వేలూరు: తమిళనాడులోని వేలూరు సమీపంలోగురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. 32 మంది గాయపడ్డారు. మినీలారీ లోయలోకి బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి లారీ లోయలోకి బోల్తా పడింది.
ప్రమాద సమయంలో లారీలో దాదాపు 40 మంది ఉన్నారు. వీరందరూ వేలూరు సమీపంలోని ఆలయానికి వెళ్లి తిరిగొస్తున్నారు. గాయపడిన వారిని వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మినీ లారీ బోల్తా; ఏడుగురు మృతి
Published Thu, Oct 23 2014 4:28 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement