
యువతి ప్రాణం తీసిన 'స్పెషల్ సెల్ఫీ'
లాసి: ఫేస్ బుక్ లో స్పెషల్ సెల్ఫీ పోస్టు చేయాలని చేసిన సాహసం ఓ యువతి ప్రాణాలు తీసింది. ఉత్తర రొమేనియాలోని లాసి పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఆశ్చర్యకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
అన్నా ఉర్సూ(18) అనే యువతి ప్రత్యేక సెల్ఫీ తీసుకుని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయాలనుకుంది. అనుకున్నదే తడవుగా దగ్గరలోని రైల్వేస్టేషన్ కు వెళ్లింది. రైలు పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆమె కాలు హైవోల్టేజ్ కరెంట్ వైర్లకు తాకడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
తీవ్రగాయాలపాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమెను కాపాడేందుకు ఓ ప్రయాణికుడు చేసిన ప్రయత్నం ఫలించలేదు. రైలు పైకి ఎక్కొద్దని హెచ్చరించినప్పటికీ అన్నా ఉర్సూ వినిపించుకోలేదని సదరు ప్రయాణికుడు తెలిపాడు.