలను గణనీయంగా విస్తరించేందుకు విధాన నిర్ణేతలు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. → దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి తద్వారా ఆర్థిక వృద్ధిలో చురుగ్గా పాల్గొనేందుకు ప్రైవేట్ సంస్థలకు దేశంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ దిశలో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. → అయితే మౌలిక రంగం పురోగతికి సంబంధించి ఎదురయ్యే కొన్ని సవాళ్లు సైతం ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా చూస్తే, ద్రవ్యలోటు పరంగా ఎదురయ్యే సవాళ్లను ఇక్కడ ప్రస్తావించుకోల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు తీవ్రం కాకుండా చూసుకోవడంలో భాగంగా మౌలిక రంగంపై పెట్టుబడుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి వ్యహరించాల్సిన అవసరం ఉంటుంది. → భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యం గణనీయంగా తగ్గింది, 2009–13 మధ్య 160 బిలియన్ల (మొత్తం పెట్టుబడులలో 46.4 శాతం) ప్రైవేటు పెట్టుబడులు ఉన్నాయి. 2019–23 మధ్య ఈ విలువ దారుణంగా 39.2 బిలియన్ (మొత్తం పెట్టుబడుల్లో 7.2 శాతం)క డాలర్లకు పడిపోయింది. అయితే ప్రభుత్వ పరంగా ఈ విభాగంలో పెట్టుబడులు పెరిగాయి. అయితే ఇది ద్రవ్యలోటు సమస్యలకూ దారితీస్తున్న సమస్య. ప్రైవేటు రంగంలో మౌలిక విభాగ పెట్టుబడులు పెరగడం వల్ల ప్రభుత్వాలు ద్రవ్యలోటు సమతౌల్యతను రక్షించగలుగుతాయి. → మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధికి తోడ్పడే చర్యల విషయంలో ప్రభుత్వ వ్యయాన్ని వినియోగించవచ్చు. ప్రజారోగ్య సంరక్షణ, మానవ వన రుల పురోగతి, రుణ చెల్లింపులు వంటి ఇతర ఆర్థిక వృద్ధికి సంబంధించిన ఇతర కీలక విభాగాలకు ప్రభుత్వం వ్యయాన్ని మళ్లించవచ్చు. → రంగాల వారీగా చూస్తే పునరుత్పాదక ఇంధనం, డేటా సెంటర్లు, రోడ్డు రవాణా రహదారులు, గోడౌన్లు, రవాణా రంగాలు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడానికి తగిన కీలక విభాగాలు. → వేగవంతమైన పట్టణీకరణ, యువత అధికంగా ఉండడం, పట్టణ ప్రాంతాల పురోగతి, ఎయిర్పోర్ట్లు, విద్యుత్ సరఫరా వంటి రంగాలు భారీ పెట్టుబడి అవకాశాలను కలిగి ఉన్నాయి. -
విస్తరిస్తున్న డేటా సెంటర్లు.. భారీగా పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీయంగా విస్తరిస్తున్న డేటా సెంటర్ మార్కెట్ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఆరేళ్ల వ్యవధిలో (2019–24) 60 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశ ఇన్వెస్టర్లు హామీ ఇచ్చారు. దీంతో 2027 ఆఖరు నాటికి ఈ విభాగంలోకి మొత్తం పెట్టుబడులు 100 బిలియన్ డాలర్ల స్థాయిని దాటిపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి.రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ సౌత్ ఏషియా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘భారత డేటా సెంటర్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అంతర్జాతీ య సంస్థలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి‘ అని నివేదిక పేర్కొంది. పెట్టుబడుల హామీలు పొందిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అగ్రస్థానాల్లో ఉన్నాయి. అసాధారణ వృద్ధి.. పెరుగుతున్న డిజిటల్ వినియోగం, ప్రభుత్వ తోడ్పాటు, దేశ విదేశ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల దన్నుతో భారత డేటా సెంటర్ మార్కెట్ అసాధారణ వృద్ధిని నమోదు చేస్తోందని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. బీఎఫ్ఎస్ఐ, టెక్నాలజీ, టెలీకమ్యూనికేషన్స్ రంగాల నుంచి డిమాండ్ నెలకొనడం, రాష్ట్రాల స్థాయిలో పాలసీలపరంగా ఇస్తున్న ప్రోత్సాహకాలు మొదలైనవి ఇందుకు దోహదం చేస్తున్నాయని వివరించారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..2025 ఆఖరు నాటికి భారత డేటా సెంటర్ సా మర్థ్యం 2,070 మెగావాట్ల స్థాయికి చేరు కోనుంది. ప్రస్తుతం ఇది 1,255 మెగావాట్లుగా ఉండగా, ఈ ఏడాది ఆఖరు నాటికి 1,600 మెగావాట్లకు చేరుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. డేటా సెంటర్ల సంఖ్యాపరంగా ముంబై అగ్రస్థానంలో ఉండగా చెన్నై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దేశీయంగా మొత్తం డేటా సెంటర్ సామర్థ్యాల్లో 90 శాతం ఈ నగరాల్లోనే ఉన్నాయి. టెక్నాలజీ వినియోగం వేగవంతం కావడం, డిజిటల్ పరివర్తన, ఇంటర్నెట్ విస్తృతి పెరగడం, సానుకూల విధానాలు, (ఏఐ) ఆధారిత డేటా మొదలైనవి డేటా సెంటర్ల వృద్ధికి తోడ్పడగలవు. అలాగే ఈ విభాగానికి మౌలిక రంగం హోదా ఇవ్వడం సైతం ఇందుకు దోహదపడుతున్న కీలకాంశాల్లో ఒకటి. దీనితో ఆపరేటర్లు, డెవలపర్లకు ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది. డిజిటల్ వ్యక్తిగత డేటా భ ద్రత చట్టం (డీపీడీపీఏ) అమలు అనేది చట్ట బద్ధమైన డేటా ప్రాసెసింగ్కు, సంబంధిత వర్గాల విశ్వాసాన్ని చూరగొనేందుకు దోహదపడింది. -
15X15X15 ఫార్ములా.. కోటీశ్వరులు అవ్వడానికి ఉత్తమ మార్గం!
డబ్బు సంపాదించాలని, కోటీశ్వరులవ్వాలని అందరికీ ఉంటుంది. అయితే ఆలోచన ఒక్కటి ఉంటే సరిపోదు, ఆచరణ కూడా అవసరం. ఈ కథనంలో 15 సంవత్సరాల్లో కోటీశ్వరులు ఎలా అవ్వాలో అనే విషయాన్ని.. 15X15X15 ఫార్ములా ద్వారా తెలుసుకుందాం.తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే.. దానికి అత్యుత్తమ మార్గం ఇన్వెస్టిమెంట్ అనే చెప్పాలి. అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? అనే విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి.ఇక 15X15X15 ఫార్ములా విషయానికి వస్తే, 15 సంవత్సరాల్లో నెలకు రూ. 15వేలు ఇన్వెస్ట్ చేస్తే కోటి రూపాయలు అవుతుందనేదే.. ఈ ఫార్ములా సందేశం. అంటే మీరు 15 సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్స్లో నెలకు 15,000 ఇన్వెస్ట్ చేసి 15 శాతం వార్షిక రిటర్న్స్ ఆశించాలి. ● పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 15,000 ● వ్యవధి: 15 సంవత్సరాలు ● వడ్డీ రేటు: 15 శాతంపైన చెప్పిన దాని ప్రకారం నెలకు 15,000 రూపాయలు పెట్టుబడి పెడితే.. 15 సంవత్సరాలకు అసలు రూ. 27 లక్షలు అవుతాయి. వడ్డీ రేటు 15 శాతం (రూ. 73 లక్షలు), కాబట్టి ఇలా మీరు కోటి రూపాయలు సంపాదించవచ్చు.ఇదీ చదవండి: 26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా ఆయన చెప్పినట్లే జరిగింది!15X15X15 ఫార్ములా ద్వారా కోటీశ్వరులవ్వాలంటే.. త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. మీరు 25 సంవత్సరాల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. 40 ఏళ్లకే మీకు కోటి రూపాయలు వస్తాయి. 30 ఏళ్లకు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే 45 సంవత్సరాలకు మీ చేతికి డబ్బులు వస్తాయి. కాబట్టి దీన్ని బట్టి చూస్తే.. మీరు ఎంత తొందరగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే, అంత త్వరగా కోటీశ్వరులు అవ్వొచ్చన్నమాట. -
రూ.30 లక్షలు ఇన్వెస్ట్.. ఫండ్స్లోనా లేదా స్టాక్స్లోనా..?
రూ.30 లక్షలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లేదా నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహం ఏంటి? మెరుగైన అస్సెట్ అలోకేషన్ విధానం ఏది అవుతుంది? – హితేంద్ర వాణిమీ పెట్టుబడి రూ.30 లక్షలను 12 నుంచి 24 సమాన నెలసరి వాయిదాలుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి పనితీరు కలిగిన ఫండ్ను ఎంపిక చేసుకోవాలి. లేదా నేరుగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే అత్యుత్తమ నాణ్యత కలిగిన కంపెనీలను ఎంపిక చేసుకోవాలి. పటిష్టమైన ఈక్విటీ పోర్ట్ఫోలియోని నిర్మించుకోవడం పెద్ద సవాలుతో కూడుకున్నదే.రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కనుక ఒక కంపెనీకి గరిష్టంగా రూ.6 లక్షలు లేదా అంతకంటే తక్కువ కేటాయించుకోవచ్చు. బలమైన మూలాలు, నమ్మకమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీలను ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడులను వివిధ కంపెనీల మధ్య వైవిధ్యం చేసుకోవాలి. ఇది రిస్క్ను తగ్గిస్తుంది. పెట్టుబడుల నాణ్యతను పెంచుతుంది. ఎంపిక, పెట్టుబడుల కేటాయింపులు, వైవిధ్యం వీపోర్ట్ఫోలియో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి.తగినంత సమయం, విశ్వాసం లేకపోతే అప్పుడు మంచి ఫ్లెక్సీక్యాప్ లేదా మల్టీక్యాప్ ఫండ్ మేనేజర్పై ఆ బాధ్యతను పెట్టాలి. ఏ స్టాక్స్ ఎంపిక చేసుకోవాలన్న శ్రమ మీకు తప్పుతుంది. స్టాక్స్ పోర్ట్ఫోలియో నిర్వహణలో అనుభవం లేకపోతే నేరుగా ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. మీకు తగిన అనుభవం, సమయం ఉంటే, నిబంధనల ప్రకారం వ్యవహరించేట్టు అయితే ఫండ్స్తో పోలిస్తే ఎక్కువ రాబడులు సొంతం చేసుకోవచ్చు.నేను రిటైర్మైంట్ తీసుకున్నాను. క్రమానుగత పెట్టుబడుల ఉపసంహరణ (ఎస్డబ్ల్యూపీ) కోసం లిక్విడ్ ఫండ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్లో దేనిని ఎంపిక చేసుకోవాలి? – విఘ్నేశ్లిక్విడ్ ఫండ్స్ స్థిరత్వంతో, తక్కువ రిస్క్తో ఉంటాయి. కనుక షార్ట్ డ్యురేషన్ ఫండ్స్తో పోల్చితే సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) కోసం ఇవి అనుకూలం. అతి తక్కువ అస్థిరతలతో, స్థిరమైన రాబడులు ఇవ్వడం వల్ల లిక్విడ్ ఫండ్స్లో పెట్టుబడులతో నిశ్చింతగా ఉండొచ్చు.1. లిక్విడ్ఫండ్స్ పెట్టుబడుల విలువ దాదాపుగా తగ్గిపోవడం ఉండదు. వారం, నెల వ్యవధిలోనూ ఇలా జరగదు. ఉదాహరణకు కోటక్ లిక్విడ్ ఫండ్ గడిచిన దశాబ్ద కాలంలో వారం వారీ 99.78 శాతం సందర్భాల్లో సానుకూల రాబడులు ఇచ్చింది. నెలవారీగా చూస్తే నూరు శాతం సందర్భాల్లోనూ సానుకూల రాబడులు ఉన్నాయి. అదే కోటక్ షార్ట్ డ్యురేషన్ ఫండ్ పనితీరు గమనించినట్టయితే.. విలువలో కొంత క్షీణించడాన్ని గుర్తించొచ్చు. గడిచిన దశాబ్ద కాలంలో వారం వారీ రాబడులను గమనిస్తే 15.8 శాతం సందర్భాల్లో ప్రతికూలంగా, నెలవారీ రాబడుల్లో 7 శాతం సందర్భాల్లో ప్రతికూల పనితీరును గమనించొచ్చు.2. లిక్విడ్ ఫండ్స్ అయితే అదే రోజు లేదా మరుసటి రోజు పెట్టుబడులు చేతికి అందుతాయి. నెలవారీ ఊహించతగిన రాబడులకు అనుకూలంగా ఉంటాయి. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లోనూ లిక్విడిటీ ఎక్కువే. కాకపోతే వాటి ఎన్ఏవీలో స్వల్ప ఊగిసలాటలు ఉంటాయి. ఇది నెలవారీ ఉపసంహరించుకునే మొత్తంపై ప్రభావం చూపిస్తుంది.3. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్లో రాబడులు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు రూ.10 లక్షల పెట్టుబడిపై ఒక ఏడాదిలో రూ.వేలల్లో ఉంటుంది. కానీ, ఈ మేరకు రిస్క్ కూడా అధికంగా ఉంటుంది.4. లిక్విడ్ ఫండ్స్పై మార్కెట్ అస్థిరతలు పెద్దగా ఉండవు. కనుక ప్రశాంతంగా ఉండొచ్చు. -
చిన్న పెట్టుబడి.. పెద్ద రాబడి
సాక్షి, అమరావతి: మహిళల ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ అనే పొదుపు పథకం విశేష ఆదరణ పొందుతోంది. మహిళలు, బాలికల కోసం ఈ పథకాన్ని 2023–24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖాతాలు ప్రారంభించడానికి ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2025 వరకు మాత్రమే అవకాశం కల్పించింది. మహిళలు తమ పేరు మీద పోస్టాఫీసులు లేదా నిర్దేశించిన బ్యాంకుల్లో ఈ ఖాతాలు తెరవచ్చు. మైనర్ బాలికల పేరుతో సంరక్షకులు ఖాతా తెరిచే అవకాశం కల్పించారు.కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన తేదీ నుంచి రెండేళ్ల తర్వాత 7.5 శాతం వడ్డీతో తిరిగి ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. అలాగే పాక్షిక ఉపసంహరణ సౌకర్యం కూడా కల్పించారు. ఖాతా తెరిచిన తేదీ నుంచి సంవత్సరం తర్వాత ఖాతా బ్యాలెన్స్లో 40 శాతం వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వ మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకం.అందువల్ల దీనికి ఎలాంటి రిస్క్ కూడా ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 43.30 లక్షల ఖాతాలు తెరిచారని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 7,46,223 ఖాతాలతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. 2,11,016 ఖాతాలతో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచింది. ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఖాతాలు తెరిచేందుకు వచ్చే ఏడాది మార్చి 31 వరకే గడువు ఉంది. అందువల్ల వీలైనంత త్వరగా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.రూ.31,125 వడ్డీ..ఈ పథకం కింద రూ.2,00,000 డిపాజిట్ చేస్తే సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. మొదటి సంవత్సరంలో రూ.15,000 వడ్డీ, రెండో సంవత్సరంలో రూ.16,125 వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా రెండేళ్ల గడువు పూర్తయ్యేనాటికి వడ్డీతో కలిపి రూ. 2,31,125 మేర ప్రయోజనం పొందుతారు. -
‘యాసంగి’ పెట్టుబడి ఎట్లా?
రాష్ట్రంలో యాసంగి పంట సాగు అంశం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. సర్కారు నుంచి అందాల్సిన రైతుభరోసాపై అస్పష్టత నెలకొనడం.. రుణమాఫీ పూర్తిగాక బ్యాంకుల నుంచి కొత్త రుణాలు అందే పరిస్థితి లేకపోవడంతో... యాసంగికి పెట్టుబడులు ఎలాగని రైతులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ప్రైవేటు అప్పుల బాటపట్టాల్సిన దుస్థితి వస్తుందా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంట కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సుమారు 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. మరో 20 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే అవకాశం ఉందని భావిస్తోంది. మరోవైపు నవంబర్ ఒకటి నుంచే యాసంగి (రబీ) సీజన్ మొదలైంది. నిజామాబాద్, నల్లగొండ వంటి జిల్లాలతోపాటు పంట కోతలు పూర్తయిన ప్రాంతాలన్నిటా రైతులు యాసంగి సాగు మీద దృష్టి పెట్టారు. దుక్కులు దున్ని, పొలాలను సిద్ధం చేస్తున్నారు. కొన్నిచోట్ల నారు పోస్తున్నారు. కానీ పంట సాగుకు పెట్టుబడులు ఎలాగని వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ‘రైతుభరోసా’పై అస్పష్టత..: రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకం కింద రైతులకు పంట పెట్టుబడి సాయంగా 2018 ఖరీఫ్ నుంచి ఆర్థిక సాయాన్ని అందిస్తూ వస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023–24 వానాకాలం సీజన్ వరకు 11 విడతలుగా రైతుబంధు మంజూరు చేసింది. చివరిసారిగా 2023–24 వానాకాలం సీజన్లో 68.99 లక్షల మంది రైతులకు రూ.7,624.74 కోట్లు రైతుబంధు సాయంగా అందజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి సాయాన్ని ఏటా రూ.15 వేలకు పెంచి ‘రైతు భరోసా’ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. కానీ 2023–24 యాసంగికి సంబంధించి ఈ ఏడాది మార్చిలో ఐదెకరాలలోపు భూమి ఉన్న వారికి ఎకరాకు రూ.5 వేల చొప్పున రూ.5,575 కోట్లు విడుదల చేసింది. తర్వాత ఐదెకరాలపైన ఉన్న వారికి కూడా పెట్టుబడి సాయం విడుదల చేసినట్టు ప్రకటించింది. అయితే.. 2024–25 వానాకాలానికి సంబంధించి ‘రైతు భరోసా (రైతుబంధు)’ పెట్టుబడి సాయం రైతులకు అందలేదు. దీనిపై ఇటీవల వ్యవసాయ మంత్రి తుమ్మలను ప్రశ్నిస్తే.. వానాకాలం సీజన్ అయిపోయిందని, యాసంగి నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్పారు. కానీ యాసంగి సీజన్ మొదలై నెలరోజులు గడుస్తున్నా పెట్టుబడి సాయం ఊసే లేదు. దీనితో పంట పెట్టుబడులు ఎలాగని రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. పెట్టుబడి సాయం పెంచి ‘రైతు భరోసా’ ఇవ్వడమేమోగానీ.. రైతు బంధుకూ దిక్కులేకుండా పోయిందని వాపోతున్నారు. రైతులందరికీ ‘భరోసా’ అందేనా? యాసంగి నుంచి పెట్టుబడి సాయం ఇస్తామని మంత్రి తుమ్మల ప్రకటించినా.. ఎవరెవరికి అందుతుందన్న దానిపై స్పష్టత లేని పరిస్థితి. గుట్టలు, రోడ్లు, సాగులో లేని భూములకు పెట్టుబడి సాయం ఇచ్చేది లేదని గతంలో సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. దానికితోడు గరిష్టంగా ఐదెకరాలకే పెట్టుబడి సాయం ఇచ్చే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం రైతుల సాగుభూములపై ఇప్పటికే సర్వే చేపట్టినట్టు తెలిసింది. సాగు జరిగిన భూముల లెక్కలు తేలితేనే పెట్టుబడి సాయం అందించే రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉంది. దీనిలో ఎంత మంది రైతులకు, ఎంత వరకు పెట్టుబడి సాయం అందుతుందన్న దానిపై అస్పష్టత నెలకొంది. ఈ నెల 28 నుంచి 30 వరకు మహబూబ్నగర్లో రైతు సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అప్పుడైనా పెట్టుబడి సాయంపై ప్రకటన వెలువడుతుందేమోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రుణమాఫీ పూర్తవక రుణాలకు ఇబ్బంది కాంగ్రెస్ సర్కారు హామీ ఇచ్చిన మేరకు రూ.2 లక్షల రుణమాఫీ ఇంకా పూర్తిస్థాయిలో అమలుకాలేదు. రాష్ట్రంలో రూ.2లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులు సుమారు 40 లక్షల మందికాగా.. ప్రభుత్వం 22 లక్షల మందికి సంబంధించి రూ. 18 వేల కోట్లను మాఫీ చేసింది. మిగతావారికి రుణమాఫీ జరగాల్సి ఉంది. రేషన్కార్డు లేకపోవడం, ఆధార్, పాస్ పుస్తకాల్లో పేర్లు తప్పుగా ఉండటం, కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ మందికి రుణాలు ఉండటంతోపాటు పలు సాంకేతిక కారణాలతో వారికి రుణమాఫీ జరగలేదు. వ్యవసాయ శాఖ వారి వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపించింది కూడా. అయితే పంట పెట్టుబడుల కోసం రుణం కావాలని వెళితే.. పాత రుణాలు ఇంకా మాఫీ కానందున కొత్త రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయని రైతులు వాపోతున్నారు. అంతేకాదు మాఫీకాని రుణాలకు సంబంధించి వడ్డీలు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయని పేర్కొంటున్నారు. వానాకాలం ధాన్యానికి సంబంధించిన సొమ్ము కూడా ఇంకా అందలేదని కొందరు రైతులు చెబుతున్నారు. -
అంతా ఓకే.. కేవలం వ్యక్తులపైనే ఆరోపణలు..
అదానీ గ్రూప్పై అమెరికాలో నమోదైన లంచాల ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్, ఫ్రాన్స్ ఇంధన రంగ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ తాజాగా స్పందించాయి. గతేడాది యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణల తదుపరి అదానీ గ్రూప్లో జీక్యూజీ పార్ట్నర్స్ భారీగా ఇన్వెస్ట్ చేసింది. టోటల్ ఎనర్జీస్ అదానీ గ్రూప్తో భాగస్వామ్య కంపెనీని కలిగి ఉంది. కాగా.. అదానీ గ్రూప్లోని తమ పెట్టుబడులన్నీ అత్యంత లాభదాయకంగా ఉన్నట్లు జీక్యూజీ తెలియజేసింది. యూఎస్లో కేవలం వ్యక్తులపైనే లంచాల ఆరోపణలు నమోదైనట్లు ప్రస్తావించింది.తాము పెట్టుబడులు చేపట్టిన అదానీ గ్రూప్ పటిష్టంగానే ఉన్నట్లు జీక్యూజీ పేర్కొంది. విడిగా గ్రూప్ కంపెనీల బిజినెస్ మూలాలు పటిష్టంగా ఉన్నట్లు అభిప్రాయపడింది. అదానీ గ్రూప్లో జీక్యూజీ 8 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులను కలిగి ఉంది. అంతక్రితం వాల్మార్ట్, ఒరాకిల్, సీమెన్స్, ఫైజర్, హనీవెల్ తదితర పలు గ్లోబల్ కంపెనీలు, ఎగ్జిక్యూటివ్లపై సైతం వివిధ ఆరోపణలను ఎదుర్కొన్నట్లు పేర్కొంది.పెట్టుబడుల నిలిపివేతమరోవైపు అదానీ గ్రూప్ అత్యున్నత అధికారులపై లంచాల ఆరోపణల నేపథ్యంలో ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ ప్రస్తుతానికి తాజా పెట్టుబడులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. అదానీ టోటల్ గ్యాస్తోపాటు అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ ఫ్రెంచ్ దిగ్గజానికి పెట్టుబడులున్న సంగతి తెలిసిందే. అదానీ టోటల్ గ్యాస్లో 37.4 శాతం వాటాను కలిగి ఉంది. అదానీ గ్రీన్ ఎనర్జీలోనూ టోటల్కు 19.75 శాతం వాటా ఉంది.ఇదీ చదవండి: ఆరు నెలల్లో భారీగా ఉపాధి అవకాశాలుఆర్థికంగా పటిష్టం: అదానీ గ్రూప్తగినంత నగదు నిల్వలు, లాభార్జన నేపథ్యంలో ఆర్థికంగా పటిష్టంగా ఉన్నట్లు అదానీ గ్రూప్ తాజాగా వెల్లడించింది. దీంతో రుణ చెల్లింపులకు సమస్యలు ఎదురుకాబోవని స్పష్టం చేసింది. అంతేకాకుండా వృద్ధి అవకాశాలకు సైతం నిధులు సరిపోతాయని తెలియజేసింది. తద్వారా ఇన్వెస్టర్లకు భరోసానిచ్చింది. కంపెనీ అత్యున్నత ఎగ్జిక్యూటివ్లపై యూఎస్లో లంచాల ఆరోపణలు వెలువడిన కారణంగా ఇన్వెస్టర్లకు ఒక నోట్లో కంపెనీ ఆర్థిక పరిస్థితులను కంపెనీవద్ద రూ.55,024 కోట్ల నగదు నిల్వలున్నాయని, ఇవి రాగల 28 నెలల్లో చేపట్టవలసిన దీర్ఘకాలిక రుణ చెల్లింపులకంటే అధికమని తెలియజేసింది. గత ఆరు నెలల్లో గ్రూప్ రూ.75,227 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. అయితే ఇదేసమయంలో మొత్తం రుణ భారం రూ.16,882 కోట్లు మాత్రమే పెరిగినట్లు వెల్లడించింది. -
అధిక వడ్డీ కావాలా? ఇది మీ కోసమే!
డబ్బు పొదుపు చేయాలని చాలా మంది కోరుకుంటారు. అందుకు విభిన్న మార్గాలు ఎంచుకుంటారు. అయితే వాటిలో డిపాజిట్ చేసే డబ్బుకు ఆర్బీఐ కొంత వరకు బీమా కల్పిస్తోంది. దాంతో చాలా మంది ఎఫ్డీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్లో వివిధ మనీ యాప్లు, బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ సంస్థలు వంటివి ఎఫ్డీలకు అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. అందులో ఎక్కువ వడ్డీ అందించే సంస్థలు, ఏడాదిలో వాటి వడ్డీరేట్లను కింద తెలియజేశాం.యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.50% నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.50%సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.10% ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.10% శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - 9.05% శ్రీరామ్ ఫైనాన్స్ - 9.07% వరకు (మహిళలకు)బజాజ్ ఫైనాన్స్ - 8.65% వరకుఇండస్ ఇండ్ బ్యాంక్ - 8.25%సౌత్ ఇండియన్ బ్యాంక్ - 7.75%ఈ రేట్లు ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నిబంధనలకు లోబడి ఉంటాయి. ఇన్వెస్టర్లు ఎంచుకునే కాలపరిమితి, వారి పెట్టుబడిని బట్టి ఇందులో మార్పులు ఉండవచ్చు.ఇదీ చదవండి: అదానీపై కేసు ఎఫెక్ట్.. రూ.6,216 కోట్ల డీల్ రద్దు?9.5 శాతం వడ్డీ ఇస్తున్న మనీ యాప్‘సూపర్.మనీ’ యాప్ ఎఫ్డీపై 9.5 శాతం వడ్డీ అందిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఆర్బీఐ గుర్తింపు కలిగిన ఏ ఆర్థిక సంస్థలో ఎఫ్డీ ద్వారా పెట్టుబడి పెట్టినా రూ.5 లక్షల వరకు ఆర్బీఐ ఆధ్వర్యంలోని డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) బీమా అందిస్తుంది. అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం అందుకు సంబంధిత బ్యాంకు/ ఆర్థిక సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి రూ.5 లక్షలలోపు ఎప్డీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నవారు అధిక వడ్డీలిచ్చే బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వంటి విభిన్న మార్గాలను ఎంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
‘రియల్’ ఆస్తులే టాప్!
దేశంలోని మొత్తం కుటుంబాల ఆస్తుల్లో సగం శాతానికి పైగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటు ఇళ్లరూపంలోనే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.ఈ మేరకు అమెరికాలో ప్రముఖ పెట్టుబడి సంస్థగా పేరున్న జెఫరీస్తో పాటు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాగణాంకాల ఆధారంగా వాణిజ్య వార్తా కథనాలు మాత్రమే ప్రసారం చేసే ప్రముఖ టీవీ ఛానల్ నివేదిక స్పష్టంచేస్తోంది. ఈ నివేదిక ప్రకారం ఇండియాలోని కుటుంబాల అన్ని రకాల ఆస్తుల మొత్తం విలువ 11.1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. (రూ.పదికోట్ల కోట్లు) ఈ ఆస్తులు ఏ రంగాల్లో ఉన్నాయో పరిశీలించిన ఆ టీవీ ఛానల్ .. సగానికి పైగా అనగా 50.7 శాతం వ్యవసాయ, వ్యవసాయేతర భూములతో పాటుఇళ్ల రూపంలోనే ఉన్నాయని గుర్తించింది. – సాక్షి, అమరావతిపీఎఫ్లో కన్నా ఇన్సూరెన్స్లోనే పెట్టుబడులు అధికంవృద్ధాప్యంలో ఆర్థిక అవసరాలకు ఉపయోగపడే ప్రావిడెంట్ పెన్షన్ ఫండ్స్లో పెట్టుబడులు కన్నా మన దేశంలోని కుటుంబాలు అత్యధిక మొత్తం ఇన్సూరెన్స్ పాలసీల రూపంలోనే పెట్టిన పెట్టుబడులే అధికమని ఆ గణాంకాలు మరో ఆశ్చర్యకరమైన అంశాన్ని వెలుగులో తీసుకొచ్చాయి. దేశీయ కుటుంబాలు కలిగి ఉన్న మొత్తం ఆస్తుల్లో 5.8 శాతం మేర ప్రావిడెంట్ పెన్షన్ ఫండ్స్ రూపంలో ఉండగా, ఇన్సూరెన్స్ పాలసీల రూపంలో 5.9 శాతం మేర ఆస్తులున్నాయి. మన దేశ మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైన బంగారం.. దేశీయ మొత్తం ఆస్తుల్లో రెండో అతి పెద్ద స్థానంలో 15.5 శాతం మేర ఉండడం గమనార్హం. -
అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు
పునరుత్పాదక ఇంధన వనరులపై అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ సామర్థ్యంతో సోలార్, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై వచ్చే ఐదేళ్లలో 35 బిలియన్ డాలర్లు (రూ.2.94 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్టు అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ ప్రకటించారు. ‘2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో యువ నాయకుల పాత్ర’ అనే అంశంపై జరిగిన సీఈవో ప్యానెల్ చర్చలో భాగంగా సాగర్ అదానీ ఈ వివరాలు వెల్లడించారు.ఇదీ చదవండి: ఒకటో తరగతి ఫీజు.. రూ.4.27 లక్షలు!గుజరాత్లోని ఖావ్డాలో 30,000 మెగావాట్ సామర్థ్యంతో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాలను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. ఇంధన స్థిరత్వం, ఇంధన పరివర్తనం విషయంలో అదిపెద్ద గ్రీన్ఫీల్డ్ పెట్టుబడుల్లో ఇది ఒకటి అవుతుందని సాగర్ అదానీ పేర్కొన్నారు. ‘‘మన దగ్గర 500 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. తలసరి వినియోగంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం మూడింత ఒక వంతు పరిమాణంలోనే ఉన్నాం. వచ్చే 7–8 ఏళ్లలో ప్రపంచ సగటు తలసరి విద్యుత్ వినియోగానికి చేరుకోవాలంటే మరో 1,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం అవసరం. చైనా స్థాయికి చేరుకోవాలంటే మరో 1,500 మెగావాట్ల సామర్థ్యం అవసరం. అభివృద్ధి చెందిన దేశాలకు సమాన స్థాయికి చేరుకోవాలంటే మరో 2,500–3,000 మెగావాట్ల సామర్థ్యం అవసరం అవుతుంది’’అని వివరించారు. -
మ్యూచువల్ ఫండ్ ఎంపిక ఎలా?
ఒక మ్యూచువల్ ఫండ్ను దీర్ఘకాలానికి ఎంపిక చేసుకునే సమయంలో గత పనితీరుపై ఆధారపకుండా.. చూడాల్సిన ఇతర అంశాలు ఏవి? – వినుత్ రాయ్ కేవలం గత పనితీరుపైనే ఆధారపడడం తప్పుదోవలో పయనించడమే అవుతుంది. ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ 100 శాతం రాబడులు ఇచి్చందంటే, అంతకంటే ముందుగానే ఆ పథకంలో ఇన్వెస్ట్ చేసిన వారికి అది విలువ సమకూర్చినట్టు అవుతుంది. కొత్తగా అదే పథకంలో ఇన్వెస్ట్ చేసే వారికి గత పనితీరు కేవలం ఒక సూచికే అవుతుంది. అంతేకానీ భవిష్యత్ రాబడులకు హామీ కాదు. ఒక మ్యూచువల్ ఫండ్ గత పనితీరు అన్నది మార్కెట్ల ఎత్తు, పల్లాల్లో ఎలా పనిచేసిందో తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది.కొన్ని ఫండ్స్ నష్టాల నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టొచ్చు. కొన్ని వేగంగా కోలుకుంటాయి. దీనికి కారణం అంతర్గతంగా అవి పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న కంపెనీలే. కనుక ఒక ఫండ్ను ఎంపిక చేసుకునే ముందు.. పోటీ పథకాలతో పోల్చి చూస్తే పనితీరు ఎలా ఉందన్నది విశ్లేషించాలి. అదే విభాగం సగటు పనితీరు, ఆ విభాగంలోని పోటీ పథకాలతో పోల్చితే మధ్య, దీర్ఘకాలంలో రాబడులు ఎలా ఉన్నాయన్నది పరిశీలించాలి.స్వల్పకాల రాబడులు అంత ఉపయోకరం కాదు. నిర్ణీత కాలంలో పథకంలో రాబడులు స్థిరంగా ఉన్నాయా? అని కూడా చూడాలి. బుల్ మార్కెట్లలో నిదానంగా ర్యాలీ చేసి, మార్కెట్ కరెక్షన్లలో తక్కువ నష్టాలకు పరిమితం చేసే విధంగా పథకం సామర్థ్యాలు ఉండాలి. అలాంటప్పుడు ఆ పథకం రాబడుల పరంగా నిరాశ మిగల్చదు. ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు (పనితీరు) కూడా పరిశీలించాలి.పథకం పనితీరు ఫండ్ మేనేజర్ ప్రతిభ వల్లే అయితే, సదరు ఫండ్ మేనేజర్ రాజీనామా చేసి వెళ్లిపోతే అది ప్రతికూలంగా మారొచ్చు. అంతేకాదు ఇన్వెస్టర్ వ్యవహార శైలి కూడా దీర్ఘకాల రాబడులను ప్రభావితం చేస్తుంది. మార్కెట్ల పతనాల్లో ఆందోళన చెందకుండా, పెట్టుబడుల విధానానికి కట్టుబడి ఉండాలి. మార్కెట్ ఉత్థాన పతనాల్లోనూ క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. గృహ రుణం, కారు రుణం, క్రెడిట్ కార్డు రుణాలున్నాయి. వీటి కోసం ప్రతి నెలా రూ.40,000 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ రుణాలను తీర్చివేసే మార్గాన్ని చూపగలరు? – ప్రేమ్ నాయక్ రుణాలు భవిష్యత్ ఆదాయాన్ని హరించివేస్తాయి. కనుక వీలైనంత వెంటనే వాటిని వదిలించుకోవాలి. ముఖ్యంగా వీటిల్లో ఆర్థిక భారంగా మారిన రుణాన్ని మొదట తీర్చివేయాలి. ముందుగా క్రెడిట్ కార్డు రుణంతో మొదలు పెట్టండి. అధిక వడ్డీ రేటుతో ఖరీదైన రుణం ఇది. అవసరమైతే మీ పెట్టుబడుల్లో కొన్నింటిని ఉపసంహరించుకుని క్రెడిట్కార్డు రుణం తీర్చివేయాలి. లేదంటే పార్ట్టైమ్ ఉద్యోగం చేసి అయినా దీన్నుంచి బయటపడే మార్గాన్ని చూడండి. క్రెడిట్ కార్డ్ రుణం చెల్లించిన అనంతరం కారు రుణాన్ని తీర్చివేయడంపై దృష్టి పెట్టండి. ఎందుకంటే వాహనాల విలువ స్వల్పకాలంలోనే తగ్గిపోతుంది. కనుక వీలైనంత ముందుగా ఈ రుణాన్ని కూడా తీర్చివేయాలి. గృహ రుణాన్ని దీర్ఘకాలం పాటు కొనసాగించుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో విలువ పెరిగే ఆస్తి ఇది. పైగా గృహ రుణాలపై అన్నింటికంటే తక్కువ వడ్డీ రేటుతోపాటు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. -
పాకిస్తాన్ చాయ్వాలాకు భారీ ఫండింగ్: ఏకంగా..
పాకిస్తాన్ చాయ్వాలా 'అర్షద్ ఖాన్' షార్క్ ట్యాంక్ పాకిస్తాన్ తాజా ఎపిసోడ్లో తన కేఫ్ బ్రాండ్ చాయ్వాలా & కో కోసం కోటి రూపాయలు (పాకిస్తాన్ కరెన్సీ) పెట్టుబడిన పొందాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.చాలా సంవత్సరాలు కేఫ్ నడుపుతూ ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్న.. అర్షద్ ఖాన్ ఇటీవల షార్క్ ట్యాంక్ పాకిస్తాన్ ఎపిసోడ్లో పాల్గొని, అక్కడి వ్యాపారవేత్తలను తన వ్యాపారం గురించి వివరిస్తూ ఎంతగానో ఆకట్టుకున్నాడు. దీంతో వారు ఈ భారీ పెట్టుబడిన ఆఫర్ చేశారు. దీంతో అర్షద్.. చాయ్వాలా & కో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి సిద్దమవుతున్నాడు.వ్యాపార వేత్తల నుంచి కోటి రూపాయల ఆఫర్ అందుకున్న తరువాత.. ఈ విషయాన్ని అర్షద్ ఖాన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా తనకు మద్దతు తెలిపిన అందరికీ కూడా అతడు ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఒప్పందం తన జీవితంలోనే కీలక మైలురాయి అని పేర్కొన్నాడు.అర్షద్ ఖాన్ చాయ్ కేఫ్ ఇస్లామాబాద్లో ప్రారంభమైంది. ఇదే ఇప్పుడు అక్కడ బాగా ఫేమస్ అయింది. ఇక్కడ కేవలం చాయ్ మాత్రమే కాకుండా.. స్నాక్స్, బర్గర్స్, పాస్తా, శాండ్విచ్ వంటివి కూడా లభిస్తున్నాయి. ఇప్పుడు షార్క్ ట్యాంక్ ఫండింగ్ గెలుచుకున్న అర్షద్ తన వ్యాపారాన్ని పెంచడానికి సన్నద్ధమవుతున్నారు. View this post on Instagram A post shared by Arshad Khan (@arshadchaiwala1) -
బంగారం Vs బిట్కాయిన్.. ఏది బెస్ట్..?
-
అన్నదాతకు దుఃఖమే!
సాక్షి, అమరావతి: ఆచరణ సాధ్యం కాని హామీలతో అన్నదాతలను ఊహల పల్లకిలో ఊరేగించిన కూటమి ప్రభుత్వం కాడి పారేసి చేతులెత్తేసింది! ఓటాన్ అకౌంట్తో ఐదు నెలలు కాలక్షేపం చేయగా సోమవారం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లోనూ రైతుల నోట్లో మట్టి కొట్టింది. సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కేటాయింపులు ఉంటాయన్న ఆశలను నీరుగార్చి నిలువు దగా చేసింది. తాము అధికారంలోకి రాగానే బేషరతుగా ప్రతీ రైతు కుటుంబానికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందచేస్తామని సూపర్ సిక్స్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఆచరణకు వచ్చేసరికి మాట మార్చి పీఎం కిసాన్తో కలిపి జమ చేస్తామని రైతులను మరోసారి మోసగించింది. గత ఐదేళ్లలో 53.58లక్షల మంది రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.34,288.17 కోట్లు పెట్టుబడి సాయం అందించింది. అయితే, ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సుమారు 53.58 లక్షల మంది రైతులకు రూ.20 వేల చొప్పున రూ.10,716.74 కోట్లు కేటాయించాలి. కానీ తాజా బడ్జెట్లో చేసిన కేటాయింపులు కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే. ఈ మొత్తాన్ని పీఎం కిసాన్ సాయం అందుకున్న వారికి మాత్రమే జమ చేసినా... ఒక్కో కుటుంబానికి ఈ ఏడాది రూ.నాలుగు వేలకు మించి పెట్టుబడి సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. పైగా కౌలు రైతులు, దేవదాయ, అటవీ, భూ సాగు దారులకు పెట్టుబడి సాయం అందిస్తామన్న ప్రస్తావన ఎక్కడా లేదు. రైతుల నెత్తిన ప్రీమియం పిడుగు రైతులపై పైసా భారం పడకుండా గత ఐదేళ్లూ విజయవంతంగా అమలైన ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేస్తున్నట్లు అసెంబ్లీలో వ్యవవసాయ శాఖ మంత్రి అచ్చెన్న అధికారికంగా ప్రకటించారు. ఖరీఫ్ సీజన్ వరకు మాత్రమే రైతుల ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని, రబీ–2024–25 నుంచి ఈ పథకంలో స్వచ్ఛంద నమోదు పద్ధతిలో రైతులను భాగస్వాములను చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఫలితంగా రబీలో నోటిఫై చేసిన 15 పంటలకు ప్రీమియం వాటాగా రైతులపై రూ.300 కోట్లకు పైగా భారం పడుతుంది.అంతేకాకుండా రూ.3 లక్షల వరకు సున్నా వడ్డీ రాయితీ, 90% సబ్సిడీపై డ్రిప్ పరికరాల పంపిణీ గురించి బడ్జెట్లో ప్రస్తావన లేదు. ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాల నిధికి పైసా కూడా విదల్చలేదు. వేటకు వెళ్లే ప్రతీ మత్స్యకార కుటుంబానికి రూ.20వేల చొప్పున వేట నిషేధ భృతి అందిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అటకెక్కించేసింది. జోన్తో సంబంధం లేకుండా ఆక్వా సర్విస్ కనెక్షన్లకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తామని ఇచ్చిన హామీకి కూడా పైసా కేటాయించలేదు. పథకాల పేర్లు మార్చి.. ప్రశంసిస్తూ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పలు పథకాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారంటూ ఎన్నికల్లో దు్రష్పచారం చేసిన కూటమి.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వాటి గొప్పతనాన్ని ప్రశంసించడం గమనార్హం. వాటి పేర్లు మార్చి తాము కొనసాగిస్తున్నట్లు తేటతెల్లం చేసింది.రూ.43,402.33 కోట్ల అంచనాలతో వ్యవసాయ బడ్జెట్ సాక్షి, అమరావతి: స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఉచిత పంటల బీమా పథకాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రబీ సీజన్ నుంచి స్పచ్ఛంద నమోదు విధానం ద్వారా రైతులను భాగస్వాములను చేసి, పీఎంఎఫ్బీవైతో అనుసంధానం చేసి అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతు కుటుంబానికి రూ.20 వేలు పెట్టుబడి సాయాన్ని పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం పేరిట అమలు చేయబోతున్నట్టు చెప్పారు. రూ.43,402.33 కోట్ల అంచనాలతో రూపొందించిన వ్యవసాయ బడ్జెట్ను అచ్చెన్నాయుడు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రసంగించారు. -
రెండో ఆదాయంపై కన్నేసిన సినీతారలు: అందరి చూపు అటువైపే..
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే చందాన.. సినీతారలు చాలా మంది రియల్ ఎస్టేట్, కమర్షియల్ రెసిడెన్షియల్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్, మనోజ్ బాజ్పేయి, సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్, అజయ్ దేవగన్ మొదలైనవారు ఉన్నారు.ఆర్ధిక నిపుణులు ప్రకారం.. మనిషి కేవలం ఒక ఆదాయ వనరుమీద మాత్రమే ఆధారపడకూడదు. ఆదాయం వచ్చే మరికొన్ని మార్గాలను ఎప్పటికప్పుడు అన్వేషించాలి. అవే కష్ట సమయాల్లో ఆదుకుంటాయి. ఈ సూత్రాన్ని సెలబ్రిటీలు మాత్రమే చాలామంది పాటిస్తున్నారు. వీరంతా కేవలం సినిమాల మీద మాత్రమే కాకుండా.. ఇతర ఆదాయాల మీద కూడా పెట్టుబడులు పెట్టి ఆర్జిస్తున్నారు.2020 - 2024 మధ్య బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ రియల్ ఎస్టేట్లో సుమారు రూ. 194 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. దీంతో రియల్ ఎస్టేట్లో అధిక పెట్టుబడిన వ్యక్తిగా అమితాబ్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ తరువాత జాన్వీ కపూర్ (రూ. 169 కోట్లు), రణవీర్ సింగ్, దీపికా పదుకొనే ఫ్యామిలీ (రూ. 156 కోట్లు), అజయ్ దేవగన్ & కాజోల్ (రూ. 110 కోట్లు), షాహిద్ కపూర్ (రూ. 59 కోట్లు) కూడా రియల్ ఎస్టేట్లో భారీ పెట్టుబడులను పెట్టినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి కారణం ఏంటంటే?డబ్బు చేతిలో ఉన్నా.. బ్యాంకులో ఉన్న పెద్దగా ప్రయోజనం ఉండదు. అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడుటలుగా ఇన్వెస్ట్ చేస్తే.. రెండింతలు, మూడింతల లాభాలు కూడా వస్తాయి. అయితే ఇన్వెస్ట్ చేసేముందు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదమరిస్తే మోసపోవడం ఖాయం.ఇదీ చదవండి: మూడేళ్ళలో 15 రెట్లు.. అక్కడ దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్ మార్కెట్2021లో ఒక ఎకరా భూమిని రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ధరతో కొనుగోలు చేసిన భూమి, మూడేళ్ళ తరువాత 15 రేట్లు పెరిగిందని.. దాని విలువ రూ. 5 కోట్లకు చేరిందని 'హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' (HoABL) చైర్మన్ 'అభినందన్ లోధా' ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ధరల పెరుగుదల అనేది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అన్ని చోట్లా 15 రేట్లు లాభాలు వస్తాయనుకోవడం పొరపాటే. కానీ రియల్ ఎస్టేట్లో తప్పకుండా లాభాలు వస్తాయని మాత్రం నిపుణులు చెబుతున్నారు. -
అత్యవసర నిధికి నిజంగా ‘బంగారం’ అనుకూలమా?
ఆరు నెలల అవసరాలకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధి కింద బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? – నర్సింగ్రావుఆర్థిక అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా బంగారానికి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ.. అత్యవసర నిధి ఏర్పాటుకు ఇది అనుకూలమైన సాధనం కాదు. ఎందుకంటే బంగారం ఆటుపోట్లతో కూడి ఉంటుంది. గడిచిన దశాబ్ద కాలంలో ఏ మూడు నెలల కాలాన్ని పరిశీలించి చూసినా బంగారం రాబడుల్లో ఆటుపోట్లు స్పష్టంగా కనిపిస్తాయి. రాబడులు గరిష్టంగా 24 శాతం వరకు, కనిష్టంగా 13 శాతం మధ్య ఉన్నాయి. అత్యవసర నిధికి స్థిరత్వం అవసరం. కానీ, బంగారం రాబడుల్లో ఉన్న ఈ ఊహించలేనితత్వం దీనికి విరుద్ధం. అత్యవసర నిధి ఏర్పాటుకు మోస్తరు స్థాయిలో స్థిరమైన రాబడులు ఇచ్చే సాధనాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు లిక్విడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ ఫండ్స్ చాలా తక్కువ రిస్క్తో వస్తాయి. ఎలాంటి లాకిన్ పీరియడ్ ఉండదు.లిక్విడ్ ఫండ్స్ మంచి ఎంపికఅత్యవసర నిధి ఏర్పాటుకు కొన్ని లిక్విడ్ ఫండ్స్ మంచి ఎంపిక అవుతాయి. కరెన్సీల్లో అస్థిరతలు లేదా ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో బంగారం విలువైన సాధనంగా మారుతుంది. ఆ సమయంలో సంపద విలువ రక్షణ సాధనంగా పనికొస్తుంది. కొందరు ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల పోర్ట్ఫోలియోలో కొంత బంగారానికీ కేటాయిస్తుంటారు. ఇది ఈక్విటీలకు హెడ్జ్ సాధనంగా పనిచేస్తుంది. స్టాక్ మార్కెట్ గణనీయమైన దిద్దుబాట్లకు గురైనప్పుడు హెడ్జింగ్ సాధానంగా అనుకూలిస్తుంది. వైవిధ్యమైన, దీర్ఘకాల పోర్ట్ఫోలియోలో బంగారం సైతం తనవంతు పాత్ర పోషిస్తుంది. కానీ, అత్యవసర నిధికి అనుకూలమైనది కాదు. ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు!బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ గురించి విన్నాను. 2020 మార్చిలో ఈక్విటీ పతనం మాదిరి సంక్షోభాల్లో డౌన్సైడ్ రిస్క్ నుంచి రక్షణ ఉంటుందా? – మునిరత్నంఈక్విటీ మార్కెట్ల అస్థిరతల నుంచి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ పూర్తి స్థాయిలో రక్షణ కల్పించలేవు. ఎందుకంటే ఇవి కొంతమేర పెట్టుబడులను ఈక్విటీలకు సైతం కేటాయిస్తుంటాయి. ఈక్విటీలు మార్కెట్ అస్థిరతలకు లోబడే ఉంటాయి. కాకపోతే అచ్చమైన ఈక్విటీ పథకాలతో పోల్చుకుంటే మాత్రం వీటిలో అస్థిరతలు తక్కువ. ఇక బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ లేదా డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ అన్నింటిలోనూ ఈక్విటీ పెట్టుబడులు ఒకే మాదిరిగా ఉండవు. ఇటీవలి డేటా ప్రకారం ఈ పథకాల్లో ఈక్విటీ ఎక్స్పోజర్ 14 శాతం నుంచి 80 శాతం మధ్య ఉండడాన్ని గమనించొచ్చు. ఈక్విటీల్లో ఎంత మేర పెట్టుబడులు ఉన్నాయనే అంశం ఆధారంగా ఆయా పథకాల్లో డౌన్సైడ్ (నష్టం) రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. అంతేకాదు విడిగా ఒక్కో పథకం సైతం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ ఎక్స్పోజర్ను మార్పులు, చేర్పులు చేస్తుంటుంది. కనుక వీటి ఆధారంగానూ డౌన్సైడ్ రిస్క్ మారుతుంటుంది. కనుక బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ మార్కెట్ల హెచ్చు, తగ్గుల ప్రభావాలకు అతీతం కాదని చెప్పుకోవాల్సిందే.- ధీరేంద్ర కుమార్, సీఈఓ, వ్యాల్యూ రీసెర్చ్ -
అడ్వయిజర్లతో ఆర్థిక ప్రణాళిక ఈజీ!
ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక అవసరం. వివిధ దశల్లో లక్ష్యాలను సాకారం చేసుకుంటూ విజయవంతంగా సాగిపోవడానికి మెరుగైన మార్గాన్ని చూపిస్తుంది. జీవిత లక్ష్యాలను నిర్ణయించుకోవడం, అందుకు అనుగుణంగా పెట్టుబడుల ప్రణాళికల రూపకల్పన, వాటి ఆచరణ ఇవన్నీ ఆర్థిక విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ, మనలో ఎక్కువ మందికి ఆర్థిక అంశాలపై కావాల్సినంత అవగాహన ఉండదు. ఇలాంటప్పుడే నిపుణుల సేవలు అవసరం పడతాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎంత కాలం పాటు, ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలి? ఏ సాధనాలను ఎంపిక చేసుకోవాలి.. వీటిని తేల్చడం నిపుణులకే సాధ్యపడుతుంది. అంతేకాదు పెట్టుబడి పెట్టడంతోనే పని ముగిసినట్టు కాదు. తమ లక్ష్యాలు, ఆకాంక్షలకు అనుగుణంగానే పనితీరు చూపిస్తున్నాయా? అన్నది సమీక్షించుకోవాలి. ఈ పనిని సులభతరం చేసే వారే ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్లు లేదా ఫైనాన్షియల్ ప్లానర్లు. వీరిని ఎలా ఎంపిక చేసుకోవాలి? ఎవరు ఎంపిక చేసుకోవాలి? వీరి సేవలు ఎలా ఉంటాయి? తదితర అంశాలపై అవగాహన కలి్పంచే కథనమిది... తమకు అనుకూలమైన ఆర్థిక సలహాదారును ఎంపిక చేసుకోవడం విజయంలో కీలకంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. మంచి ట్రాక్ రికార్డు అని కాకుండా.. తమ లక్ష్యాల ప్రాధాన్యాన్ని చక్కగా అర్థం చేసుకోగలిగే నిపుణులను ఎంపిక చేసుకోవడం అవసరం. ‘‘ఆర్థిక ప్రణాళిక ఆరంభించడానికి సరైన సమయం అంటూ ఏదీ లేదు. ఎంత ముందుగా ఆరంభిస్తే అంత మెరుగైన ఫలితాలు అందుకోవచ్చు’’ అనేది సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మైంట్ అడ్వయిజర్ల, సహజ్మనీ వ్యవస్థాపకుడు అభిõÙక్ కుమార్ అభిప్రాయం. అందుకని కెరీర్ ఆరంభంలోనే ఆర్థిక నిపుణుల సాయంతో మెరుగైన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుని, ఆ దిశగా అడుగులు వేయడం ద్వారా బంగారు భవిష్యత్కు బాటలు వేసుకున్నట్టు అవుతుంది.నిజంగా అవసరమా? మన విద్యా వ్యవస్థ చాలా విషయాలను నేర్పుతుంది. కానీ ఆర్థిక విషయాలు, ప్రణాళికల గురించి ఎక్కడా కనిపించదు. వివాహం కోసం భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కనీసం రూ.కోటి ఉంటేనే కానీ సొంతింటి కల సాకారం కాదు. పిల్లల విద్య కోసం ఏటా రూ.లక్షలు వెచి్చంచాలి. ఖరీదైన వైద్యం, రిటైర్మెంట్ తర్వాత జీవన అవసరాలు వీటన్నింటికీ సన్నద్ధంగా ఉండాలి. భారీ ఆదాయం ఆర్జించే వారికి తప్పించి, ప్రణాళిక లేకుండా వీటిని విజయవంతంగా అధిగమించడం సామాన్య, మధ్యతరగతి వారికి అంత సులభం కాదు. అర్హత కలిగిన, సెబీ రిజిస్టర్డ్ నిపుణుల సాయంతో వీటిని అధిగమించేందుకు తేలికైన మార్గాలను గుర్తించొచ్చు. ‘‘తమ జీవితంలో ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే చాలా మందికి ఫైనాన్షియల్ అడ్వయిజర్ లేదా ప్లానర్ అవసరం తెలిసొస్తుంది. ఇందుకు నిదర్శనం ఇటీవల చూసిన కరోనా విపత్తు. ఆ సమయంలో అత్యవసర నిధి సాయం ప్రాధాన్యాన్ని చాలా మంది అర్థం చేసుకున్నారు’’ అని ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ (ఎఫ్పీఎస్బీ) ఇండియా సీఈవో క్రిషన్ మిశ్రా పేర్కొన్నారు. ఒకటికి మించి లక్ష్యాలు కలిగి, పొదుపు, మదుపు పట్ల ఆసక్తి కలిగిన వారు నిపుణుల సాయంతో అదనపు ప్రయోజనం పొందొచ్చు. ఆర్థిక అంశాల పట్ల ఎంతో కొంత అవగాహన ఉన్న వారు సైతం.. పొదుపు, పెట్టుబడుల పట్ల తగినంత సమయం వెచి్చంచలేనట్టయితే నిపుణుల సాయానికి వెనుకాడొద్దు. అనుకోని అవసరాలు ఏర్పడితే కొందరు రుణాలతో అధిగమిస్తుంటారు. ఆ రుణం తర్వాత మళ్లీ రుణం ఇలా రుణ చక్రం కొనసాగుతూనే ఉంటుంది. దీనివల్ల ఎంత సంపాదించినా చివరికి మిగిలేదేమీ ఉండదు. స్వీయ తప్పిదాలు, అవగాహనలేమితో ఆర్థిక సంక్షోభాలను కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. ఆర్థిక నిపుణులను కలవడం వల్ల లక్ష్యాల పట్ల స్పష్టత వస్తుంది. ఆర్థిక సవాళ్లను అధిగమించడం ఎలాగన్న స్పష్టత వస్తుంది. మెరుగైన బాట తెలుస్తుంది. దీంతో మానసిక ప్రశాంతత సాధ్యపడుతుంది. మెరుగైన ఆర్థిక ప్రణాళిక ఉన్న కుటుంబాల్లో మానసిక ప్రశాంతత పాళ్లు ఎక్కువని పలు సర్వేలు సైతం స్పష్టం చేశాయి.అందుబాటులో ఉన్న ఆప్షన్లు.. ఆర్ఐఏలు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు వీరు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫైనాన్స్ డిగ్రీ, కనీసం ఆయా విభాగంలో ఐదేళ్ల పాటు సేవలు అందించిన/పనిచేసిన అనుభవంతోపాటు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ (ఎన్ఐఎస్ఎం) నుంచి ఎక్స్ఏ, ఎక్స్బీ సర్టిఫికెట్ కలిగి ఉంటారు. వీరు తమ క్లయింట్ల ప్రయోజనాల కోసమే కృషి చేయాలి. ఎవరి నుంచి ఏ రూపంలోనూ కమీషన్లు స్వీకరించరాదని సెబీ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.సీఏలుఅకౌంటింగ్, పన్ను, ఆడిట్ అంశాల్లో చార్టర్డ్ అకౌంటెంట్లు (సీఏలు) ఎంతో శిక్షణ పొంది ఉంటారు. ఫైనాన్షియల్ ప్లానింగ్లో ప్రత్యేక నైపుణ్యాలు సీఏలకు ఉండాలని లేదు. అయినా కానీ, పన్ను కోణంలో తమ క్లయింట్లకు పెట్టుబడుల సూచనలు చేయవచ్చు.సీఎఫ్పీలు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్లు తగిన కోర్సులు, పరీక్షలు పూర్తి చేసి ఎఫ్పీఎస్బీ నుంచి సర్టిఫికేషన్ పొందిన వారు. వ్యక్తుల ఆర్థిక ప్రణాళిక, పన్నులు, బీమా, రియల్ ఎస్టేట్ ప్లానింగ్ తదితర సేవలు అందిస్తారు.క్యూపీఎఫ్పీలు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ (క్యూపీఎఫ్పీ) ఆరు నెలల కఠోర శిక్షణ అనంతరం నెట్వర్క్ ఎఫ్పీ నుంచి క్యూపీఎఫ్పీ సర్టిఫికేషన్ పొందుతారు. పర్సనల్ ఫైనాన్స్ అంశాలు, నైపుణ్యాల గురించి వీరు పూర్తి స్థాయి శిక్షణ తీసుకుంటారు. తమ క్లయింట్ల ఆర్థిక శ్రేయస్సు దిశగా వీరు.. పొదుపు, పెట్టుబడులు, బీమా, పన్నులు, రుణాలు తదితర అన్ని రకాల వ్యక్తిగత ఆర్థిక అంశాల్లో సేవలు అందిస్తారు.ఎవరిని ఎంపిక చేసుకోవాలి? సెబీ–ఆర్ఐఏలు లేదా సీఎఫ్పీలు, క్యూపీఎఫ్పీలలో ఎవరిని అయినా ఎంపిక చేసుకోవచ్చు. కానీ, పెట్టుబడుల సలహాలు అందించాలంటే ముందుగా సెబీ నుంచి రిజి్రస్టేషన్ తీసుకోవాల్సిందే. అందుకే ఆర్ఐఏలకు అదనంగా సీఎఫ్పీ లేదా చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (సీఎఫ్ఏ) లేదా క్యూపీఎఫ్పీ అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేసుకోవడం మెరుగైనదని నిపుణుల సూచన. సీఎఫ్పీ, సీఎఫ్ఏ, క్యూపీఎఫ్పీ, సీఏ అన్నవి అదనపు అర్హతలుగానే చూడాలి. ‘‘ఫైనాన్షియల్ ప్లానర్ను ఎంపిక చేసుకునే ముందు వారికున్న అర్హతలను నిర్ధారించుకోవాలి. వివిధ రకాల అర్హతలు ఫైనాన్షియల్ ప్లానింగ్ పరంగా వివిధ అవసరాలకు సరిపోయే విధంగా ఉంటాయి. క్లయింట్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దిశగా కొందరు అడ్వయిజర్లు మార్గదర్శనం చేస్తారు. అదే సీఎఫ్పీలు అయితే సమగ్రమైన ఆర్థిక ప్రణాళికా పరిష్కారాలు సూచిస్తారు. రిటైర్మెంట్ కోసం ప్రణాళిక, ఎస్టేట్ ప్లానింగ్ (తదనంతరం వారసులకు బదిలీ), పన్ను ప్రణాళిక, వ్యక్తిగత ఆర్థిక అంశాలకు వీరు పరిష్కారాలు సూచిస్తారు. పెట్టుబడి సలహాదారుల మాదిరిగా కాకుండా సీఎఫ్పీలు ఆర్థిక లక్ష్యాలను సాధించే దిశగా సమర్థవంతమైన పరిష్కార మార్గాలను చూపిస్తారు’’ అని ఎఫ్పీఎస్బీ సీఈవో క్రిషన్ మిశ్రా సూచించారు. సీఏలు తమ కోర్సులో భాగంగా ఆర్థిక అంశాల నిర్వహణపైనా అధ్యయనం చేస్తారు. అయినప్పటికీ ప్రాక్టీసింగ్కు వచ్చే సరికి ఎక్కువ మంది సీఏలు ప్రధానంగా పన్ను అంశాల్లో పరిష్కారాలు, సేవలకు పరిమితం అవుతుంటారు. కాకపోతే తమకున్న అర్హతలు, అనుభవం ఆధారంగా కొందరు ఇతర సూచనలు కూడా చేస్తుంటారు. సీఎఫ్పీ సర్టిఫికేషన్ కలిగిన సెబీ ఆర్ఐఏ మంచి ఎంపిక అవుతారని, ఆర్థిక ప్రణాళికపై వీరికి సమగ్రమైన అవగాహన ఉంటుందని గుడ్ మనీ వెల్త్ ప్లానర్స్ వ్యవస్థాపకుడు మణికరణ్ సింఘాల్ సూచించారు. ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎంపిక విషయంలో తమ స్నేహితులు, బంధువుల సాయాన్ని తీసుకోవచ్చు.ఫీజుకు తగ్గ ప్రతిఫలం! ఆర్థిక నిపుణుల సేవల గురించి తెలిసినా.. వారికి భారీగా ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తుందని కొందరు వెనకడుగు వేస్తుంటారు. నిజానికి నిపుణుల సేవలతో లాభపడే దాని కంటే వారికి చెల్లించే ఫీజు చాలా చాలా తక్కువ. కొంచెం మొత్తానికి వెనుకాడితే.. ఒక్క తప్పటడుగుతో భారీగా నష్టపోవాల్సి రావచ్చు. అందుకే కొంత ఖర్చయినా నిపుణులను ఆశ్రయించడమే మంచిది. సెబీ 2013లో ‘ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నిబంధనలు’ తీసుకొచి్చంది. అప్పటి వరకు కమీషన్ ఆధారితంగా వీరు సేవలు అందించే వారు. దీంతో ఎక్కువ కమీషన్ కోసం కొందరు తమ ప్రయోజన కోణంలో సలహాలు ఇచ్చే వారు. దీన్ని నివారించేందుకు.. ఫీజుల ఆధారిత నమూనాను సెబీ తీసుకొచి్చంది. సెబీ ఆర్ఐఏ చట్టం 2013 కింద.. స్థిరమైన ఫీజు లేదా, క్లయింట్ తరఫున తాము నిర్వహించే పెట్టుబడుల విలువలో నిర్ణీత శాతం (ఏయూఎం ఆధారిత) మేర ఫీజు కింద తీసుకోవచ్చు. ‘‘ఫీజు ఆధారిత సేవల నమూనాలో ఇన్వెస్టర్ విజయంపైనే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల ఆదాయం ఆధారపడి ఉంటుంది. మెరుగైన సూచనలు అందించకపోతే, క్లయింట్లను కోల్పోవాల్సి వస్తుంది. కమీషన్లకు అవకాశం లేకపోవడంతో ఎలాంటి పక్షపాతం లేని సూచనలు అందించడానికి వీలుంటుంది’’ అని మిశ్రా వివరించారు. ఆర్ఐఏలకు ఫీజులను డిజిటల్ విధానంలో, వారి ఖాతాకే చెల్లించాలి. నగదు రూపంలో, లేదా వేరెవరి ఖాతాకో బదిలీ చేయొద్దు.ఫీజు పరిమితులుఆర్ఐఏలకు సంబంధించి చార్జీల విషయంలో సెబీ పరిమితులు విధించింది. ఫిక్స్డ్ ఫీజు అయితే ఏడాదికి రూ.1.25 లక్షలు మించకూడదు. లేదా, ఇన్వెస్టర్ పెట్టుబడుల విలువలో ఏటా 2.5 శాతం మించి ఫీజు వసూలు చేయరాదు.ఈ అంశాలపై స్పష్టత అవసరం... ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లకు పూర్తి వివరాలు అందించినప్పుడే వారి నుంచి సరైన సూచనలు, సలహాలు పొందడానికి వీలుంటుంది. ముఖ్యంగా తమ ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులు, రుణాలు, ఆస్తులు, పిల్లలు, వారికి సంబంధించి విద్య, వివాహ లక్ష్యాలు, భవిష్యత్తులో ఏవేవి సమకూర్చుకోవాలని అనుకుంటున్నారు? కుటుంబ ఆరోగ్య చరిత్ర ఇత్యాది వివరాలు అందించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా కోర్టు వివాదాలు, ఇతరత్రా కోరిన సమాచారం కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ అంశాల ఆధారంగా మెరుగైన ప్రణాళిక, సూచనలు, పరిష్కారాలు సూచించేందుకు ఆస్కారం ఉంటుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
పారిశ్రామిక పాలసీల్లో బడుగులకు మొండిచెయ్యి
సాక్షి, అమరావతి: నూతన పారిశ్రామిక పాలసీల్లో దళితులు, బలహీన వర్గాలకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దళితులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇంతకాలం వారికి అందిస్తున్న అదనపుప్రయోజనాల్లో భారీ కోత పెట్టింది. భూమి కొనుగోలు దగ్గర నుంచి పెట్టుబడి వ్యయం వరకు అదనపు ప్రయోజనాలు కల్పించకపోగా.. ఇప్పటివరకు ఉన్న వాటిని కూడా తీసివేయడంపై దళిత పారిశ్రామిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 32 పేజీల పారిశ్రామిక పాలసీల్లో కేవలం ఒకే ఒక వాక్యం ఎస్సీ, ఎస్టీల గురించి ప్రస్తావించి వదిలేశారంటే దళితులపై చంద్రబాబు ప్రభుత్వంకు ఎంత ప్రేముందో అర్థం చేసుకోవచ్చు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అదనంగా 5 శాతం పెట్టుబడి సాయం అని ప్రస్తావించారే తప్ప.. ఆ పెట్టుబడి సాయం పరిధిని మాత్రం పెంచలేదు. ఇతరులకు ఇస్తున్న విధంగానే పెట్టుబడి సాయం పరిమితిని ఉంచడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిన్న పరిశ్రమల విషయంలో కూడా ప్రభుత్వం ఇదే విధానాన్ని అనుసరించింది. ప్రభుత్వం కొనుగోలు చేసే వస్తువులను ఎస్సీ, ఎస్టీలకు చెందిన సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నుంచి 4 శాతం తప్పనిసరి చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసే దళితులకు అదనంగా 10 శాతం క్యాపిటల్ సబ్సిడీ అని పేర్కొన్నా ఇతరులకు అందిస్తున్న క్యాపిటల్ సబ్సిడీ రూ.7 కోట్ల పరిమితిని అదేవిధంగా ఉంచి పైసా కూడా పెంచకపోవడం ఈ ప్రభుత్వం దళితులపై చూపిస్తున్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనమని దళిత్ ఇండ్రస్టియల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మామిడి సుదర్శన్ ఘాటుగా విమర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో వైఎస్సార్ బడుగు వికాసం పేరిట దళితలకు అనేక ప్రోత్సాహకాలు ఇస్తే.. పొరుగున ఉన్న తెలంగాణ కూడా అదేవిధంగా భూమి కొనుగోళ్లలో రాయితీ ఇస్తోందని, చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక పాలసీ 4.0లో వీటన్నింటికీ మంగళం పాడారని విమర్శించారు. ప్రైవేటు పార్కులొస్తే రిజర్వేషన్లు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల నుంచి భారీ పరిశ్రమలకు వరకు అన్నిరకాల పారిశ్రామిక పార్కులను ప్రైవేటుపరం చేసే విధంగా పారిశ్రామిక పార్కుల పాలసీని ప్రవేశపెట్టడం ద్వారా దళితులు, బలహీన వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆశలపై ప్రభుత్వం నీళ్లుచల్లింది. ఇంతకాలం ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన పార్కుల్లో 25 శాతం వరకు ఎస్సీలకు రిజర్వేషన్లు ఉండటమే కాకుండా తక్కువ ధరకు భూమిని కేటాయించేవారు. కానీ ఇప్పుడు పార్కులను ప్రైవేటు పరం చేస్తుండటంతో రిజర్వేషన్లకు అవకాశం లేకుండా పోయింది. ప్రైవేటు పారిశ్రామిక పాలసీల్లో రిజర్వేషన్లు కల్పించాలని దళిత సంఘాలు అనేకసార్లు విజ్ఞప్తి చేసిన కూటమి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఏపీఐఐసీ స్థానంలో ప్రైవేటు పార్కులను ప్రోత్సహిస్తూ ఎంఎస్ఎంఈ పాలసీలో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న ప్రతిపాదన ఏ విధంగా అమలు అవుతుందని దళితులు ప్రశ్నిస్తున్నారు. పారిశ్రామిక పాలసీలలో ఎస్సీ, ఎస్టీలకు రాయితీల ప్రతిపాదనలు » పరిశ్రమల్లో ఏర్పాటు చేసే వ్యయంలో అదనంగా 5 శాతం పెట్టుబడి రాయితీ » ఎంఎస్ఎంఈ పాలసీలో ప్రభుత్వ కొనుగోళ్లలో 4 శాతం ఎస్సీ, ఎస్టీలకు పరిశ్రమల నుంచి కొనుగోలు చేయడాన్ని తప్పనిసరి చేస్తాం » 10 శాతం అదనపు క్యాపిటల్ సబ్సిడీ గరిష్ట పరిమితి రూ.7 కోట్లు. » పారిశ్రామిక పార్కుల్లో 20 శాతం స్థలాలు మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపు వైఎస్సార్ బడుగు వికాసంలో.. » పారిశ్రామిక పార్కులు, ఎంఎస్ఎంఈ పార్కుల్లో భూమి విలువలో 50 శాతం రాయితీ. » భూబదలాయింపు చార్జీల్లో 25 శాతం, 100 శాతం స్టాంప్డ్యూటీ మినహాయింపు » తయారీ, సర్వీసు రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ 45 శాతం. 9 శాతం వడ్డీ రాయితీ. » ఉత్పత్తి ప్రారంభించిన ఐదేళ్ల వరకు యూనిట్ ధరపై రూ.1.50 సబ్సిడీ » ఎంఎస్ఎంఈలకు 100 శాతం ఎస్జీఎస్టీ మినహాయింపు » మధ్యతరహా పరిశ్రమలకు 75 శాతం, భారీ పరిశ్రమలకు 50 శాతం ఎస్జీఎస్టీ మినహాయింపు » ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సీడ్ క్యాపిటల్ అసిస్టెంట్ కింద 25 శాతం యంత్రాల కొనుగోలు వ్యయంపై రాయితీ » క్వాలిటీ సర్టిఫికేషన్, పేటెంట్లకు అయ్యే వ్యయంలో 100 శాతం రాయితీ. రాయితీలు విడుదలకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు -
బంగారంపై పెట్టుబడి.. ఇప్పుడు సురక్షితమేనా?
విజయదశమి నుంచి ప్రారంభమైన బంగారం ధరల పెరుగుదల.. ధన త్రయోదశి, దీపావళి పండుగల నాటికి జీవితకాల గరిష్టాలను తాకింది. ప్రస్తుతం 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 82వేలుకు చేరువలో ఉంది. ఆంటే ఒక్క గ్రామ్ పసిడి కొనుగోలు చేయాలంటే రూ. 8,200 చెల్లించాల్సిందే అని స్పష్టమవుతుంది. ఇలాంటి సమయంలో బంగారం మీద పెట్టుబడులు సురక్షితమేనా అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.ప్రస్తుతం భారీగా పెరుగుతున్న బంగారం ధరలు, మళ్ళీ ఒక్కసారిగా పడిపోయే అవకాశం ఉంటుందా అని పెట్టుబడిదారులు కొంత గందరగోళానికి గురి కావచ్చు. అయితే గత ఐదేళ్లలో పసిడి ధరలు భారీగా పెరగడం బహుశా ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో గోల్డ్ రేటు భారీగా తగ్గే అవకాశాలు లేదు.బంగారం ధరలు గణనీయంగా పెరగడానికి ప్రధాన కారణం.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడ్ రేట్ల కోతలు, అమెరికా అధ్యక్ష ఎన్నికలని తెలుస్తోంది. అంతే కాకుండా యుద్ధం లాంటి పరిస్థితి ప్రపంచ వృద్ధి రేటును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఇది కూడా గోల్డ్ రేటు పెరగడానికి కారణమవుతోంది. భారతదేశంలో బంగారంపై కస్టమ్స్ డ్యూటీలో కోత.. ధరల పెరుగుదలకు హేతువు అయింది. ఇదీ చదవండి: 102 టన్నుల బంగారం.. ఆర్బీఐ సీక్రెట్ ఆపరేషన్!డిమాండ్ అనేది సరఫరాను మించి ఉన్నప్పుడు.. ధరల పెరుగుదల సర్వసాధారణం. కాబట్టి ఇలాంటి సమయంలో బంగారంపైన నిశ్చింతగా పెట్టుబడులు పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో పసిడిపై పెట్టిన పెట్టుబడులు తప్పకుండా లాభాలను తెచ్చిపెడతాయని చెబుతున్నారు. -
ఒకేరోజు రూ.3.53 నుంచి రూ.2.36 లక్షలకు చేరిన స్టాక్!
ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే స్మాల్ క్యాప్ స్టాక్ భారీగా పెరిగి రికార్డు నమోదు చేసింది. అక్టోబర్ 29న పెరిగిన స్టాక్ విలువ ఏకంగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్లోనే ఖరీదైన స్టాక్గా మారింది. ఈ స్టాక్ ధర ఒక్క ట్రేడింగ్ సెషన్లో ఏకంగా 66,92,535 శాతం దూసుకుపోయింది. దాంతో గతంలో రూ.3.53గా ఉండే స్టాక్ ధర కాస్తా రూ.2,36,250కు చేరింది. ఇండియాలోనే ఇప్పటి వరకు ఖరీదైనా స్టాక్గా ఉన్న ఎంఆర్ఎఫ్ షేర్ ధర రూ.1.2 లక్షలును మించిపోయింది.షేర్ ధర రూ.3.53 వద్ద ఎందుకుందంటే..2011 నుంచి ఒక్కో షేరు ధర దాదాపు రూ.3గా ఉంది. కానీ ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కో షేర్ పుస్తక విలువ(వాస్తవ విలువ) రూ.5,85,225గా ఉంది. ఇలా కంపెనీ స్టాక్ల వాస్తవ విలువ ఆకర్షణీయంగా ఉండడంతో కంపెనీ షేర్లు ఎవరూ అమ్మడానికి ఇష్టపడలేదు. దాంతో షేర్ల ట్రేడింగ్ కొరత ఎక్కువైంది. తక్కువ ట్రేడింగ్ వాల్యూమ్ల కారణంగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిలిపేశారు. ఫలితంగా దాదాపు ఒక దశాబ్దం పాటు స్టాక్ ధర సింగిల్ డిజిట్లోనే ఉంది.ఇదీ చదవండి: ‘షరతులు తీరిస్తే జాబ్ చేయడానికి సిద్ధం’ఎందుకు అంత పెరిగిందంటే..ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాల్యుయేషన్కు అనుగుణంగా ప్రత్యేక సెషన్ను నిర్వహించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలను సెబీ ఆదేశించింది. దాంతో ఎల్సిడ్ వాటాదారుల పంట పండినట్లయింది. కొత్త మెకానిజంలో భాగంగా లిక్విడిటీని మెరుగుపరచడం, సరసమైన ధరల ఆవిష్కరణను సులభతరం చేయడం లక్ష్యంగా హోల్డింగ్ కంపెనీలకు ఎటువంటి ప్రైస్ బ్యాండ్లు విధించలేదు. దాంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నిర్వహించిన ప్రత్యేక కాల్ ఆక్షన్ సెషన్లో స్టాక్ ధర భారీగా పెరిగింది. మంగళవారం కొన్ని షేర్లు చేతులు మారిన తర్వాత, బుధవారం ఉదయం ఎటువంటి ట్రేడింగ్ కార్యకలాపాలు జరగలేదు. -
నెలకో రూ.లక్ష.. రిటైర్మెంట్ ప్లాన్ ఇలా..
చాలా మందికి రిటైర్డ్ జీవితానికి సంబంధించి కొన్ని ఆలోచనలు ఉంటాయి. రిటైర్మెంట్ తర్వాత కొందరు సముద్రానికి దగ్గరగా ఉండటానికి ఇష్టపడితే మరికొందరు ప్రశాంతంగా ఏ కొండ ప్రాంతంలోనో లేదా ఊళ్లోనో ఉండాలనుకుంటారు. మన దేశంలో రిటైర్మెంట్ పరిస్థితులు నాటకీయంగా మారుతున్నాయి.పదవీ విరమణ అంటే పరిమితమైన అవసరాలతో ప్రశాంతమైన జీవనమనే రోజులు పోతున్నాయి. నేటి రిటైరీలు ఉద్యోగానంతరం కూడా జీవితాన్ని చురుగ్గా సాగించాలనుకుంటున్నారు. ప్రయాణాలు, హాబీలు, సోషల్ ఎంగేజ్మెంట్ మొదలైన వాటితో సందడిగా గడపాలనుకుంటున్నారు. అయితే, పటిష్టమైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడుకున్న పెట్టుబడులు పెట్టడం ద్వారానే ఈ కల సాకారం కాగలదు. చాలా మందికి తాము సరైన ప్రణాళికనే వేసుకున్నామా, తాము దాచుకుంటున్నది రిటైర్మెంట్ తర్వాత అవసరాలకు సరిపోతుందా అనే సందేహాలు ఉంటాయి.ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానాల కారణంగా ప్రస్తుతం మనిషి జీవితకాలం మరింతగా పెరుగుతోంది. కాబట్టి ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు రిటైర్మెంట్ తర్వాత సౌకర్యవంతంగా జీవించాలంటే నెలకో రూ. 1 లక్ష (ఏడాదికి రూ. 12 లక్షలు) అవసరమవుతాయని, 60 ఏళ్ల తర్వాత మరో 15 ఏళ్ల పాటు జీవిస్తారనుకుంటే మొత్తం రూ. 1.8 కోట్లు (రూ. 12 లక్షలు గీ 15) అవసరమవుతాయి. 85 ఏళ్ల వరకు జీవిస్తే రూ. 3 కోట్లు అవసరమవుతాయి. ఆర్థిక ప్రణాళికలు వేసుకునేటప్పుడు ఇలా అదనపు సంవత్సరాల కోసం ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక వనరుల సమీకరణకు కృషిరిటైర్మెంట్ తర్వాత కూడా జీవితం నిశ్చింతగా సా గేందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు అన్ని అవకాశాలను పరిశీలించండి. వాస్తవ గణాంకాలను పరిగణన లోకి తీసుకోండి. మీ నెలవారీ జీవన వ్యయాలను లెక్కేయండి. ముందుగా చెప్పినట్లు జీ విత కాలం 85 ఏళ్లనుకుంటే, 60 ఏళ్ల వ్యక్తికి అప్పటివరకు అయ్యే జీ వన వ్యయాల కోసం రూ. 3 కోట్ల వర కు ని ధి అవసరమవుతుంది. వార్షిక ద్రవ్యోల్బణానికి సమాన స్థాయిలో రాబడులు ఉంటాయన్న అంచనా లతో ఈ మేరకు లెక్క వేశాం. మీ ఖర్చులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని లెక్క వేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. దేశీయంగా పెరుగుతున్న హెల్త్కేర్ ఖర్చులను ఒకసారి చూద్దాం. హెల్త్కేర్ ద్రవ్యోల్బణం సుమారు 14 శాతంగా ఉంటోంది. కొత్త టెక్నాలజీలు, చికిత్సల వల్ల బిల్లుల భారం మరింతగా పెరుగుతుంది. వైద్య చికిత్సల ఖర్చులు పెరిగే కొద్దీ ఎమర్జెన్సీల కోసం మరింత నిధిని పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది. పెరిగే ఖర్చులను తట్టుకునేందుకు మీరేం చేయాల్సి ఉంటుందంటే..పెద్ద మొత్తంలో కవరేజీ ఉండేలా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలిబేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ను పరిమాణాన్ని పెంచుకునేందుకు టాప్–అప్ తీసుకోవాలిమేజర్ అనారోగ్యం బైటపడినప్పుడు ఏకమొత్తంగా డబ్బునందించే క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ను పరిశీలించాలిజీవితకాలానికి మించే రిటైర్మెంట్ ఫండ్ను సమకూర్చుకోవాలంటే ఏం చేయాలంటే.. 1. భారీ రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవడం: పొదుపు చేయాలి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. 2. ఆర్థిక సాధనాలు ఉపయోగించుకోవాలి: మీ రిటైర్మెంట్ ఫండ్ను పెంచుకునేందుకు జీవిత బీమా సాధనాలను పరిశీలించండి. ఏ ఆర్థిక ప్రణాళికైనా, ముఖ్యంగా రిటైర్మెంట్లాంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలు మొదలైనవి విజయవంతం కావాలంటే జీవిత బీమా, ఆరోగ్య బీమా కవరేజీలు తగినంతగా ఉండటం ముఖ్యం. 3. పన్ను ప్రయోజనాలు: బీమా పథకాలు సాధారణంగా పన్నులపరమైన ప్రయోజనాలు కల్పించేవిగా ఉంటాయి. -
పెట్టుబడులకు పెద్దన్నలు
దేశీయంగా వినియోగం పెరుగుతున్న కొద్దీ వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా దిగ్గజ కంపెనీలు భారీగా కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఇందుకోసం భారీగా ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. ఇటీవలి మూడీస్ రేటింగ్స్ ప్రకారం.. కొన్నాళ్ల పాటు ఏటా 45–50 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడతాయనే అంచనాలు నెలకొన్నాయి.ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల కల్పన కోసం తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు కూడా ఈ పెట్టుబడులకు దోహదపడనున్నాయి. ఇక, స్టాండర్డ్ అండ్ పూర్ అంచనాల ప్రకారం వచ్చే దశాబ్దకాలంలో కార్పొరేట్ దిగ్గజాలు 800 బిలియన్ డాలర్లపైగా పెట్టుబడులు పెట్టబోతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా, అదానీ, జేఎస్డబ్ల్యూ గ్రూప్, వేదాంత వంటి దిగ్గజాలు ఈ మేరకు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఇందులో దాదాపు 40 శాతం పెట్టుబడులు, అంటే సుమారు 350 బిలియన్ డాలర్లు హరిత హైడ్రోజన్, పర్యావరణహిత ఇంధనాలు, ఏవియేషన్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు వంటి .. కొత్త వ్యాపారాల్లోకి రానున్నాయి. అలాగే, ప్రస్తుత వ్యాపారాలను కూడా మరింత పటిష్టం చేసుకోవడంపై బిర్లా, మహీంద్రా, హిందుజా, హీరో, ఐటీసీ, బజాజ్ వంటి పలు దిగ్గజాలు దృష్టి పెడుతున్నాయి. గడిచిన రెండేళ్లుగా ఆయా సంస్థల పెట్టుబడుల సరళిని చూస్తే ఇందుకోసం వచ్చే పదేళ్లలో దాదాపు 400 బిలియన్ డాలర్ల నుంచి 500 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చని అంచనాలు నెలకొన్నాయి. రిస్క్లూ ఉన్నాయి..!దేశీ దిగ్గజాల వ్యా పార వృద్ధికి అవకాశాలు భారీగానే ఉన్నప్పటికీ.. పెట్టుబడులపరంగా కొన్ని రిసు్కలు కూడా ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పెట్టుబడుల కోసం ఏవో కొన్ని సంస్థలు తప్ప చాలా మ టుకు కంపెనీలు పెద్ద ఎత్తున రుణాలపైనే ఆధారపడాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. కాబట్టి లాభదాయకత ఎలా ఉంటుందో ఇంకా తెలియని కొత్త రంగాల్లో పెట్టుబడులపరంగా కావచ్చు ప్రణాళికల అమలుపరంగా కావ చ్చు ఏవైనా సమస్యలు ఎదురైతే రుణభారం గణనీ యంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. వీటిని గుర్తించే ఆయా కంపెనీలు కొత్త టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేసే విషయంలో ప్రత్యామ్నాయ ప్రణాళికలను కూడా సిద్ధంగా ఉంచుకుంటున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మిడ్క్యాప్ విభాగంలో మెరుగైన రాబడులు ఇలా!
motilal oswal midcap fund: లార్జ్క్యాప్ స్టాక్స్లో అధిక స్థిరత్వం చాలా మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంటుంది. కానీ, కొందరు రిస్క్ ఎక్కువ ఉన్నా ఫర్వాలేదు రాబడులు అధికంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ తరహా ఇన్వెస్టర్లు స్మాల్క్యాప్ ఫండ్స్ ఎంపిక చేసుకుంటారు. రిస్క్ మధ్యస్థంగా ఉండి, రాబడులు కూడా లార్జ్క్యాప్ కంటే ఎక్కువగా ఉండాలని కోరుకునే వారికి మిడ్క్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలంలో లార్జ్క్యాప్ స్టాక్స్ కంటే స్మాల్క్యాప్ స్టాక్స్ అధికంగా రాబడులు ఇచ్చినట్టు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ, గడిచిన పదేళ్లలో రాబడుల పరంగా స్మాల్క్యాప్ కంటే మిడ్క్యాప్ సూచీ ముందుంది. బీఎస్ఈ 150 మిడ్క్యాప్ టీఆర్ఐ సూచీ.. బీఎస్ఈ స్మాల్క్యాప్ టీఆర్ఐ సూచీ కంటే 2.13 శాతం అధికంగా 21.32 శాతం చొప్పున ఏటా రాబడులు అందించింది. ఇదే కాలంలో స్మాల్క్యాప్ సూచీ వార్షిక రాబడులు 19.18 శాతంగానే ఉన్నాయి. మిడ్క్యాప్ విభాగంలో అధిక స్థిరత్వం, మెరుగైన రాబడులు కోరుకునే వారికి మోతీలాల్ ఓస్వాల్ మిడ్క్యాప్ ఫండ్ మంచి ఎంపిక అవుతుంది.రాబడులు.. ఈ పథకం డైరెక్ట్ ప్లాన్లో ఏడాది కాలంలో రాబడి 73 శాతంగా ఉంది. అదే రెగ్యుల్ ప్లాన్లో అయితే 71 శాతం రాబడి వచి్చంది. మూడేళ్లలో డైరెక్ట్ ప్లాన్ ఏటా 36 శాతానికి పైనే రాబడి తెచ్చి పెట్టింది. ఐదేళ్లలోనూ 35 శాతం చొప్పున వార్షిక రాబడులను అందించిన చరిత్ర ఈ పథకం సొంతం. ఇక ఏడేళ్లలో ఏటా 24 శాతం, పదేళ్లలో ఏటా 23 శాతం చొప్పున పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు రాబడి లభించింది. ఇందులో డైరెక్ట్ ప్లాన్ అన్నది మధ్యవర్తుల ప్రమేయం లేనిది. ఈ ప్లాన్లో ఫండ్స్ సంస్థ ఎవరికీ కమీషన్లు చెల్లించదు. రెగ్యులర్ ప్లాన్లో మధ్యవర్తులకు కమీషన్ వెళుతుంది. ఈ మేర ఇన్వెస్టర్ల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తారు. కనుక రెగ్యులర్ ప్లాన్ కంటే డైరెక్ట్ ప్లాన్లో దీర్ఘకాలంలో రాబడులు ఎక్కువగా ఉంటాయి.పెట్టుబడుల విధానం/ పోర్ట్ఫోలియో... మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ నాణ్యత, వృద్ధి, దీర్ఘకాలం, ధర అనే అంశాల ఆధారంగా మిడ్క్యాప్ విభాగంలో భవిష్యత్లో మంచి రాబడులు ఇచ్చే స్టాక్స్ను ఎంపిక చేస్తుంటుంది. బలమైన వృద్ధి అవకాశాలున్న నాణ్యమైన కంపెనీలను ఎంపిక చేసుకుంటుంది. సహేతుక ధరల వద్దే కొనుగోలు చేస్తుంటుంది. ఎంపిక చేసుకునే కంపెనీలకు గణనీయమైన వ్యాపార వృద్ధి అవకాశాలు ఉండేలా జాగ్రత్త పడుతుంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20 శాతానికి పైన ఉన్న కంపెనీలను ఎంపిక చేసుకుంటుంది. బలమైన ఫ్రీ క్యాష్ ఫ్లోను కూడా చూస్తుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.18,604 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 81 శాతాన్నే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. 15 శాతం మేర డెట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టింది. 3.89 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లోనూ 66 శాతం మేర లార్జ్క్యాప్లోనే ఉన్నాయి.చదవండి: మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!మిడ్క్యాప్లో 32.49 శాతం, స్మాల్క్యాప్లో 1.77 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. లార్జ్క్యాప్ విభాగంలో ఎక్కువ పెట్టుబడులు ఉన్నప్పుడు మిడ్క్యాప్ పథకం ఎలా అయిందన్న సందేహం రావచ్చు. ఈ పథకం ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు మధ్య కాలానికే లార్జ్క్యాప్ కంపెనీలుగా అవతరించడం ఇందుకు కారణం. పెట్టుబడుల పరంగా టెక్నాలజీ, కన్జ్యూమర్ డి్రస్కీషనరీ, ఇండస్ట్రియల్స్ రంగాలకు ఎక్కువ వెయిటేజీ ఇస్తూ.. 61 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. -
గుడ్డు రైతుకు గడ్డు కాలం!
పౌల్ట్రీ రంగంలో నాలుగు దశాబ్దాల అపార అనుభవం ఉన్న రెడ్డిబత్తుల సత్యనారాయణరెడ్డి 2 వేల కోళ్లతో మొదలు పెట్టి 2.32 లక్షల కోళ్ల ఫారం నిర్వహించే స్థాయికి ఎదిగారు. పదేళ్ల పాటు కృష్ణా జిల్లా లేయర్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా సేవలందించారు. అలాంటి రైతు కూడా చివరకు నష్టాలు భరించలేక నూజివీడు మండలం అన్నవరం వద్ద తనకున్న కోళ్ల ఫారాలను అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తమ ప్రాంతంలో ఇటీవల ఐదు కోళ్ల ఫారాలను విక్రయించారని, మిట్టగూడెం వద్ద ఓ కోళ్లఫారాన్ని కూలగొట్టి భూమి విక్రయానికి పెట్టారని, ప్రభుత్వం ఆదుకోకుంటే పౌల్ట్రీ రంగం కోలుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులకు తోడు ఫామ్ గేటు వద్ద గుడ్డుకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాలతో అక్కడ పౌల్ట్రీ పరిశ్రమ బలంగా వేళ్లూనుకోవడం లాంటిæ కారణాల వల్ల రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లుతోంది. పలు జిల్లాల్లో ఫామ్స్ను విక్రయిస్తుండగా మరికొన్ని చోట్ల కార్పొరేట్ సంస్థలకు అప్పగించేస్తున్నారు. – సాక్షి, అమరావతిగతేడాది రికార్డు స్థాయిలో గుడ్డు ధర..రాష్ట్రంలో 1,200 కోళ్ల ఫారాలు ఉండగా రోజుకు 6 కోట్ల గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఏపీలో 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు వినియోగమవుతుండగా 2 కోట్లకు పైగా గుడ్లు పశి్చమ బెంగాల్, ఒడిశా, బిహార్, అసోం, మణిపూర్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మొన్నటి వరకు శ్రీలంక, గల్ఫ్ దేశాలకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున గుడ్లు ఎగుమతి అయ్యేవి. పౌల్ట్రీ రంగ చరిత్రలో 2023లో ఫామ్ గేటు వద్ద గుడ్డుకు రికార్డు స్థాయిలో రూ.5.75కుపైగా ధర లభించడం, అదే సమయంలో పౌల్ట్రీరంగ అభ్యున్నతి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీ పౌల్ట్రీ డెవలప్మెంట్ పాలసీ తెచ్చే దిశగా అడుగులు వేయడంతో తమ వెతలు తీరుతాయని రైతులు భావించారు. మేత ఖర్చులు తడిసి మోపెడు... ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో దాదాపు 2 లక్షల కోళ్లు మృత్యువాత పడగా ఆ ప్రభావంతో కోళ్లు పెద్దఎత్తున జబ్బుల పాలవుతున్నాయి. పౌల్ట్రీ రంగంలో విరివిగా వినియోగించే మొక్కజొన్న, బ్రోకెన్ రైస్ తదితరాలు ఇథనాల్ ఫ్యాక్టరీలకు మళ్లించడంతో బహిరంగ మార్కెట్లో వాటి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. సోయా మినహా మిగిలిన మేతæ ఖర్చులు రైతులకు భారంగా మారిపోయాయి. సాధారణంగా జూన్ తర్వాత ఫామ్ గేటు వద్ద గుడ్డు రేటు పెరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఫామ్ గేటు వద్ద రూ.4.50 నుంచి రూ.4.75కి మించి రావడం లేదు. ప్రస్తుతం ఫామ్ గేటు వద్ద లేయర్ లైవ్ ధర కిలో రూ.78, బాయిలర్ రూ.102 చొప్పున ధర లభిస్తోంది. 40–50 శాతానికి పడిపోయిన ఉత్పత్తి సాధారణంగా ఫామ్లో 70–80 వారాల పాటు కోడి సగటున రూ.1,300 విలువైన మేత తింటుంది. సగటున 330 వరకు గుడ్లు పెడుతుంది. అత్యధికంగా 20–40 వారాల మధ్య గరిష్టంగా 96 గుడ్లు వరకు పెడుతుంటాయి. వర్షాలు, వరదల వల్ల దాదాపు 8–10 శాతం కోళ్లు వైరస్ల బారిన పడడంతో 40–50 శాతానికి ఉత్పత్తి తగ్గిపోయింది. పెట్టుబడి ఖర్చులు తట్టుకోలేక కొత్త బ్యాచ్లు పెట్టేందుకు రైతులు సాహసించడం లేదు. ప్రస్తుతం 75 శాతం కెపాసిటీతోనే ఫామ్స్ నడిచే పరిస్థితి నెలకొంది. గతేడాది ఇదే సమయంలో 4.75 కోట్ల నుంచి 5 కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అవగా ప్రస్తుతం 3.75 కోట్లకు మించి ఉత్పత్తి కావడం లేదు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ఏపీ నుంచి వచ్చే గుడ్లకు ధర లేకుండా చేయడం, తమిళనాడు నుంచి కూడా ఏపీకి సరఫరా పెరగడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాల ఫలితంగా యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో కోళ్ల ఫారాలు గణనీయంగా పెరుగుతుండడంకూడా ఏపీ పౌల్ట్రీ రంగానికి అశనిపాతంగా మారింది.సిండికేట్తో ధరలు పతనం గతేడాది రికార్డు స్థాయిలో ధర లభించడంతో పౌల్ట్రీ రంగం కాస్త కుదుటపడుతుందని రైతులు ఆశించారు. వైరస్ల ప్రభావంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు సిండికేట్గా మారి ఫామ్ గేటు వద్ద మన రైతుకు ధర లేకుండా చేస్తున్నారు. – తుమ్మల కుటుంబరావు, నెక్ మాజీ చైర్మన్ మేత ఖర్చులు భారం.. ఇథనాల్ ఫ్యాక్టరీలు పెరిగిపోయాయి. మొక్కజొన్న, బ్రోకెన్ రైస్ ఈ ఫ్యాక్టరీలకు మళ్లిస్తున్నారు. ఫలితంగా మార్కెట్లో వీటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కోళ్ల ఫారమ్ల నిర్వహణ చాలా భారంగా మారింది. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ కార్యదర్శి -
భారత్ రెగ్యులేటర్లు.. భేష్
ముంబై: భారత ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలు అత్యుత్తమ రీతిలో ‘‘ప్రపంచ ప్రమాణాల స్థాయి’’ విధులు నిర్వహిస్తున్నాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. అలాగే వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి సైతం రెగ్యులేటర్లు కృషి చేస్తున్నాయని అన్నారు. కాగా రెగ్యులేటర్లను ప్రశ్నించడానికి లేదా విమర్శించడానికి తాను వ్యతిరేకం కాదని ఆమె ఆ సందర్భంగా ఉద్ఘాటింటారు. అయితే రెగ్యులేటర్లు నిర్వహిస్తున్న అత్యున్నత బాధ్యతలు, ఎకానమీ పురోభివృద్ధిలో సహకారం పట్ల కూడా ‘అత్యంత స్పృహ‘ కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఇక్కడ జరిగిన ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్బెస్ట్ బ్యాంక్స్ అవార్డుల కార్యక్రమంలో అన్నారు.సెబీ విషయంలో బయటకు వస్తున్న వాస్తవాలను అందరూ పరిశీలించాలని కోరారు. సెబీ చైర్పర్సన్ మాధవీ పురి బుచ్పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీతారామన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ‘రెగ్యులేటర్లపై చర్యలు తీసుకోవాలని చర్చించే ముందు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని నేను గట్టిగా సిఫార్సు చేస్తున్నాను’’ అని సీతారామన్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడికి లోనుకావడం లేదని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫారమ్లకు ధన్యవాదాలు బ్యాంకుల్లో పొదుపులు... పెట్టుబడుల్లోకి మారుతున్నాయన్న భయాలను ప్రస్తావిస్తూ, తక్కువ వడ్డీవచ్చే ఖాతాల వద్ద సౌకర్యవంతంగా కూర్చుండిపోకుండా, కొంత రిస్క్ తీసుకునిఎక్కువ రాబడులు పొందే వీలున్న మార్కెట్లలోకి మధ్యతరగతి భారతీయులు ప్రవేశించడానికి దోహదపడుతూ ‘‘గొప్ప సేవ’’చేస్తున్న డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫారమ్లకు ధన్యవాదాలని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. 2014లో 2.31 కోట్లుగా ఉన్న డీమ్యాట్ ఖాతాల సంఖ్య సెపె్టంబరు 2024 నాటికి 17.1 కోట్లకు పెరిగాయన్న గణాంకాలను కూడా ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.బ్యాంకుల పటిష్టత అటు ఎకానమీని ఇటు కుటుంబాల ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేస్తుందని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో వాటి లాభదాయకతను ప్రభావితం చేసే రుణ నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె బ్యాంకింగ్కు సూచించారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని అన్నారు. పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు విద్యాపరంగా అర్హత కలిగి ఉన్నారని, అయితే పారిశ్రామిక అవసరాల గురించి వారికి పెద్దగా తెలియడం లేదని ఆమె ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. -
వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి: సజ్జన్ జిందాల్తో గడ్కరీ
కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' (Nitin Gadkari) నాగ్పూర్లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదర్భలో పెట్టుబడులు పెట్టవలసిన అవసరాన్ని గురించి వివరించారు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు లేకపోవడం వల్ల రూ. 500 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్న పెట్టుబడిదారులు లేకపోవడాన్ని పేర్కొన్నారు.జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియాలో 35 శాతం వాటాను కలిగి ఉన్న 'సజ్జన్ జిందాల్' ఇటీవల తన నివాసాన్ని సందర్శించినట్లు గడ్కరీ పేర్కొన్నారు. నాగ్పూర్లో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని తాను చెప్పినట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: 40 ఏళ్ల క్రితం టీసీఎస్లో జీతం ఎంతంటే?: ఆఫర్ లెటర్ వైరల్వ్యాపారాలకు ప్రభుత్వ రాయితీల సమస్యను ప్రస్తావిస్తూ, పారిశ్రామికవేత్తలు కూడా కొంత ఓపికతో ఉండాలని గడ్కరీ చెప్పారు. లడ్కీ బహిన్ యోజన కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాల్సి ఉన్నందున.. పెట్టుబడిదారులు తమ సబ్సిడీ చెల్లింపును అందుకోవడానికి కొంత సమయం ఎదురు చూడాల్సి ఉంటుందని అన్నారు. కాబట్టి విదర్భలోని వ్యాపారులు, తమ వ్యాపారాలను స్వతంత్రంగా చేసుకోవాలని, ప్రభుత్వాల మీదే పూర్తిగా ఆధారపడకూడదని సలహా ఇచ్చారు. -
కొత్త టెక్నాలజీ కోసం ఏఎం గ్రీన్ భారీ పెట్టుబడి
ఏఎం గ్రీన్ గ్రూప్లో భాగమైన.. ఏఎం గ్రీన్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్ బీ.వీ, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఎనర్జీ ట్రాన్సిషన్ సొల్యూషన్స్ ప్రొవైడర్లలో ఒకటైన చెంపోలిస్ ఓయ్ (Chempolis Oy)తో ఒప్పందం కుదుర్చుకుంది.ఏఎం గ్రీన్ ఏర్పరచుకున్న ఈ భాగస్వామ్యం ద్వారా.. నెక్స్ట్ జెన్ 2జీ బయో ఫ్యూయెల్ టెక్నాలజీతో భారీ స్థాయి బయో రిఫైనరీలను ఏర్పాటు చేయనుంది. అంతే కాకుండా పారిశ్రామిక రంగాలలో ఉపయోగించే గ్రీన్ కెమికల్స్ వంటి వాటితోపాటు ఇథనాల్, ఫర్ఫ్యూరల్, ప్యూర్ లిగ్నిన్ వంటి ఉత్పత్తులను ఉత్పత్తి చేయనుంది. మొత్తం మీద ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక డీకార్బనైజేషన్ ప్లాట్ఫారమ్గా ఏఎం గ్రీన్ ఎదగటానికి సర్వత్రా సిద్ధమవుతోంది. దీనికోసం కంపెనీ రాబోయే మూడేళ్లలో సుమారు 1 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనుంది.2జీ లిగ్నో-సెల్యులోసిక్ ఫీడ్స్టాక్ల ప్రాసెసింగ్ను ముందుకు తీసుకెళ్లడానికి చెంపోలిస్తో భాగస్వామ్యం కావడానికి మేము సంతోషిస్తున్నామని ఏఎం గ్రూప్ చైర్మన్ 'అనిల్ చలమలశెట్టి' అన్నారు. ఈ భాగస్వామ్యం పారిశ్రామిక రంగాలలో గ్లోబల్ డీకార్బనైజేషన్ను ఎనేబుల్ చేయడంలో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.ఏఎం గ్రీన్ గ్రూప్ గురించిఏఎం గ్రీన్ గ్రూప్ అనేది హైదరాబాద్కు చెందిన సంస్థ. దీనిని అనిల్ చలమలశెట్టి, మహేష్ కొల్లి ప్రారంభించారు. ఇది భారతదేశంలోని ప్రముఖ ఎనర్జీ ట్రాన్సిషన్ సొల్యూషన్స్ ప్రొవైడర్లలో ఒకటిగా ఉంది. ఈ సంస్థ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి వాటి ఉత్పత్తులలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
పెట్టుబడులకు కేంద్రంగా భారత్: పీయూష్ గోయల్
వికసిత భారత్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ.. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలను ఏర్పరచుకుంటోంది. ఈ తరుణంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 'పీయూష్ గోయల్' సిడ్నీలో పారిశ్రామిక ప్రముఖులు & ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో భారత్.. ఆస్ట్రేలియా మధ్య పెరుగుతున్న ఆర్థిక సంబంధాలను గురించి ప్రస్తావించారు.భారత్ - ఆస్ట్రేలియా భాగస్వామ్య ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ.. ఇరు పక్షాల మధ్య సహకారం, భవిష్యత్ అవకాశాల గురించి చర్చించడం ఆనందంగా ఉందని గోయల్ అన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించాలని ఆయన అన్నారు.గోయల్ తన పర్యటనలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ప్రముఖ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎయిర్ట్రంక్ వ్యవస్థాపకుడు, సీఈఓ 'రాబిన్ ఖుదా'తో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇండియాలో డిజిటలైజేషన్ వృద్ధి గురించి మాత్రమే కాకుండా.. భారత్ ఆస్ట్రేలియా మధ్య డేటా మౌలిక సదుపాయాల రంగంలో సహకారం కోసం గణనీయమైన సంభావ్యత గురించి చర్చించినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు.ఇదీ చదవండి: భారత్ వృద్ధికి కీలక చర్చలు: పీయూష్ గోయల్భారత్ డిజిటలైజేషన్లో వేగంగా పురోగమిస్తోంది. కాబట్టి డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, టెక్నాలజీతో నడిచే మౌలిక సదుపాయాల వంటి వాటి పెట్టుబడులకు దేశం కేంద్రంగా మారింది. ఇండియా గ్లోబల్ డిజిటల్ హబ్గా మారాలంటే.. టెక్ రంగంలో జాయింట్ వెంచర్లు, భాగస్వామ్యాల సంభావ్యత చాలా అవసరమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.Excellent meeting with Australia’s leading Super Funds, where we explored significant investment opportunities within India's dynamic growth sectors.Also, discussed avenues to enhance collaboration, giving further boost to India-Australia trade and investment ties. 🇮🇳🤝🇦🇺 pic.twitter.com/Bq36vWncw1— Piyush Goyal (@PiyushGoyal) September 23, 2024 -
రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ సూచీల రికార్డు ర్యాలీ ఈ వారం కూడా కొనసాగే వీలుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దేశీయ స్థూల ఆరి్థక గణాంకాలు సానుకూలంగా ఉండటం, అమెరికా ఆరి్థక మందగమనంపై ఆందోళనలు తగ్గడంతో పాటు విదేశీ పెట్టుబడులు పెరుగుతుండటం తదితర అంశాలు సూచీలను లాభాల దిశగా నడిపిస్తాయని చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ పరిణామాలు, ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ అంశాలు ట్రేడింగ్ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చనేది నిపుణుల అభిప్రాయం.‘‘ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపుతో ఇన్వెస్టర్లు ‘పతనమైన ప్రతిసారి కొనుగోలు’ వూహాన్ని అమ లు చేస్తున్నారు. వినియోగ, ఆటో, ఫై నాన్స్, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మ ద్దతు లభించవచ్చు. డాలర్ విలువ బ లహీనపడటంతో ఎగుమతి ఆధారిత రంగాల ఫార్మా, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవచ్చు. కొనుగోళ్లు కొనసాగితే నిఫ్టీ 26,000 స్థాయిని అందుకోవచ్చు. దిగువున 25,500 – 25, 450 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అ ని స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. అమెరికా నాలుగేళ్ల తర్వాత వడ్డీరేట్లను అంచనాలకు మించి 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఈక్విటీ మార్కెట్లు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. బ్యాంకులు, ఫైనాన్స్ షేర్లు రికార్డుల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. గతవారం మొత్తంగా సెన్సెక్స్ 1653 పాయింట్లు, నిఫ్టీ 434 పాయింట్లు లాభపడ్డాయి. గురువారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు ఈ గురువారం (సెపె్టంబర్ 22న) నిఫ్టీ సెపె్టంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాంకేతికంగా నిఫ్టీకి 26,000 వద్ద కీలక నిరోధం ఉంది. ఈ స్థాయిని నిలుపుకోగలిగితే 26,100 – 26,350 శ్రేణిని పరీక్షిస్తుందని ఆప్షన్ డేటా సూచిస్తోంది.రెండు ఐపీఓలు, మూడు లిస్టింగులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన మన్బా ఫైనాన్స్ రూ.151 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. సెపె్టంబర్ 23న ప్రారంభమై 25న ముగుస్తుంది. కేఆర్ఎన్ హీట్ ఎక్సే్ఛంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ ఇష్యూ 25–27 తేదీల మధ్య ఉంటుంది. తద్వారా రూ. 342 కోట్లు సమీకరించనుంది. ఎస్ఎంఈ విభాగంలో కంపెనీలతో కలిసి మొత్తం 11 సంస్థలు మార్కెట్ నుంచి రూ.900 కోట్లను సమీకరించనున్నాయి. అలాగే ఇటీవల పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న వెస్ట్రన్ క్యారియర్స్ ఇండియా, ఆర్కేడ్ డెవలపర్స్, నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ షేర్లు ఒకేరోజున మంగళవారం (సెపె్టంబర్ 24న) స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. విదేశీ పెట్టుబడులుఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు, దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా ఈ సెపె్టంబర్లో ఇప్పటి వరకు (1– 21 తేదీల మధ్య) విదేశీ ఇన్వెస్టర్లు రూ.33,700 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘నాలుగేళ్ల తర్వాత ఫెడ్ వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లను తగ్గిస్తూ.., రేట్ల త గ్గింపు ప్రక్రియ ప్రారంభమైనట్లు సంకేతాలిచి్చంది. వచ్చే ఏడా ది (2025) చివరికి ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.4 శాతా నికి పరిమితం చేసేందుకు ప్రయతి్నస్తోంది. అమెరికా బాండ్లపై రాబడులు తగ్గుముఖం పట్టడంతో భారత్లో పెట్టుబడులు మరింత పెరగొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వీకే విజయ్ కుమార్ తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం దేశీయంగా హెచ్ఎస్బీసీ కాంపోజిట్ సెపె్టంబర్ తయారీ పీఎంఐ, సేవల పీఎంఐ గణాంకాలు నేడు (సోమవారం) వెలువడనున్నాయి. అమెరికా ఆగస్టు నెల తయారీ, కన్జూమర్ కాన్ఫిడెన్స్ డేటా మంగళవారం విడుదల కానుంది. బ్యాంకు ఆఫ్ జపాన్ ద్రవ్య కమిటీ సమావేశ వివరాలు(మినిట్స్), అమెరికా క్యూ2 జీడీపీ వృద్ధి డేటా గురువారం వెల్లడి కానుంది. సెప్టెంబర్ 13తో ముగిసిన వారం బ్యాంకు రుణాలు, డిపాజిట్ల వృద్ధి గణాంకాలు, ఆగస్టు 20తో ముగిసిన వారం ఫారెక్స్ నిల్వల డేటాను ఆర్బీఐ శుక్రవారం విడుదల చేస్తుంది. ఆయా దేశాల ఆరి్థక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్ను ప్రభావితం చేయగలవు. -
సింగపూర్లో ఇన్వెస్ట్ ఇండియా ఆఫీస్: ఫోటోలు
భారతదేశంలోకి ప్రాంతీయ పెట్టుబడులను సులభతరం చేసే లక్ష్యంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 'పీయూష్ గోయల్' ఆదివారం సింగపూర్లో ఇన్వెస్ట్ ఇండియా కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. సింగపూర్లో ఇటీవలి పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సిటీ-స్టేట్లో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ కార్యాలయం ప్రారంభించారు.సింగపూర్లో ఇన్వెస్ట్ ఇండియా కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన పీయూష్ గోయల్.. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియాల్ ఖాతాలో షేర్ చేశారు. ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయం ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, భారత్.. సింగపూర్ మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది చాలా సహాయపడుతుందని ఆయన అన్నారు.ఇన్వెస్ట్ ఇండియా మొదటి విదేశీ కార్యాలయంగా.. ఇది పెట్టుబడులను ఆహ్వానించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. భారత్కు సింగపూర్ కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి. ఇప్పుడు ఇది ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో మాత్రమే కాకుండా ఇండియా, సింగపూర్ మధ్య విస్తారమైన పెట్టుబడి అవకాశాలను అన్లాక్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఇదీ చదవండి: భారత్ వృద్ధికి కీలక చర్చలు: పీయూష్ గోయల్ఇన్వెస్ట్ ఇండియా అనేది 'నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా'. దీనిని భారత ప్రభుత్వంలోని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ లాభాపేక్ష లేని చొరవగా స్థాపించింది. "మేక్ ఇన్ ఇండియా" ప్రచారంలో భాగంగా, ఇన్వెస్ట్ ఇండియా భారతదేశంలో తమ వ్యాపారాలను ప్రారంభించడం, నిర్వహించడం, విస్తరించడంలో పెట్టుబడిదారులను అనుమతిస్తుంది. Investing in a stronger partnership 🇮🇳 🤝 🇸🇬Proud to inaugurate the @InvestIndia Singapore office today. This marks a pivotal moment in strengthening economic ties and further unlocking vast investment opportunities between India and Singapore. It is a significant step… pic.twitter.com/OATmvrrj1x— Piyush Goyal (@PiyushGoyal) September 22, 2024 -
అనిల్ అంబానీ కంపెనీలో భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రమోటర్లు ఈక్విటీ రూపేణా రూ. 1,100 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటికి జతగా ముంబైకి చెందిన రెండు ఇన్వెస్ట్మెంట్ సంస్థలు రూ. 1,900 కోట్లు అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. గురువారం సమావేశమైన కంపెనీ బోర్డు రూ. 6,000 కోట్ల సమీకరణ ప్రణాళికలకు ఆమోదముద్ర వేసింది.వీటిలో రూ. 3,014 కోట్లు ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా అందుకోనుంది. మిగిలిన రూ. 3,000 కోట్లు సంస్థాగత కొనుగోలుదారుల నుంచి సమీకరించనుంది. తొలి దశలో భాగంగా షేరుకి రూ. 240 ధరలో 12.56 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా మార్పిడికి వీలయ్యే వారంట్ల జారీ ద్వారా రూ. 3,014 కోట్లు సమకూర్చుకోనుంది. వీటిలో ప్రమోటర్ సంస్థ రైజీ ఇన్ఫినిటీ ప్రయివేట్ 4.6 కోట్ల షేర్లకు సబ్స్క్రయిబ్ చేయనుంది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?ఈ బాటలో ముంబై సంస్థలు ఫార్చూన్ ఫైనాన్షియల్ అండ్ ఈక్విటీస్ సర్వీసెస్(4.41 కోట్ల షేర్లు– రూ. 1,058 కోట్లు), ఫ్లోరిన్ట్రీ ఇన్నొవేషన్స్ ఎల్ఎల్పీ(3.55 కోట్ల షేర్లు– రూ. 582 కోట్లు) చొప్పున ప్రిఫరెన్షియల్ ఇష్యూలో భాగంకానున్నాయి. పీఈ దిగ్గజం బ్లాక్స్టోన్ మాజీ ఎగ్జిక్యూటివ్ మాథ్యూ సైరియా ఫ్లోరిన్ట్రీని ఏర్పాటు చేయగా.. ఫార్చూన్ ఫైన్షాఇయల్ను నిమిష్ షా నెలకొల్పారు. రిలయన్స్ ఇన్ఫ్రాలో ప్రమోటర్లకు ప్రస్తుతం 21.34 శాతం వాటా ఉంది. -
మొన్న బిగ్బీ.. నేడు మాధురీ దీక్షిత్: అవే షేర్స్ కొంటున్న సెలబ్రిటీలు
ప్రముఖ నటి 'మాధురీ దీక్షిత్' (Madhuri Dixit) ఇటీవల ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీలో రూ. 1.5 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ షేర్లను ఇన్నోవ్8 వ్యవస్థాపకులు 'రితేష్ మాలిక్' నుంచి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.మాధురీ దీక్షిత్, రితేష్ మాలిక్ ఇద్దరూ రూ. 3 కోట్ల విలువైన షేర్స్ కొనుగోలు చేసి స్విగ్గిలో వాటాదారులయ్యారు. వీరిరువురు ఒక్కో షేరుకు రూ. 345 చొప్పున చెల్లించినట్లు సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కాగా ఇప్పటికే స్విగ్గిలో అమితాబ్ బచ్చన్ కూడా ఇన్వెస్ట్ చేసారు.ఇదీ చదవండి: వాటా కొనుగోలు చేసిన బిగ్బీ కుటుంబంబెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్విగ్గీ.. త్వరలోనే ఐపీఓకు రానుంది. ఈ ఐపీఓ ద్వారా సుమారు ఒక బిలియన్ డాలర్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. అయితే ఈ ఐపీఓకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ ఆదాయం 36 శాతం పెరిగి రూ. 11,247 కోట్లకు చేరుకుంది. -
స్టార్టప్ కంపెనీలో క్రికెటర్ రూ.7.4 కోట్లు పెట్టుబడి
భారత క్రికెటర్ రిషబ్ పంత్ సాఫ్ట్వేర్ సేవలందించే కంపెనీలో రూ.7.4 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించారు. టెక్జాకీ అనే సాఫ్ట్వేర్ విక్రేతలకు సాయం చేసే కంపెనీ రూ.370 కోట్ల మూలధనాన్ని సమీకరించాలని నిర్ణయించింది. కంపెనీ ప్రణాళికలపై ఆసక్తి ఉన్నవారు ఇందులో ఇన్వెస్ట్ చేశారు. అందులో భాగంగా ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ కంపెనీ సమీకరించాలనుకునే మొత్తంలో రెండు శాతం వాటాను సమకూర్చారు.ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఫోర్స్పాయింట్ గ్లోబల్ సీఈఓ మానీ రివెలో కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్లు కంపెనీ వ్యవస్థాపకులు ఆకాష్ నంగియా తెలిపారు. అయితే మానీ ఎంత ఇన్వెస్ట్ చేశారోమాత్రం వెల్లడించలేదు. ఈ సందర్భంగా నంగియా మాట్లాడుతూ..‘కంపెనీ భవిష్యత్తు కార్యకలాపాలకు మూలధనాన్ని సేకరించాలని నిర్ణయించాం. ముందుగా రూ.410 కోట్లు సేకరించాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల 10 శాతం తగ్గించి రూ.370 కోట్ల పెట్టుబడికి ప్రణాళికలు సిద్ధం చేశాం. తాజాగా సమకూరిన నిధులతో మార్కెటింగ్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తాం. యూఎస్లో కంపెనీని విస్తరించడానికి ఈ నిధులు తోడ్పడుతాయి’ అని చెప్పారు.ఆకాష్ నంగియా గతంలో జొమాటో ఎగ్జిక్యూటివ్గా పని చేశారు. మెకిన్సేలో పని చేసిన అర్జున్ మిట్టల్ సాయంతో 2017లో టెక్జాకీ సాఫ్ట్వేర్ అగ్రిగేటర్ స్టార్టప్ కంపెనీను స్థాపించారు. ఇది దేశంలోని చిన్న వ్యాపారాల కోసం సాఫ్ట్వేర్ను విక్రయించేందుకు సాయపడుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో తన కార్యకలాపాలు ప్రారంభించింది. టెక్జాకీ మైక్రోసాఫ్ట్, అడాబ్, ఏడబ్ల్యూఎస్, కెక, ఫ్రెష్వర్క్స్, మైబిల్ బుక్ వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు రూ.125 కోట్లు ఆదాయాన్ని సంపాదించినట్లు అధికారులు తెలిపారు. 2024-25లో ఇది రూ.170-180 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా..?ఇటీవల కేఎల్ రాహుల్ మెటామ్యాన్ స్టార్టప్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ జులైలో భారత్కు చెందిన న్యూట్రిషన్ సప్లిమెంట్ బ్రాండ్ ‘సప్లై6’లో ఇన్వెస్ట్ చేశారు. ఏప్రిల్లో శ్రేయాస్ అయ్యర్ హెల్త్టెక్ ప్లాట్ఫామ్ ‘క్యూర్లో’లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. -
ఫలిస్తున్న వైఎస్ జగన్ కృషి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి ఫలిస్తోంది. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో భాగంగా చేసుకున్న ఒప్పందాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఇందులో భాగంగానే కాకినాడ జిల్లాలో ఏఎం గ్రీన్ (గ్రీన్కో గ్రూప్ సంస్థ) రూ.12,500 కోట్ల పెట్టుబడులపై తుది నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాదికి మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ కార్యకలాపాలు 2026లో ప్రారంభం కానున్నాయి.ఇందుకోసం 1,300 మెగావాట్ల కార్బన్ రహిత విద్యుత్, 4,500 మెగావాట్ల సోలార్, 950 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్ట్, ఇతర వనరులను కంపెనీ సమకూర్చుకుంది. అదేవిధంగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే అమ్మోనియాను యూరప్కు ఎగుమతి చేయనున్నారు. ఇందుకోసం యారా క్లీన్, కెప్పెల్, యూనిపర్ వంటి ప్రధాన సంస్థలతో ఏఎం గ్రీన్ సంస్థ ఒప్పందాలు సైతం ఇప్పటికే కుదుర్చుకుంది. మరోవైపు ఏడాదికి 5 మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యాన్ని 2030 నాటికి ఛేదించేలా దేశవ్యాప్తంగా ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించేందుకు గ్రీన్కో సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. -
స్మార్ట్ సిప్ ఎంపిక సరైనదేనా..?
ఈక్విటీ మార్కెట్ ఎప్పటికప్పుడు నూతన గరిష్టాలను నమోదు చేస్తోంది. కనుక స్మార్ట్ సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? - నియతి దూబేరెగ్యులర్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)కు వినూత్నమైనవే స్మార్ట్ సిప్లు. ఇవి ఎలా స్మార్ట్ అంటే.. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం కాకుండా మార్కెట్ తీరు ఆధారంగా వ్యవహరిస్తాయి. కొన్ని అంశాల ఆధారంగా మార్కెట్లు ఖరీదుగా ఉన్నాయా? లేక చౌకగా ఉన్నాయా..?ఎలా ఉన్నాయన్నది చెప్పే ఆల్గోరిథమ్ (సాఫ్ట్వేర్) వాటికి ఉంటుంది.మార్కెట్ల విలువ చాలా ఖరీదుగా ఉన్నట్టు ఆల్గోరిథమ్ భావిస్తే ఇన్వెస్టర్ నుంచి వచ్చే సిప్ మొత్తాన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకుండా, కొంత మొత్తాన్నే కేటాయిస్తాయి. ఉదాహరణకు ప్రతి నెలా ఒక ఇన్వెస్టర్ నుంచి రూ.1,000 సిప్ రూపంలో వస్తుంటే, అందులో కొంత స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్ (డెట్ ఫండ్)లోకి మళ్లిస్తాయి. మళ్లీ స్టాక్స్ విలువలు దిగొచ్చినప్పుడు తిరిగి ఎక్కువ మొత్తాన్ని స్టాక్స్కు, తక్కువ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్కు కేటాయిస్తుంటాయి.స్మార్ట్ సిప్లు అంటే ఈక్విటీ, డెట్ పెట్టుబడుల కలబోతగా ఉంటాయి. స్మార్ట్ సిప్లు ఇలానే పనిచేస్తుంటాయి. ఇది విజయాన్నిచ్చే విధానం. ఈక్విటీలు ఖరీదుగా ఉన్నప్పుడు తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసి, ఎక్కువ మొత్తాన్ని డెట్ ఫండ్ రూపంలో ఉంచుకోవడం, మార్కెట్లు చౌకగా మారినప్పుడు దీనికి విరుద్ధంగా వ్యవహరించడం ఇందులో కనిపిస్తుంది. కానీ వాస్తవికంగా చూస్తే మార్కెట్లు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో కచ్చితంగా అంచనా వేయడం కష్టం.ఎవరూ కూడా నిరాటంకంగా ఈ విషయంలో కచ్చితత్వంతో వ్యహరించలేరు. మార్కెట్ల గమనాన్ని కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితికి ముందు నుంచి ఉన్న సిప్ నిజానికి ఒక పరిష్కారం. ఈ విధానంలో మార్కెట్లు ఖరీదుగా ఉన్నా, చౌకగా ఉన్నా సరే ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఖరీదుగా ఉన్నప్పుడుకొన్ని యూనిట్లు వస్తే, మార్కెట్లు పడిపోయినప్పుడు అంతే సిప్తో ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. మార్కెట్లగమనం, అంచనా రిస్క్ను అధిగమించేందుకు ఇదే మెరుగైన పరిష్కారం. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇన్వె స్ట్ చేసుకుంటూ, దీర్ఘకాలంలో సంపద సృష్టించుకునేందు కు ఇది వీలు కల్పిస్తుంది. కనుక రెగ్యులర్ సిప్లను ఎంపిక చేసు కోవాలన్నదే మా సూచన.ఇండెక్స్ ఫండ్ ఎంపిక చేసుకునే విషయంలో ఎలాంటి అంశాలను పరిశీలించాలి? -లలావత్ రాములుఇండెక్స్ ఫండ్ను ఎంపిక చేసుకోవడం సులభమే. ఎక్స్పెన్స్ రేషియో, ట్రాకింగ్ ఎర్రర్ ఈ రెండు అంశాలపై దృష్టి సారించాలి. ఇందులో ఎక్స్పెన్స్ రేషియో కీలకమైనది. ఇది ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ నుంచి వసూలు చేసే నిర్ణీత చార్జీ. ఇది తక్కువగా ఉంటే దీర్ఘకాలంలో ఎక్కువ రాబడులకు వీలుంటుంది.ఉదాహరణకు ఒక ఫండ్ 0.10 శాతం, మరో ఫండ్ 0.25 శాతం వసూలు చేస్తుంటే.. ఈ రెండింటిలో మొదటి పథకంలో ఎక్కువ రాబడులు వస్తాయి. ట్రాకింగ్ ఎర్రర్ అనేది ఒక పథకం పనితీరుకు, బెంచ్మార్క్ సూచీ రాబడులను మధ్య ఉన్న వ్యత్యాసం.ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉంటే, పథకం పనితీరు సూచీలకు తగిన స్థాయిలోనే ఉందని అర్థం. అలాంటి పథకం ఇన్వెస్టర్లకు అనుకూలం. ఇండెక్స్ ఫండ్ను ఎంపిక చేసుకునే విషయంలో తక్కువ ఎక్స్పెన్స్ రేషియో, పరిమిత ట్రాకింగ్ ఎర్రర్ ఉన్న పథకాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఎక్కువ రాబడులకు అవకాశం ఉంటుంది.ధీరేంద్ర కుమార్ -సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
తమిళనాడుకు దిగ్గజ కంపెనీలు.. రూ.7618 కోట్ల పెట్టుబడులు
గత కొన్ని రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో సుమారు రూ. 7618 కోట్ల విలువైన 19 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో 11,516 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆయన అన్నారు.వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం.. తమిళనాడులోని తిరుచ్చి, మధురై మొదలైన ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఏర్పడుతాయని.. ఫోర్డ్ కంపెనీ మళ్ళీ తన ఉత్పత్తిని రాష్ట్రంలో ప్రారంభిస్తుందని సీఎం స్టాలిన్ వెల్లడించారు.ఇదీ చదవండి: ఫోర్డ్ కంపెనీ మళ్ళీ ఇండియాకు: ఎందుకంటే? అవగాహన ఒప్పందాలు👉రూ.100 కోట్ల పెట్టుబడితో హోసూర్లో లేటెస్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ తయారీ యూనిట్ను స్థాపించడానికి ఆర్జీబీఎస్ఐతో ఒప్పందం.👉రాక్వెల్ ఆటోమేషన్ కంపెనీ కాంచీపురంలో రూ. 666 కోట్ల పెట్టుబడితో దాని తయారీని విస్తరించనుంది. దీని ద్వారా దాదాపు 365 ఉద్యోగాలు లభిస్తాయి.👉లింకన్ ఎలక్ట్రిక్, విషయ్ ప్రెసిషన్, విస్టన్లతో రూ.850 కోట్ల విలువైన ఎంఓయూలు👉డెవలప్మెంట్ అండ్ గ్లోబల్ సపోర్టు సెంటర్ను రూపొందించడానికి ట్రిలియంట్తో రూ. 2000 కోట్ల అవగాహనా ఒప్పందం👉తమిళనాడులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ల్యాబ్లను ఏర్పాటు చేసేందుకు గూగుల్తో ఎంఓయూ👉రూ. 200 కోట్ల ఆర్&డీ ఇంజనీరింగ్ సెంటర్ విస్తరణ కోసం బహుళజాతి పవర్ మేనేజ్మెంట్ కంపెనీ ఈటన్తో ఒప్పందాలు👉చెంగల్పట్టు జిల్లాలో ఎలక్ట్రోలైజర్లు అండ్ గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడానికి ఓహ్మియంతో కొత్త ఫ్యాక్టరీ స్థాపనకు ఒప్పందం 👉రూ. 900 కోట్ల పెట్టుబడి కోసం నోకియా, పేపాల్, ఈల్డ్ ఇంజినీరింగ్ సర్వీసెస్, మైక్రోచిప్, ఇన్ఫింక్స్ హెల్త్కేర్ అండ్ అప్లైడ్ మెటీరియల్స్ అనే ఆరు ప్రముఖ ప్రపంచ కంపెనీలతో అవగాహన ఒప్పందాలుChennai | Tamil Nadu CM MK Stalin says "I have completed my official visit to America. This was a successful visit. 19 MoUs have been signed. I got an investment of Rs 7618 for the state. 11,516 people will get new jobs. Factories will be set up in Trichy, Madurai Coimbatore,… pic.twitter.com/KhnpxNETXz— ANI (@ANI) September 14, 2024 -
హైదరాబాద్లో భారీ మోసం.. రూ. 700 కోట్లతో బోర్డు తిప్పేసిన కంపెనీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో భారీ మోసం వెలుగుచూసింది. రూ.700 కోట్ల రూపాయలు కాజేసిన ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ.. DKZ టెక్నాలజీస్ సంస్థ ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించింది. అయితే లాభాలు పక్కన పెడితే అసలుకే టోపి పెట్టింది. మొత్తం 700 కోట్ల రూపాయలు దండుకొని చేతులెత్తేసింది.మూడు రాష్ట్రాల్లో 55 వేల మందికి పైగా బాధితులు ఉండగా.. హైదారాబాద్ వ్యాప్తంగా 18 వేల మంది బాధితులు ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. దీంతో మీడియాకు తమ గోడు వెల్లబుచ్చేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు వందలాది బాధితులు చేరుకుంటున్నారు.కాగా తమ కంపెనీపై నమ్మకం కలిగించేందుకు సంస్థ తొలుత ఇన్వెస్టర్లకు లాభాలు చూపించింది. ఇన్వెస్ట్ చేసిన కొన్ని నెలల పాటు ఇన్వెస్టర్ల అకౌంట్లో డబ్బులు జమ చేశారు కేటుగాళ్లు.సోషల్ మీడియా ఇన్ల్ఫ్యూయెన్సర్లతో కూడా ప్రమోషన్లు చేయించారు. లాభాలు వస్తుండటంతో.. అప్పు చేసి, గోల్డ్ అమ్మి మరీ బాధితులు పెట్టుబడులు పెట్టారు. చివరికి 700 కోట్ల రూపాయల వరకు దండుకుని మోసగాళ్లు పరారయ్యారు. అయితే బాధితుల్లో ఒకే వర్గానికి చెందిన వాళ్లు ఎక్కువగా ఉన్నారు. -
భారత్లో ఇన్వెస్ట్ చేయొద్దు!.. చైనా ఉద్దేశ్యం ఏంటి?
ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న చైనా.. ప్రపంచంలోని చాలా దేశాల్లో పెట్టుబడులు పెట్టి, తమ ఉనికిని విస్తరిస్తూ ఉంది. చైనా కంపెనీలు భారత్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాయి. అయితే ఇటీవల చైనా ప్రభుత్వం ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టవద్దని తమ వాహన తయారీదారులను కోరింది.చైనా వెలుపల ఉన్న దేశాలలో పూర్తి స్థాయి ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేయకూడదని ప్రభుత్వం తమ వాహన తయారీదారులకు సలహా ఇచ్చింది. అదే సమయంలో తమ ఉత్పత్తులను 'కంప్లీట్ నాక్డ్ డౌన్' (CKD) మార్గం ద్వారా ఎగుమతి చేయాలని సూచించింది. దీని ద్వారా గణనీయమైన లాభాలను పొందటమే కాకుండా.. ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీలో కీలకమైన భాగాలు చైనాలో ఉండాలని భావిస్తోంది.చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ జూలైలో వాహన తయారీదారులతో సమావేశాన్ని నిర్వహించింది. భారతదేశంలో ఎటువంటి ఆటో-సంబంధిత పెట్టుబడులు పెట్టకూడదని ఈ సమావేశంలో పేర్కొన్నారు. చైనా ఈవీ పరిశ్రమ పరిజ్ఞానాన్ని రక్షించడానికి ఇదొక మార్గమని అన్నారు.ఇతర దేశాలలో కొత్త ఎలక్ట్రిక్ కార్ల కార్యకలాపాలను ఏర్పాటు చేసినప్పుడు పరిశ్రమ, సాంకేతిక మంత్రిత్వ శాఖకు తెలియజేష్యాలని చైనా తన వాహన తయారీదారులను కోరింది. చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రపంచంలోని దిగ్గజ దేశాలు ఎలా స్పందిస్తాయో త్వరలోనే తెలుస్తుంది.భారతదేశంలోని చైనా కంపెనీలుభారతదేశంలో చైనా కంపెనీలు తమ కార్యాలపాలను కొనసాగిస్తున్నాయి. ఇందులో ఒకటి 'బిల్డ్ యువర్ డ్రీమ్స్' (BYD). ఈ కంపెనీ ఇప్పటికే నాలుగు కార్లను లాంచ్ చేసి మంచి అమ్మకాలను పొందుతోంది. ఈ సమయంలో చైనా తీసుకున్న నిర్ణయానికి భారత్ స్పందిస్తే.. ఈ కంపెనీ ఇండియాలో కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు. అంతే కాకుండా ఈ చైనా కంపెనీ దేశంలో భారీ పెట్టుబడులు పెట్టాలని కూడా యోచిస్తోంది. దీనికి కేంద్రం అంగీకరించలేదు.ఎంజీ మోటార్ కంపెనీ కూడా చైనా కంపెనీ అయినప్పటికీ దేశంలో తన కార్యకలాపాలను విస్తరిస్తూనే ఉంది. ఇటీవల జేఎస్డబ్ల్యుతో కలిసి విండ్సర్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. గ్రేట్ వాల్ మోటార్స్ పెట్టుబడులను తిరస్కరించడంతో భారతదేశ ప్రణాళికలను కంపెనీ పూర్తిగా వదులుకోవాల్సి వచ్చింది. 2022లో కంపెనీ దుకాణాన్ని మూసివేసింది. -
ఆర్థిక విజయాలకు గణేశుడి బాసట: భవిష్యత్తుకు బాటలు
విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు మనకు ఎన్నో జీవిత పాఠాలు కూడా నేర్పుతాడు. దారిలో ఉన్న అడ్డంకులను తొలగించి విజయాలకు మార్గం ఏర్పరుస్తాడు. ఇదే ప్రేరణతో మనం కూడా మ్యుచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్గా పెట్టుబడులు పెట్టే విషయంలో వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితమైనదిగా తీర్చిదిద్దుకోవడానికి బాటలు వేసుకోవచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ : శుభారంభంవినాయకుడు అంటే వివేకం, దూరదృష్టికి ప్రతీక. మన జీవితాల్లో ఎదురయ్యే విఘ్నాలను తొలగిస్తాడనే నమ్మకం. తగినంత డబ్బు లేకపోవడం లేదా ఆర్థిక భద్రతపరమైన సమస్యలతో మనలో చాలా మంది సతమతమవుతుంటారు. ఆర్థికపరమైన అడ్డంకులనేవి ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల వచ్చే సమస్యలని మనం గుర్తించాలి.వివేకవంతమైన నిర్ణయాల ద్వారా వాటిని అధిగమించాలి. మనం పొదుపు చేసుకునే మొత్తాన్ని ద్రవ్యోల్బణం అనేది పగలు, రాత్రి చెదపురుగులా తినేస్తుంది కాబట్టి ఆర్థిక భద్రతకు పొదుపు ఒక్కటే సరిపోదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ఆర్థిక భద్రతను సాధించాలన్నా, సంపదను పెంచుకోవాలన్నా మన పొదుపును అర్థవంతమైన విధంగా ఇన్వెస్ట్ చేయాలి. అప్పటికప్పుడు లాభాలు వచ్చేయాలనే తాపత్రయంతో ట్రేడింగ్ టిప్స్, స్పెక్యులేటివ్ పెట్టుబడులపై ఆధారపడకుండా వివేకవంతంగా, క్రమం తప్పకుండా మ్యుచువల్ ఫండ్స్లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందవచ్చు.తప్పిదాల నుంచి నేర్చుకోవడంగణేశుడి పెద్ద తల వివేకాన్ని, పాండిత్యాన్ని సూచిస్తుంది. దీన్నే పెట్టుబడులకు అన్వయించుకుంటే, గత తప్పిదాల నుంచి నేర్చుకుని, మెరుగైన ఇన్వెస్టర్లుగా మారే వివేకం కలిగి ఉండాలని అ ర్థం చేసుకోవచ్చు. క్రమశిక్షణ లేకపోవడం లేదా మరీ ఎక్కువ రిస్కులు తీసుకోవడం లేదా అస్సలు రిస్కే తీసుకోకపోవడం, అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మంది ఇన్వెస్టర్లు నష్టపోతుంటారు. అయితే, దీనితో కుంగిపోకుండా, ఈ అనుభవాలన్నింటినీ విలువైన పాఠాలుగా భావించి, విజయాల వైపు బాటలు వేసుకోవాలి. ప్రొఫెషనల్ సలహా తీసుకోవడంవినాయకుడి పెద్ద చెవులు మనం చక్కని శ్రోతగా ఉండాలనేది సూచిస్తాయి. ఆర్థిక ప్రపంచం విషయాన్ని తీసుకుంటే అర్హత పొందిన ఫైనాన్షియల్ ప్లానర్ లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు ఇచ్చే ఆర్థిక సలహాలను స్వీకరించే ఆలోచనా ధోరణిని కలిగి ఉండాలని ఇది సూచిస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా మీ డబ్బును సరైన విధంగా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చనేది ఆర్థిక సలహాదార్లు మెరుగైన సలహాలు ఇవ్వగలరు.జీవిత పాఠాలువినాయకుడి ఎడమ దంతం విరిగి ఉంటుంది. మహాభారతాన్ని రాసేందుకు వేదవ్యాసుడు అత్యంత వేగంగా రాయగలిగే సామర్థ్యాలు గల వినాయకుడి సహాయం తీసుకున్నట్లు మన పురాణాలు చెబుతాయి. ఒక దశలో రాస్తున్న ఘంటం విరిగిపోవడంతో గణేశుడు తన దంతాన్నే విరగగొట్టి దాన్నే ఘంటంగా ఉపయోగించి రాయడాన్ని కొనసాగించాడు. అలా వినాయకుడి పట్టుదల, నిబద్ధతతో మనకు మహోత్కృష్టమైన మహాభారతం అందింది. అద్భుతమైన ఆర్థిక లక్ష్యాలతో మొదలెట్టిన పెట్టుబడుల ప్రయాణంలోనూ ఎలాంటి ఆటంకాలు వచ్చినా వెరవకుండా క్రమానుగత పెట్టుబడులు పెడుతూ, నిబద్ధతతో ముందుకు సాగాలని ఈ వృత్తాంతం మనకు తెలియజేస్తుంది.నెలకు కేవలం రూ. 10,000 ఇన్వెస్ట్ చేస్తూ వెడితే 20 ఏళ్లలో ఏకంగా రూ. 1 కోటి మొత్తాన్ని సమకూర్చుకునేందుకు (13 శాతం వడ్డీ రేటు అంచనా), అలాగే నెలకు రూ. 45,000 ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లలోనే అంత మొత్తాన్ని సమకూర్చుకునేందుకు సిప్ సహయపడగలదు. కాబట్టి వాయిదాలు వేయకుండా సాధ్యమైనంత త్వరగా సిప్ను ప్రారంభిస్తే కాంపౌండింగ్ ప్రయోజనాలను అత్యధికంగా పొందవచ్చు. సురేష్ సోని - సీఈవో, బరోడా బీఎన్పీ పారిబా ఏఎంసీ -
చైనా గట్టి నిర్ణయం.. విదేశాలకు ఆహ్వానం!
చైనా తమ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా గట్టి నిర్ణయం తీసుకుంది. ఉత్పాదక రంగాన్ని విదేశీ పెట్టుబడులకు పూర్తిగా తెరుస్తోంది. దీంతోపాటు ఆరోగ్య రంగంలోనూ మరింత విదేశీ మూలధనానికి అనుమతించనుంది.చైనాకు చెందిన నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ తాజా ప్రకటన ప్రకారం.. తయారీ రంగంలో ఇతర దేశాల పెట్టుబడులపై మిగిలి ఉన్న పరిమితులన్నింటినీ నవంబర్ 1 నుండి చైనా తొలగించనుంది. ముద్రణ కర్మాగారాలపై చైనీస్ మెజారిటీ నియంత్రణ, చైనీస్ మూలికా మందుల ఉత్పత్తిలో పెట్టుబడిపై నిషేధం వంటివి ఇందులో ఉన్నాయి.సేవా రంగాన్ని సైతం మరింత విస్తరిస్తామని, విదేశీ పెట్టుబడుల ప్రవేశాన్ని ప్రోత్సహించడానికి చైనా ప్రభుత్వం కట్టుబడి ఉందని నేషనల్ డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్ కమిషన్ తెలిపింది. దీనికి సంబంధించిన విధాన రూపకల్పనపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.ఆరోగ్య రంగంలోనూ..మరోవైపు చైనా తమ ఆరోగ్య సంరక్షణ రంగంలో మరన్ని విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ పలు విధానాలను ప్రకటించింది. మూలకణాలు, జన్యు నిర్ధారణ, చికిత్సకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, అనువర్తనాల్లో అప్లికేషన్లో విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తున్నట్లు ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఒక ప్రకటన తెలిపింది. వీటిని తొలుత బీజింగ్, షాంఘై, గ్వాంగ్డాంగ్, హైనాన్ వంటి పైలట్ ఫ్రీ ట్రేడ్ జోన్లలో అనుమతించనున్నారు.దీంతోపాటు బీజింగ్, టియాంజిన్, షాంఘై, నాన్జింగ్, సుజౌ, ఫుజౌ, గ్వాంగ్జౌ, షెన్జెన్, హైనాన్ ద్వీపంలో పూర్తిగా విదేశీ యాజమాన్యంలోని ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు కూడా చైనా ప్రభుత్వం అనుమతించింది. అయితే సాంప్రదాయ చైనీస్ వైద్యాన్ని అందించే స్థానిక ఆసుపత్రులను కొనుగోలు చేసేందుకు మాత్రం అనుమతి లేదు. కొత్త విధానం వెంటనే అమల్లోకి వస్తుందని చైనా వాణిజ్య శాఖ వెల్లడించింది.