ఎల్‌ఈటీ టాప్‌ కమాండర్‌ ఖతం! | LeT commander killed in encounter in Kashmir | Sakshi

బ్రేకింగ్‌: ఎల్‌ఈటీ టాప్‌ కమాండర్‌ ఖతం!

Aug 1 2017 10:14 AM | Updated on Jul 26 2019 4:12 PM

ఎల్‌ఈటీ టాప్‌ కమాండర్‌ ఖతం! - Sakshi

ఎల్‌ఈటీ టాప్‌ కమాండర్‌ ఖతం!

లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) టాప్‌ కమాండర్‌ అబు దుజనా మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు...

శ్రీనగర్‌: కశ్మీర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) టాప్‌ కమాండర్‌ అబు దుజనా మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినట్టు తెలుస్తోంది. పుల్వామా జిల్లాలో మంగళవారం ఉదయం భద్రతాదళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో అబు (27)తోపాటు మరో మిలిటెంట్‌ చనిపోయాడని స్థానిక టీవీ చానెళ్లు తెలిపాయి. పుల్వామాలోని హక్రిపోరా గ్రామంలో మిలిటెంట్లుకు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలో భద్రతా దళాలు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తుండగా ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని, చనిపోయిన ఉగ్రవాదుల మృతదేహాలను ఇంకా తాము స్వాధీనం చేసుకోలేదని, కాబట్టి ఎవరు చనిపోయింది ఇప్పుడే చెప్పలేమని కశ్మీర్‌ ఐజీ మునీర్‌ ఖాన్‌ విలేకరులకు తెలిపారు.

పాకిస్థాన్‌ ఆక్రమిక కశ్మీర్‌లోని గిల్గిట్‌-బాల్టిస్తాన్‌ ప్రాంతానికి చెందిన అబు దుజనా దక్షిణ కశ్మీర్‌లో జరిగిన చాలా మిలిటెంట్‌ దాడుల వెనక ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement