మోదీ బొమ్మలతో డ్రస్.. రాఖీసావంత్‌పై కేసు | fresh case filed on rakhi sawant for wearing modi dress | Sakshi

మోదీ బొమ్మలతో డ్రస్.. రాఖీసావంత్‌పై కేసు

Nov 5 2016 12:33 PM | Updated on Aug 21 2018 9:36 PM

మోదీ బొమ్మలతో డ్రస్.. రాఖీసావంత్‌పై కేసు - Sakshi

మోదీ బొమ్మలతో డ్రస్.. రాఖీసావంత్‌పై కేసు

బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌పై తాజాగా మరో కేసు నమోదైంది.

బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌పై తాజాగా మరో కేసు నమోదైంది. గడిచిన ఆగస్టు నెలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బొమ్మలతో కూడిన ఒక అసభ్యకరమైన డ్రస్ ధరించినందుకు ఆమెపై ఈ కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని రాజ్సమంద్ జిల్లాలోని ఒక పోలీసు స్టేషన్‌లో ఈ మేరకు ఒక ఎఫ్ఐఆర్ దాఖలైంది. 
 
స్థానికుడొకరు రెండు రోజుల క్రితం ఈ విషయమై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, ఆమె ఆ దుస్తులు వేసుకోవడం ద్వారా ప్రధానమంత్రిని అవమానించడమే కాక, అసభ్యత కూడా ప్రదర్శించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్సమంద్ జిల్లాలోని కంక్రోలి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement