Lenovo
-
భారత్లో లెనోవో ఏఐ సర్వర్ల తయారీ
బెంగళూరు: పర్సనల్ కంప్యూటర్ల తయారీలో ఉన్న బీజింగ్ కంపెనీ లెనోవో.. వచ్చే ఏడాది నుంచి భారత్లో ఏఐ సర్వర్ల తయారీ చేపట్టనుంది. వీటిని పుదుచ్చేరి ప్లాంటులో ఉత్పత్తి చేస్తారు.ఏటా 50,000 యూనిట్ల ఎంటర్ప్రైస్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్స్, 2,400 యూనిట్ల హై ఎండ్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ (జీపీయూ) తయారు చేయనున్నట్టు లెనోవో ఇండియా ఎండీ శేలేంద్ర కటియాల్ తెలిపారు. వీటిలో 60 శాతంపైగా సరుకును ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ఎగుమతి చేస్తారు.అలాగే సంస్థకు నాల్గవ అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని బెంగళూరులో నెలకొల్పింది. భవిష్యత్తులో అన్ని ప్రధాన సర్వర్ డిజైన్, డెవలప్మెంట్స్, కొత్త సాంకేతిక కార్యక్రమాలను ఈ ల్యాబ్లో నిర్వహిస్తామని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఇటువంటి సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా సంస్థకు 18 ఉన్నాయి. -
లెనోవో ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఉద్యోగుల ల్యాప్టాప్లూ తనిఖీ
భారత ఆదాయపు పన్ను శాఖ అధికారులు చైనాకు చెందిన పర్సనల్ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవో (Lenovo) ఫ్యాక్టరీ, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని లెనోవా ఫ్యాక్టరీ, బెంగళూరులోని ఆఫీసులోనూ ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రచురించింది. సోదాల్లో భాగంగా ఐటీ శాఖ అధికారులు లెనోవో ఉద్యోగుల ల్యాప్టాప్లను సైతం తనిఖీ చేసినట్లు తెలిసింది. సోదాల సమయంలోనూ, ముగిసిన తరువాత అధికారులు లెనోవా సీనియర్ మేనేజ్మెంట్ను సంప్రదించడానికి ప్రయత్నించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. (అమెరికా నుంచి ఐఫోన్ తెప్పించుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి..) అంతకుముందు రోజు, తమిళనాడు రాష్ట్రంలోని లెనోవో కాంట్రాక్ట్ తయారీదారు ఫ్లెక్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలలోనూ ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారని రాయిటర్స్ నివేదించింది. కంపెనీ, దాని అనుబంధ సంస్థలపై పన్ను ఎగవేత విచారణలో భాగంగా ఈ సోదాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. కాగా దీనిపై లెనోవా స్పందిస్తూ ఐటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు పేర్కొంది. “బాధ్యతగల కార్పొరేట్ పౌరులుగా మేము వ్యాపారం చేసే ప్రతి అధికార పరిధిలో వర్తించే అన్ని చట్టాలు, నిబంధనలు, రిపోర్టింగ్ అవసరాలకు కచ్చితంగా కట్టుబడి ఉంటాం. అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నాం. వారికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తాం” అని లెనోవా ప్రతినిధి తెలిపారు. లెనోవో కంపెనీ భారత దేశంలో 17 శాతం మార్కెట్ వాటాతో 2022-23లో 1.9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. -
చైనా స్మార్ట్ఫోన్ కంపెనీలకు భారీ షాక్! కేంద్రం సీరియస్
GST Evasion: చైనా స్మార్ట్ఫోన్ కంపెనీలకు భారత ప్రభుత్వం భారీ షాకిచ్చింది. జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై షావోమీ, ఒప్పో, వివో,లెనోవో కంపెనీలపై విచారణ జరుగుతోందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, దర్యాప్తు ప్రారంభించామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభలో తెలిపారు. పన్ను మొత్తం/వడ్డీ/పెనాల్టీని వర్తించే విధంగా జమ చేయాలని ఆదేశించినట్టు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. షావోమి, రియల్మి, ఒప్పో, వివో, వన్ప్లస్ లాంటి చైనా స్మార్ట్ఫోన్ తయారీదారులు 2023-24 వరకు గత ఐదేళ్లలో రూ. 1,108.98 కోట్ల జీఎస్టీ, రూ. 7,966.09 కోట్ల కస్టమ్ డ్యూటీలను ఎగవేసినట్లు కేంద్రం శుక్రవారం పార్లమెంటుకు తెలిపింది. ఇది 2017-18, 2023-24 మధ్య (జూలై 1 వరకు) డేటా రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభ ఎంపీ నారాయణ్ దాస్ గుప్తా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తెలిపారు. 2019-20లో, షావెమి రూ. 653.02 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో కేవలం రూ. 46 లక్షలు మాత్రమే చెల్లించింది. కంపెనీ లోటుపై ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసిందని చంద్రశేఖర్ తెలిపారు. అదే విధంగా, 2020-21లో, ఒప్పో మొబైల్ ఇండియా రూ. 4,389 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో రూ. 450 కోట్లు మాత్రమే చెల్లించింది. (లండన్లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్) వివో ఇండియా అదే సంవత్సరంలో రూ.2,217 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసింది, అందులో కేవలం రూ.72 కోట్లు మాత్రమే చెల్లించింది. మొత్తంగా వివో ఈ రెండేళ్లలో 2,875 కోట్ల కస్టమ్స్ డ్యూటీలను ఎగవేసినట్లు ఆరోపణలు రాగా, కేవలం రూ. 117 కోట్లను రికవరీ చేసిందని మంత్రి తెలిపారు. జీఎస్టీ పరంగా కంపెనీ రూ.48.25 కోట్లు ఎగవేసిందని, ఎగవేతలో కొంత భాగం ఇంకా ప్రాసెస్లో ఉందని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు కంపెనీ నుంచి రూ.51.25 కోట్లను ప్రభుత్వం వసూలు చేసింది. ( జస్ట్ పోజింగ్...ఆనంద్ మహీంద్రా హనీమూన్ పిక్ వైరల్) భారతదేశంలో మోటరోలా బ్రాండ్ను కూడా నిర్వహిస్తున్న లెనోవా ఇంకా రికవరీలు నమోదు చేయనప్పటికీ, రూ. 42.36 కోట్ల జీఎస్టీ ఎగవేసిందన్నారు. ప్రధాన చైనీస్ మొబైల్ హ్యాండ్సెట్ బ్రాండ్లు భారతదేశంలో 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల కోట్ల టర్నోవర్ను కలిగి ఉన్నాయని, అలాగే నేరుగా 75 వేల మందికి పైగా , అమ్మకాలు ,కార్యకలాపాలలో మరో 80,000 మందికి ఉపాధి కల్పించారని మంత్రి చెప్పారు. -
సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త ట్యాబ్ ఎం9: ధర రూ.15 వేల లోపే
సాక్షి,ముంబై: లెనోవో కొత్త ట్యాబ్ను లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ ఎం9 పేరుతో భారీ మార్కెట్లో కొత్త టాబ్లెట్ను లాంచ్ చేసింది. దీని ధరను రూ. 12,999తోగా నిర్ణయించింది. మార్కెట్లో ఉన్న అత్యంత తేలికైన టి టాబ్లెట్లలో ఎమ్9 ఒకటని కంపెనీ ప్రకటించింది. LTE, Wi-Fi ఓన్లీ ఇలా రెండు వేరియంట్లలో, అలాగే ఫ్రాస్ట్ బ్లూ , స్టార్మ్ గ్రే రంగులలో లెనోవో సరికొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్ లభించనుంది. (వరల్డ్ ఫాస్టెస్ట్ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు) 9 అంగుళాల IPS LCD డిస్ప్లే , 1,340 x 800 పిక్సెల్ల స్క్రీన్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 12, డాల్బీ అట్మాస్ సపోర్ట్ , MediaTek Helio G80 ఆక్టా-కోర్ ప్రాసెసర్,గరిష్టంగా 64జీబీ స్టోరేజ్,8 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,100mAh బ్యాటరీ(10W ఛార్జింగ్ సపోర్ట్) గరిష్టంగా 13 గంటల వీడియో ప్లేబ్యాక్ బ్యాటరీ లైఫ్ ,ఫేస్-అన్లాక్ లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. డ్యూయల్-టోన్ మెటల్ ఛాసిస్ 344 గ్రాముల బరువుతో తీసుకొచ్చిన పట్టుకోవడానికి ఎం9 సౌకర్యంగా ఉంటుంది. జూన్ 1 నుండి రూ. 12,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు సంస్థ అధికారిక వెబ్సైట్తోపాటు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తోపాటు, రిలయన్స్ డిజిటల్, క్రోమా ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లలో ముందస్తు ఆర్డర్ చేసుకోవచ్చు. (మరో సంచలనం: బ్రెయిన్ చిప్, మస్క్కు గ్రీన్ సిగ్నల్) ఇలాంటి మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
త్వరలోనే మోటరోలా కొత్త వర్షన్ మడత ఫోన్లు.. ప్రకటించిన సీఈవో
మోటరోలా కొత్త వర్షన్ మడత ఫోన్లు త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఈ ఏడాదిలోనే మోటరోలా రేజర్ (Motorola Razr) ఫోల్డబుల్ కొత్త వర్షన్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు లెనోవో సీఈవో యువాన్కింగ్ యాంగ్ తెలిపారు. దశాబ్దాల క్రితం బాగా పాపులరైన మడత ఫోన్ మోడళ్లు ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో మళ్లీ ఆదరణ పొందుతున్నాయి. 2000 సంవత్సరంలో మోటరోలా రేజర్ మడత ఫోన్ బాగా పాపులర్ అయిన ఫోన్లలో ఒకటి. మోటరోలా సంస్థను గూగుల్ నుంచి 2014లో లెనోవో సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో పాల్గొన్న సందర్భంగా సీఎన్బీసీ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లెనోవో సీఈవో యువాన్కింగ్ యాంగ్ మోటరోలా రేజర్ ఫోన్ గురించి మాట్లాడారు. కొత్త వర్షన్ మడత ఫోన్ను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. రాబోయే స్మార్ట్ఫోన్ గురించిన వివరాలను ఎక్కువగా ప్రస్తావించని ఆయన ఆ ఫోన్లో అప్లికేషన్లు, ఇతర ఫీచర్లు మాత్రం అందరికీ నచ్చేలా ఉంటాయన్నారు. ఫోల్డబుల్ ఫోన్ల ధరలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో తగ్గుతాయని పేర్కొన్నారు. చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో ట్రావెల్ క్రెడిట్ కార్డ్! కాగా ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో మోటరోలా తన ‘రోలబుల్’ కాన్సెప్ట్ స్మార్ట్ఫోన్ను కూడా ప్రదర్శించింది. ఇందులో రోల్ అప్ డిస్ప్లే ఉంటుంది. అంటే ఫోన్ డిస్ప్లేను కింది నుంచి పైకి జరపవచ్చన్న మాట. చదవండి: WTW Report: పెరగనున్న జీతాలు.. ఆసియా-పసిఫిక్లో భారత్ టాప్! -
లెనోవో డ్యూయెల్ స్క్రీన్ ల్యాప్టాప్.. ధర ఎంతో తెలుసా?
భారతదేశంలో ఇప్పటివరకు ఒకే స్క్రీన్ కలిగిన ల్యాప్టాప్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు రెండు స్క్రీన్స్ కలిగిన ల్యాప్టాప్ దేశీయ మార్కెట్లో విడుదలైంది. ఈ డ్యూయెల్ స్క్రీన్ ల్యాప్టాప్ని 'లెనోవో' కంపెనీ లాంచ్ చేసింది. దీనిని కంపెనీ వెబ్సైట్లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ అవుట్లెట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. గతేడాది కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో థింక్బుక్ ప్లస్ జెన్ 3 లాంచ్ చేసిన లెనోవో ఎట్టకేలకు ఇప్పుడు భారతీయ విఫణిలో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ హై-ఎండ్ ల్యాప్టాప్ ధర రూ. 1,94,990. కంపెనీ లాంచ్ చేసిన ఈ ల్యాప్టాప్ 21:10 అల్ట్రా-వైడ్ రేషియోతో 17.3 ఇంచెస్ డిస్ప్లే కలిగిన మొదటి ల్యాప్టాప్. థింక్బుక్ ప్లస్ జెన్ 3 ల్యాప్టాప్ 8 ఇంచెస్ సెకండరీ టచ్-ఎనేబుల్డ్ డిస్ప్లే కూడా పొందుతుంది. ఇది బండిల్ చేయబడిన డిజిటల్ పెన్తో లభిస్తుంది. ఇది ల్యాప్టాప్లో పొందుపరిచిన టాబ్లెట్ మాదిరిగా కనిపిస్తుంది. డ్యూయెల్ స్క్రీన్ కలిగిన ఈ ల్యాప్టాప్ బరువు 2 కేజీలు. లెనోవో థింక్ బుక్ ప్లస్ జెన్ 3 ల్యాప్టాప్ 12వ తరం ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్తో అమర్చబడింది. ఇది ఇంటిగ్రేటెడ్ ఐరిస్ గ్రాఫిక్స్ ఆన్బోర్డ్తో 16జిబి ర్యామ్ కలిగి, 1టిబి ఎస్ఎస్డి స్టోరేజీ కెపాసిటీ పొందుతుంది. వీటిని 32జిబి, 2టిబి వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కొత్త లెనోవో థింక్ బుక్ ప్లస్ జెన్ 3 ల్యాప్టాప్ యుఎస్బి-సి థండర్ బోల్ట్ 4 పోర్ట్, యుఎస్బి-సి పోర్ట్, యుఎస్బి-ఏ పోర్ట్, హెచ్డిఎమ్ఐ పోర్ట్, 3.5 మిమీ జాక్, వైఫై 6ఈ, బ్లూటూత్ వెర్షన్ 5.2 కనెక్టివిటీ వంటి ఆప్షన్లతో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 11 గంటల వరకు బ్యాటరీ ఉంటుందని లెనోవా పేర్కొంది. -
గాడ్జెట్ లవర్స్కు గుడ్ న్యూస్, లెనోవో అద్బుతమైన 5జీ ట్యాబ్ వచ్చేసింది!
సాక్షి,ముంబై: గాడ్జెట్ ప్రియులకు శుభవార్త. గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ లెనోవో 11 అంగుళాల టచ్ స్క్రీన్తో తన తొలి ప్రీమియం 5జీ ఆండ్రాయిడ్ టాబ్లెట్ను విడుదల చేసింది. పీ 11 అనే 5జీ ట్యాబ్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ధర, లభ్యత 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999గా కంపెనీ నిర్ణయించింది. లెనోవో అధికారిక వెబ్సైట్తోపాటు, అమెజాన్లో అందుబాటులో ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది మూడు గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 12 గంటల నాన్స్టాప్గా వీడియో స్ట్రీమింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది. లెనోవో ట్యాబ్ పీ11 5జీ స్పెసిఫికేషన్స్ క్వాల్కమ్ స్నాప్డడ్రాగన్ 750జీ ఎస్ఓసీ ఆడ్రేనో 619 జీపీయూ 11 అంగుళాల 2కే ఐపీఎస్ టచ్స్క్రీన్ 7700ఎంఏహెచ్ బ్యాటరీ డివైజ్ స్లాట్ ద్వారా 5జీ సిమ్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా 5G సేవలను యాక్సెస్ చేయవచ్చు. ఇంకా డస్ట్- వాటర్ రెసిస్టెన్స్ పీ11 5జీ ట్యాబ్లో 8ఎంపీ ఫ్రెంట్ ఫేసింగ్ కెమెరాతో పాటు 12ఎంపీ రేర్ కెమెరా కూడా ఉంది. 4 జేబీఎల్ స్పీకర్లను జోడించింది. -
ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్
సాక్షి, ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ల్యాప్టాప్లపై భారీ ఆఫర్ ప్రకటించింది. జూన్ 11నుంచి మొదలైన ఈ సేల్ 17వ తేదీవరకు కొనసాగనుంది. తాజాగా ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ 2022 సేల్లో ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ వినియోగదారుల కోసం డీల్లు, డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తోంది. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్లో భాగంగా ల్యాప్టాప్లు, కంప్యూటర్లతో సహా ఎలక్ట్రానిక్స్పై డిస్కౌంట్స్ ప్రకటించింది. ప్రధానంగా లెనోవా, ఆసుస్, హెచ్పీ, షావోమీ, ఎంఎస్ఐ ఏసర్ లాంటి ప్రముఖ బ్రాండ్ల ల్యాప్టాప్స్ తగ్గింపు ధరలలో అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై 10 శాతం తక్షణ తగ్గింపు. అలాగే పేటీఎం Paytm వాలెట్ , యూపీఐ లావాదేవీలపై 10 శాతం క్యాష్బ్యాక్ను కూడా అందిస్తోంది. వినియోగదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ను కూడా పొందవచ్చు. ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆసుస్ వివో బుక్ కే15 ఓఎల్ఈడీ ఫ్లిప్కార్ట్లో ప్రస్తుతం రూ. 52,990కే లభ్యం. ఎంఆర్పీ ధర రూ.78,990. అంటే సుమారు 32 శాతం తగ్గింపు. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై 10 శాతం తగ్గింపు, రూ. 18,100 దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ లెనోవా థింక్బుక్ 13ఎస్ ఫ్లిప్కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్లో భారీ తగ్గింపు లభిస్తున్న వాటిల్లో ఇది కూడా ఒకటి. 51 శాతం డిస్కౌంట్తో లెనోవా థింక్బుక్ 13ఎస్ ను కేవలం 54,990 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. దీనికి ఎంఆర్పీ ధర రూ. 1,12,608. దీనికి 10 శాతం తగ్గింపు, ఎక్స్చేంజ్ ఆఫర్ అదనం. రెడ్మీబుక్ ప్రో ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో 28శాతం డిస్కౌంట్తో రూ. 42,990 ధరకే లభిస్తోంది రెడ్మీబుక్ ప్రో. దీని ఎంఆర్పీ ధర రూ. 59,990. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఎంఎస్ఐ మోడ్రన్ 14 ఈ ల్యాప్టాప్ను రూ. 43,990 అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై 10 శాతం తగ్గింపును 18,100 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభ్యం. -
వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం జాబ్రా..లెనొవొ జట్టు!
హైదరాబాద్: వేగవంతమైన వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్ అందించే దిశగా జాబ్రా, లెనొవొ జట్టు కట్టాయి. ఇందులో జాబ్రా రూపొందించిన 180 డిగ్రీల కోణంలోని పనోరమిక్ 4కే ప్లగ్ అండ్ ప్లే వీడియో సొల్యూషన్ పానాక్యాస్ట్50, లెనొవొకి చెందిన థింక్స్మార్ట్హబ్ భాగంగా ఉంటాయి. 10 అంగుళాల థింక్స్మార్ట్ హబ్లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ అప్లికేషన్ ప్రీ–లోడెడ్గా ఉంటుంది. సమావేశాల నిర్వహణను సులభతరం చేసేందుకు ఈ సొల్యూషన్ తోడ్పడగలదని ఇరు సంస్థలు తెలిపాయి. -
అదిరిపోయే ఫీచర్లతో!! యాపిల్ ఫోల్డబుల్ మాక్ బుక్, ఐపాడ్..విడుదల ఎప్పుడంటే?!
వరల్డ్ వైడ్ గా ఉన్న టెక్ ప్రియుల్ని అట్రాక్ట్ చేసేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కొత్త కొత్త ప్రొడక్ట్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. అయితే తాజాగా ఈ టెక్ జెయింట్ 20 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే తో మ్యాక్ బుక్, ఐప్యాడ్లను టెక్ లవర్స్కు పరిచయం చేయనున్నట్లు పలు రిపోర్ట్లు వెలుగులోకి వచ్చాయి. బ్లూమ్ బెర్గ్ కథనం ప్రకారం..2026 నాటికి ఫోల్డబుల్ డిస్ప్లేతో ప్రొడక్ట్లను మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత రెండేళ్లుగా యాపిల్ డ్యూయల్ స్క్రీన్, ఫోల్డబుల్ మ్యాక్బుక్/ఐప్యాడ్ హైబ్రిడ్ను తయారు చేయాలని భావిస్తుందని బ్లూమ్ బెర్గ్ ప్రతినిధి గుర్మాన్ రిపోర్ట్లో పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని డిస్ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ (డీఎస్సీసీ) విశ్లేషకుడు రాస్ యంగ్ నిర్ధారించారు. యాపిల్ కంటే ముందే లెనోవో యాపిల్ ప్రస్తుతం వర్క్ చేస్తున్న ఫోల్డబుల్ ప్రొడక్ట్లను లెనోవో గతంలో విడుదల చేసింది. Lenovo ThinkPad X1 ఫోల్డ్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పర్సనల్ కంప్యూటర్ కేవలం టాబ్లెట్/ మానిటర్గా పనిచేయడమే కాకుండా ఫోల్డ్ చేసి ఉన్న సగం స్క్రీన్ కీబోర్డ్లా పనిచేస్తుంది. అయితే ఈ తరహా ప్రొడక్ట్లు చాలా కాస్ట్లీగా ఉన్నాయని లెనోవో విడుదల చేసిన ఈ ఫోల్డబుల్ ప్రొడక్ట్ Lenovo ThinkPad X1 ధర మనదేశంలో రూ.2,43,198గా ఉంది. యాపిల్ ఫోల్డబుల్ ప్రొడక్ట్ కూడా ఇదే కాస్ట్లో ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
గేమింగ్ ప్రియులకు అమెజాన్ శుభవార్త.. ల్యాప్టాప్స్ మీద అదిరిపోయే డిస్కౌంట్..!
పముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ గేమింగ్ ప్రియులకు మంచి శుభవార్త తెలిపింది. గేమింగ్ ఔత్సాహికుల కోసం గేమింగ్ గాడ్జెట్లపై అనేక డీల్లు, ఆఫర్లను అందించడానికి అమెజాన్ ఈరోజు 'గ్రాండ్ గేమింగ్ డేస్ సేల్ని ప్రకటించింది. అమెజాన్ ఈ 'గ్రాండ్ గేమింగ్ డేస్' సేల్ని ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు నిర్వహిస్తుంది. Lenovo, Acer, Asus, LG, HP, Sony, Dell, Corsair, Cosmic byte, JBL వంటి మొదలైన ప్రముఖ బ్రాండ్ కంపెనీలు గేమింగ్ ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు & మానిటర్లు, అధునాతన హెడ్ఫోన్లు, గేమింగ్ కన్సోల్లు, గ్రాఫిక్ కార్డ్లపై మంచి డీల్లను అందిస్తుంది. వినియోగదారులు గేమింగ్ ల్యాప్టాప్లు, గేమింగ్ కన్సోల్లు, గ్రాఫిక్స్ కార్డ్లు, మానిటర్లు వంటి వాటిపై గరిష్టంగా 50 శాతం తగ్గింపును పొందవచ్చు. Acer Nitro 5 గేమింగ్ ల్యాప్టాప్: Intel Core i5 11th gen ప్రాసెసర్తో పనిచేసే Acer Nitro 5 గేమింగ్ ల్యాప్టాప్లో శక్తివంతమైన 8జీబీ DDR4SD RAM, 512GB SSD, Nvidia GeForce GTX 1650 గ్రాఫిక్ కార్డ్ ఉంటాయి. ఈ ల్యాప్టాప్ మల్టీ టాస్కింగ్ కి సపోర్ట్ చేస్తుంది. దీని డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 144 Hzగా ఉంది ఈ గేమింగ్ ల్యాప్టాప్ ₹62,490కి అందుబాటులో ఉంది. HP Victus FHD గేమింగ్ ల్యాప్టాప్: HP Victus గేమింగ్ ల్యాప్టాప్ ఇంటెల్ కోర్ R7-5800H ప్రాసెసర్, Nvidia RTX 3050 4GB DDR6 డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ సహాయంతో పనిచేస్తుంది. ఆఫర్లో భాగంగా ఈ గేమింగ్ బీస్ట్ రూ.20,000 తక్కువతో ₹83,990కి లభిస్తుంది. ఇలా వినియోగదారులు గేమింగ్ ల్యాప్టాప్లు, గేమింగ్ కన్సోల్లు, గ్రాఫిక్స్ కార్డ్లు, మానిటర్లు వంటి వాటిపై భారీగా తగ్గింపును పొందవచ్చు. (చదవండి: హైదరాబాదీలకు శుభవార్త! నగరంలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు) -
బహుశా..! ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ స్మార్ట్ఫోన్ ఇదేనేమో..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం లెనోవో త్వరలోనే భారీ ర్యామ్ స్టోరేజ్తో పవర్ఫుల్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లెనోవో Legion Y90 గేమింగ్ స్మార్ట్ఫోన్ను రిలీజ్ చేయనుంది. ఇప్పటివరకు వచ్చినా స్మార్ట్ఫోన్స్లో లెనోవో Legion Y90 ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ గేమింగ్ స్మార్ట్ఫోన్గా నిలిచే అవకాశంలేకపోలేదని స్మార్ట్ఫోన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పవర్ఫుల్ ర్యామ్..ఏకంగా 22జీబీ..! లెనోవో Legion Y90 స్మార్ట్ఫోన్ క్వాలకం స్నాప్డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్తో రానుంది. ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ విబోలో వైరల్గా మారాయి. వచ్చే నెల ఫిబ్రవరిలో లెనోవో Legion Y90 స్మార్ట్ఫోన్ చైనాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్ 22GB RAMతో రానుంది. ఈ ర్యామ్ 18GB ఫిజికల్ ర్యామ్తో పాటు 4GB వర్చువల్ ర్యామ్ను కలిగి ఉండనుంది. 512GB +128GB రెండు విభిన్న ఇంటర్నల్ స్టోరేజ్తో మొత్తంగా 640 జీబీతో లెనోవో లీజియన్ Y90 రానుంది. Lenovo Legion Y90 స్పెసిఫికేషన్(అంచనా) 6.92-అంగుళాల E4 శాంసంగ్ AMOLED డిస్ప్లే క్వాలకం స్నాప్డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ 22 జీబీ ర్యామ్+ 640 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 64ఎంపీ+16ఎంపీ రియర్ కెమెరా 44-ఎంపీ సెల్ఫీ కెమెరా ఫ్రాస్ట్ బ్లేడ్ 3.0 డ్యూయల్ ఫ్యాన్స్ ఫర్ కూలింగ్ 68W ఫాస్ట్ ఛార్జింగ్ 5,600mAh బ్యాటరీ చదవండి: షార్ట్ఫిల్మ్ మేకర్లకు నెట్ఫ్లిక్స్ అదిరిపోయే గుడ్న్యూస్..! -
భారత్లో అత్యధికంగా అమ్ముడైన ల్యాప్టాప్స్ ఏవంటే..!
కరోనా రాకతో స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్ కంపెనీలకు కాసుల వర్షం కురిసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులతో పలు ల్యాప్ట్యాప్ కంపెనీలు గణనీయమైన అమ్మకాలను చూశాయి. దేశవ్యాప్తంగా జూలై నుంచి సెప్టెంబర్(క్యూ 3) త్రైమాసికంలో పర్సనల్ కంప్యూటర్ షిప్మెంట్లు బలమైన వృద్ధిని సాధించాయి. మూడు నెలల్లో సుమారు 4.5 మిలియన్ల యూనిట్లను పలు ల్యాప్టాప్ కంపెనీలు షిప్పింగ్ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 30 శాతం అధికంగా వృద్ధిని సాధించాయి. ►ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదిక ప్రకారం... ఈ ఏడాది క్యూ3లో భారత్లో ఎక్కువగా అమ్ముడైన ల్యాప్టాప్లో హెచ్పీ 28.5 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్లో దాదాపు 1.3 మిలియన్ల యూనిట్ల కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. హెచ్పీ సుమారు 31.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. ►డెల్ టెక్నాలజీస్ రెండో స్థానంలో నిలిచింది. పర్సనల్ కంప్యూటర్ కేటగిరీలో క్యూ3లో 23.8 శాతం వాటాను డెల్ సొంతం చేసుకుంది.లెనోవోను అధిగమించి 45 శాతం వృద్దిను డెల్ సాధించింది. ►2021 క్యూ3లో లెనోవో మొత్తంగా 18.6 శాతం వాటాతో మూడవ స్థానాన్ని కొనసాగించింది. గత సంవత్సరంతో పోలిస్తే లెనోవో ల్యాప్టాప్స్ షిప్మెంట్లు 11.5 శాతం వృద్ధి చెందాయి. ►ఏసర్ 8.6 శాతం మార్కెట్ వాటాతో నాలుగో స్థానంలో నిలవగా....గత సంవత్సరం ఎగుమతులలో పోలిస్తే 16.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో దాదాపు 3.8 లక్షల యూనిట్లకు చేరుకుంది. ►మరో వైపు ఆసుస్ ఈ ఏడాది క్యూ3లో 8.5 శాతం మార్కెట్ వాటాతో ఐదవ స్థానంలో ఉండగా... భారత్లో మొదటిసారిగా 3 లక్షల పర్సనల్ కంప్యూటర్లను షిప్పింగ్ చేసింది. ►యాపిల్ లాంట్ దిగ్గజ కంపెనీ కూడా ఈ ఏడాది క్యూ3లో సుమారు 12 శాతం మేర వాటాను దక్కించుకున్నాయి. ►సరఫరా, లాజిస్టికల్ సవాళ్లు పలు కంపెనీలకు వేధిస్తున్నప్పటికీ ఆయా కంపెనీలు ఈ త్రైమాసికంలో గణనీయంగానే వృద్ధిని సాధించాయి. పర్సనల్ కంప్యూటర్స్లో నోట్బుక్ ల్యాప్టాప్ సుమారు 80 శాతం మేర కొనుగోలు జరిగాయి. డెస్క్టాప్ కంప్యూటర్లు 16.5 శాతంగా నిలిచాయి. -
లెనోవో నుంచి సరికొత్త ట్యాబ్..! భారీ తగ్గింపుతో లాంచ్..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం లెనోవో భారత మార్కెట్లలోకి సరికొత్త ట్యాబ్ను లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ కె10మోడల్ను సోమవారం రోజున కంపెనీ విడుదల చేయగా...ఈ ట్యాబ్కు 7500ఎమ్ఎహెచ్ బ్యాటరీని అమర్చారు. 3జీబీ, 4జీబీ ర్యామ్ వేరియంట్లతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. లెనోవో లాంచ్ చేసిన ట్యాబ్ కే 10 ధర కంపెనీ వెబ్సైట్ లో రూ. 25000గా ఉండగా...ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో అతి తక్కువ ధరకే అందించనున్నట్లు తెలుస్తోంది. 4జీబీ+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999, కాగా 3జీబీ+32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999 గా ఉంది. ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 11 వోఎస్ను సపోర్ట్ చేయనుంది. అంతేకాకుండా రానున్న ఆండ్రాయిడ్ 12 వోఎస్కు అప్గ్రేడ్ చేసుకోవచ్చునని లెనోవో పేర్కొంది. చదవండి: జియో ఫోన్ సేల్స్ కోసం అదిరిపోయే బిజినెస్ మోడల్ లెనోవో ట్యాబ్ కే10 ఫీచర్స్ ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ 10.3-అంగుళాల ఫుల్-హెచ్డీ (1,920x1,200 పిక్సెల్స్) టీడీడీఐ డిస్ప్లే ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 22టీ ప్రాసెసర్ లెనోవో యాక్టివ్ పెన్ సపోర్ట్ పవర్వీఆర్ జీఈ 8320 గ్రాఫిక్స్ ప్రసెసింగ్ యూనిట్ 4 జిబి ఎల్పిడిడిఆర్ 4జీబీ+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 8ఎమ్పీ రియర్ కెమెరా 5ఎమ్పీ ఫ్రంట్ కెమెరా డాల్బీ అట్మోస్తో డ్యూయల్ స్పీకర్ USB టైప్-C పోర్ట్ ఫేస్ అన్లాక్ ఫీచర్ 10W ఛార్జింగ్ సపోర్ట్ 7,500mAh బ్యాటరీ చదవండి: వారెవ్వా జియో..! అదిరిపోయే ఫీచర్లతో పాటు మరో సూపర్ అప్డేట్..! -
తిరుపతిలో లెనోవో ట్యాబ్లెట్స్ తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు టెక్నాలజీ కంపెనీ లెనోవో తెలిపింది. కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ నేపథ్యంలో పర్సనల్ కంప్యూటర్లు, నోట్బుక్స్, స్మార్ట్ఫోన్స్ ఉత్పత్తి సామర్థ్యం అధికం చేసినట్టు లెనోవో ఇండియా ఎండీ శైలేంద్ర కత్యాల్ వివరించారు. ‘వింగ్టెక్ టెక్నాలజీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వద్ద ట్యాబ్లెట్ పీసీల తయారీని ప్రారంభించాం. సాధారణ కస్టమర్లు, విద్యార్థులతోపాటు రిటైల్, తయారీ, ఆరోగ్య సేవల రంగానికి అవసరమైన ట్యాబ్లెట్లను ఇక్కడ రూపొందిస్తున్నాం. పుదుచ్చేరిలోని పీసీల తయారీ ప్లాంటులో మూడవ లైన్ ఏర్పాటు చేశాం. డిక్సన్ టెక్నాలజీస్ సహకారంతో ఉత్తరప్రదేశ్లోని నోయిడా ప్లాంటులో మోటరోలా బ్రాండ్ స్మార్ట్ఫోన్లను తయారు చేస్తున్నాం. భారత్తోసహా పలు దేశాల్లోని 30కిపైగా ప్లాంట్లలో ఉత్పత్తి అయిన ప్రొడక్ట్స్ను కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 180 మార్కెట్లలో విక్రయిస్తోంది’ అని తెలిపారు. -
ప్రపంచంలో తొలి 20 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ మొబైల్
ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక ర్యామ్ గల స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన కంపెనీలు అసుస్, లెనోవో. ఈ రెండు కంపెనీలు మొబైల్ లో అత్యధికంగా 18 జీబీ ర్యామ్ ని తీసుకొచ్చాయి. ఇప్పుడు అంతకు మించి ర్యామ్ తో జడ్టీఈ కంపెనీ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో 20జీబీ ర్యామ్ తీసుకొస్తున్నట్లు సమాచారం. చైనా కంపెనీ జడ్టీఈ దీని గురుంచి ఎటువంటి అధికారిక సమాచారం బయటకి వెల్లడించలేదు. ఆ సంస్థలో పనిచేసే ఎగ్జిక్యూటివ్ లలో ఒకరు ఆన్ లైన్ లో దీని గురుంచి లీక్ చేశారు. 20జీబీ ర్యామ్ ఫోన్ తీసుకురావడం ద్వారా జడ్టీఈ కంపెనీ తన ప్రత్యర్థి కంపెనీలకు దక్షిణాసియా మార్కెట్లో పోటీ ఇవ్వాలని చూస్తుంది. ఈ సంవత్సరం చివరి వరకు అండర్-డిస్ ప్లే సెల్ఫీ కెమెరా ఫోన్లను తీసుకొని రావాలని కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది. జడ్టీఈ డైరెక్టర్లలో ఒకరైన లూ క్వియాన్ హావో వీబోలో కంపెనీ 20జీబీ ర్యామ్ ఫోన్ ను టీజ్ చేశారు. వచ్చే ఏడాది 1 టీబీ స్టోరేజీతో ఫోన్లు తీసుకొనిరావచ్చు అని ఎగ్జిక్యూటివ్ సూచించారు. ఖచ్చితమైన లాంఛ్ వివరాలు లేనప్పటికి భవిష్యత్తులో 20జీబీ ర్యామ్ ఫోన్ ను తీసుకురావచ్చని తెలుస్తుంది. అలాగే, అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరా కోసం పనిచేస్తున్న పెద్ద కంపెనీల్లో జడ్టీఈ ఒకటి. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల -
ల్యాప్టాప్ కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి!
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విద్యార్థులు స్కూల్, కాలేజీ వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం క్లాస్ లు అన్నీ ఇంట్లో నుంచే ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రస్తుతం డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్దులకు ల్యాప్టాప్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ మీరు కొత్తగా ల్యాప్టాప్ కొనుగోలు చేయాలని చూస్తుంటే, కొనే ముందు ఒకసారి ఈ విషయాలను గుర్తుంచుకోండి. బడ్జెట్ రూ.50,000 లోపు ఉండాలి కేవలం స్కూల్ లేదా కాలేజీ విద్యార్దుల కోసం విండోస్ ల్యాప్టాప్ తీసుకోవాలని అనుకుంటే దానిపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. హెచ్ పీ, డెల్, ఏసర్, ఆసుస్ వంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు రూ.30,000-రూ.50,000 ధరలో బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్టాప్ లు తీసుకొస్తున్నాయి. ఫుల్హెచ్డీ డిస్ప్లే సరిపోతుంది ల్యాప్టాప్ అధిక రిజల్యూషన్ డిస్ ప్లే ప్యానెల్ వల్ల భారీగా ధర పెరుగుతుంది కనుక అలాంటి డిస్ ప్లే గల ల్యాప్టాప్ అవసరం లేదు. ఫుల్ హెచ్ డీ(1920 8 1080 పీక్సెల్స్) డిస్ ప్లే గల ల్యాప్టాప్ తీసుకున్న సరిపోతుంది. ఇంకా తక్కువ ధరకు ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకుంటే 1366 * 768 పీక్సెల్స్ ల్యాపీ తీసుకోవచ్చు. ప్రాసెసర్ ముఖ్యమే ఇంటెల్ కోర్ ఐ3 వంటి ల్యాప్టాప్ లు ఇంకా మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ మరికొన్ని సంవత్సరాల పాటు మీరు వాడుతారు కాబట్టి కోర్ ఐ5 ప్రాసెసర్ గల ల్యాప్టాప్ తీసుకుంటే మంచిది. ర్యామ్ ఎంత అవసరం మీ ల్యాప్టాప్ లో కనీసం 8జీబీ ర్యామ్ ఉండేలా చూసుకోండి. ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలకు మీకు ఇది మంచిగా సరిపోతుంది. 4 జీబీ ర్యామ్ మాత్రం తీసుకోకండి. హార్డ్ డ్రైవ్ ఎంత ఉండాలి మీ అవసరాల కోసం 512జీబీ హెచ్ డీడీ లేదా 256జీబీ ఎస్ఎస్ డీ గల ల్యాప్టాప్ సరిపోతుంది. మీ దగ్గర కనుక కొంచెం ఎక్కువ డబ్బులు ఉంటే 512జీబీ ఎస్ఎస్ డీ గల ల్యాప్టాప్ తీసుకోండి. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ఓఎస్ మీ ల్యాప్టాప్ లో ఒరిజినల్ విండోస్ 10 ఓఎస్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు చాలా కంపెనీ ఉచితంగా విండోస్ 10 ఓఎస్ ను అందిస్తున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడం మంచిది. దీని వల్ల మీరు సైబర్ బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే, మైక్రోసాఫ్ట్ ఆఫీసు 365 ఉంటే మంచిది. చదవండి: సైబర్ పవర్లో ఇజ్రాయిల్ కంటే వెనుకనే భారత్! -
భారీ కెమెరాతో : మోటరోలా మరో అద్భుత స్మార్ట్ఫోన్
సాక్షి,వెబ్డెస్క్: చైనా టెక్ దిగ్గజం లెనోవాకు చెందిన మోటరోలా భారీ కెమెరాతో మరో స్మార్ట్ఫోన్ను భారత్లో విడుదల చేయనుంది. ఇప్పటికే 108 ఎంపీ బిగ్ కెమెరా ప్రధాన ఫీచర్గా ‘మోటోజీ 60’ ను లాంచ్ చేసిన సంస్థ తాజాగా మరో డివైస్ను ఆవిష్కరించనుంది. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఏ52కి పోటీగా మిడ్ రేంజ్లో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మోటరోలా మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్లు ఒకటి అంతకంటే ఎక్కువ ఫోన్లను మార్కెట్లోకి తేవాలని లెనోవా భావిస్తోంది. టెక్నిక్ సంస్థ న్యూస్ ప్రకారం.. మోటరోలా ఎడ్జ్ బెర్లిన్, మోటరోలా ఎడ్జ్ బెర్లిన్ ఎన్ఎ, మోటరోలా ఎడ్జ్ క్యోటో, మోటరోలా ఎడ్జ్ పిస్టార్ ఆండ్రాయిడ్ వెర్షన్లలో లాంచ్ కానున్నాయి. గత ఏడాది ఏప్రిల్లో లాంచ్ చేసిన మోటో ఎడ్జ్, మోటో ఎడ్జ్ + ఫోన్ల తరహాలో ఈ స్మార్ట్ఫోన్లు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. మోటో ఎడ్జ్ బెర్లిన్: స్పెసిఫికేషన్స్ టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం యూరోపియన్ మోడల్, నార్త్-అమెరికన్ మోడల్తో మోటో ఎడ్జ్ బెర్లిన్ స్మార్ట్ ఫోన్ విడుదల కానుంది. ఈ స్మార్ట్ఫోన్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778 g soc తో పాటు 6 జీబీ ర్యామ్,128 జీబీ స్టోరేజ్, 8 జీబీ, 265 జీబీ వేరియంట్లతో రావచ్చు. మోటో ఎడ్జ్ బెర్లిన్, ఎడ్జ్ బెర్లిన్ ఎన్ఎలలో ట్రిపుల్ రియర్ కెమెరా, ప్రధానంగా 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. యూరోపియన్ వేరియంట్లో 16 మెగాపిక్సెల్, సెకండరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్, మూడు కెమెరా సెన్సార్లు ఉంటాయని అంచనా. నార్త్ అమెరికన్ మోడల్లో 8 ఎంపీ సెకండరీ సెన్సార్, 2 ఎంపీ మూడు సెన్సార్లతో రానుంది. 32 ఎంపీ సెల్ఫీకెమెరాను జోడించినట్టు సమాచారం. మోటరోలా ఎడ్జ్ పిస్టార్: ఫీచర్స్ మోటరోలా ఎడ్జ్ పిస్టార్ స్నాప్ డ్రాగన్ 865 సాక్ లేదంటే స్నాప్ డ్రాగన్ 870 సాక్ తో అందుబాటులోకి రానుంది. అంతేకాదు 6GB + 128 GB, 8 GB + 265 GB తో సహా రెండు ర్యామ్ వేరియంట్లతో అందుబాటులోకి రానుంది. మోటో ఎడ్జ్ బెర్లిన్ మాదిరిగానే వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్, 108 మెగాపిక్సెల్, ప్రైమరీ సెన్సార్తో పాటు 16 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ 2 కెమెరా సెన్సాలతో భారత్ లో విడుదల కానుంది. చదవండి: పిల్లలు ఆన్ లైన్ లో ఏం చేస్తున్నారంటే.. -
రూ. 25 వేలకే టచ్స్క్రీన్ ల్యాప్టాప్
అసుస్ డిటాచబుల్ సీఎం3 క్రోమ్బుక్ను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. మీడియాటెక్ 8183 ప్రాసెసర్పై ఈ ల్యాప్టాప్ పనిచేస్తుంది. ఇందులో క్రోమ్ఓఎస్ ఉంటుంది. లెనోవో క్రోమ్బుక్ కు పోటీగా ఇది ఆసుస్ క్రోమ్బుక్ను తీసుకొచ్చింది. దీని స్పెసిఫికేషన్లు కూడా అందులో ఉన్న మాదిరగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా దేశాల్లో ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో తెలియదు. ఇది ల్యాప్టాప్, టచ్ ట్యాబ్లెట్ లాగా మల్టీ టాస్క్ పని చేస్తుంది. అసుస్ క్రోమ్బుక్ ఫీచర్లు ఇందులో 10.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేను ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 16:10గా ఉంది. ఆక్టాకోర్ 2 గిగాహెర్ట్జ్ మీడియాటెక్ 8183 ప్రాసెసర్పై ఈ ల్యాప్టాప్ పనిచేస్తుంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు ఈఎంఎంసీ స్టోరేజ్ను ఇందులో అందించారు. ఇందులో డిటాచబుల్ కీబోర్డును తీసుకొచ్చారు. అంటే ఈ కీబోర్డును తీసేసి టచ్ ట్యాబ్లెట్లాగా కూడాపనిచేస్తుంది. ఇందులో వెనకవైపు 8 ఎంపీ కెమెరా, ముందువైపు 2 ఎంపీ ఉన్నాయి. ఇందులో 3.5 ఎంఎం ఆడియోజాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టును కూడా అందించారు. ఇందులో 27Whr బ్యాటరీని తీసుకొచ్చారు. 45వాట్ ఫాస్ట్ చార్జింగ్ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లుగానూ, బరువు 510 గ్రాములుగానూ ఉంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 349.99 డాలర్లుగా(సుమారు రూ.25,500) ఉంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.369.99 డాలర్లుగా(సుమారు రూ.27,000)గా ఉంది. మినరల్ గ్రే కలర్ ఆప్షన్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. చదవండి: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్ -
ఈ మొబైల్స్ వాడేవారికి గుడ్ న్యూస్
మోటోరోలా సరికొత్త ఆండ్రాయిడ్ 11 అప్డేట్ను అందుకోబోయే ఫోన్ల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ఆండ్రాయిడ్ 11 అప్డేట్ను అందుకునే 22 మోటరోలా మొబైల్స్, ఒక లెనోవా మొబైల్ ఉంది. ఈ జాబితాలో ఉన్న ఫోన్లకు త్వరలో ఆండ్రాయిడ్ 11 అప్డేట్ రానుంది. అయితే సరిగ్గా ఎప్పుడు తీసుకువస్తారో అనే విషయం కంపెనీ ప్రకటించలేదు. ఈ జాబితాలో మోటరోలా రేజర్ 5జీ, మోటరోలా రేజర్ 2019, మోటరోలా ఎడ్జ్, మోటరోలా ఎడ్జ్ ప్లస్, మోటరోలా వన్ 5జీ, మోటరోలా వన్ యాక్షన్, మోటరోలా వన్ ఫ్యూజన్, మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్, మోటరోలా వన్ హైపర్, మోటరోలా వన్ విజన్, మోటో జీ 5జీ, మోటో జీ 5జీ ప్లస్, మోటో జీ 5జీ ఫాస్ట్, మోటో జీ పవర్, మోటో జీ ప్రో, మోటో జీ స్టైలస్, మోటో జీ9, మోటో జీ 9ప్లే, మోటో జీ 9ప్లస్, మోటో జీ 9పవర్, మోటో జీ8, మోటో జీ 8పవర్, లెనోవా కే 12నోట్ ఉన్నాయి. అయితే ఈ అప్డేట్ 2021లో రానున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ 11 అప్డేట్ లో భాగంగా చాట్ బబుల్స్, డివైస్ కంట్రోల్స్ ఫీచర్ రానుంది. దీంతోపాటు ప్రైవసీ సెట్టింగ్స్ను కూడా మెరుగుపరుచుకోవచ్చు. మైక్, కెమెరా, లొకేషన్ వంటి వాటికి వన్ టైం పర్మిషన్లను అందించవచ్చు. (చదవండి: 2020 వాట్సాప్ లో వచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఇవే) -
లెనోవో K12 స్మార్ట్ ఫోన్- త్వరలో విడుదల!
ముంబై: చైనీస్ టెక్ దిగ్గజం లెనోవో.. కే12 బ్రాండుతో దేశీయంగా స్మార్ట్ ఫోన్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన మోటో ఈ7 మోడల్ మొబైల్ను ఆధునీకరించి కే12గా ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. గత నెలలో కే12ను యూరోపియన్ మార్కెట్లలో లెనోవో విడుదల చేసింది. చైనాలో ఇప్పటికే కే12 స్మార్ట్ ఫోన్ను ప్రవేశపెట్టింది. అయితే చైనీస్ మార్కెట్లో విడుదలైన ఫోన్ గతంలో విడుదలైన మోటో ఈ7 ప్లస్కు ఆధునిక వెర్షన్గా టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. గత మోటో ఈ7 మోడల్ను ఆధునీకరించి విడుదల చేయనున్న కే12 ఫోన్ దేశీ మార్కెట్లలో 120 యూరోలు(సుమారు రూ. 10,550)గా ఉండవచ్చని అంచనా. ఫోన్కు సంబంధించిన ఇతర టెక్నికల్ వివరాల అంచనాలు చూద్దాం.. (గత నెల అమ్మకాలలో టాప్-3 కార్లు) 6.5 అంగుళాల తెర లెనోవో కే12 స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల హెచ్డీప్లస్ టచ్ స్ర్నీన్ను కలిగి ఉంటుంది. వెనుక 48 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు.. 2 ఎంపీ మాక్రో స్నాపర్, 5 ఎంపీ షూటర్తో వెలువడనుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం 5 ఎంపీ షూటర్(కెమెరా)ను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియోస్ జీ25 చిప్సెట్తో పనిచేయనుంది. 2జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీతోపాటు.. 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 వెర్షన్లో లభించవచ్చని అంచనా. (ఎప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 బుకింగ్ షురూ) -
బడ్జెట్లో మోటో 5జీ ఫోన్
మోటరోలా చివరకు తన మోటో జి 5జీని త్వరలో భారత్ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. నవంబర్ 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని మోటొరోలా ట్వీటర్ ద్వారా ప్రకటించింది. మిడ్-రేంజ్ విభాగంలో 5జి ఫోన్ను లాంచ్ చేయాలని మోటోరోలా చాలాకాలంగా ఎదురుచూస్తుంది. ఈ ఫోన్ గతంలోనే యూరోప్లో లాంచ్ అయింది. మోటో జి 5జీ 4 జీబీ + 64 జీబీ వేరియంట్ యొక్క ధర యూరప్లో 299.99 యూరోలు(సుమారు రూ.26,300)గా నిర్ణయించింది. ట్విట్టర్ లో కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం భారతదేశంలో యూరప్ కంటే కొంచెం తక్కువ ధరకే తీసుకురానుంది. (చదవండి: ఫ్లిప్కార్ట్ బ్లాక్ ఫ్రైడే మొబైల్ బెస్ట్ డీల్స్) మోటో జి 5జీ స్పెసిఫికేషన్స్ మోటో జీ 5జీలో 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఎల్టీపీఎస్ డిస్ ప్లేను అందించారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ పై మోటో జీ 5జీ పనిచేయనుంది. దీని ర్యామ్ 4జీబీ కాగా, 64జీబీ స్టోరేజ్తో లభిస్తుంది. దీనిలో మైక్రో ఎస్డి కార్డ్ వేసుకోవడం ద్వారా 1టెరాబైట్ వరకు విస్తరించుకోవచ్చు. మోటో జి 5జీ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ సెకండరీ వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీనిలో 20వాట్ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 5జీ, వైఫై, ఎన్ఎఫ్సీ, బ్లూటూత్ 5.1, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. -
లాక్డౌన్ ఎఫెక్ట్: పీసీలకు పెరిగిన గిరాకీ
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా వివిధ దశల్లో లాక్డౌన్ ఆంక్షలు అమలయ్యాయి. దీంతో చాలామంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానానికి మళ్లారు. అటు పలు కాలేజీలు, విద్యాసంస్థలు ఆన్లైన్ క్లాసెస్ విధానాన్నిఎంచుకున్నాయి. ఈ కారణంగా ల్యాప్టాప్లు, టాబెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా మార్కెట్ లీటర్ లెనోవో ల్యాప్లాప్లు, నోట్బుక్లకు భారీగా విక్రయించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలయిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కేవలం 45 రోజుల్లోనే దేశంలో 2.9 మిలియన్ పీసీలు అమ్ముడయ్యాయని పరిశోధనా సంస్థ కెనాలిస్ తెలిపింది. వీటిలో డెస్క్టాప్లు, నోట్బుక్లు, టాబ్లెట్లు వర్క్స్టేషన్లు ఉన్నాయని ప్రకటించింది. ఇది నమ్మశక్యం కాని విషమయని కెనాలిస్ రీసెర్చ్ అనలిస్ట్ వరుణ్ కన్నన్ చెప్పారు. ఈ త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన ల్యాప్టాప్ల ఎగుమతి 33 శాతం తగ్గిందన్నారు. 8,18,000 పీసీలను విక్రయించిన లెనోవో మార్కెట్ లీడర్గా నిలిచింది. టాబ్లెట్ విభాగంలో కూడా ఇదే దూకుడును ప్రదర్శించింది. త్రైమాసికంలో మొత్తం విక్రయాల్లో 29 శాతం వాటాను ఈసమయంలో సాధించింది. 629,000 యూనిట్లతో హెచ్పీ రెండవ స్థానంలో ఉంది. మూడో స్థానంలో డెల్ వుంది. డెస్క్టాప్ల కంటే నోట్బుక్లకు ప్రాధాన్యత లభించినట్టు కెనాలిస్ పేర్కొంది. గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే, లెనోవా మార్కెట్ వాటా 27.4 శాతం నుంచి 44.2 శాతానికి, హెచ్పి మార్కెట్ వాటా 17.3 శాతం నుంచి 23.2 శాతానికి పెరిగింది. డెల్ 10.0 శాతం నుంచి 12.7 శాతం వరకు పెరిగింది. ఎసెర్ మార్కెట్ వాటా 7.1 శాతం నుంచి 5.6 శాతానికి పడిపోగా, శాంసంగ్ తన మార్కెట్ వాటా రెట్టింపు చేసుకుంది. గత ఏడాది 2.4 శాతం నుంచి 5.8 శాతానికి పుంజుకుంది. లాక్డౌన్ ఆంక్షల కారణంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సీఎల్ లాంటి దిగ్గజ కంపెనీల ఉద్యోగులు ఇంటి నుండే పనిచేస్తున్నారు. కోవిడ్-19 సంక్షోభంతో పలుటెక్ సంస్థలతో పాటు, చాలా కార్పొరేట్ సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానానికే ప్రాధాన్యత ఇవ్వవచ్చని, అలాగే రాబోయే త్రైమాసికాల్లో ఆన్లైన్ లెర్నింగ్కే ఎక్కువ మొగ్గుచూపే అవకాశ ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా బాగా క్షీణించిన పీసీ పరిశ్రమకు ఈ బూస్ట్ సరిపోదని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఈక్యూ మోడ్తో లెనోవా వైర్లెస్ హెడ్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా బహుళజాతి సాంకేతిక సంస్థ లెనోవా తన కొత్త వైర్లెస్ హెడ్ఫోన్లను తాజాగా విడుదల చేసింది. సరికొత్త ఈక్యూ టెక్నాలజీతో 'హెచ్డి 116' పేరుతో ప్రస్తుతం అమెజాన్ ద్వారా అందుబాటులో ఉంచింది. ఈ నెల చివరి నాటికి ఫ్లిప్కార్ట్లో కూడా లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది. దీని ధరను రూ .2,499 గా వుంచింది. మంచి,లుక్, ఉన్నతమైన నాణ్యత, గొప్ప సౌండ్ అవుట్పుట్, బలమైన బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి క్లాసిక్ మేళవింపుతో తమ తాజా హెడ్ఫోన్స్ ఆకట్టుకుంటాయని షెన్జెన్ ఆడిషి టెక్నాలజీ లిమిటెడ్ ఇంటర్నేషనల్ బిజినెస్ సీఈవో జిసేన్జు తెలిపారు. డ్యూయల్ ఈక్యూ మోడ్, (ఒకే బటన్ను నొక్కడం ద్వారా వినియోగదారుడు రెండు మోడ్లకు మారడానికి అనుమతి), 240హెచ్ స్టాండ్బై సమయంతో 24 గంటల ప్లేయింగ్ సమయం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. 2019లో తమ ఆడియో పరికరాలకు భారత వినియోగదారుల నుంచి వచ్చిన విశేష ఆదరణ నేపథ్యంలోఇక్యూ టెక్నాలజీతో అప్గ్రేడ్ వెర్షన్ను తీసుకొచ్చామని ఆడిషి టెక్నాలజీ లిమిటెడ్ ఇండియా బిజినెస్ హెడ్ నవీన్ బజాజ్ తెలిపారు -
లెనోవో నుంచి నూతన థింక్ప్యాడ్లు
న్యూఢిల్లీ: లెనోవో నూతన తరం థింక్ప్యాడ్, థింక్ సెంటర్పీసీలను మంగళవారం విడుదల చేసింది. వాణిజ్య ఐవోటీ, సెక్యూరిటీ సొల్యూషన్లలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించింది. థింక్ప్యాడ్ టీ490, థింక్ప్యాడ్ ఎక్స్390, థింక్సెంటర్ నానో, థింక్సెంటర్ నానో ఐవోటీ ఆవిష్కరించిన వాటిల్లో ఉన్నాయి. సులభమై, భద్రతతో కూడిన, వేగవంతమైన, అధిక పనితీరు చూపించే పరికరాలను నేడు ఉద్యోగులు కోరుకుంటున్నారని, థింక్ప్యాడ్ ఈ అవసరాలను తీరుస్తుందని ఈ ఉత్పత్తులను విడుదల చేసిన సందర్భంగా లెనోవో ఇండియా ఎండీ, సీఈవో రాహుల్ అగర్వాల్ పేర్కొన్నారు. కళ్లను సురక్షితంగా ఉంచే టెక్నాలజీతో వీటిని రూపొందించినట్టు వెల్లడించారు. -
లెనొవొ నుంచి మూడు కొత్త స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: చైనా టెక్నాలజీ దిగ్గజం లెనొవొ కంపెనీ మూడు స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి తెచ్చింది. లెనొవొ ఏ6నోట్, లెనొవొ కే10 నోట్, లెనొవొ జడ్6 ప్రొలను అందుబాటులోకి తెచ్చా మని లెనొవొ ఇండియా తెలిపింది. ఏ6 నోట్ ధర రూ.7,999 అని లెనొవొ ఇండియా ఎమ్డీ ప్రశాంత్ మణి చెప్పారు. కే10 నోట్లో 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఫోన్ ధర రూ.13,999 అని, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.15,999 అని పేర్కొన్నారు. ఇక జడ్6 ప్రొలో 8 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999 అని వివరించారు. 5–7% వృద్ధి: ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో స్మార్ట్ఫోన్ అమ్మకాలు 5–7%రేంజ్లో పెరగగలవని అంచనాలున్నాయని ఎమ్డీ ప్రశాంత్ మణి చెప్పారు. కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ద్వారా భారత్లో మొబైల్ ఫోన్ల తయారీ చేపట్టామని, భారత్ నుంచి ఎగుమతులూ మొదలు పెట్టామని తెలిపారు. -
జెడ్ 6 ప్రొ ఫీచర్లు అదుర్స్!
సాక్షి, న్యూఢిల్లీ : చైనా స్మార్ట్ఫోన్ కంపెనీ లెనోవో మూడు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. లెనోవో జెడ్ 6 ప్రొ, లెనోవో కే 10 నోట్, లెనోవో ఏ6 నోట్ పేర్లతో వీటిని భారత మార్కెట్లో తీసుకొచ్చింది. ప్రధానంగా ప్రీమియం మోడల్ జెడ్ 6 ప్రొ లో 6.39 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను, 12 జీబీ ర్యామ్, వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెపాసిటీతో పాటు, నాలుగు కెమెరాలను, 27 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ను అమర్చింది. లెనోవో జడ్ 6 ప్రొ ఫీచర్లు 6.39 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9.0పై, 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 48+16+ 8+ 2 ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ధర రూ. 33,999 లెనోవో కే 10 నోట్ ఫీచర్లు 6.30 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే క్వాల్కం స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9.0పై, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 16+ 8+5 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4050 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ధర రూ.13,999 లెనోవో ఏ 6 నోట్ ఫీచర్లు 6.09 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే మీడియా టెక్ హీలియో పీ 22 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 3 జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ 13+2 ఎంపీ రియర్ డ్యుయల్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర రూ. 7999 ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ నెల 11వ తేదీ నుంచి విక్రయానికి లభ్యం. కొనుగోలు చేసిన యూజర్లకు జియో రూ.2200 విలువైన ఆఫర్స్ను కంపెనీ అందివ్వనుంది. అలాగే రూ.1500 విలువైన మేక్ మై ట్రిప్, రూ.2వేల విలువైన జూమ్ కార్ కూపన్లు జియో నుంచి లభిస్తాయి. అందుకు గాను యూజర్లు రూ.299 ప్లాన్ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. -
లెనొవొ నుంచి అధునాతన గేమింగ్ ల్యాప్టాప్
న్యూఢిల్లీ: ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ (పీసీ) తయారీ కంపెనీ ‘లెనొవొ’.. తాజాగా తన అధునాతన గేమింగ్ ల్యాప్టాప్, పీసీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘లెజియన్ వై 540’ పేరుతో ల్యాప్ట్యాప్.. ‘లెజియన్ వై 740’ పేరిట డెస్క్టాప్లను మంగళవారం విడుదలచేసింది. వీటి ధరల శ్రేణి రూ. 70,000 నుంచి రూ. 1.3 లక్షలుగా ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ శైలేంద్ర కటియల్ మాట్లాడుతూ.. ‘గతేడాది మొదటి త్రైమాసికంలో లెజియన్ మోడల్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టగా.. దీనికి 14.6% మార్కెట్ వాటా లభించింది. నూతన మోడళ్లతో ఈ ఏడాది మూడవ క్వార్టర్లో 20% మార్కెట్ వాటాకు ఎగబాకుతుందని భావిస్తున్నాం. ఇక రెండేళ్ల కిందట శాతంగా ఉన్న గేమింగ్ మార్కెట్.. ఇప్పుడు 5 శాతానికి పెరిగింది. రూ. 60,000– రూ. 80,000 మధ్య శ్రేణి గేమింగ్ ల్యాప్టాప్ల మార్కెట్ భారత్లో శరవేగంగా వృద్ధిచెందుతోంది’ అని వ్యాఖ్యానించారు. -
లెనొవొ ‘యోగా ఎస్940’
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ (పీసీ) తయారీ కంపెనీ ‘లెనొవొ’ తాజాగా పలు అధునాతన ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఐడియాప్యాడ్ టాబ్లెట్లు, యోగా ఆల్ ఇన్ వన్ డెస్క్టాప్లు, అల్ట్రా–స్లిమ్ నోట్బుక్లను బుధవారం విడుదలచేసింది. ‘యోగా ఎస్940’ పేరిట కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత అల్ట్రా స్లిమ్ పీసీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటి ధరల శ్రేణి రూ.23,990– 1,69,990 వరకు ఉన్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా లెనొవొ ఇండియా ఎండీ, సీఈఓ రాహుల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది పీసీ మార్కెట్లో 30–40% వృద్ధి ఉండొచ్చు. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ నుంచి ఈ త్రైమాసికంలో ఆర్డర్ లభిస్తుందని భావిస్తున్నాం’ అని చెప్పారు. -
ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ ల్యాప్టాప్
సాక్షి, న్యూఢిల్లీ : ఇప్పటివరకూ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు, టీవీలను చూశాం. తాజాగా మడతపెట్టే ల్యాప్టాప్లురానున్నాయి. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్న చైనా టెక్ కంపెనీ లెనోవో ప్రోటోటైప్ ఫోల్డబుల్ ల్యాపీని ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ పీసీ అని లెనోవో ఒక ప్రకటనలో వెల్లడించింది. ల్యాప్టాప్ ఆకారంలో మడవటానికి వీలుగా వుంటుందీ డివైస్. ఫోల్డబుల్ స్క్రీన్తో ఫుల్ ప్లెడ్జ్డ్ ల్యాప్టాప్ అని కంపెనీ తెలిపింది. ‘థింక్ ఫ్యాడ్ ఎక్స్1’ అని పేరుతో దీన్ని లాంచ్ చేసింది. ఇక ఫీచర్స్ విషయానికొస్తే..13.3 అంగుళాల పరిమాణంలో తీర్చిదిద్దారు. 9.3 ఇంచీల స్క్రీన్, ఇంటెల్ ప్రాసెసర్, యూఎస్బీ పోర్ట్స్, ఇన్ఫ్రార్డ్ కెమెరా, స్టీరియో స్పీకర్స్, హై-రిజల్యూషన్ డిస్ ప్లే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రధాఫీచర్లుగా ఉన్నాయి. 2020 నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నామని పేర్కొంది. ధర వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించిపోయినప్పటికీ, మూడు నుంచి 4వేల డాలర్ల మధ్య ఉంటుందని అంచనా. ఈ డివైస్కు సంబంధించిన దీంతో ల్యాప్టాప టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. -
అద్భుత ఫీచర్లతో లెనోవో స్మార్ట్ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా మొబైల్ మేకర్ మరో విప్లవాత్మక స్మార్ట్ఫోన్ను తీసుకురానుంది. జెడ్ సిరీస్లో భాగంగా అదిరిపోయే ఫీచర్లతో జెడ్6 ప్రొ పేరుతో లెనోవో 5జీ స్మార్ట్ఫోన్ను త్వరలో లాంచ్ చేయనుంది. 100 మెగాపిక్సల్ భారీ కెపాసిటీ హైపర్ విజన్ కెమెరాతోపాటు, ఎలక్షన్ సందర్భంగా ఫేక్న్యూస్ను అడ్డుకునేందుకు తీసుకొచ్చిన ఫేస్బుక్ కొత్త టూల్, వాట్సాప్ డార్క్మోడ్ అథెంటిఫికేషన్ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. 100ఎంపీ కెమెరా సామర్థ్యం ఉన్న తొలి ఫోన్ ఇదే కానుంది. ఈ మేరకు ఈ ఫోన్కు చెందిన ఓ ఇమేజ్ను, వీడియోను ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చాంగ్ చెంగ్ మార్చి 27వ తేదీన చైనా సోషల్ మీడియా వైబోలో పోస్ట్ చేశారు.ఈ ఏడాది మొబైల్ వరల్డ్కాంగ్రెస్లో దీనిపై ప్రకటించిన సంస్థ జూన్ నెలలో మార్కెట్లలో తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫీచర్లపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, అంచనాలు ఇలా ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ప్రధానంగా వెలుగులోకి వచ్చిన లెనోవో జడ్6 ప్రొ ఫీచర్లు. -
లెనోవో కొత్త అల్ట్రా స్లిమ్ ల్యాప్టాప్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ కంప్యూటర్స్ ఉత్పత్తుల తయారీదారు లెనోవో రెండు కొత్త ల్యాప్టాప్లను లాంచ్ చేసింది. అల్ట్రా స్లిమ్ పోర్ట్ఫోలియో ఐడియా ప్యాడ్ డివైస్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. లెనోవో ఐడియా ప్యాడ్ 530ఎస్, ఐడియా ప్యాడ్ 330ఎస్ పేరిట ఈ ల్యాప్టాప్లను అందుబాటులో ఉంచింది. లెనోవో ఐడియా ప్యాడ్ 530 ఎస్ పీచర్లు:14 ఇంచుల డిస్ప్లే, 8వ జనరేషన్ కోర్ ఐ5/ఐ7 ప్రాసెసర్, ఎన్వీడియా ఎంఎక్స్ 150/ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, 16 జీబీ వరకు ర్యామ్ సపోర్ట్, 512 జీబీ ఎస్ఎస్డీ, విండోస్ 10 ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, 8 గంటల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.67,990గా ఉంది. లెనోవో ఐడియాప్యాడ్ 330ఎస్ ఫీచర్లు: 15.6/14 ఇంచుల డిస్ప్లే, ఇంటెల్ 8వ జనరేషన్ క్వాడ్కోర్ ప్రాసెసర్, ఎన్వీడియా జిఫోర్స్ జీటీఎక్స్1050/ఏఎండీ రేడియాన్ 535 గ్రాఫిక్స్, 16 జీబీ వరకు ర్యామ్ సపోర్ట్, 256 జీబీ ఎస్ఎస్డీ, 1 టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్, 7 గంటల బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.35,990 గా ఉంది. నిరంతరం నూతనమైన, డివైస్లను ఆవిష్కరించడంలో తన నిబద్దతను అల్ట్రా-స్లిమ్ పోర్ట్ఫోలియో మరోసారి నిరూపించిందని కస్టమర్ బిజినెస్ అండ్ ఇకామర్స్ లెనోవో ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ తాదానీ తెలిపారు. భారతీయ మార్కెట్ కోసం సరసమైన ధరల్లో, అల్ట్రా పోర్టబుల్ ల్యాప్టాప్లను తీసుకువస్తున్నామని, తద్వారా తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. -
అద్భుత ఫీచర్లతో ప్రపంచంలోనే తొలి సూపర్ ల్యాప్టాప్
సాక్షి, న్యూఢిల్లీ: చైనీస్ తయారీదారు లెనోవా అద్భుత ఫీచర్లతో ఒక ల్యాప్టాప్ను లాంచ్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక స్టోరేజ్ కెపాసిటీతో తొలి డివైస్నువిడదుల చేసింది. థింక్ప్యాడ్ పీ 52 పేరుతో లాంచ్ చేసింది. వర్చువల్ రియాల్టీ సామర్థ్యాలతో 128 జీబీ ర్యామ్, 6టీబీ స్టోరేజ్ కెపాసిటీతో దీన్ని ప్రవేశపెట్టింది. జూన్ చివరినాటికి వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ ల్యాప్టాప్ ధర సుమారు రూ.81 వేల నుంచి ప్రారంభమవుతుంది. లెనోవా థింక్ప్యాడ్ పి52 ఫీచర్లు 15.6 అంగుళాల 4కె టచ్ స్క్రీన్ డిస్ ప్లే 1920x1080 పిక్సెల్ రిసల్యూషన్ 8 వ జనరల్ ఇంటెల్ జియోన్ హెక్సా-కోర్ ప్రాసెసర్ 2.5 కిలోగ్రాముల బరువు కనెక్టివిటీ పరంగా ఇందులో యూఎస్బీ 3.1 టైప్-ఎ, రెండు: యూఎస్బీ- సి / థండర్ బోల్డ్, ఒక హెచ్డీఎంఐ 2.0, ఒక మినీ డిస్ప్లేపోర్ట్ 1.4, ఎస్డీ కార్డ్ రీడర్ను అందిస్తుంది. అంతేకాదు ఈ ల్యాప్టాప్లో ఐదు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆప్షన్స్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. విండోస్ 10 ప్రో, విండోస్ 10 ప్రో, విండోస్ 10 హోమ్, ఉబూన్-2 మరియు లైనక్స్ కోసం విండోస్ 10 ప్రో, ఐదు ఆపరేటింగ్ సిస్టమ్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే ఇందులోని ఇన్ఫ్రారెడ్ కెమెరా (ఫేస్ రికగ్నిషన్ వీడియో కాలింగ్ కోసం హెచ్డీ వెబ్ కెమెరాలా ఉపయోగపడుతుంది. -
సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త స్మార్ట్ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ తయారీదారు లెనోవో తన నూతన స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. జెడ్ సిరీస్లో మిడ్రేంజ్లో 'జెడ్5' పేరుతో మంగళవారం బీజింగ్లో విడుదల చేసింది. 64/128 జీబీ స్టోరేజ్ అరోరా బ్లూ, బ్లాక్, ఇండిగో బ్లూ కలర్ ఆప్షన్స్లో ఇవి లభ్యంకానుంది. 64జీబీ వెర్షన్ 1399 యువాన్ (రూ .14,670 సుమారు) 128 జీబీ వెర్షన్ 1799 యువాన్ (రూ .18,870)గా నిర్ణయించింది. ఇది ప్రీబుకింగ్ ప్రస్తుతం చైనా మార్కెట్లో అందుబాటులో వుండగా, జూన్ 12 నుండి విక్రయానికి లభ్యం కానుంది. ఆకట్టుకునే రంగులతోపాటు అద్భుత డిజైన్తోప్రీమియం లుక్ వచ్చేలా ఈ డివైస్ను డిజూన్ చేసింది. దీనికి ఫేస్ అన్లాక్ సదుపాయాన్ని కూడా జోడించింది. లెనోవో జెడ్5 ఫీచర్లు 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2246 x 1080 స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16+8 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ -
4 టీబీ స్టోరేజ్తో ఆ ఫోన్ వచ్చేస్తోంది..
10 లక్షల ఫోటోలు, 2000 హెచ్డీ మూవీలు స్మార్ట్ఫోన్లో స్టోర్ చేసుకునేలా.. అత్యధిక మొత్తంలో స్టోరేజ్ ఆప్షన్తో లెనోవో కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ వచ్చేస్తోంది. జూన్ 5న చైనాలో ఈ స్మార్ట్ఫోన్ లాంచ్ కానుందట. 4 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో లెనోవో ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేస్తుందని తెలిసింది. లెనోవో మొబైల్స్ అధికారిక వైబో అకౌంట్ ఈ విషయాన్ని ధృవీకరించింది. లాంచ్ డేట్కు సంబంధించిన ఓ పోస్టర్ను సైతం షేర్ చేసింది. తొలుత ఈ స్మార్ట్ఫోన్ను లెనోవో బీజింగ్లో లాంచ్ చేయనుంది. అయితే భారత్ లాంటి ఇతర మార్కెట్లకు తీసుకొస్తుందో లేదో ఇంకా తెలియరాలేదు. వైబోలో లెనోవో షేర్ చేసిన పోస్టులో ‘కేవలం ఈ క్షణం, జూన్ 5, బీజింగ్లో కొత్త నేషనల్ ఫ్లాగ్షిప్ వచ్చేస్తోంది’ అని ఉంది. చైనాలో స్టాండర్డ్ టైమ్ మధ్యాహ్నం రెండు గంటలకు(భారత్ కాలమానం ప్రకారం సుమారు ఉదయం 11.30కు) లాంచ్ ఈవెంట్ జరుగనుంది. లెనోవో లాంచ్ చేయబోతున్న ఈ స్మార్ట్ఫోన్ పేరు జెడ్5గా తెలిసింది. ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన టీజర్లను సైతం లెనోవో విడుదల చేసింది. ఏఐ ఆధారిత డ్యూయల్ కెమెరా, బెజెల్-లెస్ డిజైన్ ఇది కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. అంతకముందు లెనోవో వైస్ ప్రెసిడెంట్ ఛాంగ్ ఛెంగ్ విడుదల చేసిన కెమెరా శాంపుల్స్లో కూడా ‘ఏఐ డ్యూయల్ కెమెరా’ ఉన్నట్టే ఆ ఫోటోల కింద భాగంలో ఆయన రాశారు. కాగ, ఇంత ఎక్కువ మొత్తంలో స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ స్టోరేజ్ కెపాసిటీతో స్మార్ట్ఫోన్లో 2000 హెచ్డీ మూవీలు, 1,50,000 మ్యూజిక్ ఫైల్స్, 10 లక్షల ఫోటోలను స్టోర్ చేసుకోవచ్చని ఛెంగ్ అంతకముందే తెలిపారు. తక్కువ వెలుతురులో కూడా క్లారిటీ ఫోటో తీసుకునేలా, ఫోటోగ్రఫీ అనుభవాన్ని పెంచేలా ఏఐ ఫీచర్ను కంపెనీ కల్పిస్తోంది. 45 రోజుల స్టాండ్బై టైమ్తో ఈ ఫోన్ రూపొందుతుంది. అంటే ఈ ఫోన్లో అత్యంత ఎక్కువ స్టోరేజ్ మాత్రమే కాక, అతిపెద్ద బ్యాటరీ కూడా ఉండబోతుందన్నమాట. జెడ్5 స్మార్ట్ఫోన్కు సంబంధించిన స్కెచ్లను సైతం లెనోవో షేర్ చేసింది. ఈ పిక్చర్స్లో ముందు భాగమంతా బెజెల్-లెస్ డిస్ప్లేతోనే రూపొందిందని తెలిసింది. -
4 టీబీ స్టోరేజ్తో లెనోవో కొత్త స్మార్ట్ఫోన్
10 లక్షల ఫోటోలను, 2000 హెచ్డీ మూవీలను ఒక స్మార్ట్ఫోన్లో స్టోర్ చేసుకోవచ్చా అంటే, నిజంగా అసాధ్యం అనేస్తారు. ఇప్పుడున్న ఫోన్లలో అంత స్టోరేజ్ ఎక్కడుందని ఠక్కున ప్రశ్నిస్తారు. కానీ త్వరలోనే అంత ఎక్కువ స్టోరేజ్ సామర్థ్యంతో కూడా ఓ స్మార్ట్ఫోన్ మార్కెట్లలోకి వచ్చేస్తోందట. 4 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యంతో లెనోవో నుంచి ఓ స్మార్ట్ఫోన్ లాంచ్ కాబోతుందని తెలిసింది. మీరు విన్నది నిజమే. ఈ విషయాన్ని లెనోవో వైస్ ప్రెసిడెంట్ ఛాంగ్ ఛెంగ్ చైనీస్ సోషల్ నెటివర్కింగ్ వెబ్సైట్ వైబో ద్వారా తెలియజేశారు. లెనోవో నుంచి తర్వాత రాబోతున్న ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ అత్యధిక మొత్తంలో 4 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉందని టీజ్ చేశారు. ఇంత ఎక్కువ మొత్తంలో స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ స్టోరేజ్ కెపాసిటీతో స్మార్ట్ఫోన్లో 2000 హెచ్డీ మూవీలు, 1,50,000 లూస్లెస్ మ్యూజిక్ ఫైల్స్, 10 లక్షల ఫోటోలను స్టోర్ చేసుకోవచ్చని ఛెంగ్ తెలిపారు. ఇప్పటికే ఈ డివైజ్ లెనోవో జెడ్ 5గా ధృవీకరణ అయింది. ఈ స్మార్ట్ఫోన్ తొలుత చైనాలో లాంచ్ కాబోతుంది. త్వరలోనే భారత్కు కూడా రానున్నట్టు తెలుస్తోంది. ప్రాక్టికల్ టెక్నాలజీతో ఇది రూపొందుతోంది. ఈ స్మార్ట్ఫోన్కు వెనుక వైపు ఎలక్ట్రిక్ బ్లూ బాడీ ఉండనుంది. ఛెంగ్ రివీల్చేసిన ఇమేజ్లో ఇది పూర్తిగా బెజెల్-లెస్ స్మార్ట్ఫోన్ అని తెలుస్తోంది. -
మార్కెట్లోకి మరో రెండు ఫిట్నెస్ బ్యాండులు
న్యూఢిల్లీ: చైనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవా భారత మార్కెట్లోకి హెచ్ఎక్స్03ఎఫ్ స్పెక్ట్రా, హెచ్ఎక్స్03 కార్డియో పేరుతో మరో రెండు ఫిట్నెస్ బ్యాండులను విడుదల చేసింది. వీటిలో హెచ్ఎక్స్03ఎఫ్ స్పెక్ట్రా రూ.2,299 ధరకు లభిస్తుండగా , హెచ్ఎక్స్03 కార్డియో ధర 1,999గా నిర్ణయించారు. హెచ్ఎక్స్03 కార్డియో ప్రస్తుతం అందుబాటులో ఉండగా..హెచ్ఎక్స్03ఎఫ్ స్పెక్ట్రా మే 3 నుంచి ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫిట్నెస్ బ్యాండుల్లో ఓఎల్ఈడీ, టీఎఫ్టీ డిస్ప్లే ఉందని కంపెనీ పేర్కొంది. డైనమిక్ హార్ట్రేట్ మానిటర్, మూవ్మెంట్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ తదితర ఫీచర్లు ఈ బ్యాండుల్లో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ప్రతి 15 నిమిషాల కొకసారి ఆటోమేటిక్గా వినియోగదారుడి హార్ట్ రేట్ను మానిటర్ చేస్తుందని వివరించింది. ఒక్కసారి స్మార్ట్ఫోన్కు సింక్ అయితే వీటికి సంబంధించిన ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, టెక్ట్స్ మెసేజెస్, నోటిఫికేషన్ అప్డేట్స్ ఆటోమాటిక్గా అందుతాయని కంపెనీ తెలిపింది. 2018లో ఫిట్నెస్ బ్యాండుల విపణిలో 20 శాతం వాటా దక్కించుకునేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు లెనోవా ఎంబీజీ ఎకోసిస్టం హెడ్ సెబాస్టియన్ పెంగ్ తెలిపారు. -
లెనోవో సూపర్ ల్యాప్టాప్స్ : ‘థిన్ అండ్ లైట్’
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ ల్యాప్టాప్ తయారీ సంస్థ లెనోవో భారీగా ల్యాప్టాప్లను, టాబ్లెట్ల (2018) ను లాంచ్ చేసింది. ‘థిన్ అండ్ లైట్’ అంటూ ఎక్స్,ఎల్, టీ సిరీస్లలో ల్యాప్టాప్లు, టాబ్లెట్లను భారతీయ వినియోగదారులకోసం వీటిని విడుదల చేసింది. వినియోగదారులకు కోసం థింక్ పోర్ట్ఫోలియోలో వివిధ మోడళ్లలో లేటెస్ట్ 8 వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్లతో సరికొత్త శ్రేణిలో వీటిని ప్రారంభించింది. వీటిల్లో థింక్పాడ్ ఎక్స్, టీ, ఎల్ సిరీస్లో పలు మోడల్స్ను లాంచ్ చేసింది. ఎక్స్ సిరీస్లో ఎక్స్ 1, ఎక్స్1 కార్బన్, ఎక్స్ 1 యోగా సహా ఇతర డివైస్లను లాంచ్ చేసింది. ఐ ట్రాకింగ్ విత్ ఐ ఆర్ కెమెరా, సెక్యూరిటీ తమ డివైస్ల ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది. ఇక ఆడియో, డిస్ప్లే విషయానికి వస్తే డాల్బీ విజన్ హెచ్డీఆర్, 500నిట్స్ ఫీచర్లను జోడించింది. డాల్బీ విజన్ హెచ్డీఆర్ సపోర్టుతో మొట్టమొదటి థింక్ ఎక్స్1 కార్బన్, ఎక్స్ 1 యోగా డివైస్లను లాంచ్ చేసినట్టు కంపెనీ చెప్పింది. అంతేకాదు ప్రపంచంలో అతి తేలికైన 14 ఇంచెస్ బిజినెస్ ల్యాప్టాప్గా చెబుతోంది. అల్ట్రా లైట్ కార్బన్ ఫైబర్ తో రూపొందించిన ఈ డివైస్లో 1920 x 1080 రిజల్యూషన్, 16జీబీ ర్యామ్, 8వ జనరేషన్ ఇంటెల్కోర్ ప్రాసెసర్ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ముఖ్యంగా14 అంగుళాల శ్రేణిలో అతి తక్కువ బరువు వుండే ఎక్స్ 1 ల్యాప్టాప్ ప్రారంభ ధర రూ .1,21,000 నుంచి రూ.1,26,000 వరకు ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ పెన్, గ్లోబల్ ఎల్టీవీ సామర్ధ్యంతో వస్తున్న ఇది ప్రపంచంలో ఏకైక కన్వర్టిబుల్ ల్యాప్టాప్గా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. థింక్ ప్యాడ్ ఎక్స్ సిరీసలో ఎక్స్ 280, ఎక్స్ 330 ధరలు రూ. 73,000 నుండి రూ .87,000 వరకు ఉండనున్నాయి. ఎల్ సిరీస్లో ఎల్ 580, ఎల్ 480, ఎల్ 380 ధరలు రూ .54,000 నుంచి రూ. 65,000 వరకు ఉన్నాయి. టీ సిరీస్లో, టీ 580 (74వేల రూపాయలు), టీ480ఎస్ (86వేల రూపాయలు), టీ 480 (69వేలు రూపాయలు) లను అందుబాటులో తెచ్చింది. -
బడ్జెట్ ధరలో లెనోవో కొత్త స్మార్ట్ఫోన్లు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్మేకర లెనోవో కే సిరీస్లో నూతన స్మార్ట్ఫోన్లునులంచ్ చేసింది. కె5, కె5 ప్లే పేరుతో రెండు స్మార్ట్ఫోన్లను చైనా మార్కెట్లో విడుదల చేసింది. త్వరలోనే భారత మార్కెట్లనుకూడా పలకరించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్పెసిఫికేషన్లు, ధరల వివరాలు ఒకసారి చూద్దాం. లెనోవో కె5 రూ.9,300 ధరకు లభ్యం కానుండగా, కె5 ప్లే రూ.7,200 ధరకు లభించనుంది. లెనోవో కె5 ఫీచర్లు 5.7 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్ 3 జీబీ ర్యామ్ 32 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 13+5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ లెనోవో కె5 ప్లే ఫీచర్లు 5.7 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 2 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 13+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
లెనోవో, మోటోరోలా ఫోన్లకు బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్, లెనోవో, మెటోరోలా 4జీ స్మార్ట్ఫోన్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ కంపెనీలకు చెందిన ఎంపిక చేసిన 4జీ స్మార్ట్ఫోన్లపై 2వేల రూపాయల వరకుక్యాష్బ్యాక్ ఇవ్వనున్నట్టు తెలిపింది. పాపులర్ మోడల్స్ అయిన మోటొరోలా మోటో సీ, మోటో ఈ4, లెనోవో కే8 నోట్ ఫోన్లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్లో భాగంగా మోటో సీ స్మార్ట్ఫోన్ రూ.3,999కే లభ్యంకానుంది. అలాగే మోటో ఈ4 స్మార్ట్ఫోన్ 6,499 రూపాయలకి, లెనోవో కే8 నోట్ స్మార్ట్ఫోన్ 10,999 రూపాయలకి కంపెనీ అందుబాటులో ఉంచుతుంది. 4జీ స్మార్ట్ఫోన్లను మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు మోటోరోలాతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని భారతీ ఎయిర్టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వాని వెంకటేశ్ తెలిపారు. '' ఎయిర్టెల్ కస్టమర్లు 4జీ స్మార్ట్ఫోన్కు అప్గ్రేడ్ అయ్యేందుకు ఇది మంచి అవకాశం. మోటోరోలా, లెనోవో స్మార్ట్ఫోన్లతో ఈ అనుభవాన్ని ఎంజాయ్ చెయ్యండి'' అని మోటోరోలా మొబిలిటీ ఇండియా, లెనోవో ఎంబీజీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుధిన్ మాథుర్ అన్నారు. -
ఆ ఫోన్లపై ఎయిర్టెల్ రూ.2 వేల క్యాష్బాక్
న్యూఢిల్లీ : ‘మేరా పెహ్లా స్మార్ట్ఫోన్’ ప్లాన్ ప్రచారంలో భాగంగా మోటరోలా, లెనోవా 4జీ స్మార్ట్ఫోన్లపై టెలికాం సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్ టెల్ రూ.2 వేల క్యాష్బాక్ ఆఫర్ను ప్రకటించింది. మోటో సీ, మోటో ఈ4, లెనోవో కే8 నోట్ మొబైళ్లకు మాత్రమే ఈ క్యాష్బాక్ వర్తిస్తుంది. క్యాష్బాక్ ఆఫర్లో భాగంగా మోటో సీ మొబైల్ రూ.3,999 , మోటో ఈ4 మొబైల్ రూ.6,499, లెనోవో కే8 నోట్ రూ.10,999 లకే లభిస్తుంది. స్మార్ట్ఫోన్లు అత్యంత దిగువస్థాయి కస్టమర్లకు కూడా లభ్యమయ్యేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు భారతీ ఎయిర్టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వాణి వెంకటేశ్ తెలిపారు. -
ట్యాబ్స్ మార్కెట్.. లెనొవొ టాప్..
బెంగళూరు: ప్రముఖ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ‘లెనొవొ ఇండియా’ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ వ్యాపారంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తాజాగా డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 30.8 శాతం మార్కెట్ వాటాతో మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కంపెనీ మొదటి స్థానంలో ఉండటం ఇది వరుసగా మూడో త్రైమాసికం. లెనొవొ ఇండియా.. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తాజా నివేదికను ఉటంకిస్తూ.. 2017–18 ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసికంలోనూ శాంసంగ్, ఐబాల్ కంపెనీలను వెనక్కు నెట్టామని ప్రకటించింది. ఇక లెనొవొ ఇండియా ప్రధాన ప్రత్యర్థులైనా శాంసంగ్, ఐబాల్ మార్కెట్ వాటా వరుసగా 19.9 శాతంగా, 17.7 శాతంగా ఉంది. -
భారీ మొత్తంలో లెనోవో ల్యాప్టాప్లు రీకాల్
న్యూఢిల్లీ : పేలుళ్ల ఘటనలతో ఇన్నిరోజులు స్మార్ట్ఫోన్ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటే.. తాజాగా ల్యాప్టాప్లు కూడా ఈ ఘటనల బారిన పడుతున్నాయి. పేలుళ్ల కారణాలతో చైనీస్ తయారీదారి లెనోవో భారీ మొత్తంలో ల్యాప్టాప్లను రీకాల్ చేసింది. థింక్ప్యాడ్ ల్యాప్టాప్లను రీకాల్ చేసినట్టు లెనోవో ప్రకటించింది. 78వేల యూనిట్ల థింక్ప్యాడ్ ఎక్స్1 కార్బన్ ఐదో జనరేషన్ ల్యాప్టాప్లను కంపెనీ రీకాల్ చేసినట్టు అమెరికాలోని కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ కూడా వెల్లడించింది. ఓవర్హీట్తో బ్యాటరీలు పాడైపోతున్నాయని తెలిపింది. దీంతో పేలుళ్ల ఘటనలు సంభవిస్తున్నాయని, వెంటనే ఈ బ్యాటరీలను రీఫైర్ చేయాల్సి ఉందని చెప్పింది. మొత్తం 78వేల యూనిట్ల రీకాల్లో 55,500 యూనిట్ల రీకాల్ కెనడాలోనే జరిగింది. లెనోవో థింక్ప్యాడ్ ఎక్స్1 కార్బన్ ల్యాప్టాప్ ఐదవ జనరేషన్కు చెందింది. ఇది సిల్వర్, బ్లాక్ రంగుల్లో మార్కెట్లోకి వచ్చింది. రీకాల్ చేసిన ఈ 78వేల యూనిట్ల ల్యాప్టాప్లు 2016 డిసెంబర్ నుంచి 2017 డిసెంబర్ మధ్యలో తయారుచేశారు. థింక్ప్యాడ్ ఎక్స్1 కార్బన్ 5వ తరం యూజర్లు వెంటనే https://support.lenovo.com/X1C_5GEN_RECALL లింక్ను క్లిక్ చేసి, తమ ల్యాప్టాప్లు రీకాల్ జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకోవాలని కంపెనీ సూచించింది. ఒకవేళ ఈ జాబితాలో యూజర్ల ల్యాప్టాప్ ఉంటే, వెంటనే దాన్ని వాడటం ఆపివేయాలని హెచ్చరించింది. ఇటీవలే ముంబైలో వన్ప్లస్ 3టీ స్మార్ట్ఫోన్ ఛార్జింగ్ లో ఉండగా పేలింది. ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఆ కంపెనీ అధికారికంగా స్పందించలేదు. -
లెనోవా కొత్త ల్యాప్టాప్: టూ ఇన్ వన్
సాక్షి, బెంగళూరు: చైనాకు చెందిన బహుళజాతి టెక్నాలజీ కంపెనీ లెనోవా కొత్త ల్యాప్టాప్ను విడుదల చేసింది. 'యోగా 920’ లిమిటెడ్ ఎడిషన్ వైబ్స్ కన్వర్టిబుల్ ల్యాప్టాప్ను మంగళవారం లాంచ్ చేసింది. దీని ధరను రూ .1,27,150 గా నిర్ణయించింది. దీన్ని ల్యాప్ టాప్ మోడ్, టాబ్లెట్ మోడ్, స్టాండ్ మోడ్ , టెంట్ మోడ్ ఇలా 2-ఇన్ -1 గా దీన్ని వాడుకోవచ్చని కంపెనీ చెప్పింది. కన్వర్టిబుల్ పీసీ కేటగిరీలో లెనోవా యోగా బ్రాండ్ లీడర్గా కొనసగుతోందని లెనోవా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ తాడాని వెల్లడించారు. తమ తాజా ఆవిష్కరణ యోగా 920 అల్ట్రా ప్రీమియం మోడల్ అని తెలిపారు. 2ఇన్ వన్ గ్లాస్ కన్వర్టిబుల్ పరికరంలో డిజిటల్ పిన్, ఫార్-ఫీల్డ్ టెక్నాలజీని జోడించినట్టు చెప్పారు. దీని వలన వినియోగదారులు నాలుగు మీటర్ల దూరంలో ఉన్నా, స్టాండ్ బై మోడ్లో ఉన్నా వాయిస్-యాక్టివేటెడ్ ఇంటిలిజెన్స్ అసిస్టెంట్ కోర్టానా ను యాక్టివేట్ చేసేకోచ్చని తెలిపారు. కంపెనీ వినియోగదారుల పోర్ట్ఫోలియోలో 2ఎక్స్ థండర్ బోల్టులు కలిగిన మొదటి డివైస్అని ప్రకటించారు. 4కే టచ్స్ర్కీన్ డిస్ ప్లే, 8వ జనరేషన్ ఇంటెల్ క్వాడ్ కోర్ యు-సిరీస్ ప్రాసెసర్స్ విత్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, ట్విన్ థండర్ బోర్డ్ యూఎస్బీ టైప్-సి పోర్టు, డాల్బీ అట్మోస్ టెక్నాలజీ జెబీఎల్ స్పీకర్లు ,ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. ప్లాటినం కలర్లో ఆల్ మెటల్బాడీ డిజైన్తో వస్తున్న ఈ ల్యాప్టాప్ విండోస్ 10ఆపరేటింగ్ సిస్టం ఆధారితం. విండోస్ హెల్లోకి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫింగర్ ప్రింట్ రీడర్ కూడా ఉంది. -
లెనోవో కె8ప్లస్ కొత్త వేరియంట్...డిస్కౌంట్
సాక్షి, ముంబై: చైనా మొబైల్ ఉత్పత్తిదారు లెనోవో కె 8 ప్లస్ లో కొత్త వేరియంట్ను లాంచ్ చేసింది. ఇటీవల లాంచ్ చేసిన లెనోవో కె 8 ప్లస్ లో 4 జీబీ వేరియంట్ను శుక్రవారం విడుదల చేసింది. దీని ధర రూ.11,999గా కంపెనీ ప్రకటించింది. ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకంగా లభించనుంది. ఈ సందర్భంగా లాంచింగ్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్ లో వెయ్యి రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది. దీంతోపాటు రూ.10వేల దాకా ఎక్సేంజ్ ఆఫర్కూడా అందుబాటులో ఉంచింది. లెనోవో కె8 ప్లస్ ఫీచర్లు 5.2 అంగుళాల హెచ్డీ డిస్ప్లే మీడియా టెక్ డాక్ హెలియో పీ25 ఆక్టా కోర్ 2.6 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1.1 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 13ఎంపీ+ 5ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
లెనోవో కె8ప్లస్ లాంచ్.. లాంచింగ్ ఆఫర్స్
సాక్షి,న్యూఢిల్లీ: మొబైల్ ఉత్పత్తిదారు లెనోవా కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. లెనోవో కె 8, కె 8 ప్లస్ పేరుతో రెండు డివైస్లను ఇండియాలో బుధవారం విడుదల చేసింది. దీని ధర రూ.10,999గా కంపెనీ ప్రకటించింది. ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్లో ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకంగా లభించనుంది. ఈ విక్రయాలు రేపటిను నుంచి ప్రారంభంకానున్నాయని లెనోవా ట్విట్టర్ద్వారా ప్రకటించింది. కొన్ని వారాలలో ఇది ఇతర దుకాణాల్లో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ సందర్భంగా లాంచింగ్ ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. రూ.10వేల దాకా ఎక్సేంజ్ ఆఫర్, జియో ఖాతాదారులకు 30జీబీ అదనపుడేటా, మోటోప్లస్ 2 హెడ్ ఫోన్స్ రూ. 599లకే అందిస్తోంది. ఇంకా ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై ద్వారా 5 వా. బ్లూటూత్ స్పీకర్పై రూ.100 తగ్గింపు, ఫ్యాషన్, లైఫ్స్టైల్ ఉత్పత్తులపై 15శాతం తగ్గింపును ప్రకటించి. సెప్టెంబర్ 7-8 తేదీల మధ్య ఈ ఆఫర్లు వర్తిస్తాయి. లెనోవో కె8 ప్లస్ ఫీచర్లు 5.2 అంగుళాల హెచ్డీ డిస్ప్లే మీడియా టెక్ డాక్ హెలియో పీ25 ఆక్టా కోర్ 2.6 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1.1 3జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 13ఎంపీ+ 5ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, And that's a wrap from the #LenovoK8Launch! Hope you're ready for the sale tomorrow for the #LenovoK8Plus, exclusively on @Flipkart. pic.twitter.com/n1oclDVamD — Lenovo India (@Lenovo_in) September 6, 2017 -
లెనోవో కే6 కొత్త వేరియంట్..ధర?
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ లెనోవో కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. కే 6 కొత్త వేరియంట్ ను విడుదలచేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. 4 జీబీ ర్యామ్ వేరియంట్ తో 'కే 6 పవర్' పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తేనుంది. దీని ధరను రూ. రూ.10,999 గా కంపెనీ నిర్ణయించింది. జనవరి 31 నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా విక్రయించనున్నట్టు తెలిపింది. అత్యధిక బ్యాటరీ సామర్థ్యం దీని ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది. పేరుకు తగ్గట్టుగానే 96.5 గంటల మ్యూజిక్ , 13.6 గంటల వీడియో, 48 గంటల వాయిస్ కాల్స్, 12.6 నెట్ వాడకం, 649 గంటల స్టాండ్ బై టైమ్ తో అల్టిమేట్ పవర్ మోడ్ తో రానుందని తెలిపింది. ఫుల్ మెటల్ బాడీతో డిజైన్ చేసిన ఈ సరికొత్త వేరియంట్ డార్క్ గ్రే, గోల్డ్, సిల్వర్ కలర్స్ లో తీసుకొస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది కే 6 పవర్ ఫీచర్స్ 5 అంగుళాల ఫుల్ హెచ్ డీ స్క్రీన్ 1.4 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 1080x1920 పిక్సెల్ రిజల్యూషన్ –డాల్బే అట్మాస్ సౌండ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ 128 ఎక్స్ పాండబుల్ మెమొరీ 13 ఎంపీరియర్ కెమెరా 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ కాగా గత ఏడాది నవంబరు కే 6 3 జీబీ వేరియింట్ ను లాంచ్ చేసింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో రికార్డులుసృష్టించిన సంగతి తెలిసిందే. -
ఎల్జీ, శాంసంగ్లకు పోటీగా మోటోరోలా ఫోన్
న్యూఢిల్లీ : శాంసంగ్, ఎల్జీలకు పోటీగా ఫాస్ట్ ప్రాసెసర్తో మోటో జెడ్ స్మార్ట్ఫోన్ కొత్త వెర్షన్ను లాంచ్ చేయాలని లెనోవో ప్లాన్ చేస్తోంది. పునరుద్ధరించబడిన మోటో జెడ్ స్మార్ట్ఫోన్ను లెనోవో మోటోరోలా త్వరలోనే వినియోగదారులు ముందుకు తీసుకొస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అప్గ్రేడ్ అయిన ప్రాసెసర్, ఆండ్రాయిడ్ వెర్షన్తో ఈ హ్యాండ్సెంట్ ఇప్పటికే గీక్బెంచ్ బెంచ్మార్కులో లిస్టు అయిందట. ప్రస్తుత మోటో జెడ్ మోడల్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్ను కలిగి ఉంది. తాజా వెర్షన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్తో దీన్ని ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. గూగుల్ కొత్త ఆండ్రాయిడ్ నోగట్ ఓఎస్ను ఇది కలిగి ఉండబోతుందట. 4జీబీ ర్యామ్తో ఇది మార్కెట్లోకి వస్తుందని ఈ వెబ్సైట్ పేర్కొంటోంది. ఫ్యూచర్-ప్రూఫ్తో కొత్త ప్రాసెసర్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్, మంచి ర్యామ్ వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా లెనోవో ప్రణాళికలు రచిస్తోంది. అప్గ్రేడెట్ మోటో జెడ్ స్మార్ట్ఫోన్ కచ్చితంగా ప్రస్తుతమున్న ఎల్జీ, శాంసంగ్ ఫ్లాగ్షిప్లకు గట్టిపోటీ ఇస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. శాంసంగ్ కొత్త గెలాక్సీ ఎస్8 కూడా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్తోనే మార్కెట్లోకి రాబోతుందని టాక్. గత అక్టోబర్లో ప్రవేశపెట్టిన మోటో జడ్ స్మార్ట్ ధర రూ.39,999. -
'మోటో ఎం' స్మార్ట్ ఫోన్ లాంచింగ్ నేడే
ముంబై: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ లెనోవో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మంగళవారం లాంచ్ చేయనుంది. లెనోవా సొంతమైన మోటో.. ఇండియాలో మొట్టమొదటి ఆల్ -మెటల్ ఫోన్ ను ప్రారంభించనుంది. మోటో ఎం పేరుతో తీసుకొస్తున్న ఈ కొత్త డివైస్ ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. ముంబైలో జరిగే ఒక కార్యక్రమంలో ఈ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేయనుంది. ఇప్పటికే చైనాలో ఈ లాంచ్ అయిన మోటో ఎం ధర సుమారు రూ. 20వేలుగా ఉండనుంది. మోటో ఎం ఫీచర్లు: ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే,1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, మాలి టి860 ఎంపీ2 గ్రాఫిక్స్ 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 16 మెగా పిక్సెల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఫింగర్ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్ 4జీ వీవోఎల్టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్ 3050 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్ ఆండ్రాయిడ్ 6.0.1 మార్షమిల్లౌ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. -
లెనొవొ నుంచి‘కే6 పవర్’ స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘లెనొవొ’ తాజాగా తన ‘కే’ సిరీస్లోనే ‘కే6 పవర్’ అనే మరొక కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.9,999గా ఉంది. లెనొవొ కంపెనీ తన ‘కే6 పవర్’ స్మార్ట్ఫోన్ల విక్రయాల కోసం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాగా తాజా కొత్త ఫోన్ల విక్రయాలు డిసెంబర్ 6 నుంచి ప్రారంభంకానున్నవి. ‘కే6 పవర్’లో మెటల్ బాడీ డిజైన్, 5 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్, డాల్బే అట్మాస్ సౌండ్, 1.4 గిగాహెర్ట్జ్ఆక్టాకోర్ ప్రాసెసర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3 జీబీ ర్యామ్, ఆండ్రారుుడ్ మార్ష్మాలో ఆపరేటింగ్ సిస్టమ్, 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. -
అతిపెద్ద డిస్ ప్లేతో లెనొవో స్మార్ట్ ఫోన్
న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ సంస్థ లెనొవో కొత్తగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. 'ఫాబ్ 2 ప్లస్' పేరుతో మంగళవారం కొత్త స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. అతిపెద్ద తెర కలిగివుండడం ఈ ఫోన్ ప్రత్యేకత. అత్యధిక డేటా వాడే వారి కోసం 6.4 ఫుల్ హెచ్ డీ డిస్ ప్లేతో దీన్ని రూపొందించింది. అమెజాన్ వెబ్ సైట్ లో మాత్రమే ఈ ఫోన్ లభ్యమవుతుంది. 'ఫాబ్ 2 ప్లస్' స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు సరికొత్త అనుభూతి ఇస్తుందని లెనొవో ఇండియా కన్జుమర్, డిజిటల్ మార్కెటింగ్ హెడ్ అమిత్ దోషీ తెలిపారు. ఫింగర్ ప్రింట్ స్కానర్, డాల్బీ అట్మోస్ ఆడియో టెక్నాలజీ, ఫొటోలు మరింత స్పష్టంగా వచ్చేందుకు అవసరమైన ఆధునిక ఫీచర్లు పొందుపరిచినట్టు వెల్లడించారు. డేటా భద్రత కోసం మెక్ ఆఫీ, నెట్ ఫ్లిక్స్, స్విఫ్ట్ కీ సాఫ్ట్ వేర్స్ పెట్టామని చెప్పారు. లెనోవా ఫాబ్ 2 ప్లస్ ఫీచర్లు 4050 ఎంఏహెచ్ బ్యాటరీ 1.8 జీహెచ్ జడ్ ట్రూ 8 కోర్ మీడియా టెక్ ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్ 32 ఇంటర్నల్ మెమరీ 128 జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్ ధర రూ. 14,999 -
ఆ రెండు ఫోన్ల లాంచింగ్ నవంబర్ 8నే!
మోటోరోలా కొత్త స్మార్ట్ఫోన్ డివైజ్ రూపకల్పనలో నిమగ్నమై ఉందని ఇప్పటికే పలు రిపోర్టులు నివేదించాయి. దాని పేరు మోటో ఎమ్ అని, ఆ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉండబోతున్నాయంటూ ఆన్లైన్లో హల్చల్ చేశాయి. రియర్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్తో రాబోతున్న ఈ ఫోన్ లాంచింగ్ నవంబర్ 8న జరుగబోతుందని, దీంతో పాటు లెనోవా వైబ్ పీ2 స్మార్ట్ఫోన్ కూడా లాంచ్ అవుతుందని తాజా రిపోర్టుల బట్టి తెలుస్తోంది. వైబ్ పీ1 విజయం సాధించడంతో, వైబ్ పీ2ను లెనోవా ఆవిష్కరిస్తుందని టెక్డ్రాయిడర్ తెలిపింది. ఆండ్రాయిడ్ సోల్ ఈ ఫోన్కు సంబంధించిన ఫీచర్లను పోస్టు చేసింది. లెనోవా వైబ్ పీ2 ఫీచర్లు 5100 ఎంఏహెచ్ బ్యాటరీ 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ 3జీబీ ర్యామ్+32జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 4జీబీ ర్యామ్+32జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ముందు వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో ఓఎస్ ఇక మోటోరోలా మోటో ఎమ్ ఫీచర్లను పరిశీలిస్తే... 5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 2.1 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6755 ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్ 32జీబీ ఇంటర్నెల్ మెమరీ 3,000ఎంఏహెచ్ బ్యాటరీ 16 ఎంపీ ప్రైమరీ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా -
ఉచిత ప్రమాద బీమాతో ‘లెనోవో’
హైదరాబాద్: దసరా, దీపావళి పండుగలు సమీపిస్తుండటంతో లెనోవో సంస్థ అమ్మకాలు పెంచుకోవటానికి కొత్త ఆఫర్లు ప్రకటించింది. ప్రీమియం లెనోవో ల్యాప్టాప్లు కొనుగోలు చేసినవారికి రెండేళ్ల యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్, రెండేళ్ల అదనపు వారెంటీ ఉచితంగా అందిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలియజేసింది. అనుకోకుండా కింద పడటం, విద్యుత్ హెచ్చుతగ్గుల వల్ల దెబ్బతినటంతో పాటు రిపేరు సాధ్యంకాని డ్యామేజీ జరిగితే ఈ ప్రొటెక్షన్ పనికొస్తుందని కంపెనీ పేర్కొంది. -
లెనోవో పండగ ఆఫర్లు
న్యూఢిల్లీ: దసరా పండగ సందర్భంగా ప్రముఖ మొబైల్ సంస్థ లెనోవో ఆకర్షణీయ ఆఫర్లు ప్రకటించింది. కొత్తగా విడుదల చేసిన జడ్ 2 ప్లస్ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ఇండియా ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ లో భాగంగా ఈ ఆఫర్లు ఇవ్వనుంది. పాత ఫోన్లను మార్చుకుని గరిష్టంగా రూ. 12 వేల వరకు రాయితీ పొందవచ్చని లెనోవో ఒక ప్రకటనలో తెలిపింది. అదనంగా రూ. 2 వేల వరకు క్యాష్ బాక్ అందుకోచ్చని వెల్లడించింది. ఎనిమిది బ్యాంకులు, బజాజ్ ఫైనాన్స్ ఎటువంటి చార్జీలు లేకుండానే ఈఎంఐ మీద ఫోన్లు విక్రయిస్తామని లెనోవో ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ అనుజ్ శర్మ చెప్పారు. డ్యుయల్ సిమ్ ను సపోర్ట్ చేసే జడ్ 2 ప్లస్ ఫోన్ 3 జీబీ(రూ.17,999), 4జీబీ(రూ.19,999) వెరియంట్ లో లభిస్తుంది. జడ్ 2 ప్లస్ ఫీచర్లు 5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే 820 స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ మార్ష్ మాలో 6.0 ఓఎస్ 3 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 13 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4కే వీడియో రికార్డింగ్ 3500 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఎట్రాక్టివ్ ఆఫర్లతో లెనోవో జెడ్ 2 విడుదల
ప్రముఖ మొబైల్ సంస్థ లెనోవో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను సోమవారం లాంచ్ చేసింది. రెండు వేరియంట్లలో 'లెనోవో జెడ్ 2' వస్తున్న ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ను అమెజాన్ ద్వారా భారత మార్కెట్ లోకి అందుబాటులోకి తెచ్చింది.. 32 జీబీ వేరియంట్ ను రూ.17,999, 64 జీబీ వేరియంట్ ను రూ. 19,999గా కంపెనీ నిర్ణయించింది. అంతేకాదు దీనితో పాటు కస్టమర్లకోసం కొన్ని ఎట్రాక్టివ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. లెనోవా జెడ్ 2 ఫీచర్స్ 5 ఇంచెస్ స్క్రీన్, 1920 x 1080 పిక్సెల్ రిజల్యూషన్ క్వాల్కం స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ 13 ఎంపీ ప్రైమ్ కెమెరా,విత్ హైబ్రిడ్ ఆటో ఫోకస్ 8ఎంపీ ఫ్రంట్ కెమెరా 4జీ, 3జీబీ ర్యామ్, 32 ఇంటర్నెల్ మొమరీ 3500 ఎంఏహెచ్ హై డెన్సిటీ లియాన్ బ్యాటరీ ఆఫర్లు సెప్టెంబర్ 26-27 మధ్య కొంటే 100 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కు అర్హులు.15మంది కస్టమర్లకు అమెజార్ గిప్ట్ కార్డు ఆఫర్ కింద ఈ అవకాశం లభించనుంది. సెప్టెంబర్ 26 -అక్టోబర్ 3 మధ్య కొంటే యాత్రా. కాం లో 15 వేల రూపాయల ప్రోమో కోడ్ లభిస్తుంది. దీన్ని నవంబర్ 30లోగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. అలాగే హెడీఎఫ్ సీ డెబిట్ కార్డ్ మీద 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. దీంతోపాటు కిండ్లే యాప్ ద్వారా కొనుగోలు చేస్తే ఈ బుక్స్ కొనుగోళ్లపై 80 శాతం తగ్గింపు, సెప్టెంబర్ 26 -అక్టోబర్ 3 మధ్య ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలపై రూ.500 ప్రత్యేక తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్లను అందుకోవాలంటే అమెజాన్.ఇన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. -
లెనొవొ నుంచి మూడు 4జీ స్మార్ట్ఫోన్స్
న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘లెనొవొ’ తాజాగా మూడు 4జీ స్మార్ట్ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించింది. ఏ6600 ప్రారంభ ధర రూ.6,999గా ఉంది. ఈ స్మార్ట్ఫోన్లో 5 అంగుళాల స్క్రీన్, 1 జీబీ ర్యామ్, 8 ఎంపీ రియర్ కెమెరా, 16 జీబీ మెమరీ, 2,300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇక ఏ6600 ప్లస్లో ఏ6600లో ఏ ఫీచర్లు ఉన్నాయో అవే ఇందులోనూ ఉన్నాయి. అయితే ఇందులో 2 జీబీ ర్యామ్ ఉంటుంది. ఏ7700 ధర రూ.8,540గా ఉంది. ఈ స్మార్ట్ఫోన్లో 5.5 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 2,900 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. -
లాభాల్లో దూసుకుపోయిన లెనోవో
ప్రపంచంలో అతిపెద్ద వ్యక్తిగత కంప్యూటర్ (పీసీ) మేకర్, చైనాకు చెందిన లెనోవా గ్రూప్ లిమిటెడ్ ఫలితాల్లో అదరగొట్టింది. గురువారం ప్రకటించిన మొదటి త్రైమాసికంలో భారీ నికర లాభాలను ఆర్జించింది. ప్రధానంగా పీసీ అమ్మకాల్లో మ్మకాలు గోరువెచ్చని మార్కెట్ అంచనాలు ఓడించింది. బీజింగ్-ఆధారిత లెనోవా 64 శాతం నికర లాభాలను నమోదు చేసింది. గత ఏడాది క్రితం ఇదే కాలంలో 105 మిలియన్ డాలర్లతో పోలిస్తే జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 173 మిలియన్ డాలర్లకు కు పెరిగింది. అయితే ఆదాయంలో 6 శాతం క్షీణతతో 10.5 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. పీసీ మార్కెట్ కారణంగా ఎనలిస్టులు ఊహించిన దాని కంటే కాస్త మెరుగ్గా ఉన్నామని సంస్థ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యాంగ్ యువాన్ జింగ్ తెలిపారు. చైనా స్మార్ట్ఫోన్ మార్కెట్లో తమకు పోటీ చాలా ఆసక్తిగా ఉందని కానీ, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా డిమాండ్ తగ్గిందని స్టాక్ మార్కెట్ ఫైలింగ్ లో తెలిపారు. కాగా ట్రెండ్ ఫోర్స్ అంచనాల ప్రకారం, లెనోవా ప్రపంచ స్మార్ట్ఫోన్ మార్కెట్ 4.5 శాతం వాటాను కలిగి ఉంది. ఏప్రిల్-జూన్ మాసంలో స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో లిమిటెడ్ 24 శాతం, ఆపిల్15 శాతం షేర్ ను సొంతం చేసకున్నాయి. -
లెనోవో ల్యాప్టాప్స్పై క్యాష్బ్యాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లెనోవో విద్యార్థుల కోసం ప్రత్యేక క్యాష్బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.5,100 వరకు క్యాష్బ్యాక్ పొందవచ్చు. మూడేళ్ల వరకు అదనపు వారంటీ, యాక్సిడెంట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ సైతం అందిస్తోంది. వీటి విలువ రూ.7,999. విద్యార్థులు 2 ఈఎంఐ పథకాల్లో వీటిని పొందొచ్చు. లెనోవో ఎక్స్క్లూజివ్ ఔట్లెట్లు, సంస్థ ఆన్లైన్ భాగస్వాముల వద్ద కొనుగోలు చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆగస్టు 15 వరకు ఈ సౌకర్యం ఉంటుందని లెనోవో ఇండియా కన్స్యూమర్, ఈ-కామర్స్ హెడ్ రాజేష్ థడని తెలిపారు. -
చిన్నపిల్లలకు లెనోవా స్పెషల్...
టెక్నాలజీకి ఎక్కువగా ఆకర్షితులవుతున్న చిన్న పిల్లల కోసం, ఓ స్పెషల్ ఎడ్యుకేషనల్ టాబ్లెట్ ను లెనోవా ఆవిష్కరించింది. "సీబీ స్లేట్" పేరుతో ఆవిష్కరించిన ఈ టాబ్లెట్ ను, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కాన్వెజీనియస్ భాగస్వామ్యంతో రూ.8,499కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎడ్యుటైన్ మెంట్ సొల్యూషన్ గా కంపెనీ పిలుచుకునే ఈ లెర్నింగ్ డివైజ్, ఎన్ సీఈఆర్టీ సిలబస్ తో గ్రేడ్ కే-5 స్టూడెంట్లకు అందుబాటులో ఉచ్చింది లెనోవా సీజీ స్లేట్ ఎక్స్ క్లూజివ్ గా ఫ్లిప్ కార్ట్ లో లభ్యం కానుంది. మొదటి 1,000 యూనిట్లను రూ.7,499కు విక్రయించనుంది. అనంతరం రూ.8,499కే కంపెనీ అమ్మకాలు నిర్వర్తించనుంది. సీబీ స్లేట్ ఎడ్యుటైన్ మెంట్ సొల్యూషన్ ప్రధాన ఫీచర్లు... వీడియో స్టోరీలు, డిజిటల్ బుక్స్, వర్క్ షీట్లు, గేమ్స్ ద్వారా వివిధ సబ్జెక్టులను పిల్లలు నేర్చుకోవచ్చు. ఎన్ సీఈఆర్ టీ సిలబస్ ఆధారితంగా వీటిని టాబ్లెట్ లో పొందుపరిచారు. గేమిఫైడ్ విధానం ద్వారా పిల్లుల పాఠాలు నేర్చుకునేలా ఈ టాబ్లెట్ ను రూపొందించారు. ఉత్తేజకరమైన కార్టూన్లు, మూవీలు, గేమ్స్ తో ప్లే జోన్ ను ఏర్పాటుచేశారు. ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ కాయిన్స్ ను పిల్లలు ఈ గేమ్ లో పొందవచ్చు. లెర్నింగ్, ఎంటర్ టైన్ మెంట్, షాపింగ్ కు ఈ టాబ్లెట్ బెస్ట్ ఫ్రెండ్ లా ఈ టాబ్లెట్ ఉండనుంది. ఎడ్యుకేషన్, ఎంటర్ టైన్ మెంట్ కు లెనోవా బెస్ట్ డివైజ్ లను మార్కెట్లోకి విడుదలచేస్తుందని, సీజీ స్లేట్ చిన్న పిల్లలకు నేర్చుకోగలిగినంత జ్ఞానార్జన అనుభూతిని అందిస్తుందని లెనోవా కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ భాస్కర్ చౌదురీ తెలిపారు. ప్రత్యేకతలు.. 7 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే 1.3 జీహెచ్ జడ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ఎమ్ టీ8127 ప్రాసెసర్ 1జీబీ ర్యామ్ 8 జీబీ, 16 జీబీ రెండు స్టోరేజ్ వేరియంట్లు 32 జీబీ వరకూ విస్తరణ మెమెరీ 2 ఎంపీ వెనుక కెమెరా వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 3,450 ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ 3.5 ఎంఎం ఆడియో జాక్ ఫ్రంట్ స్పీకర్, వై-ఫై, బ్లూటూత్ 4.0, మైక్రో యూఎస్ బీ -
లెనోవో 'వైబ్ కె 5' ఓపెన్ అమ్మకాలు నేటినుంచే
చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లెనోవో తన నూతన స్మార్ట్ఫోన్ 'వైబ్ కె 5' ఓపెన్ అమ్మకాలను సోమవారం నుంచి ప్రారంభించింది. ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన ఈ స్మార్ట ఫోన్ ను తొలిసారి ఓపెన్ అమ్మకాల ద్వారా అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలో ఆసక్తి వున్న వినియోగదారులు, ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి అవసరం లేకుండానే అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.6,999 ధరకు ఈ స్మార్ట్ఫోన్ లభ్యం కానుంది. ఎల్టీఈ క్యాట్ 4 మద్దతుతో 150యంబీసీఎస్ డౌప్ లోడ్ వేగం, 50యంబీపీఎస్ అప్ లోడ్ వేగంతో పనిచేస్తుంది. ఇప్పటికే లక్ష మొబైళ్ల అమ్మకాలు చేపట్టినట్టు కంపెనీ ప్రకటించింది. ఇండియాలో తమకు వైబ్ కె5 మంచి ఆదరణ లభిస్తోందని లెనోవా ఇండియా తెలిపింది. లెనోవో వైబ్ కె5 ఫీచర్లు... 5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.2 జీహెచ్జడ్ ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 415 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్, 4జీ 13 మెగాపిక్సెల్, రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 2750 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 గంటల టాక్ టైమ్ 150 గ్రాముల బరువు -
లెనోవో వైబ్ లో కొత్త ఫోన్
ధర రూ.6,999 న్యూఢిల్లీ: చైనా టెక్నాలజీ కంపెనీ లెనోవో తన వైబ్ స్మార్ట్ఫోన్ పోర్ట్ఫోలియోను విస్తరిస్తోంది. ఈ కంపెనీ సోమవారం వైబ్ కే5 స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ. 6,999గా నిర్ణయించామని కంపెనీ తెలిపింది. ఏ6000 స్మార్ట్ఫోన్కు కొనసాగింపుగా దీనిని తెస్తున్నామని పేర్కొంది. ఈ ఫోన్లో 720 బై 1280 పిక్సెల్ రిజల్యూషన్ ఉన్న 5 అంగుళాల హై-డెఫినేషన్ డిస్ప్లే, 64-బిట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 415 ఆక్టాకోర్ సీపీయూ, ట్విన్ డాల్బీ అట్మాస్-ఎనేబుల్డ్ స్పీకర్లు, 2జీబీ డీడీఆర్3 ర్యామ్, 13 మెగా పిక్సెల్ కెమెరా(వెనక వైపు), 5 మెగా పిక్సెల్ ముందు వైపు కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది. బంగారం, వెండి, తదితర రంగుల్లో లభ్యమవుతుందని తెలిపింది. ఈ ఫోన్లను అమెజాన్డాట్ఇన్ ద్వారా విక్రయిస్తామని, ఈ నెల 22 మధ్యాహ్నం 2 నుంచి తొలి ఫ్లాష్ సేల్ ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది. -
టాప్ 5 నుంచి లెనోవా, షియామి ఔట్
వాషింగ్టన్ : ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో చైనా హవా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమే. అయితే ఈ మధ్యకాలంలో చైనా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిస్థితి కొంచెం భిన్నంగా మారినా తన బలాన్ని మాత్రం నిరూపించుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో టాప్-5లో నిలిచిన ఫోన్లలో మూడు స్థానాలను మళ్లీ చైనావే కైవసం చేసుకుంది. అయితే అంతకముందు టాప్-5లో ఉన్న లెనోవా, షియోమిలు మాత్రం తమ స్థానాలను కోల్పొయాయి. కొత్తగా స్మార్ట్ ఫోన్ల ప్రపంచంలోకి ప్రవేశించిన ఒప్పో, వివోలు వాటి స్థానాలను దక్కించుకున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా చైనావే కావడం విశేషం. ఐడీసీ నిర్వహించిన సర్వేలో 2016 మొదటి త్రైమాసికంలో శ్యామ్ సంగ్ మొదటిస్థానంలో నిలవగా, యాపిల్ రెండో స్థానంలో, హ్యువాయ్ మూడో స్థానంలో నిలిచాయి. 4.5 శాతంతో శ్యామ్ సంగ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను ఏలుతుండగా, 15.3శాతం మార్కెట్ షేరును మాత్రమే యాపిల్ కలిగిఉందని సర్వే వెల్లడించింది. హ్యువాయ్ అమ్మకాలు 58 శాతం పెరిగి, 8.2 శాతం మార్కెట్ షేరును కల్గిఉందని సర్వే గుర్తించింది. కొత్తగా వచ్చిన ఒప్పో, వివో కంపెనీ స్మార్ట్ ఫోన్ లు చైనీస్ మార్కెట్ తోపాటు బయట మార్కెట్లోకి ఎక్కువగా విస్తరిస్తున్నాయని సర్వే పేర్కొంది. ఇలా వాటి షేరును పెంచుకోవడం వల్లనే లెనోవా,షియోమిలకు గట్టి పోటీని ఇచ్చి, వెనక్కి నెట్టేశాయని సర్వే తెలిపింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ వృద్ధి కేవలం 0.2 శాతం మాత్రమే ఉందని, 334.9మిలియన్ సరుకు రవాణా జరుగుతుందని ఐడీసీ రీసెర్చ్ సర్వే వెల్లడించింది. -
లెనోవో ధర పడిపోయిందోచ్!
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవో తన వైబ్ సిరీస్ మొబైల్ ధరను భారీగా తగ్గించింది. సెల్సీల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన వైబ్ ఎస్1ను గత నవంబర్ నెలలో రూ.15,999/- ధరతో మార్కెట్లోకి విడుదలైంది. ఆండ్రాయిడ్ 5.0తో అందుబాటులో ఉన్న ఈ ఫోన్లో 5అంగుళాల స్క్రీన్, 8 మెగా పిక్సల్ రీర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాలు ఇందులో ఉన్నాయి. ఫోటోల కోసం ప్ర్తత్యేకంగా ఫోటో ఎడిటింగ్ ఫీచర్ను అందుబాటులో ఉంచారు. 64 బిట్, 1.7జీహెచ్జడ్ ఆక్టాకోర్ మీడియా టెక్ ప్రాసెసర్ను ఇందుకు జత చేశారు. 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో లభ్యమయ్యే ఈ మొబైల్ను 128 జీబీ సామర్ధ్యం వరకు విస్తరించుకోవచ్చు. ఎస్ 1 ధరను రూ.15,999/- నుంచి రూ.12,999/-కు తగ్గిస్తున్నట్లు లెనోవో ఇండియా తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. మార్చిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. -
లెనోవో నుంచి ‘వైబ్ కే5 ప్లస్’
న్యూఢిల్లీ: చైనా టెక్నాలజీ దిగ్గజ కంపెనీ లెనోవో తాజాగా ‘వైబ్ కే5 ప్లస్’ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.8,499. ‘వైబ్ కే5 ప్లస్’ స్మార్ట్ఫోన్లో 2 జీబీ ర్యామ్, క్వాల్కామ్ 64-బిట్ స్నాప్డ్రాగన్ 616 ఆక్టాకోర్ ప్రాసెసర్, 5 అంగుళాల తెర, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ మెమరీ, 2,750 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలి పింది. కొత్త స్మార్ట్ఫోన్స్ ఈ నెల 23 నుంచి ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. -
సిమ్ కార్డు లేకుండా రోమింగ్ ఇంటర్నెట్!
వినియోగదారులకు లెనోవో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. సిమ్ కార్డు లేకుండా ఇంటర్నెట్ సౌకర్యంతోపాటు, గ్లోబల్ రోమింగ్ సేవలనూ అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం వెళ్లినపుడు వినియోగదారులు రోమింగ్ అప్ డేట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ టెలికాం సంస్థలు ఇటీవల ఉచిత రోమింగ్ సౌకర్యాన్ని కల్పించినా మిగిలిన ప్రైవేటు వినియోగదారులంతా రోమింగ్ ఛార్జీల మోత భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో లెనెవో 'కనెక్ట్' అనే అత్యాధునిక సదుపాయాన్ని వినియోగదారులకు అందిస్తోంది. ఒక్కసారి రీచార్జి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆ ప్లాన్ ఎక్కడైనా వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది. ముందుగా ఈ సరికొత్త ప్లాన్ను చైనాలో ప్రవేశపెడుతోంది. వినియోగదారులకు రోమింగ్ ఖర్చులు తగ్గించేందుకు లెనోవో కృషిచేస్తోంది. ఒక్క స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు బిల్డ్ ఇన్ కనెక్టివిటీ ఉన్న పీసీ, టాబ్లెట్ వంటి ఏ పరికరాల్లోనైనా లోకల్ సిమ్ తోనే ఏదేశంలోనైనా ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సేవను వాడుకునేలా చేస్తోంది. దీంతో వినియోగదారులకు బిల్లుల మోతను తగ్గిస్తోంది. కనెక్ట్ ఫీచర్తో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే సుమారు 50 దేశాల్లో ఎక్కడ తిరిగినా రోమింగ్ సమస్య లేకుండా ఇంటర్నెట్ వాడుకునే వీలు కల్పిస్తోంది. థింక్ ప్యాడ్ ల్యాప్ టాప్కూ త్వరలో ఈ సదుపాయాన్ని యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాల్లోని మరో 45 దేశాల్లో అందించేందుకు లెనొవో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మొబైల్ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటర్ గా పేరు తెచ్చున్న లెనొవో ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉంది. తాజాగా ఈ కనెక్ట్ వర్చువల్ డేటా నెట్వర్క్ సేవలను ప్రారంభించి గ్లోబల్ రోమింగ్ సర్వీసుతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మరింత చేరువ కానుంది. తరచుగా ప్రయాణాలు చేసేవారికి, వ్యాపారస్తులకు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని లెనొవో వైస్ ప్రెసిడెంట్ వాంగ్ ష్వాయి చెబుతున్నారు. -
ప్రపంచపు అతి పలుచని కన్వర్టబుల్ ల్యాప్టాప్!
‘యోగా 900ఎస్’ను ఆవిష్కరించిన లెనొవొ న్యూఢిల్లీ: చైనా టెక్నాలజీ దిగ్గజ కంపెనీ లెనొవొ తాజాగా తన యోగా సిరీస్లోనే ప్రపంచపు అతి పలుచనైన (12.8 మిల్లీమీటర్లు) కన్వర్టబుల్ ల్యాప్టాప్ ‘యోగా 900ఎస్’తో సహా పలు ఉత్పత్తులను మార్కెట్లో ఆవిష్కరించింది. ‘యోగా 900ఎస్’లో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, తక్కువ బరువు (999 గ్రాములు), 10.5 గంటల వీడియో ప్లేబ్యాక్, డాల్బీ ఆడియోను అందించే ఇంటెల్ కోర్ ఎం7 ప్రాసెసర్, క్రిస్టల్ క్లియర్ రిజల్యూషన్ను అందించే క్యూహెచ్డీ స్క్రీన్ (2,560x1,440) వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. వీటితోపాటు లెనొవొ కంపెనీ ఐడియాప్యాడ్ వై900, ఐడియాసెంటర్ వై900 ఆర్ఈ, లెనొవొ వై27జీ అండ్ వై27జీ ఆర్ఈ కర్వ్డ్ గేమింగ్ మానిటర్స్, ఐడియాసెంటర్ 610ఎస్, ఐడియాప్యాడ్ 700, 710ఎస్ వంటి తదితర ఉత్పత్తులను మార్కెట్లో ఆవిష్కరించింది. కంపెనీ ఈ ఉత్పత్తులన్నింటినీ జనవరి 6 నుంచి 4 రోజులపా టు లాస్ఏంజిలిస్లో జరగనున్న ‘ఇంటర్నేషనల్ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షో’లో ప్రదర్శించనున్నది. కొత్త స్మార్ట్ఫోన్స్ కూడా... లెనొవొ కంపెనీ ‘వైబ్ ఎస్1 లైట్’, ‘వైబ్ కే4 నోట్’ అనే రెండు స్మార్ట్ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించింది. ‘వైబ్ ఎస్1 లైట్’లో 5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 2,700 ఎంఏహెచ్ బ్యాటరీ, 1.3 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4జీ, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక ‘వైబ్ కే4 నోట్’ స్మార్ట్ఫోన్లో 5.5 అంగుళాల తెర, 3 జీబీ ర్యామ్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. దీని ధర రూ.11,999. వైబ్ కే4 నోట్ స్మార్ట్ఫోన్ల ఫ్లాష్ సేల్స్ జనవరి 19 నుంచి అమెజాన్లో ప్రారంభమౌతాయని కంపెనీ వెల్లడించింది. -
లెనోవో నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు
న్యూఢిల్లీ: మరో రెండు కొత్త మోడల్ స్మార్ట్ఫోన్లు భారత్ మార్కెట్లోకి వచ్చాయి. చైనా కంపెనీ లెనోవో బుధవారం కొత్త మోడల్స్ వైబ్ పీ1, వైబ్ పీ1 ఎమ్ ను విడుదల చేసింది. వైబ్ పీ1 మొబైల్ ధర 15,999, వైబ్ పీ1 ఎమ్ ధర .7,999 రూపాయలు. వీటిని ఫ్లిప్కార్ట్ ద్వారా ఆన్లైన్లో అమ్మకానికి పెట్టారు. వైబ్ పీ1ఎమ్ మోడల్స్ను వెంటనే ఆన్లైన్ విక్రయిస్తుండగా.. వైబ్ పీ1 ఫోన్లను వచ్చే వారం నుంచి అందుబాటులోకి వస్తాయి. వైబ్ పీ1 మొబైల్లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 2 జీబీ ర్యామ్, 13 మెగాపిక్సెల్ కెమెరా, యూఎస్బీ, పవర్ సేవ్ బటన్, ఫింగర్ ప్రింట్ స్కానర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక వైబ్ పీ1 ఎమ్లో 8 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగాఫిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెండు మోడళ్లలోనూ తొందరగా ఛార్జింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. -
లెనొవొ ‘కె3 నోట్’@ 9,999
విక్రయాలు ఫ్లిప్కార్ట్లోనే న్యూఢిల్లీ : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ లెనొవొ తాజాగా ‘కె3 నోట్’ పేరిట కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని కోసం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ట్ఫోన్ ధర రూ.9,999. ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఓఎస్పై పనిచేసే ఈ స్మార్ట్ఫోన్లో 4జీ, 5.5 అంగుళాల హెచ్డీ తెర, 1.7 గిగాహెర్ట్జ్ఆక్టాకోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్ఫోన్ రిజిస్ట్రేషన్ ఫ్లిప్కార్ట్లో గురువారం నుంచి ప్రారంభ మయ్యింది. -
లెనొవొ కొత్త స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్లో మాత్రమే..
న్యూఢిల్లీ : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ లెనొవొ తాజాగా 'కె3 నోట్' అనే కొత్త స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని కోసం ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ఫోన్ ధర రూ.9,999. ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఓఎస్పై పనిచేసే ఈ స్మార్ట్ఫోన్లో 4జీ, 5.5 అంగుళాల హెచ్డీ స్క్రీన్, 1.7 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్ రిజిస్ట్రేషన్ ఫ్లిప్కార్ట్లో గురువారం నుంచి ప్రారంభమయ్యింది. -
లెనొవొ నుంచి మరిన్ని యోగ సిరీస్ ల్యాప్టాప్స్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ పీసీ తయారీ కంపెనీ లెనొవొ ప్రత్యేకించి విద్యార్థుల కోసం మరిన్ని యోగ సిరీస్ ల్యాప్టాప్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కన్వర్టబుల్ ల్యాప్టాప్ల ధర రూ. 30,000 నుంచి రూ.1,14,000 శ్రేణిలో ఉంటుంది. లెనొవొ స్టోర్లలో లభ్యంకానున్న యోగ 300 ల్యాప్టాప్ ధర రూ.30,490. యోగ 500 ల్యాప్టాప్ ధర రూ.57,990. అలాగే యోగ 3 ల్యాప్టాప్ (14 అంగుళాలు) ధర రూ.86,990. కన్సూమర్ కన్వర్టబుల్ ల్యాప్టాప్ విభాగంలో తాము ఇతర కంపెనీలతో పోలిస్తే ముందున్నామని లెనొవొ ఇండియా డెరైక్టర్ శైలేంద్ర కత్యాల్ తెలిపారు. -
థింక్ప్యాడ్ శ్రేణిలో సరికొత్త ల్యాప్టాప్లు...
లాస్వేగాస్లో మంగళవారం ప్రారంభమైన కన్స్యూమరల్ ఎగ్జిబిషన్ సీఈఎస్ 2015లో లెనోవో వేర్వేరు మోడళ్ల ల్యాప్టాప్లను విడుదల చేసింది. థింక్ప్యాడ్ శ్రేణిలో ల్యాప్టాప్లతోపాటు వాటికి అవసరమైన యాక్సెసరీస్ను కూడా పరిచయం చేసింది. మొత్తమ్మీద థింక్ప్యాడ్ ఈ, టీ, ఎల్, ఎక్స్ పేర్లతో ఎనిమిది ల్యాప్టాప్లను విడుదల చేయగా వీటన్నింటిలో ఇంటెల్ ఐదవతరం మైక్రోప్రాసెసర్ బ్రాడ్వెల్ను ఉపయోగించడం ఒక విశేషం. థింక్ప్యాడ్ ఎక్స్1 కార్బన్ 14 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్, టచ్ స్క్రీన్ ఆప్షన్లు కలిగి ఉంది. దాదాపు 1.2 కిలోల బరువు ఉండే ఈ ల్యాప్టాప్లో ఏకంగా 8 జీబీల ర్యామ్ ఉంటుంది. 128 జీబీ, 180 జీబీ, 256 జీబీ, 320 జీబీల హార్డ్డ్రైవ్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. అవసరమనుకుంటే ఈ ల్యాప్టాప్ను ఎల్టీఈ కనెక్టివిటీ ఆప్షన్తో తీసుకోవచ్చు. దాదాపు రూ.80 వేల ఖరీదు చేసే ఈ ల్యాప్టాప్తోపాటు లెనవూ ఎల్టీఈ హాట్స్పాట్లు, పవర్బ్యాంక్లు, బ్లూటూత్ స్పీకర్లను కూడా విడుదల చేసింది. -
లెనవూ కొత్త ల్యాప్టాప్లు..
కొత్త సరకు చైనీస్ కంప్యూటర్ తయారీ సంస్థ లెనవూ తాజాగా సరికొత్త ల్యాప్టాప్, ఆల్ఇన్వన్ పీసీలను భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటిల్లో లెనవూ జీ40/50 ఎంట్రీలెవెల్ ల్యాప్టాప్. ఇందుకు తగ్గట్టుగానే వీటిల్లో ఇంటెల్ కోర్ ఐ3, లేదా ఏఎండీ ఏ8 బీమా ప్రాసెసర్లు ఉంటాయి. గ్రాఫిక్స్ కోసం 2జీబీ ఎన్విడియా జీఈఫోర్స్ జీటీ820ఎం ప్రాసెసర్ను, జీ50లో జీటీ840ఎం ప్రాసెసర్ను ఉపయోగించింది. స్క్రీన్సైజు 14, 15.6 అంగుళాలు. రెండింటిలోనూ 16 జీబీ డీడీఆర్3ఎల్ ర్యామ్, ఒక టెరాబైట్ హార్డ్డిస్క్లు ఉన్నాయి. అవసరమైతే ఒక టెరాబైట్ హైబ్రిడ్ డ్రైవ్ను ఎంచుకోవచ్చు. వీటి ధర రూ.22,900 వరకూ ఉండవచ్చు. ఇక మధ్యమశ్రేణిలో లెనవూ జెడ్50 పేరుతో మరో ల్యాప్టాప్ను అందుబాటులోకి తెచ్చింది.దీని స్క్రీన్సైజు 15.6 అంగుళాలు. రెండు గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ను ఉపయోగించారు. ఎనిమిది గిగాబైట్ల డీడీఆర్3ఎల్ ర్యామ్, ఒక టెరాబైట్ హార్డ్డిస్క్/ 500 జీబీ హైబ్రిడ్ డిస్క్ల ఆప్షన్స్ ఉన్నాయి. జీ40/జీ50, జెడ్ 50ల బ్యాటరీలు నాలుగు నుంచి 5 గంటలపాటు పనిచేస్తాయని కంపెనీ చెబుతోంది. ఇక సీ260 ఆల్ ఇన్వన్ పీసీ విషయం చూద్దాం. దాదాపు 20 అంగుళాల స్క్రీన్సైజుతో వచ్చే ఈ పీసీలో 2.41 గిగాహెర్ట్జ్ క్లాక్స్పీడ్తో పనిచేసే ఇంటెల్ పెంటియమ్ ప్రాసెసర్ను ఉపయోగించారు. ర్యామ్ 8 జీబీ, హర్డ్డిస్క్ సామర్థ్యం ఒక టెరాబైట్. ఇవికాకుండా లెనవూ కొత్తగా రూ.60వేలు విలువ చేసే యోగా -2 కన్వర్టిబుల్ను, రూ.42 వేల ఖరీదు చేసే ఫ్లెక్స్-2ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ పీసీలు, ల్యాప్టాప్లన్నీ విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తాయి. -
లెనోవో చేతికి మోటరోలా
మొబైల్స్ వ్యాపారాన్ని విక్రయించనున్న గూగుల్... డీల్ విలువ 2.91 బిలియన్ డాలర్లు మోటరోలా పేటెంట్లు మాత్రం గూగుల్ వద్దే.. మొబైల్స్ మార్కెట్లో యాపిల్, శామ్సంగ్తో పోటీకి లెనోవో ప్రణాళికలు బీజింగ్/హ్యూస్టన్: మోటరోలా మళ్లీ చేతులు మారనుంది. సెర్చింజిన్ దిగ్గజం గూగుల్కు 22 నెలల పాటు మోటరోలాతో ఉన్న బంధానికి తెరపడింది. చైనా టెక్నాలజీ దిగ్గజం లెనోవోకు మోటరోలా మొబిలిటీ వ్యాపారాన్ని(మొబైల్ ఫోన్ల తయారీ) విక్రయించాలని గూగుల్ నిర్ణయించింది. ఈ మేరకు లెనోవోతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ 2.91 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.18,000 కోట్లు)గా గూగుల్ వెల్లడించింది. తద్వారా ఒక చైనా కంపెనీ విదేశాల్లో జరిపిన అదిపెద్ద టెక్నాలజీ టేకోవర్ డీల్గా ఇది నిలవనుంది. గూగుల్ కొన్నది 12.5 బిలియన్ డాలర్లకు... ఒకప్పుడు మొబైల్ ఫోన్ల తయారీలో అగ్రగామిగా వెలుగొందిన మోటరోలా క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోయి చివరకు దివాలా తీయడం తెలిసిందే. దీన్ని 2012లో గూగుల్ 12.5 బిలి యన్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే, తాజాగా లెనోవోతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కేవలం మొబైల్ ఫోన్ల తయారీ వ్యాపారాన్ని మాత్రమే గూగుల్ విక్రయించింది. మోటరోలాకు ఉన్న 17,000 కీలక పేటెంట్లు మాత్రం తనవద్దే అట్టిపెట్టుకోవడం విశేషం. మోటరోలా కేబుల్ బాక్స్ వ్యాపారాన్ని ఇదివరకే గూగుల్ అమ్మేసింది. కాగా, లెనోవోతో డీల్ను అమెరికా, చైనా ప్రభుత్వాలు ఆమోదించాల్సి ఉంటుంది. వారంలో రెండో భారీ డీల్... అంతర్జాతీయంగా కంప్యూటర్ హార్డ్వేర్, మొబైల్స్ తయారీలో దూసుకెళ్తున్న లెనోవో... ఐబీఎంకు చెందిన పర్సనల్ కంప్యూటర్ల తయారీ వ్యాపారాన్ని 2005లోనే చేజిక్కించుకుంది. దీంతో ప్రపంచంలో టాప్ పీసీ తయారీ కంపెనీల్లో ఒకటిగా అవతరించింది. అలాగే ఈ నెల 24న ఐబీఎం లో-ఎండ్ సర్వర్ల బిజినెస్ను 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు మోటరోలాను దక్కించుకోవడంతో వారం వ్యవధిలోనే రెండు భారీ కొనుగోళ్ల డీల్స్ను లెనోవో కుదుర్చుకున్నట్లయింది. కాగా, మొబైల్స్ మార్కెట్లో వెనుకబడిన మరో దిగ్గజం బ్లాక్బెర్రీని లెనోవో కొనుగోలు చేయనుందని ఇదివరకే కథనాలొచ్చాయి. మోటరోలాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ ఊహాగానాలకు ప్రస్తుతానికి తెరపడినట్లే. శామ్సంగ్, యాపిల్తో పోటీ... అంతర్జాతీయంగా మొబైల్ హ్యాండ్సెట్ల(ప్రధానంగా స్మార్ట్ఫోన్లు) మార్కెట్ను శాసిస్తున్న శామ్సంగ్, యాపిల్లతో ఇక లెనోవో పోటీపడే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మోటరోలా కొనుగోలుతో అంతర్జాతీయంగా మొబైల్స్ మార్కెట్లో మరింత విస్తరించేందుకు దోహదం చేస్తుందనేది వారి అభిప్రాయం. ‘పేరొందిన బ్రాండ్, వినూత్న ఉత్పత్తుల పోర్ట్ఫోలియో, ప్రపంచవ్యాప్తంగా అత్యంత నైపుణ్యంగలిగిన సిబ్బంది ఉన్న మోటరోలా మొబిలిటీని కొనుగోలు చేయడం వల్ల స్మార్ట్ఫోన్ల మార్కెట్లో గ్లోబల్ శక్తిగా అవతరించేందుకు మాకు అవకాశం లభించనుంది’ అని లెనోవో చైర్మన్, సీఈఓ యాంగ్ యువాన్క్వింగ్ వ్యాఖ్యానించారు. ఐడీసీ గణాం కాల ప్రకారం... శామ్సంగ్, యాపిల్ల తర్వాత ప్రపంచ స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరో చైనా దిగ్గజం హ్యువాయ్ మూడో స్థానంలో(4.9% వాటా) నిలుస్తోంది. ఆలస్యంగా ఈ విభాగంలోకి అడుగుపెట్టిన లెనోవో కూడా 4.5 శాతం వాటాతో నాలుగో స్థానంలో ఉంది(చైనాలో టాప్-2). ఇప్పుడు మోటరోలా డీల్తో మూడో స్థానంలోకి రావచ్చనేది యువాన్క్వింగ్ అంచనా. 2015లో 10 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా ఆయన చెప్పారు. లెనోవో గతేడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో 13.6 శాతం మార్కెట్ వాటాతో భారత్లో రెండో అతిపెద్ద పీసీల విక్రేతగా నిలిచింది. ఎందుకు అమ్మేసింది... {పపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల మార్కెట్లో గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో తనే మొబైల్ హ్యాండ్సెట్లను కూడా తయారు చేసి విక్రయిస్తే ఈ రంగంలోనూ అగ్రస్థానాన్ని కొల్లగొట్టవచ్చని గూగుల్ యోచించింది. ఈ ప్రణాళికతోనే దివాలాతీసిన మోటరోలాను కొనుగోలు చేసింది. అయితే, ఈ ప్లాన్ గూగుల్కు ఏమంత కలిసిరాలేదు. శామ్సంగ్, యాపిల్ ఇతరత్రా దిగ్గజాల ముందు చేతులెత్తేసింది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ మార్కెట్లో గూగుల్ వాటా 2012లో 2.3%గా ఉండగా... 2013లో ఇది 1%కి పడిపోయినట్లు రీసెర్చ్ సంస్థ ఐడీసీ పేర్కొంది. గూగుల్ కొనుగోలు చేసిన తర్వాత మోటరోలా ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్పై ‘మోటో ఎక్స్’, ‘మోటో జీ’ పేర్లతో స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. టెక్నాలజీపరంగా మంచి మార్కులే పడినప్పటికీ వీటి సేల్స్ అంతంతే. మరోపక్క, మోటరోలా ఆదాయం కూడా భారీగా పడిపోతూ వచ్చింది. గతేడాది మూడో క్వార్టర్(జూలై-సెప్టెంబర్)లో ఆదాయం 1.18 బిలియన్ డాలర్లకు పడిపోయింది(2012 ఇదే క్వార్టర్లో 1.78 బిలియన్ డాలర్లు). గతేడాది క్యూ3లో నష్టాలు మరింత తీవ్రతరమై 25.9 కోట్ల డాలర్లకు చేరాయి. ఈ ప్రతికూల పరిస్థితులన్నింటీ బేరీజు వేసుకునే ఇక మోటరోలా మొబిలిటీ వ్యాపారాన్ని గూగుల్ వదిలించుకుందననేది నిపుణుల విశ్లేషణ. -
లెనోవో చేతికి ఐబీఎం సర్వర్ వ్యాపారం
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం ఐబీఎంకు చెందిన దిగువస్థాయి సర్వర్ బిజినెస్ను (ఎక్స్86) పీసీ తయారీ దిగ్గజం లెనోవో కొనుగోలు చేయనుంది. ఈ విషయమై ఉభయుల మధ్యా వెనక్కి తగ్గటానికి వీల్లేని ఒప్పందం కుదిరింది. డీల్ విలువ 230 కోట్ల డాలర్లు (సుమారు రూ. 14,000 కోట్లు) కాగా, టెక్నాలజీ విభాగంలో ఒక చైనీస్ కంపెనీ చేపట్టిన అతిపెద్ద కొనుగోలు ఇదే. దీనిలో భాగంగా ఐబీఎంకు 200 కోట్ల డాలర్లను నగదు రూపంలో లెనోవో చెల్లిస్తుంది. మిగిలిన మొత్తానికి వాటాలను కేటాయిస్తుంది. దీన్ని రెండు కంపెనీలూ సంయుక్తంగా ప్రకటించాయి. ఒప్పందం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఐబీఎంకు సర్వర్ విభాగంలో ఉన్న 7,500 మంది ఉద్యోగులు లెనోవోకు బదిలీ అవుతారు. 2005లో ఐబీఎంకు చెందిన పీసీ బిజినెస్ను సైతం లెనోవో సొంతం చేసుకోవటం తెలిసిందే. కొనుగోలులో భాగంగా థింక్ప్యాడ్ పీసీ విభాగాన్ని సైతం దక్కించుకుంది. -
లెనొవో ఐడియాప్యాడ్ ఏ10 @ రూ.19,990
బెంగళూరు: పర్సనల్ కంప్యూటర్లు తయారు చేసే లెనొవొ కంపెనీ కొత్త నోట్బుక్, ఐడియాప్యాడ్ ఏ10ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ ఆధారిత ఈ డ్యుయల్-మోడ్ నోట్బుక్ ధర రూ.19,990 అని పేర్కొంది. పూర్తి సైజ్ కీ బోర్డ్తో కూడిన 10.1 అంగుళాల డిస్ప్లే ఉన్న ఈ హైబ్రిడ్ డివైస్ను 300 డిగ్రీల కోణంలో ఫ్లిఫ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఓఎస్పై పనిచేసే ఈ నోట్బుక్లో 10 పాయింట్ మల్టీ-టచ్ ఫీచర్, కోర్టెక్స్ -ఏ9 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 0.3 మెగా పిక్సెల్ వెబ్క్యామ్, 32 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్, మైక్రో-యూఎస్బీ పోర్ట్, రెండు యూఎస్బీ 2.0 పోర్ట్లు, మైక్రో హెచ్డీఎంఐ పోర్ట్, మైక్రో ఎస్డీ కార్డ్ రీడర్, ఒక్కసారి చార్జింగ్ చేస్తే 10 గంటల చార్జింగ్ ఉండే బ్యాటరీ లైఫ్ వంటి ప్రత్యేకతలున్నాయి. -
లెనావూ నుంచి క్వాడ్కోర్ ప్రాసెసర్ స్మార్ట్ఫోన్!
లెనావూ నుంచి వైబ్ ఎక్స్ స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ నెలలో బెర్లిన్లో జరిగిన ఐఎఫ్ఏ-2013లో ప్రదర్శితం అయిన ఈ స్మార్ట్ఫోన్ రూ.25,999 ధరకి భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. 6.9 మిల్లీమీటర్ల థిన్నెస్తో ఉండే ఈ స్మార్ట్ఫోన్ 120 గ్రాముల బరువు ఉంటుంది. క్వాడ్కోర్ ప్రాసెసర్ ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకత. ఆండ్రాయిడ్(4.2) జెల్లీబీన్ వెర్షన్పై పనిచేస్తుంది. 2 జీబీ ర్యామ్తో రేర్ సైడ్ కెమెరా 13 మెగా పిక్సెల్స్తో ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్స్తో ఉంటుంది. ఇది 16 జీబీ స్మార్ట్ఫోన్. డ్యూయెల్ సిమ్ మెయింటెయిన్ చేయొచ్చు. నిద్రలోకి జారితే హెచ్చరిస్తుంది..! సరికొత్త హెడ్సెట్లా కనిపిస్తున్న ఈ పరికరం పేరు ‘విగో’. ధరించినవారు నిద్రమత్తులో జోగితే హెచ్చరించడం దీని ప్రత్యేకత. డ్రైవర్లు నిద్రలోకి జారినా, తరగతి గదిలో లేదా సమావేశాల్లో ఉపన్యాసాలు వింటూ కళ్లు మూతలు పడుతున్నా ఇది హెచ్చరిస్తుంది. బ్లూటూత్ సాయంతో స్మార్ట్ఫోన్కు అనుసంధానమై పనిచేసే విగో... ఇన్ఫ్రారెడ్ సెన్సర్, యాక్సిలెరోమీటర్, ప్రత్యేక ఆల్గారిథమ్ల సాయంతో వ్యక్తుల కళ్లు మూసుకు పోయినా, శరీరం తూలిపోయినా, మెదడు అలసిపోయినా గుర్తించి అప్రమత్తం చేస్తుంది. మిమ్మల్ని ఎప్పుడు, ఎలా హెచ్చరించాలో.. పని మధ్యలో విరామం ఎప్పుడు తీసుకోవాలో ఇది గుర్తుచేసేందుకు కూడా స్మార్ట్ఫోన్లో సెట్టింగ్స్ ద్వారా ఎంచుకోవచ్చు. చిన్నగా వైబ్రేషన్తో హెచ్చరించాలా..? ఎల్ఈడీ కాంతి వెలుగుతూనా..? లేక పాట పాడుతూనా..? అన్నదీ నిర్ణయించుకోవచ్చు. దీనిని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధకులు తయారుచేశారు. అన్ని ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లతో పనిచేస్తుంది. దీని ధర రూ.3,600. -
ఇక చౌక ధరల లెనోవో స్మార్ట్ఫోన్లు
ముంబై: లెనోవో కంపెనీ చౌక ధరల స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఏ సిరీస్లో 4 స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ నాలుగు ఫోన్లు-ఏ269ఐ, ఏ369ఐ, ఏ516, ఏ850 ధరలు రూ. 5,499 నుంచి రూ.15,999 రేంజ్లో ఉన్నాయి. ఏ850 ఫోన్లో 1.3 గిగాహెర్ట్స్ క్వాడ్కోర్ ప్రాసెసర్ ఉండగా, మిగిలిన మూడు స్మార్ట్ఫోన్లలో డ్యుయల్ కోర్ ప్రాసెసర్లు ఉన్నాయి. ఇక ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.2 ఓఎస్పై పనిచేసే ఏ850 స్మార్ట్ఫోన్లో 5.5 అంగుళాల డిస్ప్లే, 5 మెగా పిక్సెల్ కెమెరా, 4జీబీ మెమొరీ, 32 జీబీ ఎక్స్పాండ్ చేసుకోగల మెమొరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ధర రూ.15,999. ఏ516లో ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఓఎస్, 4.5 అంగుళాల ఐపీఎస్ ప్యానెల్ డిస్ప్లే, 5 మెగా పిక్సెల్ కెమెరా, 4జీబీ మొమెరీ, 32 జీబీ వరకూ ఎక్స్పాండ్ చేసుకోగల మెమొరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ధర రూ.10,999. ఇక ఏ369ఐ ఫోన్లో 4 అంగుళాల డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఓఎస్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ మెమొరీ వంటి ప్రత్యేకతలున్నాయి. ధర రూ.6,999. ఇక 3.5 అంగుళాల డిస్ప్లే ఉన్న ఏ269 స్మార్ట్ఫోన్ ధర రూ.5,499. -
లెనోవో నుంచి కొత్త గేమింగ్ పీసీలు
బెంగళూరు: పర్సనల్ కంప్యూటర్లు తయారుచేసే లెనోవో కంపెనీ కొత్త రేంజ్ గేమింగ్ పీసీలను సోమవారం విడుదల చేసింది. వీటి ధరలు రూ.50,990 నుంచి రూ.1,36,500 రేంజ్లో ఉన్నాయని లెనోవో ఇండియా డెరైక్టర్(కన్సూమర్) శైలేంద్ర కత్యాల్ పేర్కొన్నారు. ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్తో తయారైన ఈ గేమింగ్ పీసీలు విండోస్ 8 ఓఎస్పై పనిచేస్తాయని తెలిపారు. లెనోవో ఐడియా ప్యాడ్ జడ్ 510 ధర రూ.50,990, లెనొవొ ఐడియా ప్యాడ్ వై 510పి ధర రూ.69,990, లెనోవో ఐడియా సెంటర్ హొరైజన్ 27 ధర రూ.1,36,500 అని వివరించారు.