సునందా పుష్కర్ది హత్యే! | delhi police confirm that sunanda pushkar was murdered | Sakshi
Sakshi News home page

సునందా పుష్కర్ది హత్యే!

Published Tue, Jan 6 2015 2:39 PM | Last Updated on Wed, Sep 18 2019 3:04 PM

సునందా పుష్కర్ది హత్యే! - Sakshi

సునందా పుష్కర్ది హత్యే!

కేంద్ర మాజీమంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. థరూర్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన న్యూఢిల్లీలో కేబినెట్ సమావేశంలో పాల్గొన్నప్పుడు.. ఢిల్లీలోని ఓ హోటల్లో ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణానికి కారణం ఏంటన్నది అప్పట్లో పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఆమెపై విష ప్రయోగం జరిగిందని ఇప్పుడు ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. అజ్ఞాత వ్యక్తిపై కేసు నమోదు చేశారు. 2014 జనవరి 17న ఢిల్లీలోని ఓ హోటల్లో సునంద మరణించారు. అప్పట్లో అది పెద్ద సంచలనం రేకెత్తించింది.

అతిగా నిద్రమాత్రలు మింగడం వల్లే మరణించారని అప్పట్లో అన్నారు గానీ.. ఆమెకు ఎవరైనా బలవంతంగా ఆ మాత్రలు ఇచ్చారా, లేక ఆమే తీసుకున్నారా అనే విషయం తెలియలేదు. తాజాగా ఇప్పుడు ఢిల్లీ పోలీసులు మాత్రం సునందది హత్యేనని నిర్ధారించారు. దాంతో ఈ కేసులో శశి థరూర్ సహా పలువురిని ఢిల్లీ పోలీసులు విచారించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement