రాజధాని శంకుస్థాపనా ప్రైవేటుకే ! | The foundation stone of the capital For private! | Sakshi
Sakshi News home page

రాజధాని శంకుస్థాపనా ప్రైవేటుకే !

Published Mon, Sep 21 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM

The foundation stone of the capital For private!

సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నిర్మాణాన్ని విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం చివరకు దాని శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణ సైతం ప్రైవేటు ఏజెన్సీలకే అప్పగించనుంది. ఈ మేరకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) ఈవెంట్ ఏజెన్సీల కోసం టెండర్లు పిలిచింది.  ఈ కార్యక్రమాన్ని తానే నిర్వహిస్తే సాధారణంగా ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌గా దీన్ని నిర్వహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.

వచ్చే నెల 22న రాజధాని శంకుస్థాపనకు ముహూర్తం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీతోపాటు సింగపూర్ ప్రధాని, జపాన్ వాణిజ్య శాఖా మంత్రిని ఈ కార్యక్రమానికి తీసుకువస్తోంది.  ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ఆ స్థాయిని శంకుస్థాపనలోనే చూపించాలని ఆత్రుత పడుతోంది.
 
వెంకటపాలెంలో 50 ఎకరాల్లో నిర్వహణ
సీడ్‌క్యాపిటల్ ప్రాంతంలోని వెంకటపాలెంలో 50 ఎకరాలను కార్యక్రమం కోసం సిద్ధం చేస్తున్నారు. వంద మంది కూర్చునే వేదిక, వెయ్యి మంది విశిష్ట అతిథులు, 50 వేల మంది ప్రజలతో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించారు.  
 
అక్టోబర్ 1 నుంచే ప్రచారం : శంకుస్థాపన ప్రచారాన్ని అక్టోబర్ 1 నుంచే మొదలు పెట్టనున్నారు. పత్రికలు, టీవీలతోపాటు సోషల్ మీడియాలోనూ దీనిపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్, విజయవాడ అవసరమైతే ఢిల్లీలో ఈ  ప్రమోషనల్ ఆడియో, వీడియోలను ప్రదర్శిస్తారు. ఇందు కోసం రూ. 50 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు పలు అంతర్జాతీయ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలతో సంప్రదించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement