ఇదొక దిగ్భ్రాంతిని కలిగించే ఘటన. హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఫరిదాబాద్లో ఒక కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులకు బతికుండగానే నిప్పంటించారు.
ఫరిదాబాద్: ఇదొక దిగ్భ్రాంతిని కలిగించే ఘటన. హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఫరిదాబాద్లో ఒక కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులకు బతికుండగానే నిప్పంటించారు. వీరిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు.
మంగళవారం వేకువ జామున 4గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో అవతలి వర్గం వారు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు చెప్తున్నారు. నలుగురు బాధితులను ఢిల్లీలోని సప్థార్ జంగ్ ఆస్పత్రికి చికిత్స కోసం అత్యవసరంగా తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.