చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జాతీయరహదారిపై బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
చిట్యాల(నల్గొండ): చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జాతీయరహదారిపై బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని వెనకాలే వస్తున్న కారు ఢీకొట్టింది.
దీంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు.