చెట్టును ఢీకొన్న స్కార్పియో: ముగ్గురి మృతి | Three killed in road accident, Scorpio hits tree | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న స్కార్పియో: ముగ్గురి మృతి

Published Thu, Aug 27 2015 6:10 AM | Last Updated on Sat, Sep 15 2018 7:55 PM

చెట్టును ఢీకొన్న స్కార్పియో: ముగ్గురి మృతి - Sakshi

చెట్టును ఢీకొన్న స్కార్పియో: ముగ్గురి మృతి

అనంతపురం(నల్లచెరువు): నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున ఓ స్కార్పియో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడ్డవారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తులు రవి(50), మురళి(56), అనిల్(30) అంతా హిందూపూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. రవి అక్కడిక్కడే మృతిచెందగా, మిగతా వారు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement