లెనోవో నుంచి కొత్త గేమింగ్ పీసీలు | Lenovo launches new range of gaming PCs in India | Sakshi
Sakshi News home page

లెనోవో నుంచి కొత్త గేమింగ్ పీసీలు

Published Tue, Sep 24 2013 2:45 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM

Lenovo launches new range of gaming PCs in India

బెంగళూరు: పర్సనల్ కంప్యూటర్లు తయారుచేసే లెనోవో కంపెనీ కొత్త రేంజ్ గేమింగ్ పీసీలను సోమవారం విడుదల చేసింది. వీటి ధరలు రూ.50,990 నుంచి రూ.1,36,500 రేంజ్‌లో ఉన్నాయని లెనోవో ఇండియా డెరైక్టర్(కన్సూమర్) శైలేంద్ర కత్యాల్ పేర్కొన్నారు. ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో తయారైన ఈ గేమింగ్ పీసీలు విండోస్ 8 ఓఎస్‌పై పనిచేస్తాయని తెలిపారు. లెనోవో ఐడియా ప్యాడ్ జడ్ 510 ధర రూ.50,990, లెనొవొ ఐడియా ప్యాడ్ వై 510పి ధర రూ.69,990, లెనోవో ఐడియా సెంటర్ హొరైజన్ 27 ధర రూ.1,36,500 అని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement