న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల పొడిగింపు నేపథ్యంలో పార్లమెంటు ఉభయసభల సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీన పునఃప్రారంభమై 21వ తేదీన ముగియనున్నాయి. ఉభయసభలను ప్రోరోగ్ చేయనందున శీతాకాల సమావేశాలకు కొనసాగింపుగానే ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ పేర్కొన్నారు.