Burnt Alive
-
యూపీలో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం!
ఉత్తరప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. లక్నో జిల్లా, కకోరిలో గల హతా హజ్రత్ సాహెబ్ ప్రాంతంలో రెండంతస్తుల భవనంలో మంగళవారం అర్దరాత్రి మంటలు చెలరేగాయి. ఇంతలో ఇంటిలోని సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒక జంటతో సహా ఐదుగురు సజీవ దహనమయ్యారు. హతా హజ్రత్ సాహెబ్ నివాసి ముషీర్ అలీ (50) జర్దోసీ పనితో పాటు పటాకుల వ్యాపారం కూడా చేస్తుంటాడు. మంగళవారం రాత్రి ఆయన ఇంటి రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఇంతలో సిలిండర్ పేలుడు సంభవించింది. ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చేంతలోనే మంటలు ఇల్లంతా వ్యాపించాయి. ముషీర్, అతని భార్య హుస్నా బానో (45), వారి బంధువుల పిల్లలు రాయ (5), హిబా (2), హుమా (3) మంటల్లో సజీవ దహనమయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న బనోయి అజ్మత్ (30), అనమ్ (17)ఇన్షా (16), లకబ్ (18)లను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ప్రాణాలు తీసిన రూమ్ హీటర్.. తండ్రితో సహా 3 నెలల చిన్నారి మృతి
చలి వణికిస్తోంది. రాత్రి మాత్రమే కాదు, పగలు కూడా చలి తీవ్రంగా ఉంది. ఈ కారణంగా చాలా మంది ఇంట్లో ఉపశమనం కోసం రూమ్ హీటర్లను ఉపయోగిస్తారు. అయితే రూమ్ హీటర్లు వాడే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమారుపాటుగా ఉన్నా ప్రాణాలకే రిస్క్. ఈ మధ్య కాలంలో హీటర్ల వల్ల కలుగుతున్న ప్రమాదాల గురించి వింటూనే ఉన్నాం. రూమ్ హీటర్లు గాలిలో తేమను తగ్గించగలవు. దీంతో ఆక్సిజన్ తగ్గిపోయి శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. కొన్నిసార్లు అగ్ని ప్రమాదానికి కారణమై ప్రాణాలు కోల్పోవం వంటి ఘటనలు కూడా జరిగాయి. తాజాగా రాజస్థాన్లోనూ వాటర్ హీటర్ ఇద్దరి ప్రాణాలు బలి తీసుకుంది. హీటర్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఓ తండ్రి, మూడు నెలల చిన్నారి మృత్యువాతపడ్డారు. భార్య చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఖైర్తాల్-తిజారా జిల్లాలో శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. దీపక్ యాదవ్ అనే వ్యక్తి స్థానికంగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఇంట్లో చలిగా ఉందని రూమ్ హీటర్ ఆన్ చేశాడు. ఈ క్రమంలో హీట్ ఎక్కువై ఇంట్లో ఉన్న దూదికి మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా ఇళ్లంతా మంటలు చెలరేగడంతో దీపక్, అతని మూడు నెలల కుమార్తె నిషిక సజీవ దహనమయ్యారు. భార్య సంజు తీవ్రంగా గాయడింది. వీరి కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, దీపక్ మరియు నిషిక మరణించినట్లు ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంజు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. -
Mumbai Hotel Fire: ఒక్కటవ్వకుండానే ఒక్కటిగానే వెళ్లిపోయారు..
ముంబై: ఆదివారం రోజున నైరోబీ వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో ఓ జంట శాంతాక్రూజ్ సమీపంలో గెలాక్సీ హోటల్లో బస చేశారు. అంతలో అక్కడ అగ్నిప్రమాదం జరగడంతో ఆ జంట సజీవ దహనమయ్యారు. వీరితోపాటు ఆ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా చనిపోయారు. ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని గెలాక్సీ హోటల్లోహోటల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఆ ముగ్గురిలో ఒక జంట కథ అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. మృతుడి సొంతూరైన రామ్పార్ గ్రామ సర్పంచ్ సురేష్ కారా తెలిపిన వివరాల ప్రకారం ఎన్నారై కిషన్ హాలాయ్(28) అతడికి కాబోయే భార్య రూపాలు వెకారియా(25) ఇద్దరి కుటుంబాలు గుజరాత్లోని రామ్పార్ గ్రామానికి చెందినవారే అయినా వారి పూర్వీకులు నైరోబీలో స్థిరపడటంతో వీరు కూడా అక్కడే పెరిగి పెద్దయ్యారన్నారు. వీరిరువురికీ పెద్దలు పెళ్లి కూడా నిశ్చయించారు.. అయితే కిషన్ సోదరుడి వివాహం నిమిత్తం సొంత గ్రామానికి వచ్చారని వివాహం పూర్తవగానే కొత్తగా పెళ్ళైన జంటతో పాటు ఈ జంట తల్లిదండ్రులు నైరోబీ వెళ్లిపోగా కిషన్ మాత్రం బంధువులను కలిసి వెళదామని ఆగిపోవడంతో అతడితోపాటు రూపాల్ కూడా ఉండిపోయినాట్లు తెలిపారు. అన్ని పనులను పూర్తిచేసుకుని ఆదివారం వీరు కూడా నైరోబీ తిరిగి వెళ్లాల్సి ఉండగా అహ్మదాబాద్ నుండి ముంబై చేరుకున్నారు. తీరా ముంబై వచ్చాక విమానం ఆలస్యమవుతుందని తెలియడంతో శాంతాక్రూజ్ సమీపంలోని గెలాక్సీ హోటల్లో బస చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ జంట ఒక్కటవ్వకుండానే ఒక్కటిగా వెళ్లిపోయారని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు సురేష్ కారా. ఇది కూడా చదవండి: సినిమా చూసేందుకు వెళ్లి మృత్యుఒడిలోకి.. ఏమైందంటే? -
Manipur Violence: మణిపూర్లో సజీవదహనమైన తల్లీకొడుకులు..
ఇంఫాల్: మణిపూర్లో తవ్వేకొద్దీ దారుణాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. మణిపూర్ హింసాకాండపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ చేతికి మొత్తం 20 కేసులను అప్పగించగా తాజాగా వారికి మరో సంచలనాత్మక కేసును అప్పగించారు మణిపూర్ పోలీసులు. ఆనాటి అల్లర్లలో బులెట్ గాయమైన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని ఆసుపత్రికి తీసుకెళ్తోన్న తల్లి, మేనత్తలను బిడ్డతో సహా సజీవ దహనం చేసిన ఈ సంఘటన అధికారులను సైతం కలచివేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 4న టాన్సింగ్(7) సహాయక శిబిరంలో ఉండగా మెయిటీ అల్లరి మూకలు జరిపిన కాల్పుల్లో ఒక బులెట్ అతడి తలలోకి దూసుకెళ్లింది. వెంటనే సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు అక్కడి ఎస్పీతో మాట్లాడి బాలుడి తోపాటు తల్లి, మేనత్తలను మాత్రమే వెంట ఆసుపత్రికి పంపాల్సిందిగా సూచించారు. ఎందుకంటే బాలుడి తండ్రి జాషువా హాంగ్సింగ్ కుకీ తెగకు చెందిన వారు కాగా తల్లి మీనా హాంగ్సింగ్ మాత్రం మెయిటీ తెగకు చెందింది. ఆమెనైతే మెయిటీలు ఏమీ చేయరన్న ఉద్దేశ్యంతో అలా చేసినట్టు ఆర్మీ అధికారి తెలిపారు. అధికారి చెప్పినట్టుగానే బాలుడిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు ఎస్పీ. అంబులెన్స్ కు తోడుగా ఇంఫాల్ వెస్ట్ సూపరింటెండెంట్ సహా పోలీసుల ఎస్కార్టును కూడా పంపించారు ఆర్మీ ప్రతినిధులు. సరిగ్గా ఇంఫాల్ సరిహద్దుకు చేరుకోగానే సుమారు 2000 మంది గుంపు చుట్టూ మూగడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కొంచెం వెనక్కి తగ్గినట్టే తగ్గి అలరిమూక ఒక్కసారిగా దాడి చేసి అంబులెన్సుకు నిప్పు పెట్టేశారు. పోలీసులు చూస్తుండగానే అంబులెన్స్ మంటల్లో చిక్కుకోగా అందులోని బాలుడు, అతడి తల్లి, మేనత్త సజీవ దహనమయ్యారు. బాలుడి తండ్రి జాషువా హాంగ్సింగ్ కాంగ్పోక్పి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయగా.. లాంఫెల్ పోలీస్ స్టేషన్లో కూడా ఇదే కేసు నమోదైంది. దీంతో సీబీఐ ఈ కేసు పూర్వాపరాలను పరిశీలించి రెండు కేసులు ఒక్కటేనని తేల్చి దర్యాప్తు చేసే పనిలో పడింది. మణిపూర్లో రెండున్నర నెలలుగా సాగుతున్న హింసాకాండలో ఇప్పటివరకు 160 మంది మృతి చెందగా అల్లర్ల సమయంలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇది కూడా చదవండి: కాంగ్రెస్పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు -
మణిపూర్లో మరో ఘోరం.. ఫ్రీడం ఫైటర్ భార్య సజీవ దహనం
ఇంఫాల్: మణిపూర్ ప్రజలు గడిచిన రెండున్నర నెలలుగా కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి చక్కబడుతోందను కుంటున్న తరుణంలో అల్లర్ల సమయంలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా వీధుల్లో ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన మరువక ముందే ఒక మహిళను ఇంట్లోనే పెట్టి సజీవ దహనం చేసిన మరో ఘటన సెరౌ పోలీస్ స్టేషన్లో నమోదైంది. మే 28న కక్చింగ్ జిల్లాలోని సెరౌ గ్రామంలో నివాసముంటున్న స్వాతంత్య్ర సమరయోధుడి భార్య ఐబెతొంబి(80)ను అల్లర్ల సమయంలో ఇంట్లోనే బంధించి ఇంటికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. దీంతో బాధితురాలు ఎటూ తప్పించుకోలేక అగ్నికి సజీవ దహనమైంది. ఆమెను రక్షించడానికి ప్రయత్నించిన మనవడు ప్రేమకంఠ(22) పై సాయుధులైన నిరసనకారులు బుల్లెట్ల వర్షం కురిపించడంతో అతడి చేతుల్లోకి తొడభాగంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అనంతరం అతడిని ఆసుపత్రిలో చేర్చగా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆరోజున ప్రమాదాన్ని పసిగట్టిన మృతురాలు కొద్దిసేపైన తర్వాత తిరిగి రండని చెప్పి ఇంట్లో వాళ్ళని బయటకు వెళ్ళమని చెప్పి తాను మాత్రం ఇంట్లోనే ఉండిపోయి అగ్నికి ఆహుతైందని చెప్పుకొచ్చాడు ప్రేమకంఠ. రెండు నెలల తర్వాత తిరిగొచ్చిన అతను శిధిలమైన ఇంటి నుండి జ్ఞాపకాలను తన వెంట తీసుకుని వెళ్ళాడు. వాటిలో మృతురాలి భర్త ఎస్. చురాచంద్ సింగ్(లేటు) భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా గౌరవ పురస్కారాన్ని స్వీకరించిన ఫోటో ఫ్రేము కూడా ఉంది. మణిపూర్ అల్లర్లలో అత్యధికంగా నష్టపోయిన గ్రామాల్లో సెరౌ గ్రామం కూడా ఒకటి. రాజధానికి 45 కి.మీ దూరంలో ఉండే ఈ ప్రాంతం హింసాకాండలో బాగా ప్రభావితమైంది. ప్రస్తుతం ఈ గ్రామంలో ఎక్కడ చూసినా సగం కాలిపోయిన ఇళ్ళు.. తూటాల రంధ్రాలతో నిండిన గోడలు దర్శనమిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ప్రధాని పదవి నుండి తప్పుకుని సమర్ధులకి అప్పగించాలి.. అశోక్ గెహ్లాట్ -
రైలులో మంటలు..ఏడుగురు సజీవదహనం
కరాచీ: పాకిస్తాన్లో ఎక్స్ప్రెస్ రైలులో చెలరేగిన మంటల్లో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న రైలు ఏసీ బోగీలో బుధవారం అర్ధరాత్రి తర్వాత మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వెంటనే టాండో మస్తి ఖాన్ స్టేషన్లో రైలును ఆపేసి, మంటలు అంటుకున్న బోగీని వేరు చేశారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ దుర్ఘటనలో నలుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఆరు మృతదేహాలు గుర్తు పట్టడానికి కూడా వీలు లేనంతగా కాలిపోయాయి. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు చెప్పారు. -
కుషాయిగూడలో ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం
సాక్షి, మేడ్చల్: కుషాయిగూడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. టింబర్ డిపోలో మంటలు చెలరేగడంతో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మృతులంతా వరంగల్ జిల్లా ఒకే కుటుంబానికి చెందిన నరేష్, సుమ, బాబుగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను నియంత్రించారు. ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్గా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. చదవండి: సవాల్ విసురుతున్న గుండెపోట్లు.. -
మెదక్ జిల్లా : వ్యక్తి సజీవదహనం కేసులో పురోగతి
-
కారులో గుర్తు తెలియని వ్యక్తి సజీవ దహనం
-
బతికుండగానే కారులో వ్యక్తి సజీవ దహనం.. ఏం జరిగింది?
సాక్షి, మెదక్ జిల్లా: అప్పటి వరకు బంధువులతో మాట్లాడిన వ్యక్తి.. అంతలోనే మృత్యుఒడికి చేరుకున్నాడు. అక్కా వస్తున్నా అని చెప్పిన తమ్ముడి రాక కోసం రాత్రంతా ఎదురుచూసి తెల్ల వారగానే అతని మరణ వార్త తెలియడంతో ఆమె తల్లడిల్లిపోయింది. తెలంగాణ సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న ధర్మా అనే వ్యక్తి సజీవదహనం కావడంతో టేక్మాల్ మండలం భీమ్లా తండాలో విషాదం నెలకొంది. టెక్మాల్ మండలం వెంకటాపురం గ్రామ శివారులో కారులో వ్యక్తి సజీవదహనం కావడం సంచలనంగా మారింది. కారు డోర్ వద్ద మృతుడి కాలు బయటకు రావడంతో ఇది ప్రమాదమా? లేక హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ధర్మాకు భార్య, ముగ్గురు సంతానం ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ధర్మా మృతిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు. గత అర్థరాత్రి వ్యక్తిని కారులో వేసి ప్రెటోల్ పోసి నిప్పు పెట్టినట్లు ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు. కారు నంబర్ను దుండగులు పూర్తిగా దహనం చేశారు. కారు వద్ద బ్యాగుతో పాటు చెట్ల పొదల్లో పెట్రోల్ డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
అర్ధరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలు.. ఆరుగురు సజీవ దహనం
సాక్షి, మంచిర్యాల: అర్ధరాత్రి ఇంట్లో మంటలు చెలరేగి కుటుంబం మొత్తం సజీవ దహనమైన విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని మందమర్రి మండలం గుడిపల్లి వెంకటాపూర్లో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పెంకుటిల్లు కావడం, మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడిన క్రమంలో నిద్రలోనే మాంసం ముద్దలుగా మారిపోయారు. ఈ ప్రమాదంలో కుటుంబంలోని ఆరుగురు మరణించగా.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతులు శివయ్య, ఆయన భార్య పద్మ, చిన్నారులు ప్రీతి(4), హిమబిందు(2) మరో వ్యక్తి కాంతయ్యగా గుర్తించారు. మృతదేహాలను గుర్తించిన తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. వీడియోలు వైరల్.. నవీన్రెడ్డి సోదరుడి అరెస్ట్ -
భర్త వేధింపులతో విసిగి కూతురుసహా తల్లి సజీవదహనం
ములుగు(గజ్వేల్): కుటుంబకలహాలు రెండు నిండుప్రాణాలను బలితీసుకున్నాయి. ఒకవైపు భర్త వేధింపులు.. మరోవైపు మానసిక వికలాంగురాలైన కూతురుకు పెళ్లి కాదేమోననే బెంగ.. కొంతకాలంగా మానసిక వేదన అనుభవిస్తున్న ఓ తల్లి కూతురుతోసహా నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ములుగు మండలం వాగునూతి గ్రామానికి చెందిన సగ్గు అవిలయ్యకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య గంగవ్వ(40)కు జ్యోతి, హారతి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్నకూతురు వివాహం జరగ్గా మానసిక వికలాంగురాలైన పెద్ద కూతురు జ్యోతి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. రెండో భార్యకు కొడుకు, కూతురు. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆరునెలల నుంచి అవిలయ్య, గంగవ్వకు మధ్య కుటుంబకలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అవిలయ్య ఆమెను కొట్టడంతో గురువారం ఉదయం 10 గంటలకు తన సోదరుడు మానుక అవిలయ్యకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు అతడు బావకు ఫోన్ చేయగా గంగవ్వ, జ్యోతి కనపడటం లేదని చెప్పాడు. ఆందోళనకు గురైన మానుక అవిలయ్య వారి కోసం వెతకడం ప్రారంభించాడు. మరుసటిరోజు ఉదయం 11 గంటలకు జప్తిసింగాయిపల్లి అటవీ ప్రాంతంలో నీలగిరి చెట్ల మధ్య కాలినస్థితిలో గంగవ్వ, జ్యోతి మృతదేహాలు కనిపించాయి. అక్కడ సమీపంలోనే గంగవ్వ బంగారు, వెండి అభరణాలు మూటకట్టి ఉన్నాయి. భర్త వేధింపులు భరించలేకనే తన సోదరి గంగవ్వ కూతురితో కలసి నిప్పంటించుకుని బలవన్మరణం చెందిందని మానుక అవిలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. గంగవ్వ భర్త అవిలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
మూడు పెళ్లిళ్లు.. సవతుల మధ్య పోరు.. చివరికి షాకింగ్ ట్విస్ట్
తిరువొత్తియూరు(తమిళనాడు): కృష్ణగిరి జిల్లాలో సవతుల మధ్య జరిగిన పోరులో ఓ తల్లీ, కుమారుడు సజీవదహనం అయిన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఊతంకరై సమీపంలో ఉన్న కల్లావి చెంగల్ పట్టికి చెందిన సెందామరై కన్నన్ (55) వీధి నాటకం కళాకారుడు. ఇతను ధర్మపురి జిల్లా స్వామియార్ పురానికి చెందిన సెల్విని మొదట వివాహం చేసుకున్నాడు. చదవండి: మహిళతో వివాహేతర సంబంధం.. పెళ్లికి ఒప్పుకోలేదని.. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఆ తరువాత సెందామరై కన్నన్ కీల్కుప్పం ప్రాంతానికి చెందిన కమల (47)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూడా ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అందులో కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు గురు (17) ప్లస్ టూ చదివి ఇంట్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అతను సత్య (30) అనే మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముత్తు అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో రెండో భార్య కమల, మూడో భార్య సత్యకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కమల, గురు బుధవారం రాత్రి ఇంటిలో భోజనం చేసి నిద్రపోయారు. గురువారం వారు ఎంతకీ ఇంటిలో నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు అనుమానం వచ్చి చూశారు. అనంతరం కల్లావి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా, అక్కడ కాలిపోయిన స్థితిలో కమల, గురు మృతదేహాలు ఉన్నాయి. విచారణలో ఇద్దరూ సజీవ దహనం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై సమాచారం అందుకున్న ఊతంకరై డీఎస్పీ అలెగ్జాండర్ విచారణ చేపట్టి, ఇద్దరి మృతదేహాలను శవ పరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సవతుల గొడవలో ఇద్దరు సజీవదహనం కావడంపై సెందామరై కన్నన్, సత్యను పోలీసులు విచారణ చేస్తున్నారు. -
అస్సాంలో అమానుషం.. క్షుద్రపూజల నెపంతో.. అందరూ చూస్తుండగా..
గువాహటి/మోరిగావ్: అస్సాంలో క్షుద్రపూజలతో మహిళను హత్యచేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని గ్రామస్థులు సజీవ దహనంచేశారు. నాగోవ్ జిల్లాలోని సమగురి పోలీస్స్టేషన్ పరిధిలో ఈ అమానుష ఘటన జరిగింది. కొద్దిరోజుల క్రితం సరస్సులో విగతజీవిగా పడిఉన్న 22 ఏళ్ల మహిళను 35 ఏళ్ల రంజిత్ బొర్డోలోయ్ హతమార్చాడని బోర్లాలుంగో, బర్హామ్పూర్ బముని ప్రాంతంలోని గ్రామసభలో ఒక బహిరంగ విచారణ చేపట్టారు. ఆమెను రంజితే హతమార్చాడని తీర్మానించి పట్టపగలే అందరూ చూస్తుండగా సజీవదహనం చేశారు. తర్వాత మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టారు. విషయం తెల్సుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా గ్రామంలోని పురుషులంతా పారిపోయారు. మృతదేహాన్ని పోలీసులు తవ్వి తీసి పోస్ట్మార్టమ్కు పంపించారు. సజీవదహనం కేసులో ముగ్గురు మహిళలుసహా ఐదుగురిని అరెస్ట్చేసినట్లు జిల్లా ఎస్పీ లీనా డోలే చెప్పారు. -
ఘోర ప్రమాదం
సాక్షి, పుట్టపర్తి, అమరావతి/తాడిమర్రి/సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూలీలు ప్రయాణిస్తున్న ఆటోపై విద్యుత్ తీగలు తెగి పడటంతో మంటలు చెలరేగి ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. ఒకరు తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో గురువారం ఉదయం 7.30 గంటలకు ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానికులు, కూలీలు తెలిపిన వివరాల మేరకు.. తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన గుండ్లమడుగు మెకానిక్ రాజా ఇటీవల 2 ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. కలుపు తొలగించేందుకు ఇతని భార్య కుమారి (28).. గుడ్డంపల్లికి చెందిన మరో 11 మంది కూలీలను తీసుకుని కునుకుంట్ల గ్రామానికి చెందిన పోతులయ్య ఆటోలో పొలానికి బయలుదేరింది. మొత్తం 13 మందితో వెళ్తున్న ఆటో చిల్లకొండయ్యపల్లి సమీపంలోకి రాగానే 11 కేవీ విద్యుత్ తీగ ఉన్నట్లుండి తెగి ఆటోపై పడింది. దీంతో ఆటోకు విద్యుత్ ప్రవహించి మంటలు చెలరేగాయి. దీంతో గుండ్లమడుగు కుమారితో పాటు కొంకా మల్లికార్జున భార్య రామలక్ష్మి (30), కొంకా చిన్న మల్లన్న భార్య పెద్ద కాంతమ్మ (45), కొంకా కిష్టయ్య భార్య రత్నమ్మ (40) కొంకా ఈశ్వరయ్య భార్య లక్ష్మీదేవి (41) సజీవ దహనమయ్యారు. కొంకా మంజునాథ్ భార్య గాయత్రికి తీవ్ర గాయాలు కాగా, కొంకా మధుసూదన్ భార్య అరుణ, కొంకా పెద్దన్న భార్య నాగేశ్వరమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ పోతులయ్యతో పాటు కొంకా ఈశ్వరమ్మ, శివరత్నమ్మ, రమాదేవి, ఎ.రత్నమ్మలు ఆటోలోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. తీవ్రంగా గాయపడిన గాయత్రిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. మృతుల్లో కుమారి పెద్ద కోట్ల గ్రామానికి చెందగా.. మిగతా నలుగురు గుడ్డంపల్లి వాసులు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఎంపీపీ పాటిల్ భువనేశ్వర్రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అధికారులను అప్రమత్తం చేసి.. క్షతగాత్రులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొంప ముంచిన ఉడుత స్థంభంపై ఇనుప రాడ్డుకు, విద్యుత్ వైరు తగలకుండా మధ్యలో పింగాణీ పరికరాన్ని అమర్చుతారు. కానీ ఉడుత పొడవు ఆ పరికరాన్ని దాటి ఉండటంతో వైరును తాకింది. విద్యుత్ తీగకు స్తంభంపై ఉన్న ఇనుప రాడ్డుకి మధ్య ఉడుత పడటంతో దాని శరీరం గుండా విద్యుత్ ప్రవహించింది. ఆ వెంటనే షార్ట్ సర్క్యూట్, ఎర్త్ కారణంగా స్పార్క్ ఏర్పడి వైరు తెగిపోయింది. అప్పుడే అటుగా వచ్చిన ఆటోపై ఆ వైరు పడింది. అయినప్పటికీ ఆటోకి ఉండే టైర్లు ఎర్త్ అవ్వకుండా అడ్డుకోగలవు. కానీ ఆటోపై ఇనుప మంచం ఉంది. అదీగాక ఆ కంగారులో ఆటోలో ఉన్నవారెవరో కిందకు దిగే ప్రయత్నం చేశారు. వారు ఒక కాలు నేలపై, మరోకాలు ఆటోలో ఉంచడం వల్ల ఎర్త్ అయ్యి ఆటోకి వేల వాట్ల హై టెన్షన్ విద్యుత్ ప్రసరించి క్షణాల్లో కాలి బుగ్గయ్యింది. కాగా, ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) సీఎండీ హరినాథరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాఖ పరమైన విచారణకు ఆదేశించామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు (సీఎం ప్రకటించిన పరిహారం కాకుండా), తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల తక్షణ సహాయం అందించనున్నట్టు వెల్లడించారు. ఇటీవలే కొత్త లైన్లు వేశాం కరెంటు పోళ్లు గానీ, వైర్ల విషయంలో గానీ ఎక్కడా లోపం లేదని, ఆరుమాసాల కిందటే కొత్త ఫీడర్లు వేశామని విద్యుత్ శాఖ అనంతపురం ఎస్ఈ నాగరాజు తెలిపారు. విద్యుత్ సరఫరా నిర్వహణలో లోపంగానీ, సాంకేతిక సమస్యలు గానీ ఎక్కడా లేవన్నారు. ఈ ఘటనపై విచారణాధికారిగా ఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ రషీద్ను నియమించారు. ఆయన శుక్రవారం ఘటన స్థలికి చేరుకుని పరిశీలించనున్నారు. ఉడుతలతో ప్రమాదం విద్యుత్ తీగలపై ఉడుతలు, తొండలు, పాములు, పక్షులు వంటివి పడటం సాధారణంగా తరచూ జరుగుతుంటుంది. పవర్ గ్రిడ్లలో వీటివల్ల అనేక సార్లు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంటుంది. ప్లాస్టిక్ యానిమల్ గార్డ్లను దాటేసి, చిన్న సందు దొరికితే చాలు సబ్స్టేషన్లోకి ఇవి దూరిపోతుంటాయి. ఇవి మోషన్ డిటెక్టర్లను దాటి కంచెల కింద సొరంగం కూడా చేయగలవు. టన్నెలింగ్, ఎలక్ట్రికల్ ఇన్సులేషన్ ద్వారా కొరకడం, నమలడం, వేర్వేరు విద్యుత్ పొటెన్షియల్స్లో ఉన్న రెండు కండక్టర్లపై ఏకకాలంలో పడటం ద్వారా విద్యుత్ పంపిణీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా షార్ట్ సర్క్యూట్ జరిగి తీగలు తెగిపోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఏకకాలంలో జరుగుతుంది. ఇంటర్నెట్, మౌలిక సదుపాయాలు వంటి సేవలకు ఉడుతల వల్ల కలిగే ముప్పు సైబర్, ఉగ్ర దాడుల వల్ల కలిగే ముప్పు కంటే ఎక్కువగా ఉంటుందని అంతర్జాతీయ భద్రత సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఉడుతలు అనేక దేశాల్లో పవర్ గ్రిడ్లను నిర్వీర్యం చేయగలవని రుజువైంది. గవర్నర్, సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి చిల్లకొండయ్యపల్లిలో జరిగిన ప్రమాదంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పారిస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి.. సీఎంఓ ద్వారా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. -
బతికుండగానే భార్యను తగులబెట్టాడు
భివండీ (ముంబై): స్పృహ తప్పిన భార్యను బతికుండగానే తగలబెట్టాడు ఓ భర్త. ఈ సంఘటన స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు కుంది. సంతోశ్ చౌరసియా తన భార్య కవిత ఇద్దరు పిల్లలతో కలిసి చావింద్రలోని మహం కాళి దాబా ప్రక్కనే ఉన్న గుడిసెలో నివసిస్తున్నారు. కూలి పనిచేసే సంతోష్ వ్యసనాల కారణంగా పనికిపోక తరుచుగా భార్యతో గొడవ పడేవాడు. మంగళవారం మద్యం సేవించిన సంతోశ్ భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగటంతో ఆవేశంతో సంతోశ్ కవిత తలపై కర్రతో కొట్టడంతో ఆమె స్పహతప్పిపోయింది. దీంతో గుడిసె బయట నిల్వ చేసిన కర్రల కుప్ప దగ్గరకు కవితను లాకొచ్చి ప్రాణంతో ఉన్న కవితపై కట్టెలు పేర్చి నిప్పు అంటించి హత్యచేసి పారిపోయాడు. పోలీసులు నిందుతున్ని అరెస్ట్ చేశారు. చదవండి: (పెళ్లయిన యువతికి తల్లిదండ్రులు మరో పెళ్లి.. భర్తకు తెలిసి..) -
మైనర్పై అఘాయిత్యం.. బైక్తో సహా సజీవ దహనం చేసిన గ్రామస్తులు
తెలిసిన వ్యక్తే కదా! అని నమ్మి కూతురిని కూడా పంపించారు ఆ తల్లిదండ్రులు. కానీ, ఆ కీచకుడు.. మరోకరితో కలిసి దాష్టికానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి ఊరు ఊరంతా రగిలిపోయింది. నిందితులకు ‘చావే సరైన శిక్ష’ అనుకుని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంది. ఇంటి దగ్గర దిగబెడతాం అంటూ మైనర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిని.. సజీవ దహనం చేశారు గ్రామస్తులు. ఈ షాకింగ్ ఘటన జార్ఖండ్, గుమ్లాలో జరిగింది. బుధవారం బంధువుల ఇంటికి వెళ్లిన ఓ కుటుంబం.. సాయంత్రం స్వగ్రామానికి వెళ్లేందుకు బస్టాప్లో ఎదురు చూస్తోంది. ఆ సమయంలో ఆ కుటుంబం పక్క ఊరిలో ఉండే సునీల్ ఉన్రావ్ అనే వ్యక్తి వాళ్ల దగ్గరకు వచ్చాడు. అతని కూడా బైక్ మీద స్నేహితుడు కూడా ఉన్నాడు. బాగా ఆలస్యం అయ్యేట్లు ఉందని, కనీసం అమ్మాయినైనా తమతో పంపించమని అడిగాడు. బాగా దగ్గరి వాడే కదా నమ్మి కూతురిని అని బైక్ మీద పంపించారు ఆ తల్లిదండ్రులు. అయితే ఆ తల్లిదండ్రులు ఇంటికి చేరినా.. ఎంతసేపటికి కూతురు మాత్రం రాలేదు. దీంతో సునీల్కు ఫోన్ చేశారు. అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి గాలించారు. ఈలోపు పక్క ఊరి శివారులో ఒక అమ్మాయి స్పృహ లేకుండా పడి ఉందన్న సమాచారం వీళ్లకు అందింది. వెళ్లి చూస్తే.. అది వాళ్ల కూతురే. తనపై అఘాయిత్యం జరిగిందని చెప్పింది బాధితురాలు. విషయం తెలిసి బాధితురాలి గ్రామస్తులు చిర్రెత్తి పోయారు. పొరుగూరికి వెళ్లి మరీ నిందితులను దొరకబుచ్చుకుని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరినీ తమ ఊరికి లాక్కొచ్చారు. వాళ్ల బైక్తో సహా పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటనలో సునీల్ మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కేసు బుక్ చేసుకున్న పోలీసులు.. ఆరుగురిపై హత్య కేసు నమోదు చేశారు. -
బోయిగూడలో అగ్నిప్రమాదంలో 11 మంది కార్మికులు సజీవదహనం
-
హఠాత్తుగా ఇంట్లో మంటలు.. దంపతుల సజీవదహనం
పీలేరు రూరల్(చిత్తూరు జిల్లా): అగ్ని ప్రమాదంలో దంపతులు సజీవ దహనమైన సంఘటన సోమవారం ఉదయం పీలేరు పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు, ఎర్రావారిపాళెం మండలం, కోటకాడపల్లెకు చెందిన భుక్కే నాగేశ్వరనాయక్ (46), బి.సిద్ధేశ్వరి (40)కి 20 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత 17 సంవత్సరాలుగా పీలేరు పట్టణం సైనిక్ నగర్లో కాపురం ఉంటున్నారు. నాగేశ్వరనాయక్ సీఆర్పీఎఫ్ జవాన్గా శ్రీనగర్లో ఉద్యోగం చేస్తున్నాడు. వారం క్రితం శ్రీనగర్ నుంచి పీలేరుకు వచ్చాడు. చదవండి: ప్రేయసి ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. ఎంత పనిచేశావ్ తరుణ్.. సోమవారం ఉదయం హఠాత్తుగా ఇంట్లో మంటలు ఎగిసిపడుతుండగా కేకలు వినిపించాయి. దీంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక కేంద్రానికి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే నాగేశ్వర్నాయక్ మృతి చెందాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సిద్ధేశ్వరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. అగ్నిప్రమాదంలో భార్య భర్తలిద్దరూ మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. కుమారుడు విష్ణువర్ధన్ నాయక్ ఇంటరీ్మడియెట్ ద్వితీయ సంవత్సరం, కుమార్తెలు అంజలి టీటీసీ, శ్రీచైతన్య బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పీలేరు రూరల్ సీఐ తులసీరామ్, ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. -
కారులో వ్యక్తి సజీవ దహనం.. హత్యా? లేదా ప్రమాదమా?
-
కారులో వ్యక్తి సజీవ దహనం.. హత్యా? లేదా ప్రమాదమా?
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కంటేపల్లి రైల్వే గేట్ సమీపంలోని పొలాల్లో ఓ కారు పూర్తిగా దగ్ధమై కనిపించింది. కారులో ఉన్న వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. హత్యా? లేక ప్రమాదమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
వెనక నుంచి వచ్చే ప్రమాదాన్ని గమనించలేదు.. రైతు సజీవదహనం
జగిత్యాల క్రైం: మంటల నుంచి గడ్డి వామును కాపాడుకునే ప్రయత్నంలో ఓ రైతు సజీవ దహనమయ్యాడు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన పోతుగంటి లక్ష్మణ్గౌడ్ (60) మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. పోతుగంటి లక్ష్మణ్ గౌడ్ గ్రామ శివారులోని తన రెండెకరాల్లో వ్యవసాయం చేస్తూ కులవృత్తి చేస్తాడు. ఇటీవల పంట కోశాడు. యాసంగిలో మళ్లీ సాగు చేసేందుకు మంగళవారం ఉదయం వరి కొయ్యకాలుకు నిప్పు పెట్టాడు. పొలం సమీపంలోనే గడ్డివాము ఉంది. దానికి నిప్పు అంటుకోకూడదని పొలంలోని మంటల్ని కర్రలతో కొడుతూ ఆర్పుకుంటూ ముందుకు సాగాడు. కానీ వెనక నుంచి వచ్చే మంటల్ని గమనించలేదు. ఈక్రమంలోనే లక్ష్మణ్గౌడ్ చుట్టూ మంటలు వ్యాపించాయి. తప్పించుకునే మార్గం లేక అందులోనే చిక్కుకుని కాలిపోయాడు. రూరల్ ఎస్ఐ అనిల్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (చదవండి: Telangana: కొత్తగా 205 మందికి కరోనా ) -
ప్రాణం తీసిన చుట్ట.. సజీవ దహనం
సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): మంచానికి మంటలు వ్యాపించి వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డి దుర్గారావు కూలి పనులు చేసుకుంటూ తల్లి రెడ్డి సీతమ్మ(71)తో కలసి జామి అప్పన్నవీధి, సత్యనారాయణపురం సీతన్నపేటగేటు సమీపంలో నివాసముంటున్నాడు. తల్లి అనారోగ్యంతో కొంతకాలంగా మంచానికే పరిమితమైంది. రోజు తల్లికి టిఫిన్ తినిపించి సపర్యలు చేసి, ఆమెకు చుట్ట తాగే అలవాటు ఉండటంతో కొన్ని చుట్టలు మంచం పక్కనే పెట్టి పనికి వెళ్తుంటాడు. సోమవారం ఉదయం తల్లికి టిఫిన్ తినిపించి పనికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి పొగ వస్తుండటంతో చుట్టుపక్కల వారు దుర్గారావుకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అతను ఇంటికి వచ్చి చూడగా తల్లి పడుకున్న మంచానికి మంటలు వ్యాపించాయి. నీళ్లు చల్లి మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే మంటల్లో పూర్తిగా కాలిపోయి సీతమ్మ చనిపోయింది. చుట్ట తాగి కింద పడేయడంతో మంచం కింద ఉన్న బట్టలకు మంటలు వ్యాపించి నవ్వారు మంచం కాలిపోయిందని, కదలలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు మంటల్లో కాలిపోయి మృతి చెంది ఉండొచ్చని భావిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వివాహిత సజీవ దహనం: హత్యా.. ప్రమాదమా?
హస్తినాపురం: అనుమానాస్పదస్థితిలో ఓ వివాహిత మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగిందని మొదట స్థానికులు భావించారు. కానీ భర్తే ఆమెను హత్యచేసి..పెట్రోల్ పోసి నిప్పంటించాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈమేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. వనస్థలిపురంలో సోమవారం జరిగిన ఈఘటనపై పోలీసులు, మృతురాలి బంధువులు తెల్పిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన చెల్లం బాలకృష్ణ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. అతని మొదటి భార్య చనిపోవడంతో నల్గొండ జిల్లా డిండి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన ఎర్ర సరస్వతి (42)ని 20 ఏళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. అనంతరం సరస్వతికి ప్రభుత్వ టీచర్గా ఉద్యోగం రావడంతో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలతో కలిసి వనస్థలిపురంలో నివాసం ఉంటున్నారు. బాలకృష్ణ మొదటి భార్యకు కుమారుడు వెంకటరమణ జన్మించగా, సరస్వతికి కూతురు అక్షిత (15) ఉంది. వనస్థలిపురంలోని ఎఫ్సీఐ కాలనీలో ఉన్న ఇల్లు సరస్వతి పేరు మీద ఉండగా..తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని బాలకృష్ణ ఇటీవల ఒత్తిడి చేయడంతో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి వారిద్దరు గొడవ పడ్డారని కూతురు అక్షిత పోలీసులకు తెలిపింది. సోమవారం ఉదయం కూడా మళ్లీ గొడవ పడ్డారని, తల్లిపై బాలకృష్ణ చేయి చేసుకున్నాడని అక్షిత పేర్కొంది. కొద్దిసేపటికి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన తన తండ్రి టిఫిన్ తీసుకొచ్చారని, ఆ తర్వాత తాను ఆన్లైన్ క్లాస్లు వినేందుకు బెడ్రూంలోకి వెళ్లానని చెప్పింది. కొద్దిసేపటికి పెద్దశబ్ధం రావడంతో తాను బయటకి వచ్చి చూడగా..తన తల్లి మంటల్లో చిక్కుకుని కన్పించిందని, తనను దగ్గరకు రావొద్దని చెప్పారని తెలిపింది. అప్పటికే తన తల్లి మొత్తం మంటల్లో కాలిపోయినట్లు అక్షిత చెప్పిందని పోలీసులు వివరించారు. మంటలు అంటుకున్న సమాచారం అందుకున్న హయత్నగర్ ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చి మంటలార్పారు. కాగా తాము సంఘటనా స్థలానికి చేరుకునే సరికే మృతురాలి భర్త బాలకృష్ణ స్వల్పగాయాలతో 108లో యశోద ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరినట్లు సీఐ మురళీమోహన్ తెలిపారు. అక్షిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హత్యచేసి అగ్నిప్రమాదంగా చిత్రీకరించాడు.. తన చెల్లెల్ని ఆమె భర్త బాలకృష్ణ హత్యచేసి..ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని మృతురాలి అక్కలు సులోచన, వెంకటమ్మ, రమణలు ఆరోపించారు. ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయని, కొద్దికాలంగా సరస్వతిని బాలకృష్ణ తీవ్రంగా వేధిస్తున్నాడని వారు పేర్కొన్నారు. హత్యచేసి..అగ్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు కుట్రపన్నారని, అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనుమానాస్పద కేసు... సోమవారం ఉదయం సజీవ దహనమైన సరస్వతి ఆత్మహత్య చేసుకుందా, హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని వనస్థలిపురం సీఐ మురళీ మోహన్ తెలిపారు. మృతురాలి పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశామని, భర్త బాలకృష్ణను విచారించనున్నట్లు తెలిపారు. చదవండి: మూడు రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం Lockdown: సారు.. లాఠీల జోరు.. -
విషాదం: స్టౌని అలాగే ఉంచి అగ్గిపుల్లతో వెలిగించడంతో..
సామర్లకోట: వంట చేయడానికి వంట గదిలోకి వెళ్లిన ఓ మహిళ గ్యాస్ మంటలకు ఆహుతైన విషాద సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక బ్రౌన్ పేట కుమ్మర వీధికి చెందిన గుబ్బల భవాని (35) శనివారం వంట చేయడానికి గ్యాస్ స్టౌను అగ్గిపుల్లతో వెలిగిస్తోంది. స్టౌ వెలగకపోవడంతో అలాగే ఉంచి పలుమార్లు అగ్గిపుల్లలు వెలిగింది. ఈ క్రమంలో పెద్ద మొత్తంలో గ్యాస్ లీకైంది. ఆ సమయంలో అగ్గిపుల్ల వెలగడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి, భవాని సజీవ దహనమైంది. లారీ డ్రైవర్గా పని చేస్తున్న భర్త చిన్న కుమారుడిని తీసుకొని బయటకు వెళ్లాడు. ఇంటి సమీపంలో భవాని ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తోంది. షాపు వద్ద పెద్ద కుమారుడు, అత్తను ఉంచి, మధ్యా హ్నం వంట చేయడానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంటి నుంచి మంటలు రావడం, భవాని కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న ఆమె బావ కుమారుడు గమనించి, భవాని పెద్ద కుమారుడిని తీసుకుని అక్కడకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న నీటితో మంటలు అదుపు చేశారు. అప్పటికీ గ్యాస్ లీకవడం గమనించి వారు అదుపు చేశారు. విషయం తెలిసిన వెంటనే పెద్దాపురం సీఐ వి.జయకుమార్, ఎస్సై వీఎల్వీకే సుమంత్, వార్డు కౌన్సిలర్ పిట్టా సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్టౌ వద్ద ఐదు అగ్గిపుల్లలు ఉండటం గమనించారు. వెంటనే స్టౌ వెలగకపోవడం, గ్యాస్ వ్యాపించి ఉన్న సమయంలో మరో అగ్గిపుల్ల వెలగడంతో మంటలు వ్యాపించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాకినాడ రూరల్ పెనుమర్తికి చెందిన భవానీకి 16 ఏళ్ల క్రితం సామర్లకోట బ్రౌన్పేటకు చెందిన గుబ్బల రామకృష్ణతో వివాహమైంది. అత్త లక్ష్మి, పెద్ద కుమారుడు అర్జున్ గణేష్, చిన్న కుమారుడు వేణుతేజ ఉన్నారు. కుమార్తె మరణ వార్త తెలుసుకొని తల్లిదండ్రులు దెయ్యాల మహలక్ష్మి, కామరాజులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. భవానీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెద్దాపురం తరలించి, ఎస్సై సుమంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అడ్డగోలు దోపిడీ: సీటీ ‘స్కామ్’ సీఐ విచారణ: స్పృహ తప్పిన నిందితుడు -
గడ్డివాము దగ్ధం: ఇద్దరు చిన్నారుల సజీవ దహనం
సాక్షి, మహబూబ్ నగర్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దాగుడు మూతలు ఆడేందుకు వెళ్ళి గడ్డివాములో దాక్కున్న ఇద్దరు చిన్నారులు మంటల్లో చిక్కుకుని మృతి చెందారు. నవాబుపేట మండలం ఇప్పటూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం గ్రామానికి చెందిన విగ్నేష్, ప్రశాంత్ అనే ఇద్దరితో పాటు శివ అనే మరో బాలుడు కలిసి గ్రామశివారులోని గడ్డివాము పక్కన ఆడుకునేందుకు వెళ్ళారు. అక్కడే ఉన్న ట్రాక్టర్ కు సంబంధించిన కేజీ వీల్స్ పై గడ్డి కప్పి ఆడుకుంటున్నారు. ఇదే సమయంలో విగ్నేష్, ప్రశాంత్లు గడ్డివాము పక్కన దాక్కున్నారు. శివ అనే బాలుడు గడ్డినీ అంటించగా... వారికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారు వెంటనే జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా చిన్నారులిద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శివ వల్లే తమ పిల్లలు ప్రాణాలు కోల్పోయారని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: అంబర్పేట్లో విష వాయువుల కలకలం గోదావరిలో ఏడుగురు గల్లంతు -
విషాదం మిగిల్చిన ‘దీపం’: బతికుండగానే..
ఎచ్చెర్ల క్యాంపస్(శ్రీకాకుళం జిల్లా): పిలిస్తే పలకడానికి పక్కన ఎవరూ లేరు. పరుగెత్తుకుని వెళ్లిపోవడానికి బలం లేదు. మంటల్ని అదుపు చేసే సత్తువా లేదు. అలాంటి నిస్సహాయ స్థితిలో ఓ వృద్ధుడు బతికుండగానే దహనమైపోయాడు. ముద్దాడలో శుక్రవారం రాత్రి జరిగి న ఈ దుర్ఘటన స్థానికులను కలిచి వేసింది. గ్రామంలో 81 ఏళ్ల మడ్డి రామప్పడు ఓ పూరి గుడిసె లో ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి గుడిసె నుంచి మంటలు ఎగసిపడ్డాయి. దీన్ని గమనించిన స్థానికులు మంటలను అదుపు చేసి ఎచ్చెర్ల పోలీసులకు సమాచారం అందించారు. గుడిసె లోపలకు వెళ్లి చూడగా వృద్ధుడు సజీవ దహనమై కనిపించాడు. గుడిసెలో ఉన్న కిరోసిన్ దీపం నుంచి మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. వృద్ధుడికి ఇద్దరు కుమారులు ఉండగా.. వారు ఇతర జిల్లాలకు వలస వెళ్లిపోయారు. కుమార్తె ఈశ్వరమ్మ రోజూ భోజనం అందించి వెళ్లిపోతారు. శుక్రవారం రాత్రి కూడా భోజనం అందించి వెళ్లిపోయారు. తెల్లారేసరికి తండ్రి ఇలా విగతజీవిగా కనిపించారు. ఎస్ఐ రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. చదవండి: ఆటవికం.. అరాచకం: ఇదీ అచ్చెన్నాయం! అచ్చెన్న ‘రాజ్యం’లో అరాచకం -
నేవీ అధికారి సజీవదహనం: ఆ 6 రోజులు ఏం జరిగింది?
ముంబై: తమిళనాడులోని చెన్నైలో కిడ్నాప్కు గురైన నౌకాదళ అధికారి సూరజ్ కుమార్ దుబేని ముంబైలో సజీవదహనం చేయడంతో హత్యకు గురైన సంగతి తెలిసందే. ఈ క్రమంలో మహారాష్ట్ర పోలీసులు కేసు దర్యాప్తుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. మృతి చెందిన సూరజ్కుమార్ దుబే షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవాడని.. ఈ క్రమంలో బ్యాంక్, స్నేహితుల దగ్గర భారీగా అప్పు చేశాడని తెలిసింది. మరో విషాదకర అంశం ఏంటంటే దూబేకి గత నెల 15న నిశ్చితార్థం జరిగింది.. ఈ ఏడాది ఏప్రిల్లో ఇద్దరికి వివాహం జరగాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చనిపోయిన సూరజ్ కుమార్ దుబే బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన పోలీసులు అతడు చనిపోవడానికి ముందు బ్యాక్ నుంచి 8 లక్షల రూపాయల లోన్, ఓ కొలిగ్ వద్ద నుంచి 5.75 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని తెలిపారు. ఇదే కాక కాబోయే మామగారి దగ్గర నుంచి 9 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది అన్నారు. ఇంత భారీ మొత్తం అప్పుగా తీసుకున్నప్పటికి ప్రస్తుతం అతడి ఖాతాలో కేవలం 392 రూపాయలు మాత్రమే ఉన్నాయని పోలీసులు తెలిపారు. సూరజ్ దూబే అప్పు చేసిన ఈ మొత్తాన్ని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇక అప్పు ఇచ్చిన స్నేహితుడు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా దూబేపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇక జనవరి నెల మొత్తం సెలవుల్లో ఉన్న దూబే విధుల్లో తిరిగి చేరడం కోసం జనవరి 30న ఉదయం 8 గంటలకు రాంచీ నుంచి హైదరాబాద్ వెళ్లే విమానం ఎక్కాడు. దిగాక తన కుటుంబ సభ్యులకు కాల్ చేశాడు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన దూబే చెన్నైలో దిగగా ముగ్గురు వ్యక్తులు అతడిని గన్తో బెదిరించి కిడ్నాప్ చేశారు. మూడు రోజులు దూబేని చెన్నైలో ఉంచారు. ఇక దుబే నుంచి జనవరి 30 తర్వాత ఎలాంటి కాల్ రాకపోవడం.. ఫోన్ స్విచ్ఛాఫ్లో ఉండటంతో అతడి కుటుంబ సభ్యులు నేవీ ఉన్నతాధికారికి సమాచారం ఇచ్చారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 1న దూబే మూడు ఫోన్లలో ఒక నెంబర్ రింగ్ అయినట్లు అతడి స్నేహితుడు తెలపడంతో పోలీసులు దాన్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. దూబే ఈ నంబర్ని షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ కోసం వినియోగించేవాడని దర్యాప్తులో తెలిసిందన్నారు పోలీసులు. మరో నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 5న దుండగులు దూబేని పహల్గఢ్లోని ఎతైన కొండ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికి లాభం లేకపోయింది. మరణించాడు. ఈ క్రమంలో జనవరి 31-ఫిబ్రవరి 5 మధ్యన ఆ ఆరు రోజుల పాటు ఏం జరిగి ఉంటుందనే విషయం కీలకంగా మారింది. ప్రస్తుతం పోలీసులు ఈ చిక్కు ముడిని విప్పే ప్రయత్నం చేస్తున్నారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్, భారీ మొత్తంలో డబ్బు అప్పు చేయడం వంటి అంశాలే దూబే మరణానికి కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. దూబే మొబైల్కి ఓ నంబర్ నుంచి వరుసగా 13 కాల్స్ రావడంతో అది ఎవరిదనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరి కొద్ది రోజుల్లోనే దోషులను పట్టుకుంటామని తెలిపారు. ఇక దూబేకి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అలవాటు ఉందని కానీ.. అతడి దగ్గర మూడు మొబైల్ ఫోన్లు ఉన్నాయనే విషయం కానీ కుటుంబ సభ్యులకు తెలియకపోవడం గమనార్హం. చదవండి: బెంగుళూరులో చంపారు.. రావూరులో పూడ్చారు.. చెన్నైలో కిడ్నాప్.. ముంబైలో సజీవదహనం -
చెన్నైలో కిడ్నాప్.. ముంబైలో సజీవదహనం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని చెన్నైలో కిడ్నాప్నకు గురైన నౌకాదళ అధికారి ముంబైలో సజీవదహనం చేసి హత్యకు గురయ్యారు. జార్కండ్ రాష్ట్రం రాంచికి చెందిన సూరజ్కుమార్ దుబే కోయంబత్తూరు ఐఎన్ఎస్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు. గత నెల 31న ఆయన జార్కండ్ వెళ్లే నిమిత్తం చెన్నైకు వచ్చారు. అయితే, ఆయన కనిపించకుండా పోయారు. చెన్నై విమానాశ్రయంలో ఆయన్ను ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్టు విచారణలో తేలింది. రూ.పది లక్షల కోసం డిమాండ్ చేసిన ఆ ముఠా, చివరకు ఆ అధికారిని హతమార్చింది. రోడ్డు మార్గంలో చెన్నై నుంచి ముంబైకు ఆయన్ను తీసుకెళ్లిన ఆ ముఠా సజీవదహనం చేసింది. చెన్నై, ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. -
ఏమీ చేయనని నమ్మించి, ప్రాణాలు తీశాడు
సాక్షి, కృష్ణా: ప్రేమ పేరుతో వేధించడమే కాకండా ఓ యువతి పాలిట కాలయముడిగా మారాడు ఓ వ్యక్తి. తన ప్రేమను నిరాకరించడంతో పాటు పోలీసులకు పిర్యాదు చేసిందని కసితో రగిలిపోయి ఆమెపై పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. అంతటితో ఆగకుండా ప్రేయసితో పాటు తనూ నిప్పంటించుకొన్నాడు. ఈ ఘటన సోమవారం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలోని ఓ కొవిడ్ కేర్ సెంటర్లో నర్సుగా పని చేస్తోంది. స్నేహితురాళ్లతో కలిసి ఆస్పత్రికి సమీపంలోనే ఓ గది అద్దెకు తీసుకుని ఉంటోంది. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి ఆమెను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ వ్యవహారం శృతిమించడంతో నాలుగు రోజుల కిందట గవర్నర్పేట పోలీసుస్టేషన్లో చిన్నారి ఫిర్యాదు చేసింది. పోలీసులు నాగభూషణాన్ని పిలిచి హెచ్చరించడంతో ఆమెకు దూరంగా ఉంటానని, ఏమీ చేయనని అతను స్టేట్మెంట్ రాసి ఇచ్చాడు. దీంతో ఫిర్యాదును చిన్నారి వెనక్కి తీసుకుంది. అయితే, రోజులానే సోమవారం విధులకు హాజరైన చిన్నారి రాత్రి 8 గంటలకు విధులను ముగించుకుని ఒంటరిగా ఇంటికి వెళుతుండగా.. మాటు వేసిన నాగభూషణం ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నాగభూషణం ముందుగానే తనతో తెచ్చుకున్న పెట్రోల్ను చిన్నారిపై పోసి నిప్పంటించాడు. తనూ ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రగాయాలైన నాగభూషణాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగభూషణం కూడా మృతి చెందాడని పోలీసులు తెలిపారు. -
భూ వివాదం : పూజారి సజీవ దహనం
జైపూర్ : రాజస్ధాన్లోని కరౌలి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భూ వివాదంలో ఆలయ పూజారిని కొందరు సజీవ దహనం చేసిన ఘటన వెలుగుచూసింది. కరౌలి జిల్లాలోని గ్రామంలో రాధాకృష్ణ ఆలయంలో పూజాధికాలు నిర్వహించేందుకు పూజారికి 5.2 ఎకరాలు అప్పగించారు. అయితే ఈ భూమి కరౌలీలో వివాదానికి దారితీసింది. గ్రామ పూజారి బాబాలాల్ వైష్ణవ్ తన భూమిని ఆనుకుని ఉన్న ఈ ప్లాట్లో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు స్థలం చదును చేసే పనులు చేపట్టారు. ఈ భూమి తమదని ఇందులో నిర్మాణాలు చేపట్టరాదని అంటూ మీనా వర్గీయులు అడ్డుకున్నారు. వివాదం గ్రామ పెద్దల వద్దకు చేరడంతో వారు పూజారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆ భూమి తనదే అంటూ పూజారి ఆ స్థలంలో తన పంట దిగుబడిని ఉంచాడు. పూజారి చదును చేసిన స్ధలంలో గుడిసె నిర్మించేందుకు నిందితులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఘర్షణ చెలరేగడంతో స్ధలంలో ఉన్న తన పంటను ఆరుగురు వ్యక్తులు తగులబెట్టడంతో పాటు తనపై కూడా పెట్రోల్ పోసి నిప్పంటించారని స్టేట్మెంట్లో పూజారి పేర్కొన్నారని పోలీసులు చెప్పారు. పూజారి కాలిన గాయాలతో జైపూర్ ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని, ప్రధాన నిందితుడు కైలాష్ మీనాను అరెస్ట్ చేశామని సీనియర్ పోలీస్ అధికారి హజ్రి లాల్ యాదవ్ తెలిపారు. చదవండి : ముగ్గురు విద్యార్ధినుల సజీవ దహనం -
ముగ్గురు విద్యార్థినులు సజీవ దహనం
-
కారులో వృద్ధుడి సజీవదహనం
తాండూరు టౌన్: పాడైపోయిన ఓ కారుకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో అందులో నిద్రిస్తున్న ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం ఈ ఘటన జరిగింది. పట్టణంలోని వాల్మీకినగర్కు చెందిన పత్తర్షెడ్ వీరన్న (70) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నప్పటికీ వేరుగా ఉంటున్నాడు. కొన్నేళ్లుగా స్థానిక మర్రిచెట్టు కూడలి సమీపంలోని గల్లీలో పాడైపోయిన ఓ కారులో రాత్రిళ్లు నిద్రిస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం మర్రిచెట్టు కూడలి వద్ద ఉన్న రక్తమైసమ్మ జాతర సందర్భంగా కారు నిలిపి ఉంచిన సమీపంలో టెంటు వేసి కొందరు వంటలు చేశారు. వీరన్న ఎప్పటిమాదిరిగానే అర్ధరాత్రి కారులో నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు టెంటుకు నిప్పంటుకుని కారుపై పడిపోవడంతో దానికి నిప్పంటుకుంది. దీంతో కారులో నిద్రిస్తున్న వీరన్న సజీవ దహనమై గుర్తు పట్టలేని స్థితిలో బూడిదగా మారాడు. మద్యం మత్తులో ఉండటం వల్ల వీరన్న తప్పించుకోలేక మంటల్లో చిక్కుకుని మృతిచెంది ఉంటాడని డీఎస్పీ అనుమానం వ్యక్తంచేశారు. మృతుడి కుమారులు రఘు, చిన్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
90 శాతం కాలిన గాయాలతో కిలోమీటర్ నడిచి..
న్యూఢిల్లీ : నిందితుల చేతిలో సజీవ దహనానికి గురైన ఉన్నావో బాధితురాలు ప్రస్తుతం ఢిల్లీలోని సప్ధర్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఉత్తర ప్రదేశ్లోని ఉన్నావోలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని గురువారం ఇద్దరు నిందితులతో సహా మరో ముగ్గురు అపహరించి పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలసిందే. గురువారం ఉదయం కోర్టు విచారణ కోసం రైల్వే స్టేషన్కు వెళ్తున్న యువతిని నిందితులు అపహరించి పెట్రోల్ పోసి నిప్పటించి పరారయ్యారు. తమపై కేసు పెట్టిందన్న అక్కసుతోనే నిందితులు ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గురైన బాధితురాలు కాలిన గాయాలతోనే దాదాపు కిలోమీటరు వరకు నడుచుకుంటూ స్థానికులను రక్షించాలంటూ వేడుకుంది. అనంతరం గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అదే రోజు సాయంత్రం కాలిన గాయాలతో ఉన్న యువతిని మెరుగైన వైద్య సేవల నిమిత్తం లక్నో నుంచి విమానంలో ఢిల్లీలోని ఆసుపత్రికి తరలించారు. అయితే యువతి శరీరం 90శాతం కాలిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. బాధితురాలి కోసం ప్రత్యేక ఐసీయుని ఏర్పాటు చేశామని, ప్రస్తుతం వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అయితే బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, ప్రాణాలతో బయటపడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఏడాది మార్చిలో తన తల్లిదండ్రుల గ్రామానికి వెళ్లి వస్తున్న24 ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన అయిదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ విషయం విదితమే. అయితే నిందితులపై మహిళ కేసు పెట్టడంతో.. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇటీవలే బెయిల్పై విడుదలైన నిందితుడు.. తమపై కేసు ఉపసంహరించుకోవాలని కోరగా దానికి ఆమె నిరాకరించడంతో తలపై కొట్టి, కత్తితో దాడి చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఘటన అనంతరం అయిదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఇక దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినట్టుగానే ఉన్నావో అత్యాచారం కేసు నిందితులను కూడా ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
శంషాబాద్లో మహిళ మృతి కేసులో పురోగతి
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్లోని సిద్దులగుట్ట సమీపంలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిన్న సాయంత్రం మహిళ ఆ పరిసరాల్లో సంచరించడాన్ని గుర్తించినట్లు పోలీసుల విచారణలో స్థానికులు వెల్లడించారు. ఏడుస్తూ తిరుగుతున్న ఆమెను స్థానిక పూజారి ప్రశ్నించగా... ఆ మహిళ హిందీలో మాట్లాడిందని, తనకు అర్థం కాలేదని పూజారి తెలిపారు. కాగా మహిళ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సిద్ధులగుట్ట ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తుంచారు. మృతురాలు ధూల్పేటకు చెందిన కవితా భాయ్ (35)గా గుర్తించారు. గత కొంతకాలంగా ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: శంషాబాద్లో మరో ఘోరం -
సీఎం బాధ్యత వహించాలి: కోమటిరెడ్డి
ఇబ్రహీంపట్నం/హయత్నగర్/తుక్కుగూడ/పెద్దఅంబర్పేట : తహశీల్దార్ హత్యకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అబ్దుల్లాపూర్మెట్ తహశీల్ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగులతో కలిసి జాతీయ రహదారిపై ఎంపీ బైఠాయించారు. భూప్రక్షాళన పేరుతో గత 60, 70 సంవత్సరాల భూసమస్యలను కొంతమేరకే పరిష్కరించారని, మిగిలిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని పేర్కొన్నారు. దీంతో రెవెన్యూ ఉద్యోగులు ఆయా భూసమస్యలను పరిష్కరించలేకపోవడంతో ప్రజలు వీరిపై కక్ష పెంచుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యమే విజయారెడ్డి హత్యకు కారణమని, విజయారెడ్డికి గత ఆరు నెలలుగా వచ్చిన ఫోన్ కాల్స్పై విచారణ జరిపితే అసలు దోషులు బయటపడతారని అన్నారు. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హతురాలి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో తహశీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్, వీఆర్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, టీఎన్జీఓ జిల్లా నాయకుడు యశ్వంత్, తహశీల్దార్లు సుశీల, శైలజ, సుచరిత, సీహెచ్ సుజాత, ఎంపీడీఓ నరేందర్రెడ్డి, దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధ దంపతుల సజీవ దహనం
సాక్షి, నెక్కొండ: ఇద్దరు వృద్ధ దంపతులు సజీవ దహనం చేసుకొని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నెక్కొండ మండలంలోని మడిపల్లి శివారు గేట్ తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన భూక్య ధస్రు(68), బాజు(65)లు అనుమానాస్పద స్థితిలో బుధవారం సాయంత్రం సజీవదహనం అయ్యారు. ఈ క్రమంలో వారు నివసిస్తున్న ఇల్లు సైతం మంటలకు ఆహుతైంది. స్థానికులు సమాచారం అందించడంతో నెక్కొండ ఎస్సై నవీన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి సంబంధించన వివరాలు అడిగి తెలిసుకున్నారు. ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. -
యువతి సజీవదహనం.. 16 మందికి మరణశిక్ష
ఫెని(బంగ్లాదేశ్) : ఓ యువతిని సజీవ దహనం చేసిన కేసులో బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 16 మందికి మరణశిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. నుస్రత్ జహాత్ రఫీ అనే విద్యార్థిని ఓ శిక్షణ కార్యక్రమానికి హాజరైనప్పుడు అక్కడి ప్రధాన అధ్యాపాకుడు ఆమెను లైంగిక వేధించాడు. దీనిపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ టీచర్.. కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా రఫీపై బెదిరింపులకు పాల్పడ్డాడు. నుస్రత్ వినకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన మరికొంత మందితో కలిసి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆమె శరీరం 80 శాతానికి పైగా కాలిపోయింది. విషమ పరిస్థితుల్లో ఉన్న నుస్రత్ను హాస్పిటల్లో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఏప్రిల్ 10వ తేదీన కన్నుమూశారు. నుస్రత్ మృతిపై దేశ రాజధాని ఢాకాలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. నుస్రత్ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన బంగ్లా ప్రధాని షేక్ హసీనా.. బాధ్యులను తప్పకుండా శిక్షించి తీరుతామని హామీ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఎస్పీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ‘నుస్రత్ కేసుకు సంబంధించి ప్రాథమికంగా 18 మందిని అరెస్ట్ చేశాం. నుస్రత్ కేసు ఉప సంహరించకోకుంటే ఆమెను అంతమొందించాల్సిందిగా టీచర్ వారిని ఆదేశించినట్టు నిందితులు విచారణలో అంగీకరించారు. తొలుత వారు నుస్రత్ ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే ఆమె బిల్డింగ్ పై నుంచి కాలిపోతూ కిందికి రావడంతో అసుల విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో నుస్రత్ క్లాస్మేట్స్ కూడా ఉన్నారు. వారు ఆమెపై కిరోసిన్ పోసే ముందు స్కార్ఫ్తో ఆమె చేతులను కట్టివేశారు’ అని తెలిపారు. కాగా, ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం 62 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి 16 మందికి మరణశిక్ష విధించింది. -
ప్రియురాలి ఇంటి ఎదుటే ప్రాణాలు విడిచాడు..
లక్నో : ఉత్తర్ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. తాను ప్రేమించిన యువతి ఇంటి ఎదుటే ప్రేమికుడు సజీవ దహనమైన ఘటన మహరాజ్గంజ్లో వెలుగుచూసింది. ఆర్యచౌక్ ప్రాంతంలో బసంత్పూర్కు చెందిన 23 ఏళ్ల కిషన్ ఆర్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. కిషన్ తన ప్రియురాలు కలిసి ఉండేవారని, పదిరోజుల కిందట వీరిద్దరూ గొడవపడటంతో యువతి పట్టణంలోని ఫరెందా రోడ్డు సమీపంలోని తన పుట్టింటికి వచ్చిందని ఏఎస్పీ వెల్లడించారు. మరోవైపు యువతి కుటుంబ సభ్యులే కిషన్ను సజీవ దహనం చేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే కిషన్ తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని లైటర్తో నిప్పంటించుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారని ఎసీపీ చెప్పారు. కిషన్ను కాపాడే ప్రయత్నంలో యువతి తండ్రికి కూడా గాయాలయ్యాయి. జిల్లా ఆస్పత్రిలో గాయపడిన యువతి తండ్రిని చేర్పించామని పోలీసులు తెలిపారు. సజీవ దహనానికి పాల్పడిన కిషన్ యువతి ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాడని పోలీసులు చెబుతున్నారు. కాగా మృతదేహాన్ని గుర్తించని యువతి ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని చెప్పడం గమనార్హం. రెండేళ్ల కిందట తన గర్ల్ఫ్రెండ్ మైనర్గా ఉన్న సమయంలో ఆమెతో కలిసి పారిపోగా, ఆమె తండ్రి ఫిర్యాదుపై కిషన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మరోసారి అదే యువతితో వెళ్లిపోయాడు. -
అత్తింట్లో పైశాచికం : మహిళ సజీవ దహనం
లక్నో : ఉత్తర్ ప్రదేశ్లోని రాంపూర్లో దారుణ ఘటన వెలుగుచూసింది. కట్నం తేలేదని మహిళతో పాటు మూడు నెలల పసికందును అత్తింటి వారు సజీవ దహనం చేయడం కలకలం రేపింది. తన సోదరికి నాలుగేళ్ల కిందట వివాహమైందని, ఆమెకు మూడేళ్ల కుమారుడు, మూడు నెలల కుమార్తె ఉన్నారని, కట్నం కోసం అత్తిటి వారు ఒత్తిడి చేస్తుండగా ఆమె కొద్దినెలలుగా పుట్టింట్లో ఉందని బాధితురాలి సోదరుడు మహ్మద్ జావేద్ చెప్పారు. బుధవారం తన సోదరిని అత్తింటివారు తమ ఇంటికి తీసుకువెళ్లి అదే రోజు ఆమెను, మూడు నెలల కుమార్తెను సజీవ దహనం చేశారని తెలిపారు. తన సోదరి షబ్నం, ఆమె కుమార్తెల గురించి అత్తింటి వారు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ఇరుగు పొరుగు వారు ఈ ఘటనపై తమకు సమాచారం అందించారని చెప్పారు. జావేద్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరకట్నం, హత్య కేసును నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని రాంపూర్ ఎస్పీ అజయ్ శర్మ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించామని చెప్పారు. -
కరెంట్ వైర్లు తెగిపడి పూరిళ్లు దగ్ధం
-
పాత వీడియోనే.. మళ్లీ వైరల్!
మధ్యప్రదేశ్లో ఓ హిందూ అమ్మాయి చర్చిలో ప్రార్ధన చేసిన కారణంగా నడిరోడ్డుపై సజీవ దహనం చేసిన వీడియో ఫేస్బుక్, ట్విట్టర్లో చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో వైరలయిన ఈ వీడియోను పాకిస్తానీయులు సైతం షేర్ చేస్తున్నారు. ఇండియా టుడే యాంటీ ఫేక్న్యూస్ వార్ రూమ్ (తప్పుడు సమాచార కట్టడి) నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ వీడియో ప్రజలను మభ్యపెట్టేలా ఉందని తేలింది. అయితే ఈ ఘటన గ్వాటేమాల దేశంలోని 'రియో బ్రావో'లో నాలుగేళ్ల క్రితం (2015 మే) చోటుచేసుకొంది. ఓ ట్యాక్సీ డ్రైవర్ హత్యలో 16 ఏళ్ల అమ్మాయి ప్రమేయం ఉన్న కారణంగా కొంతమంది ఆమెను కొట్టి తగలబెట్టారు. -
లైంగిక దాడి ఆపై సజీవ దహనం
లక్నో : ఉత్తర ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం తల్లితండ్రులు ఆస్పత్రిలో ఉండగా, 14 ఏళ్ల దళిత మైనర్ బాలికపై దుండగలు లైంగిక దాడికి పాల్పడి అనంతరం సజీవ దహనం చేసిన ఉదంతం వెలుగుచూసింది. ఈ కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేసినా ఇప్పటివరకూ పోలీసులు ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. ముజఫర్పూర్లో బాలిక పనిచేసే ఇటుక బట్టీ వద్ద ఓ చిన్న గదిలో బాధితురాలి దగ్ధమైన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇటుక బట్టీలో పనిచేస్తూ పొట్టపోసుకునే బాలిక కుటుంబం పక్కనే ఉన్న గదిలో నివసిస్తుండేదని స్ధానికులు చెప్పారు. గత వారం బాలిక తల్లితండ్రులు అస్వస్ధతతో ఆస్పత్రిలో చేరగా తమ్ముడితో కలిసి బాధితురాలు గదిలో ఉంటోంది. బాలికపై కన్నేసిన ఇటుక బట్టీ యజమాని మరో ఆరుగురుతో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి సజీవ దహనం చేశారు. కాగా, నిందితులపై హత్య, లైంగిక దాడి, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద పలు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని బీమ్ ఆర్మీ హెచ్చరించింది. -
ఫోన్కు బానిసైన కూతురిపై తండ్రి ఘాతుకం
సాక్షి, ముంబై : మొబైల్ ఫోన్ యువత జీవితాలను బలితీసుకుంటోంది. కన్నకూతురు నిత్యం ఫోన్లో మునిగితేలుతున్నదనే ఆగ్రహంతో తండ్రి ఆమెకు నిప్పుపెట్టిన ఘటన ముంబై మహానగరంలో వెలుగుచూసింది. పదేపదే ఫోన్లో సంభాషిస్తున్న కుమార్తె (16)ను తండ్రి మందలించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, నిందితుడు మహ్మద్ మన్సూరీ ఆగ్రహంతో బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. కాగా,డెబ్బై శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న బాలిక ప్రస్తుతం జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు చెప్పారు. ఘటన జరిగిన సమయంలో ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ లేరని పేర్కొన్నారు.బాలికను స్ధానికులు ఆస్పత్రిలో చేర్పించారని పోలీసులు వెల్లడించారు. నిందితుడు మన్సూరీని అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఆప్ నేత ప్రాణం తీసిన అసహజ బంధం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆప్ నేత నవీన్ సజీవ దహనం కేసులో మిస్టరీ వీడింది. బాధితుడిని తన స్నేహితుడే కిడ్నాప్ చేసి డ్రగ్స్ తీసుకునేలా ప్రేరేపించి దారుణంగా హతమార్చాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు బాధితుడితో స్వలింగ సంపర్కం చేసేవాడని ఘజియాబాద్ పోలీసులు వెల్లడించారు. బాధితుడికి ప్రధాన నిందితుడు తయ్యాబ్తో హోమో సెక్సువల్ సంబంధం ఉందని, దీన్ని కొనసాగించేందుకు తనతో ఫ్లాట్లో కలిసి ఉండాలని కోరాడని పోలీసులు చెప్పారు. తయ్యాబ్ ఇందుకు నిరాకరించడంతో గతంలో తాము కలిసిఉన్న వీడియోను బహిర్గతం చేస్తానని బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడన్నారు. ఆప్ నేతను వదిలించుకునేందుకు ఘటన జరిగిన రోజు రాత్రి లోని ప్రాంతానికి అతడిని పిలిపించిన తయ్యాబ్ నిద్ర మాత్రలు కలిపిన హల్వాను తినిపించారు.బాధితుడు మత్తులోకి జారుకున్న వెంటనే అతడి వద్ద నుంచి రూ 7.85 లక్షల నగదును దోచుకున్నారని పోలీసులు తెలిపారు. బాధితుడు నవీన్ కుమార్ దగ్ధమైన మృతదేహాన్ని ఆయన కారులో లోని-బోప్రా రోడ్డులో గుర్తించిన కుటుం సభ్యులు ఘజియాబాద్లోని సహిదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
వరంగల్ జిల్లాలో ముగ్గురు సజీవ దహనం
-
దారుణాతి దారుణం.. పోలీసులూ స్పందించలేదు
మరో దారుణాతి దారుణమైన ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఓ వివాహితపై అఘాయిత్యానికి పాల్పడ్డ దుండగులు.. తిరిగొచ్చి దాష్టీకానికి పాల్పడ్డారు. దగ్గరల్లోనే ఓ ఆలయంలోకి ఈడ్చుకెళ్లి మరీ సజీవ దహనం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... సంభల్ జిల్లాలోని రాజాపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త ఘజియాబాద్లో కూలీ పనులు చేసుకుంటుండగా.. సదరు మహిళ(35) ఇద్దరి పిల్లలతో గ్రామంలోనే ఉంటోంది. శనివారం వేకువ ఝామున ఇంట్లోకి దూసుకొచ్చిన ఐదుగురు దుండగులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ఆపై నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోగా.. ఆమె 100 హెల్ప్లైన్ సెంటర్కి ఫోన్ చేసింది. అయితే అవతలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో.. భర్త, సోదరుడిపై ఫోన్ కాల్స్ చేసింది. వాళ్లు పోలీసులను అప్రమత్తం చేసే లోపే.. తిరిగొచ్చిన నిందితులు ఆమెను దగ్గర్లోనే ఓ ఆలయంలోకి లాక్కెల్లారు. అక్కడ యజ్ఞశాలలో ఆమెపై కిరోసిన్ పోసి తగలబెట్టారు. ఆడియో క్లిప్ కీలకం... కాగా, ఘటన తర్వాత స్థానిక మహిళలను క్లూస్ టీమ్ను అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఏడీజీ ప్రేమ్ ప్రకాశ్ వారిని సుముదాయించారు. ‘100కు కాల్ చేసిన స్పందించలేదన్న విమర్శలు వచ్చాయి. దర్యాప్తుకు ఆదేశించాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. బాధితురాలు ఫోన్కాల్లో నిందితుల పేర్లు వెల్లడించింది. ఆ ఆడియో క్లిప్ ఈ కేసులో సాక్ష్యంగా కీలకం కానుంది. ఐదుగురు నిందితులను గుర్తించాం. వారి కోసం గాలింపు చేపట్టాం’ అని ప్రేమ్ ప్రకాశ్ వెల్లడించారు. అత్యాచారం నిజంకాదు: ఎస్పీ ... అయితే ఈ ఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరగలేదని, నిందితుల ఉద్దేశం వేరే ఉందని సంభల్ ఎస్పీ ఆర్ఎమ్ భరద్వాజ్ వెల్లడించారు. శనివారం ఉదయం ఓ ఛానెల్తో ఆయన మాట్లాడుతూ.. నిందితులంతా స్థానికులేనన్న ఆయన.. త్వరలో అరెస్ట్ చేసి, ప్రెస్మీట్లో అసలు వివరాలు వెల్లడిస్తామని భరద్వాజ్ తెలిపారు. -
తొలి క్షమాభిక్షకు కోవింద్ నో...!
న్యూఢిల్లీ : రాష్ట్రపతి అయిన తర్వాత మొదటి క్షమాభిక్ష పిటిషన్ను రాంనాథ్ కోవింద్ తిరస్కరించారు. ఐదుగురు చిన్నారులతో సహా ఏడుగురు కుటుంబ సభ్యులను అతికిరాతంగా సజీవదహనం చేసిన ఓ నిందితుడికి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. 2006లో బిహార్కు చెందిన విజేంద్ర మహతో, ఆయన కుటుంబ సభ్యులను జగత్రాయ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధించగా.. తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 23న దోషి జగత్రాయ్ రాష్ట్రపతి కోవింద్కు విజ్ఞప్తి చేసుకున్నాడు. అయితే ఏడుగురిని హతమార్చి, దహనం చేసిన వ్యక్తికి క్షమాభిక్ష ఇవ్వడానికి రాష్ట్రపతి అయిష్టత చూపించారు. జగత్రాయ్ అభ్యర్థనను తిరస్కరించినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
16 ఏళ్ల బాలికను రేప్ చేసి ఆపై..
-
హైదరాబాద్లో రిటైర్డ్ ఉద్యోగి సజీవ దహనం
-
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం
సాక్షి, నాగర్కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కారుకొండ గ్రామంలో శనివారం ఓ వ్యక్తి సజీవ దహమయ్యాడు. రాళ్ల లోడ్తో వెళ్తున్న టిప్పర్కు 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో టిప్పర్తో సహా డ్రైవర్ లైకేష్ విశ్వకర్మ సజీవ దహనమయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంటీని కాపాడబోయి..
సాక్షి, ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మృతుల్లో అమెరికా గ్రీన్కార్డు కలిగిన యువకుడు కూడా ఉన్నాడు. కమలా మిల్స్ కాంపౌండ్లో గురువారం అర్ధరాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో ధైర్య లలానీ(26), అతడి సోదరుడు విశ్వ(23), వీరి పిన్ని ప్రమీల కెనియా(70) మృతి చెందారు. అమెరికాలో ఉంటున్న ధైర్య.. సెలవులు గడిపేందుకు ఇటీవల ముంబైకి వచ్చాడు. గురువారం రాత్రి తన సోదరుడు, బంధువులతో కలిసి కమలా మిల్స్ కాంపౌండ్లోని ‘వన్ ఎబౌ’ హోటల్కు వెళ్లాడు. ఊహించని విధంగా మంటలు వ్యాపించడంతో వీరంతా చెల్లాచెదురయ్యారు. బంధువులంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమీల చిక్కుకుపోవడంతో ఆమెను కాపాడబోయి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ‘మంటలు వ్యాపించాయని తెలియగానే మేమంతా పరుగెత్తుకుంటూ మెయిన్ గేటు వద్దకు చేరుకున్నాం. కింది ఫ్లోర్కు వచ్చాక ప్రమీల మాతో పాటు రాలేదని గుర్తించాం. ఆమెను రక్షించేందుకు ధైర్య, విశ్వ మళ్లీ పైకి వెళ్లార’ని వారి ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు తెలిపారు. వెంటిలేషన్ అవుట్లెట్ లేకపోవడంలో ఊపిరాడక ఎక్కువ మంది చనిపోయారని పోలీసులు చెప్పారు. కనీసం 35 మందిని కాపాడామని, 21 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామన్నారు. రెస్టారెంట్ నిర్వాహకులపై ఐపీసీ 304, 337, 338 కింద ఎన్ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
పుట్టినరోజున ప్రాణాలు కోల్పోయింది
-
బర్త్డే పార్టీలోనే ప్రాణాలు కోల్పోయింది
సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో గురువారం అర్థరాత్రి సంభవించిన ఘోర అగ్నిప్రమాదం పెను విషాదం నింపింది. కమలా మిల్స్ కాంపౌండ్లోని లండన్ టాక్సీ గాస్ట్రోబార్లో జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది మహిళలతో సహా 14 మంది సజీవ దహనమయ్యారు. పుట్టినరోజు వేడుకలు జరుగుతుండగా రాత్రి 12.30 గంటల ప్రాంతంలో మంటలు వ్యాపించినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. నాలుగు అంతస్థుల్లో ఉన్న ఈ వాణిజ్య సముదాయంలో రెస్టారెంట్లు, పబ్బులు, టీవీ చానళ్ల కార్యాలయాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన హోటల్ చివరి అంతస్థుపైన రూప్టాప్లో ఉంది. ఇక్కడ మంటలు చెలరేగి మిగతా అంతస్థులకు వేగంగా వ్యాపించడంతో భయంతో జనం పరుగులు తీశారు. ప్రాణభయంతో పరుగులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగెత్తామని ప్రమాదం నుంచి బయటపడిన డాక్టర్ సులభ కేజీ ఆరోరా చెప్పారు. చాలా మంది మహిళలు ప్రాణభయంతో పురుషుల మరుగుదొడ్డిలోకి పరుగెత్తడం తాను చూశానని తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో తొక్కిసలాట జరిగిందని, రెస్టారెంట్ వెనుక డోర్ నుంచి సిబ్బంది తనను రక్షించారని ఆమె వెల్లడించారు. ఊపిరాడక చనిపోయింది తన సోదరి ప్రీతి రాజగారియా(48) ఊపిరాడక చనిపోయిందని ఆమె సోదరుడు అజయ్ అగర్వాల్ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ‘ప్రీతి తన కుమార్తె రుచీతో కలిసి డిన్నర్కు వెళ్లింది. అగ్నిప్రమాదం గురించి తెలియడంతో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా వీరిద్దరూ విడిపోయారు. రచి మెట్ల కిందకు పరుగు తీసింది. ప్రీతి వాష్రూములో ఇరుక్కుపోయి, ఊపిరాడక చనిపోయింద’ని అజయ్ తెలిపాడు. మృతుల్లో ఎక్కువ మంది ఊపిరాడకపోవడం వల్లే చనిపోయారని గుర్తించారు. ప్రమాదానికి ముందు స్నేహితురాలితో ఖుష్బు(కుడి) పుట్టినరోజున విషాదం ఖుష్బు అనే మహిళ తన 29 పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి హాజరైన పలువురు మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని ‘రాయిటర్స్’ వెల్లడించింది. పుట్టినరోజు జరుపుకున్న ఖుష్బు కూడా మృతి చెందినట్టు ఆమె తాతయ్య తెలిపారు. అద్దాల గోడలు పగులగొట్టి, లోపలికి ప్రవేశించి బాధితులను కాపాడినట్టు అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. విచారణకు ఆదేశం ఈ ఘటనపై విచారణకు బీఎంసీ మేయర్ విశ్వనాథ్ మహదేశ్వర్ ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కమలా మిల్స్పై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సామాజిక కార్యకర్త మంగేశ్ కాలాస్కర్ వెల్లడించారు. దీని నిర్మాణంలో ఎటువంటి పొరపాట్లు లేవని అధికారులు సమాధానం ఇచ్చారని తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు -
ముంబైలో భారీ అగ్ని ప్రమాదం.. 15 మంది సజీవ దహనం
సాక్షి, ముంబై : భారీ అగ్నిప్రమాదంతో దేశ ఆర్థిక రాజధాని ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గురువారం అర్థరాత్రి నగరంలోని కమలా మిల్స్ కాంపౌండ్ మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 15 మంది సజీవ దహనం అయినట్లు సమాచారం. క్షతగాత్రుల సంఖ్య సరిగ్గా తెలీనప్పటికీ వారందరిని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్(కేఈఎం) ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేయిస్తున్నారు. ఇక కాంపౌండ్లో పలు ఇళ్లు, కార్యాలయాలు, రెస్టారెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. మృతుల్లో 12 మంది మహిళలే ఉన్నారు. రాత్రి 12.27 గంటల సమయంలో ఘటన గురించి తమకు సమాచారం అందిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. హుటాహుటిన 8 శకటాలు అక్కడికి చేరుకున్నట్లు వారు తెలిపారు. ముందు కమలా ట్రేడ్ హౌస్లోని రెస్టారెంట్ 1లో తొలుత మంటలు చెలరేగి.. చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయని అధికారులు వివరించారు. కాగా, ఇదే కాంపౌండ్లో పలు మీడియా హౌస్లు కూడా ఉన్నాయి. దీంతో దీనిని ప్రత్యక్షంగా చూసిన జర్నలిస్టులు మాట్లాడుతూ రెస్టారెంట్లో చెలరేగిన మంటలు వేగంగా విస్తరించాయని, దానికి ఆనుకుని ఉన్న డిన్నర్ కమ్ పబ్లకు వ్యాపించాయని తెలిపారు. చానళ్లకు సంబంధించిన కొంత సామగ్రి కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్టు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
ఉరే సరి అని తేల్చినా..
సాక్షి, భోపాల్: మైనర్లపై అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష విధిస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినా కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా దెవాల్ గ్రామంలో ఎనిమిదవ తరగతి చదివే 15 ఏళ్ల బాలికపై ఆమె నివాసంలో ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో ఆమెకు నిప్పుంటించి పరారయ్యారు. బాధితురాలిని కాపాడిన ఇరుగుపొరుగు వారు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బుందేల్ఖండ్ మెడికల్ కాలేజ్లో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. బాధితురాలి శరీరానికి 80 శాతంపైగా కాలిన గాయాలయ్యాయని తెలిపారు. బాధితురాలిపై అదే గ్రామానికి చెందిన రాఘవేంద్ర సేన్, శుభనం యాదవ్లు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలు ఒంటరిగా ఉండటం గమనించిన నిందితులు గురువారం రాత్రి ఆమె నివాసంలోకి చొరబడి ఘాతుకానికి తెగబడ్డారని చెప్పారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, మరొకరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కారులో ఆరుగురు.. బూడిదే మిగిలింది
ఆగ్రా : ఉత్తర ప్రదేశ్లో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ హైవేపై కన్నౌజ్ ప్రాంతం వద్ద ఓ కారు ప్రమాదానికి గురికాగా అందులోని ఆరుగురు సజీవ దహనం అయ్యారు. వీరిలో ఇద్దరు మైనర్లు(2,3 ఏళ్లు) కూడా ఉండటం శోచనీయం. అర్థరాత్రి 2గం 15 ని. ప్రాంతంలో హుషేపూర్ గ్రామం వద్దకు చేరుకుంది. డివైడర్ను బలంగా ఢీకొట్టిన కారు పల్టీలు కొడుతూ చాలా దూరం వెళ్లింది. అనంతరం ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులోని వారు దహనం అయ్యారు. వారంతా బిహార్ ఛ్చాత్ వేడుకల్లో పాల్గొని తిరిగి మిథాపూర్కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు భావిస్తున్నారు. మృతుల్లో వినయ్ కుమార్, అభయ్ కుమార్లను మాత్రమే గుర్తించగలిగారు. మిగతా వారి దేహాలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యాయని తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తేల్చారు. ఇక ఘటనా స్థలానికి మొదటగా చేరుకున్న కానిస్టేబుల్ ముకుత్ అక్కడి భయానక దృశ్యాల గురించి వివరించారు. ‘‘నేను వెళ్లే సరికి ఓ చిన్నారి మృతదేహం కారు టైర్ కింద కాలుతూ కనిపించింది. కారు లోపల కూర్చున్న ముగ్గురు ప్రయాణికులు బూడిదగా మారిపోయి ఉన్నారు‘‘ అని ఆయన తెలిపారు. వినయ్ కుమార్, అభయ్ కుమార్లు సాకీత్ ప్రాంతంలో నగల షాపును నిర్వహిస్తున్నారని తేలింది. గోపాల్గంజ్లోని తమ స్నేహితుల వద్దకు వెళ్లి ఛ్చాత్ వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగినట్లు వారి తాత విక్రమా సింగ్ తెలిపారు. మిగతా వారిని గుర్తించాల్సి ఉంది. ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు సజీవ దహనం -
రోడ్డు ప్రమాదంలో యువకుడి సజీవదహనం
దొడ్డబళ్లాపురం: ముందు వెళ్తున్న బైక్ను ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న యువకుడు సజీవ దహనమైన సంఘటన కర్ణాటకలోని దేవననహళ్లిలో జరిగింది. అవతి గ్రామానికి చెందిన పరమేశ్వర్(27) గురువారం రాత్రి బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా వెనుక నుండి వచ్చిన ట్యాంకర్ వేగంగా ఢీకొంది. దీంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో చిక్కుకుని పరమేశ్వర్ సజీవదహనమయ్యాడు. విశ్వనాథపపుర పోలీసులు కేసు ననమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణం: ముస్లిం గర్భిణీ సజీవ దహనం!
బెంగళూరు: కర్ణాటకలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కారణంతో గర్భిణీ అయిన ఓ ముస్లిం మహిళను ఆమె కుటుంబసభ్యులే సజీవంగా దహనం చేశారు. ఈ అమానుష ఘటన బీజాపూర్ జిల్లాలోని గుండనకల గ్రామంలో జరిగింది. గుండనకలకు చెందిన బానూ బేగం (21) తన ఊరికి చెందిన దళిత యువకుడైన సాయబన్న శరణప్ప కొన్నూర్ (24)ను ప్రేమించింది. కొంతకాలంగా వీరి ప్రేమ గురించి గత జనవరిలో ఇద్దరి కుటుంబాలకు తెలిసింది. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. వీరి ప్రేమ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన బాను కుటుంబం ఆమెను పోలీసు స్టేషన్కు ఈడ్చుకొచ్చి సాయబన్నకు వ్యతిరేకంగా పోస్కో కేసు పెట్టాలని ఫిర్యాదు చేసింది. అయితే, సాయబన్నపై ఎలాంటి క్రిమినల్ అభియోగాలు, చరిత్ర లేకపోవడంతో పోలీసులు అతన్ని విడిచిపెట్టారు. అనంతరం సాయబన్న బానును తీసుకొని ఇంటినుంచి పారిపోయాడు. ఇద్దరూ కలిసి గోవా వెళ్లారు. ఆ తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని కర్ణాటకలోనే కొంతకాలం నివసించారు. ఈ క్రమంలో బాను గర్భవతి కావడంతో ఇరు కుటుంబాలు మారి ఉండవచ్చునన్న ఆశతో గత శనివారం (జూన్3న) ఊరికి తిరిగొచ్చారు. అయితే, తమ వైఖరిని ఏమాత్రం మార్చుకొని ఇరుకుటుంబాలు సాయబన్న-బాను దంపతులను చూడటంతోనే గొడవకు దిగారు. బాను కుటుంబం బరితెగించి సాయబన్నపై దాడికి దిగింది. అతన్ని రాళ్లతో కొట్టి తరిమింది. దీంతో అక్కడి నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడుతున్న సాయబన్న స్థానికంగా ఉన్న తాలికోట్ పోలీస్స్టేషన్ను ఆశ్రయించాడు. మరో పది నిమిషాల్లో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా.. అప్పటికే బానును ఆమె కుటుంబసభ్యులే కత్తితో పలుమార్లు పొడిచి.. ఆ తర్వాత సజీవ దహనం చేశారు. పట్టపగలే ఈ కిరాతకం జరుగుతున్నా, తన భార్యను కాపాడాలని సాయబన్న వేడుకున్నా గ్రామస్తులు ఎవరూ ముందుకురాలేదని, తమ ఇళ్లకు తలుపులు పెట్టుకొని లోపలే ఉండిపోయారని తెలుస్తోంది. ఈ ఘటనలో బాను తల్లిని, సోదరిని, సోదరుడిని, బాను అరెస్టు చేశారు. బాను మరో ఇద్దరు అక్కల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
యువతిపై సర్పంచ్, గ్రామస్తుల అమానుషం
జోద్పూర్: రాజస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది. తన ఫాంలో చెట్లు నరకడాన్ని వ్యతిరేకించిన యువతిని అమానుషంగా హత్యచేశారు. జోధ్ పూర్ గ్రామంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన లలిత (20)ను గ్రామ పెద్దలు, మరికొంతమంది గ్రామస్తులు సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు అందించిన సమాచార ప్రకారం జోధ్పూర్కు చెందిన గ్రామ సర్పంచ్ సహా కొంతమంది గ్రామస్తులు లలిత పొలంలో చెట్లను నరకడానికి ప్రయత్నించారు. దీన్ని ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్తత చెలరేగింది. రెచ్చిపోయిన వారు ఆమెపై మూకుమ్మడిగా దాడిచేశారు. అక్కడితో ఆగకుండా ఆవేశంతో విచక్షణ మరచి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం లలిత కన్నుమూసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారి సురేష్ చౌదరి తెలిపారు. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న గ్రామ సర్పంచ్ రణవీర్ సింగ్, ఇతర గ్రామస్తులను విచారిస్తున్నట్టు చెప్పారు. విచారణ అనంతరం వారిని అదుపులోకి తీసుకుంటామన్నారు. -
అందరూ చూస్తుండగా అఘాయిత్యం
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని బిస్బేన్ నగరంలో పంజాబ్ కు చెందిన బస్సు డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. అందరూ చూస్తుండగానే అతడిని సజీవ దహనం చేశాడో దుండగుడు. బిస్బేన్ సిటీ కౌన్సిల్ డ్రైవర్ గా పనిచేస్తున్న మాన్మీత్ ఆలిషెర్(29)పై దుండగుడు మండేస్వభావం ఉన్న ద్రవం పోశాడు. వెంటనే మంటలు వ్యాపించడంతో కాలిన గాయాలతో బస్సులోనే మాన్మీత్ ప్రాణాలు విడిచాడని పోలీసులు తెలిపారు. భయాందోళనకు గురైన బస్సులోని ప్రయాణికులు అత్యవసర ద్వారం గుండా పారిపోయారని వెల్లడించారు. అయితే బస్సు మొత్తానికి మంటలు అంటుకోకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. ఈ దాడికి సంబంధించి 48 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అయితే ఇది జాత్యంహకార, తీవ్రవాద దాడి కాదని పోలీసులు స్పష్టం చేశారు. మంచి గాయకుడిగా కూడా ప్రసిద్ధుడైన మాన్మీత్ ఆలిషెర్ మరణం పట్ల ప్రవాస పంజాబీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
మహిళా ఇంజనీరును కుర్చీకి కట్టేసి.. సజీవ దహనం
బిహార్లో దారుణం జరిగింది. మహిళా ఇంజనీరును కుర్చీకి కట్టేసి, సజీవదహనం చేశారు. ఈ కేసులో ఆ భవన యజమానితో పాటు ఆమె మాజీ భర్తను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సరితాదేవి (42) సీతామాడి జిల్లాలో జూనియర్ ఇంజనీర్గా పనిచేసేవారు. ఆమె తన చిన్న కొడుకు ఆర్యన్తో కలిసి ఒక్కరే ఒక అద్దె ఇంట్లో ఉండేవారు. పెద్దకొడుకు ధ్రువ్ ఆమె భర్త విజయ్ నాయక్తో పాటు ఉంటాడు. దంపతులిద్దరూ పదేళ్ల క్రితమే విడిపోయారు. విజయ్ నాయక్ అక్కడకు 65 కిలోమీటర్ల దూరంలోని సీతామాడిలో ఉంటాడు. రెండు రోజుల క్రితం సరితాదేవి తన కొడుకు ఆర్యన్ను తన పుట్టింటికి పంపింది. తర్వాత.. ఈ ఘోరం జరిగిపోయింది. ఈ దారుణానికి పాల్పడిందెవరో తెలుసుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. సరితాదేవి మాజీ భర్త విజయ్ నాయక్తో పాటు భవన యజమాని విజయ్ గుప్తాను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సీతామాడి సీనియర్ ఎస్పీ వివేక్ కుమార్ తెలిపారు. భవన యజమాని తరచు ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండేవాడని పోలీసులు చెప్పారు. ప్రాజెక్టుల అంచనాలు తయారుచేయడంలో అతడు ఆమెకు సాయపడుతుండేవాడు. సరితాదేవి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జేఈగా పనిచేస్తున్నారు. ఆమెను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందో కూడా తెలియడం లేదు. అయితే హంతకులు ఆమె మృతదేహం నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు కొన్ని రసాయనాలు కూడా చల్లారు. దాంతో ఇరుగుపొరుగువారికి కూడా అనుమానం రాలేదు. ఎప్పటిలాగే ఆ ఇంటికి వచ్చిన యజమాని విజయ్ గుప్తా.. సరితాదేవి మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదుచేశారు. -
మాజీ ప్రియురాలిని వెంటాడి పట్టుకుని..
రోమ్: తనకు దూరమైందనే కోపంతో రోమ్ యూనివర్శిటీ విద్యార్థిని ఆమె మాజీ ప్రియుడు అతికిరాతకంగా చంపాడు. తన కెరీర్లోనే ఇది అతి క్రూరమైన హత్యని ఓ విచారణాధికారి విస్తుపోయారు. ఇటలీ రాజధాని రోమ్ యూనివర్శిటీ విద్యార్థిని సారా డి పీట్రంటోనియో (22), విన్కెంజో పడానో (27) ప్రేమించుకున్నారు. కాగా కొంతకాలం తర్వాత విన్కెంజోకు సారా దూరమైంది. దీన్ని భరించలేకపోయిన విన్కెంజో ఆమెపై పగపెంచుకున్నాడు. సారా వెళ్తున్న కారును ఆపి విన్కెంజో నిప్పుపెట్టాడు. ఆమె కారులోంచి దిగి పారిపోయేందుకు ప్రయత్నించగా, విన్కెంజో ఆమెను వేటాడి పట్టుకుని సజీవదహనం చేశాడు. సారా ముఖం, ఒంటిపై ఆల్కాహాల్ పోసి, సిగరెట్ లైటర్తో నిప్పుపెట్టాడు. హత్య జరిగిన ప్రాంతంలో కెమెరాలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు విన్కెంజోపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సారాను తాను చంపలేదంటూ మొదట నిరాకరించిన విన్కెంజో.. పోలీసుల సుదీర్ఘ విచారణ అనంతరం నేరాన్ని అంగీకరించాడు. తన 25 ఏళ్ల కెరీర్లో ఇలాంటి క్రూరమైన హత్య చూడలేదని పోలీస్ అధికారి లూగి సిలిపో చెప్పారు. విన్కెంజో ఓ పథకం ప్రకారం సారాను హత్య చేశాడని తెలిపారు. సారా ప్రస్తుత ప్రియుడు ఇంటి నుంచి కారులో బయటకు వచ్చినపుడు విన్కెంజో ఆమెను ఆపాడని చెప్పారు. అతను బలవంతంగా రోడ్డు పక్కన కారును పార్క్ చేయించాడని వెల్లడించారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు చెప్పారు. విన్కెంజో తన వెంట తీసుకెళ్లిన బాటిల్లోని మద్యాన్ని కారులోపల చెల్లి నిప్పుపెట్టాడని తెలిపారు. సారా ప్రాణాలు కాపాడుకునేందుకు కారు దిగి పరిగెత్తగా, కొంతదూరం వెళ్లాక విన్కెంజో ఆమెను పట్టుకుని కిరాతకంగా చంపాడని విచారణాధికారి చెప్పారు. -
ఇద్దరు చిన్నారులు సజీవ దహనం
దేవరకొండ రూరల్ (నల్లగొండ) : నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పెండ్లిపాకల గ్రామంలో గురువారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సైదయ్య, లక్ష్మమ్మ ఇంటి వద్ద బంధువుల పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంటి ముందున్న పందిరికి కట్టిన ఊయల వద్ద బంధువుల పిల్లలు కార్తీక్(2), అశ్విని(5) ఉండగా పందిరిపై ఉన్న కరెంటు తీగలు షార్ట్సర్క్యూట్ అయ్యి మంటలు లేచాయి. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు చిన్నారులపై పడటంతో వారు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. స్థానికులు రక్షించటానికి యత్నించినా వీలుకాలేదు. సంఘటన స్థలాన్ని సీఐ గట్టుమల్లు, తహశీల్దార్ గణేష్నాయక్ పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. -
గ్యాస్ లీకై నవ వధువు సజీవదహనం
క్రోసూరు (గుంటూరు జిల్లా) : వంట గ్యాస్ లీకై సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ నవ వధువు సజీవ దహనమైన ఘటన గుంటూరు జిల్లా క్రోసూరులో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. స్థానిక మార్కెట్ యార్డు వెనుకభాగంలో ఉన్న ఎస్టీ కాలనీలో ఈ ఘోరం చోటుచేసుకుంది. రేఖమణి వెంకటకృష్ణ, ఆదెమ్మ దంపతుల కుమార్తె లావణ్య (19)ను నరసరావుపేట ప్రాంతానికి చెందిన వనపర్తి మస్తాన్కు ఇచ్చి గత నెల 29న వివాహం చేశారు. అల్లుడిని కూడా తమ ఇంటి వద్దే ఉంచుకుని వ్యాపారం చేయించాలనే యోచనలో వెంకటకృష్ణ దంపతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం నవదంపతులు ఇక్కడి వచ్చారు. ఆదివారం ఉదయం లావణ్య దంపతులు పాలప్యాకెట్ కోసం బజారుకెళ్లారు. ముందుగా లావణ్య ఇంటికి వచ్చి టీ పెట్టేందుకు వరండాలోని గ్యాస్ స్టవ్ వెలిగించింది. అప్పటికే వంటగ్యాస్ లీకై ఉండడంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని చుట్టుముట్టాయి. దీంతో భయాందోళన చెందిన ఆమె ఇంట్లోకి వెళ్లింది. క్షణాల్లో మంటలు పెద్దవి కావడంతో ఆ మంటల్లో చిక్కుకుని లావణ్య సజీవ దహనమైంది. ప్రమాదంలో పక్కనే ఉన్న మూడు పూరిళ్లు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. వ్యాపారనిమిత్తం పక్క గ్రామం వెళ్లిన లావణ్య తల్లిదండ్రులు, సోదరుడు ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనాస్థలానికి సత్తెనపల్లి సీఐ కోటేశ్వరరావు, అచ్చంపేట ఎస్ఐ రాజేశ్వరరావు చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తహశీల్దార్ జేఏ ప్రసూన బాధిత కుటుంబాలకు 20 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్, ఐదు వేలు ఆర్థిక సహాయం అందజేశారు. -
తల్లీబిడ్డలు సజీవ దహనం
వైఎస్సార్ జిల్లా : పూరిల్లు తగలబడటంతో రెండేళ్ల చిన్నారితో సహా తల్లి మంటల్లో కాలి బూడిదైంది. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి మండలం కొత్తపేట రామాపురంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కౌసల్య ఇంట్లో వంట చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో ఆమెతో పాటు చిన్నారి భాను(2) కాలి బూడిదయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ కలహాలతో ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక ప్రమాదవశాత్తు మంటలంటుకుని సజీవ దహనమైందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
ప్రేమోన్మాది ఘాతుకానికి విద్యార్థిని బలి
ప్రేమోన్మాది వేధింపులు మరో యువతి ప్రాణాలు బలిగొన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రు గ్రామానికి చెందిన ఇందుమతి (18) అనే యువతిపై విక్కీ అనే యువకుడు, అతడి సోదరుడు పెదబాబు కిరోసిన్ పోసి నిప్పంటించడంతో.. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆమె శనివారం రాత్రి మరణించింది. అంతకుముందు జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్ స్వయంగా ఆస్పత్రికి వచ్చి ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విక్కీ అనే యువకుడు, అతడి సోదరుడు పెదబాబు తమ ఇంటికి ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం వచ్చి.. తనపై కిరోసిన్ పోసి నిప్పంటించారని ఆమె చెప్పింది. ఇందుమతిని విక్కీ రెండేళ్లుగా వేధిస్తున్నాడు. దాంతో మధ్యలో కొన్నాళ్లు చదువు కూడా ఆపేసింది. తర్వాత ఏలూరు సి.ఆర్. రెడ్డి కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఇటీవల కొన్నాళ్లుగా అతడు వెంబడిస్తున్నాడు. ఈమధ్యే పదిమంది యువకులతో కలిసి వచ్చి అమ్మాయి తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. దాంతో వాళ్లు ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విక్కీ తరఫు పెద్దలను పిలిచి హెచ్చరికలు జారీ చేశారు. కేసు కూడా నమోదు చేశారు. శనివారం సాయంత్రం రెండువైపులా పెద్దలను పిలిపించి మాట్లాడాలని అనుకున్నారు. కానీ ఈలోపే మధ్యాహ్నం చాటపర్రులోని వాళ్ల ఇంటికి వెళ్లి కిరోసిన్ పోసి నిప్పంటించారు. దాంతో 90 శాతం కాలిన గాయాలైన ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆమె మరణించింది. నిందితులు ఇద్దరిపైనా నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. -
యువతి సజీవదహనం
బోడుప్పల్ (హైదరాబాద్) : ఇంట్లో పని చేసుకుంటున్న యువతి విద్యుదాఘాతానికి గురై సజీవదహనమైంది. ఈ సంఘటన నగరంలోని బోడుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హేమానగర్లో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సౌజన్య(18) ఇంట్లో పని చేసుకుంటుండగా.. ప్రమదవశాత్తు కరెంట్ షాక్కు గురైంది. ఈ ఘటనలో యువతి శరీరం పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి వద్దన్నందుకు సజీవ దహనం చేశారు
పురానీ బజార్ (బిహార్) : పెళ్లి వద్దు.. ఇంకా చదువుకుంటాను అని కోరినందుకు పదహారేళ్ల బాలికను సజీవ దహనం చేశారు. స్వయానా కన్నతండ్రి, సవతి తల్లి.. మరికొంతమంది బంధువులతో కలసి ఆ అమ్మాయిని అతి దారుణంగా చంపారు. ఈ అమానుష ఘటన బిహార్ లోని పురానీ బజార్లో చోటుచేసుకుంది. పురానీ బజార్ కు చెందిన ఖుష్బూ (16) స్థానిక పాఠశాలలో 12 వ తరగతి చదువుతుంది. ఈ అమ్మాయి చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో తండ్రి సునీల్ ఠాకూర్ రెండవ వివాహం చేసుకున్నాడు. సోదరుడు అమృత్ రాజ్ అమ్మమ్మ, తాతయ్యల దగ్గరకు వెళ్లిపోగా ఖుష్బూ మాత్రం తండ్రి మీద ప్రేమతో వారి వద్దే ఉండిపోయింది. ఇక అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి. సవతి తల్లి పూనమ్ దేవి ఇంటి పనులన్నీ ఖుష్బూ మీదే పడేసేది. చిత్రహింసలకు గురిచేసేది. అయినప్పటికీ చదువులో చురుకుగా ఉండే ఖుష్బూ ఎంతో పట్టుదలతో చదువుతుండేది. ఇటీవల ఈ అమ్మాయికి తెలియకుండా తల్లిదండ్రులు ఓ ముసలాడితో పెళ్లి నిశ్చయించారు. విషయం తెలుసుకున్న ఖుష్బూ ఆ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. తనకిప్పుడే పెళ్లి వద్దని.. తానింకా చదువుకోవాలనుకుంటున్నానని తండ్రిని, సవతి తల్లిని ప్రాధేయపడింది. పెళ్లికి నిరాకరించడంతో వారి హింస తారాస్థాయికి చేరుకుంది. బంధువులతో కలిసి బుధవారం ఈ అమ్మాయిని సజీవ దహనం చేశారు. తీవ్రగాయాలతో పాట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. ఆమె సోదరుడు అమృత్ రాజు తండ్రి, సవతి తల్లి కలిసి చేసిన అకృత్యంపై పోలీసులను ఆశ్రయించాడు. మసౌహ్రీ స్టేషన్ పోలీసు అధికారి కుమార్ అకేలా మట్లాడుతూ.. ఖుష్బూ హత్యకు కారణమైనవారిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, పోస్టుమార్టం రిపోర్టు కోసం చూస్తున్నామని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లోను వదిలేది లేదని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం నిందితులంతా పరారీలో ఉన్నారు. -
హిందువైనందుకే నా కొడుకును తగలబెట్టారు
ముంబై: తన కుమారుడు కేవలం హిందువు కావడం వల్లే పెట్రోల్ పోసి దారుణంగా కాల్చి చంపారని సావన్ రాథోడ్ తండ్రి ధర్మ ఆరోపించారు. చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే సావన్ రాథోడ్(17) జనవరి 13న కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరి, రెండు రోజుల తర్వాత మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో ప్రమేయమున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇబ్రహిం షేక్, జుబేర్ తంబోలీ, ఇమ్రాన్ తంబోలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. సావన్ కారు బ్యాటరీలను చోరీ చేయడం వల్లే అతని పై పెట్రోల్ పోసి నిప్పంటించామని వీరు చెబుతున్నారు. అయితే ఈ హత్య వెనక మత ప్రమేయమైన కోణం లేదని పోలీసు అధికారి తుషార్ దోషి తెలిపారు. హిందువు అవునా కాదా అని అడిగిమరీ నిందితులు పెట్రోల్ పోసి నిప్పంటించారని బంజారా క్రాంతి దళ్ అధ్యక్షుడు రమేష్ రాథోడ్ ఆరోపించారు. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స్ పొందుతున్న సావన్ మాట్లాడిన వీడియోను.. పోలీసులకు సమర్పించామని తెలిపారు. దీన్ని మరణ వాంగ్మూలంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మత పరమైన కోణంలో కూడా ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయాలన్నారు. పోలీసులు బాధితుడి వాంగ్మూలాన్ని రికార్డు చేయడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ఈ కేసును పోలీసులు తప్పుదోవపట్టిస్తున్నారని ఆందోళనకారులు మండిపడుతున్నారు. ఆ వీడియోలో ఏముందంటే: బాదితుడు సావన్ తన తండ్రి, అక్కడున్నవారితో మాట్లాడుతూ...ముగ్గురు నా దగ్గరుకు వచ్చి నువ్వు ఏం చేస్తూంటావ్, నీ పేరేంటీ అని అడిగారు. నా పేరు సావన్ రాథోడ్ అని చెప్పాను. నువ్వు హిందువువా ? అని ప్రశ్నించారు. అవును నేను హిందువును అని చెప్పా. తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు. కేవలం హిందువు కావడం వల్లే నాకు నిప్పంటించారు అని మరోసారి బాధితుడు స్పష్టం చేశాడు. -
ఆడుకుంటూ సజీవ దహనమయ్యారు
గుమ్మలక్ష్మీపురం (విజయనగరం) : పూరి గుడిసెలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు.. ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో సజీవ దహనమయ్యారు. ఈ హృదయ విదారక సంఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అడ్డాకుల రాకేష్(4) అనే చిన్నారి తమ పొలం వద్ద వేసిన పూరి గుడిసెలో తన మామయ్య కొడుకు రోహిత్(3)తో కలిసి ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు సమీపంలోని వరికుప్పలకు నిప్పు అంటుకుంది. దీంతో ఇద్దరు చిన్నారులు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. దీంతో చిన్నారుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. -
నడి రోడ్డుపై సజీవ దహనం
రామగుండం: కరీంనగర్ జిల్లా రామగుండం మండలం పొట్యాల, సోమనపల్లి గ్రామాల మధ్య ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో ఉన్న పెట్రోల్ క్యాన్ వల్ల మంటలు చెలరేగినట్లు సమాచారం. బెల్లంపల్లికి చెందిన మోహన్ అనే వ్యక్తి కుక్కల గూడూరులో ఉంటున్న బంధువు ఇంట్లో ఫంక్షన్కు హాజరై తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో, కారు పూర్తిగా కాలిపోయాయి. మృతుల్లో ఆటో డ్రైవర్ ఉప్పులేటి రాజేందర్, కారు డ్రైవర్ వెంకటేశ్తోపాటు అంజద్, మోహన్, మదనమ్మలు ఉన్నారు. మృతదేహాలు బాగా కాలిన స్థితిలో గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. మరో ముగ్గురికి తీవ్రగాయాలవ్వడంతో గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. -
కోరిక తీర్చలేదని..కిరోసిన్ పోసి నిప్పంటించాడు..
పరకాల: కోరిక తీర్చనందుకు ఉన్మాదిలా మారిన వ్యక్తి.. ఓ వితంతువును సజీవ దహనం చేసిన ఘటన వరంగల్ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. పరకాల సీఐ బి.మల్లయ్య కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తిక్క లలిత(35) భర్త కుమారస్వామి ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె కూలీ పనులు చేస్తూ ముగ్గురు పిల్లలను పోషిస్తోంది. అయితే రెండేళ్లుగా అదే గ్రామానికి చెందిన కొయ్యడ రాజేశ్ తో ఆమెకు వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వీరిద్దరి వ్యవహారన్ని పసిగట్టిన రాజేశ్ భార్య.. 8 నెలల క్రితం పెద్దలను ఆశ్రయించగా, మరోసారి వారిద్దరు కలవొద్దని హెచ్చరించి వదిలేశారు. అప్పటి నుంచి లలిత దూరంగా ఉంటుండగా రాజేష్ మాత్రం బలవంతం చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా ఉన్న లలిత వద్దకు వచ్చిన రాజేష్ తన కోరిక తీర్చమని బలవంతం చేశాడు. లలిత నిరాకరించడంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. 95 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న లలితను 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందింది. మృతురాలి పెద్ద కుమారుడు దిలీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణం.. బతికుండగానే నలుగురికి నిప్పు
-
దారుణం.. బతికుండగానే నలుగురికి నిప్పు
ఫరిదాబాద్: ఇదొక దిగ్భ్రాంతిని కలిగించే ఘటన. హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. ఫరిదాబాద్లో ఒక కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులకు బతికుండగానే నిప్పంటించారు. వీరిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. మంగళవారం వేకువ జామున 4గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో అవతలి వర్గం వారు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు చెప్తున్నారు. నలుగురు బాధితులను ఢిల్లీలోని సప్థార్ జంగ్ ఆస్పత్రికి చికిత్స కోసం అత్యవసరంగా తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బీడీ వెలిగించబోయి వ్యక్తి సజీవదహనం
నార్వ(మహబూబ్నగర్): కల్తీ కల్లుకు అలవాటు పడి అది లభించకపోవడంతో పిచ్చి చేష్టలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. కల్తీ కల్లు లభించక పోవడంతో మతిస్థిమితం కోల్పోయి.. గ్యాస్ తెరిచి ఉందని గమనించక బీడీ వెలిగించడానికి ప్రయత్నించిన వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా నర్వ మండలం కొకంణివారిపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి(39) గత కొన్నెళ్లుగా కల్తీ కల్లుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈరోజు కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళ్లగా.. గుడిసెలో నిద్రిస్తున్న రవీందర్ రెడ్డి బీడీ వెలింగించుకోవడానికి ప్రయత్నించాడు. అప్పటికే ఇంట్లో ఉన్న వంట గ్యాస్ ఆన్ చేసి ఉంచడంతో, ఇంట్లో గ్యాస్ వ్యాపించి ఉండటాన్ని గమనించని రవీందర్ అగ్గిపుల్ల గీయడంతో గుడిసెకు మంటలు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకున్న అతను సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నడిరోడ్డుపై కాలి బూడిదైన వ్యక్తి
చిత్తూరు : రోడ్డు మీద తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి సజీవంగా కాలిపోయిన హృదయ విదారక సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం గరిడేయసత్రం గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బళ్లారి నుంచి కృష్ణపట్నం వెళ్లే జాతీయ రహదారి పై తెల్లవారుజామున కూరగాయల లోడుతో వెళ్తున్న వ్యాన్ గరిడేయసత్రం గ్రామ సమీపంలో రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ స్తంభం నేలకొరిగింది. అయినప్పటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోకపోవడంతో స్కూటర్ పై అదే రహదారిలో బద్వేల్ నుంచి గోపవరం వెళ్తున్న కోటంరెడ్డి రమణారెడ్డి(49) విద్యుత్ షాక్తో సజీవ దహనం అయ్యాడు. స్కూటర్తో సహా వ్యక్తి కాలిపోతున్న సంఘటనను చూసిన కొందరు స్థానికులు వెంటనే ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేలోపే రమణారెడ్డి కాలి బూడిదయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంట్లో షార్ట్ సర్క్యూట్ : మహిళ సజీవ దహనం
గుంటూరు (మంగళగిరి) : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలోని ఓ ఇంట్లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గౌరమ్మ(56) అనే మహిళ సజీవ దహనమయ్యింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. ఫైరింజన్ వచ్చేసరికి ఇంట్లో ఉన్న పలు వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. -
ఇది మనుషులు చేసే పనియేనా?
గయ: బీహార్ గయకు సమీపంలోని గ్రామంలో అమానుషం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో వందలాది మంది గ్రామస్తులు చూస్తుండగానే ఆటవికమైన శిక్షను అమలు చేశారు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో 16 ఏళ్ల అమ్మాయిని, 32 ఏళ్ల వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టి సజీవ దహనం చేశారు. పెళ్లయి ముగ్గురు పిల్లలున్న వ్యక్తి తన అత్తగారింటికి తరచూ వచ్చి వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో గ్రామంలోని ఈ పదహారేళ్ల అమ్మాయితో పరిచయం ఏర్పడింది. మూడు రోజుల క్రితం ఇద్దరూ కనిపించకుండా పోయారు. దీంతో ఇద్దరినీ వెతికి పట్టుకున్న అమ్మాయి బంధువులు పంచాయితీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పంచాయతీ పెద్దలు సమావేశాన్ని ఏర్పాటుచేసి శిక్షను ఖరారు చేశారు. వారి ఆదేశాల ప్రకారమే బుధవారం ఈ శిక్షను అమలు చేశారు. బాలిక తల్లిదండ్రులు, ఇతర బంధువుల సమక్షంలోనే ఈ ఘోరం జరిగింది. గ్రామంలో ఒక్కరు కూడా ఈ ఘటనను వ్యతిరేకించలేదు, కనీసం పోలీసులకు తెలియజేయలేదు. పొరుగున ఉన్న గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో మోహరించారు.ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రులతో సహా, 20 మందిని అనుమానితులుగా గుర్తించామని, తదుపరి విచారణ అనంతరం మిగతావారిని కూడా అరెస్ట్ చేస్తామని సీనియర్ పోలీసు అధికారి షాలిన్ తెలిపారు. మనిషిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనేనా...తప్పు చేసిన మనుషులను శిక్షించడానికే కోర్టులు, చట్టాలు ఉన్నాయంటున్నారు రాష్ట్రంలోని హక్కుల సంఘాల నాయకులు. ఇంకా మధ్య యుగాల నాటి శిక్షలు అమలు కావడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
'ఆటోడ్రైవర్ల సజీవదహనం' కేసులో ముగ్గురి అరెస్టు
నగరంలో సంచలనం రేపిన 'ఆటోలో నిద్రిస్తున్న వ్యక్తుల సజీవదహనం' కేసు చిక్కుముడి వీడింది. ఏప్రిల్ 2న సికింద్రాబాద్ పరిధిలోని పాత గాంధీ ఆసుపత్రి సమీపంలో ఆటోలో నిద్రిస్తున్న నర్సింగరావు.. బాటా షోరూం వద్ద ఫుట్పాత్పై పడుకున్న ఆనంద్ అనే ఆటోడ్రైవర్పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనకు బాద్యులైన సిద్దీఖ్, అఖీర్ ఖాన్, అన్నును శుక్రవారం మహంకాళి పోలీసులు అరెస్టుచేశారు. నిదితులు ముగ్గురూ హఫీజ్బాబానగర్కు చెందినవారని, హత్యకు దారితీసిన కారణాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. సజీవదహన ఘటనల్లో తీవ్రంగా గాయపడిన నర్సింగరావు మృతి చెందగా, ఆనంద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. -
కిడ్నాప్... ఆపై సజీవ దహనం
ఓబులవారిపల్లె : వైఎస్సార్ జిల్లా ఓబులవారిపల్లె మండలంలో కొత్తగా నిర్మించిన ఎల్లాయిపల్లె రైల్వేట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశం వద్ద నాగ సుబ్బారెడ్డి(58) అనే వ్యక్తిని ఇద్దరు దుండగులు పెట్రోలు పోసి తగులబెట్టారు. పోలీసుల కథనం ప్రకారం... రైల్వేకోడూరుకు చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తిని ప్రసాద్, బాషా అనే ఇద్దరు వ్యక్తులు గురువారం కిడ్నాప్ చేశారు. రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సుబ్బారెడ్డి మొబైల్ నుంచే అతని కుమారుడు హర్షవర్థన్ రెడ్డికి ఎస్ఎంఎస్ పంపారు. తండ్రిని విడిపించుకోవడానికి హర్షవర్థన్ రెడ్డి కిడ్నాపర్లకు రూ.10 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. మరి ఏమైందో ఏమో కానీ ఆ ఇద్దరు దుండగుల నుండి ఎటువంటి సమాచారం అందకపోవడంతో హర్షవర్థన్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం ఆ ఇద్దర్ని అరెస్టు చేసి సుబ్బారెడ్డి ఆచూకీ కోసం తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకొని, అసలు విషయం బయటపెట్టారు. ఓబులవారిపల్లె మండలంలో కొత్తగా నిర్మించిన ఎల్లాయిపల్లె రైల్వేట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి సుబ్బారెడ్డిని తీసుకెళ్లి పెట్రోలు పోసి తగలపెట్టామని చెప్పారు. దుండగులు చూపించిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సజీవ దహనం కేసు: ఆ యువతి పూజిత
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన యువతి మృతి కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ పంజాగుట్ట ఐఏఎస్ కాలనీలో శుక్రవారం కలకలం రేపిన యువతి సజీవ దహనానికి సంబంధించిన వివరాలను వారు కనుగొన్నారు. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన ఆ యువతి పేరు పూజితగా తెలిపారు. విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఆమె ప్రస్తుతం సీఏ ఇంటర్ చదువుతోంది. యువతి హైదరాబాద్ బయలుదేరే ముందు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. తన అక్క రోహితకు ఉద్యోగం వచ్చిందని, తను ఇంకా ఉద్యోగం సాధించలేకపోయానని, జీవితం మీద విరక్తి చెంది చనిపోతున్నట్లుగా పూజిత సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు సమాచారం. అయితే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పూజితను అత్యాచారం చేసి ఆ తర్వాత చంపేసి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూజిత బాయ్ ఫ్రెండ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూజిత మరణవార్త విని ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు పూర్తి విషాదంలో మునిగిపోయారు. -
వృద్ధురాలి సజీవదహనం
'మా కొడుకు మరణానికి కారణం నువ్వేనం'టూ 90 ఏళ్ల వృద్ధురాలిని ఆమె పక్కింటివాళ్లు సజీవ దహనం చేశారు! మానవీయమైన ఈ ఘటన రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చోటుచేసుకుంది. 8 నెలల కిందట జరిగిన ఓ యాక్సిడెంట్లో శంకర్ అనే యువకుడు మరణించాడు. శంకర్ వాళ్ల పక్కింట్లో ఉండే రత్నా కూడా ఆ సమయంలో అతనితోనే ఉన్నాడు. కొడుకు మరణానికి కారణం రత్నాయే కారణమని భావించిన శంకర్ కుటుంబం అదునుచూసి రత్నా ఇంటిపై దాడిచేశారని, రత్నా తల్లి జగుదీని బంధించి ఇటికి నిప్పుపెట్టి సజీవదహనం చేశారని పోలీసులు తెలిపారు. నిందితుల్ని అరెస్టుచేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు, -
ఇంటికి నిప్పు.. నలుగురు సజీవదహనం!
-
కాలిన గాయాలతో ముస్తఫా మృతి
హైదరాబాద్: మెహిదీపట్నం మిలిటరీ గ్రౌండ్లో ఆడుకోడానికి వెళ్లి దుండగులు నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన ముస్తఫా (11) గురువారం ఉదయం డీఆర్డీఎల్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. దీంతో మిలిటరీ ఏరియాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, సిద్ధిఖీనగర్ బస్తీవాసులు మిలిటరీ గ్రౌండ్కు భారీగా తరలివచ్చారు. బాలుడి మృతదేహాన్ని పోలీసులు సిద్దిఖీనగర్లో అతని ఇంటికి తీసుకెళ్తున్న సమయం లో స్థానికులు మిలిటరీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, యువకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జిచేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వెస్ట్జోన్ డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలో స్థానిక పోలీసులు, పారా మిలటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా 92 శాతం కాలిన గాయాలతో ముస్తఫా మృతి చెందినట్లు ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ టకియుద్దీన్ మీడియాకు తెలిపారు. రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ముస్తఫా కుటుంబ సభ్యులను మంత్రి పద్మారావు పరామర్శించారు.మృతుని కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. జీహెచ్ఎంసీ రూ.2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుడి కుటుంబం మేయర్ మాజిద్ హుస్సేన్ ప్రాతినిధ్యం వహిస్తున్న అహ్మద్నగర్ డివిజన్లో ఉండటంతో మేయర్, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ మేరాజ్ హుస్సేన్ బాలుడి అంత్యక్రియలు దగ్గరుండి జరిపించారు. సుమోటోగా స్వీకరించిన మైనారిటీ కమిషన్ ముస్తఫా (11) మృతిపై రాష్ట్ర మైనారిటీ కమిషన్ తీవ్రంగా స్పందించింది. గురువారం ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈమేరకు కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను ఈ నెల 18 లోగా అందించాలని నగర పోలీసు కమిషనర్, వెస్ట్జోన్ డీసీపీ, హుమాయూన్ నగర్ ఇన్స్పెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల న ష్టపరిహారం, ఇంటివసతి కల్పించాలని, ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. -
చికిత్స పొందుతున్న ముస్తఫా మృతి
-
ఆ ఘటనతో మాకు సంబంధం లేదు
హైదరాబాద్ : బాలుడుపై కిరోసిన్ పోసిన ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. సంఘటన జరిగిన సమయంలో ఆర్మీ అధికారులు ఎవరూ అక్కడ లేరని తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతానికి దగ్గరలో దోబీ కుటుంబం ఉందని, ఆ సమయంలో దోబీ కూడా నివాసంలో లేడని పేర్కొన్నారు. దీనిపై సమగ్రంగా విచారణ జరుపుతున్నామని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. ఆర్మీ అధికారులపై వస్తున్న వార్తలు వదంతులేనని అన్నారు. కాగా మెహిదీపట్నం మిలటరీ క్యాంపులో షేక్ ముస్తఫా అనే బాలుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయం విదితమే. డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు ఈరోజు ఉదయం మృతి చెందాడు. ఆర్మీ జవాన్ల పనేనని స్థానికులు, బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మిలటరీ గ్యారిసన్ వద్ద ఉద్రిక్తత నెలకొనటంతో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఈ ఘటనపై రూమర్లు నమ్మవద్దని వెస్ట్జోన్ డీసీపీ సత్యనారాయణ సూచించారు. బాలుడి వాంగ్మూలం ఆధారంగా విచారణ జరుపుతున్నామన్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలను సేకరించారని తెలిపారు. మూడు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. -
చికిత్స పొందుతున్న ముస్తఫా మృతి
హైదరాబాద్ : మిలిటరీ గ్రౌండ్లో ఆడుకోడానికి వెళ్లిన బాలుడిపై దుండగులు కిరోసిన్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ముస్తఫా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందటంతో మోహదీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. మెహిదీపట్నం మిలిటరీ ప్రాంతంలోని సిద్దిఖీనగర్ బస్తీలో నివాసం ఉంటున్న షేక్ ముఖీదుద్దీన్, షాకేరాబేగంలకు నలుగురు సంతానం. వీరిలో ముస్తఫా (12) ఫస్ట్ లాన్సర్లోని మదర్సాలో చదువుకుంటున్నాడు. బక్రీద్ కు సెలవు ఉండడంతో బుధవారం తన స్నేహితులతో కలసి సమీపంలోని మిలిటరీ గ్రౌండ్లో ఆడుకోడానికి వెళ్లాడు. అక్కడ ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముస్తఫాను ఓ గదికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంటల్లో కాలుతున్న ముస్తఫా మైదానంలోకి పరుగెత్తి రక్షించండంటూ కేకలు వేశాడు. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి.. ముస్తఫాను నానల్నగర్లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు అక్కడ నుంచి సంతోష్నగర్లోని అపోలో డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. మృత్యువుతో పోరాడుతూ ముస్తఫా ఈరోజు ఉదయం చనిపోయాడు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొటంతో మిలటరీ క్యాంప్ ఎదుట పోలీసులు మోహరించారు. మరోవైపు బాలుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మిలిటరీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము విచారణ జరిపామని, అందులో తమ సిబ్బంది హస్తం లేదని తేలిందన్నారు. (ఇంగ్లీష్ కథనం కోసం) -
కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దానవాయిపేటలో కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నారాయణపురానికి చెందిన దాసరి సోమరాజు తన మారుతీ కారులో ఇంటర్నెట్ సెంటరుకు వెళ్తుండగా అదుపుతప్పి పక్కనే ఉన్న మురుగు కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ఎల్పీజీ కిట్ నుంచి గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న సోమరాజు పూర్తిగా కాలిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినా, ఫలితం లేకుండా పోయింది. దాంతో అక్కడికక్కడే మరణించాడు. -
ఖైదీని సజీవదహనం చేసిన జైలు అధికారి
బీహార్ జైల్లో ఘోరం జరిగింది. ఓ విచారణ ఖైదీపై జైలు అధికారి కిరోసిన్ పోసి నిప్పంటించడంతో అతడు పాట్నా వైద్యకళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రూపేష్ పాశ్వాన్ అనే వ్యక్తిని ఆయుధాల చట్టం కింద గత నాలుగేళ్లుగా నవాడా జైల్లో విచారణ ఖైదీగా ఉంచారు. జైలర్ లాల్ బాబూ సింగ్, అతడి సహచరులు గోపీ యాదవ్, బ్రహ్మదేవ్ యాదవ్ కలిసి తనపై కిరోసిన్ పోసి తగలబెట్టేశారని పాశ్వాన్ తన వాంగ్మూలంలో తెలిపాడు. అతడికి 80 శాతం కాలిన గాయాలు కావడంతో పాట్నా వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స సొందుతూ అతడు మరణించాడు. అయితే.. జైలు అధికారులు మాత్రం పాశ్వాన్ తనకు తానే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడని జైలు అధికారులు అంటున్నారు. -
నడిరోడ్డు పై మహిళ సజీవ దహనం
-
తెల్లవారితే పెళ్లనగా వధువు సజీవ దహనం
విశాఖపట్నం: తెల్లవారితే పెళ్లి పీటల మీద కూర్చోవలసిన ఆ యువతి ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడింది. పెళ్లి వారింట పెను విషాదం నెలకొంది. ఈ దారుణ ఘటన విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం తాటితూరులో చోటుచేసుకుంది. భీమిలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాటితూరుకు చెందిన చిల్ల ఎర్రయ్యమ్మ(18) గురువారం ఉదయం వంట చేసేందుకు పొయ్యి వెలిగిస్తుండగా నిప్పంటుకుంది. మంటలు శరీరమంతటికీ వ్యాపించడంతో ఆమె కేకలు వేసింది. కుటుంబీకులు వచ్చి మంటలు ఆర్పారు. బాధితురాలిని కేజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. మృతురాలికి శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. -
నలుగురి సజీవ దహనం
శంషాబాద్, న్యూస్లైన్: రంగారెడ్డి జిల్లా గగన్పహాడ్ పారిశ్రామికవాడలో ఆశ్రీత రబ్బరు పరిశ్రమలో గురువారం బాయిలర్ లీకై మంటలు ఎగిసిపడడంతో నలుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. కార్మికులు, స్థానికుల కథనం ప్రకారం.. తెల్లవారుజామున 5.30 గంటలకు పరిశ్రమలోని బాయిలర్ నుంచి యంత్రాల వరకు రసాయనాలను తీసుకెళ్లే థెర్మో పైపులైన్ లీకైంది. కార్మికులు విశ్రాంతి తీసుకునే గదిపై నుంచే ఈ పైపులైన్ ఉండడంతో రేకులు పగిలిపోయి గదిలో రసాయనాలు పడ్డాయి. దీంతో గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో నిద్రిస్తున్న నలుగురు బీహార్ కార్మికులు సందీప్(22) నావల్యాదవ్(40), జోగిందర్ చౌదరి (42), జైకిషన్(45) సజీవ దహనమయ్యారు. కార్మికులు అగ్నిమాపక సిబ్బందికి సవూచారమివ్వగా, ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం జైకిషన్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కంపెనీ యజమాని కైలాష్ అగర్వాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంవల్లే ప్రమాదం జరిగిందని భావించిన గగన్పహాడ్ వాసులు ఆగ్రహంతో అక్కడి ఆయిల్ పరిశ్రమలపై దాడులు చేశారు. అంతటితో ఆగకుండా పలు వాహనాలను కూడా ధ్వంసం చేశారు. ఈ దుర్ఘటనపై జిల్లా కలెక్టర్ను సీఎం కిరణ్కుమార్రెడ్డి నివేదిక కోరినట్లు తెలిసింది. -
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి మృతి
-
ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి మృతి
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన రేవతి మరణించింది. కాకినాడలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న రేవతి, సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు వదిలింది. మూడు రోజుల్లో పెళ్లి ఉందనగా ఓ యువతిపై ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడి వేధించిన నవీన్ అనే యువకుడు ఈనెల 18వ తేదీన ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. పిఠాపురానికి చెందిన రేవతి పదో తరగతి చదువుతోంది. గతంలో ఆమెను ప్రేమిస్తున్నానంటూ నవీన్ అనే పెయింటర్ వెంటపడేవాడు. ఆమె అతడిని తిరస్కరించింది. ఆ విషయం ఇంట్లో కూడా చెప్పడంతో ఇంట్లో పెద్దలు అతడిని తీవ్రంగా మందలించారు. కొంతకాలంగా దూరంగానే ఉంటున్న అతడు, బుధవారం ఉన్నట్టుండి రెచ్చిపోయాడు. ఇంట్లో అందరూ పెళ్లి పనుల మీద బయటకు వెళ్లిన సమయం చూసి ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఇంట్లోకి వచ్చాడు. ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయాడు. కాసేపటికే ఇంట్లోంచి అమ్మాయి అరుపులు, కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూసేసరికి ఆమె మంటల్లో కాలిపోతోంది. వెంటనే నీళ్లు పోసి, దుప్పట్లు కప్పి, ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ 60 శాతం వరకు ఆమెకు కాలిన గాయాలు కావడంతో వెంటనే కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.