![సీఎంపై ఫిర్యాదును తిరస్కరించిన కోర్టు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/51425253263_625x300_1.jpg.webp?itok=nFkPvleX)
సీఎంపై ఫిర్యాదును తిరస్కరించిన కోర్టు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్పై వచ్చిన కేసును విచారించేందుకు పుణెలోని బారామతిలో గల ఓ కోర్టు నిరాకరించింది. ఆ రాష్ట్రంలోని ధన్గార్ (పశువుల కాపర్లు) వర్గానికి ప్రత్యేక రిజర్వేషన్ కోటా ఇస్తామంటూ ఆయన ఎన్నికల సమయంలో తప్పుడు హామీ ఇచ్చారని హేంత్ పాటిల్ అనే బీఎస్పీ కార్యకర్త ఈ ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే, ఈ విషయంలో సీఎం మోసగించినది ఏమీ లేదంటూ జడ్జి.. ఈ కేసు విచారణకు నిరాకరించారు.