దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా.. | 2 Members Died And 2 Severely Injured From Hyderabad In Tamil Nadu Road Accident Returning From Sabarimala | Sakshi
Sakshi News home page

దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా..

Dec 19 2024 8:42 AM | Updated on Dec 19 2024 10:39 AM

road accident in hyderabad

తమిళనాడులో రోడ్డు ప్రమాదం 

ఇద్దరు నగర వాసుల దుర్మరణం

మైలార్‌దేవ్‌పల్లి: దైవ దర్శనం చేసుకుని కారులో ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు నగర వాసులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ బాబుల్‌రెడ్డి నగర్‌కు చెందిన పోతన్న (50), శ్రీరామ్‌నగర్‌ కాలనీకి చెందిన సీతారాం నాయక్‌ (49), ఆయన కుమారుడు చరణ్, శివకుమార్‌ గౌడ్‌లు ఈ నెల 16న శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనానికి కారులో వెళ్లారు. అయ్యప్ప దర్శనం అనంతరం బుధవారం ఉదయం తిరిగి బయలుదేరారు. 

తమిళనాడు దేవదాయపట్టి సమీపంలో వీరు వస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొని పల్టీలు కొడుతూ రోడ్డు అవతల పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో పోతన్న, సీతారాం నాయక్‌లు అక్కడిక్కడే మృతి చెందారు. చరణ్, శివకుమార్‌లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు మధురైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement