'వారివల్లే వీరికి అధికారం వచ్చింది' | Wrong policies of Cong brought BJP to power: Mulayam | Sakshi
Sakshi News home page

'వారివల్లే వీరికి అధికారం వచ్చింది'

Sep 6 2015 7:10 PM | Updated on Mar 29 2019 9:31 PM

'వారివల్లే వీరికి అధికారం వచ్చింది' - Sakshi

'వారివల్లే వీరికి అధికారం వచ్చింది'

ఓ పక్క బయట నుంచి తన మద్దతు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్పే సమాజ్ వాది పార్టీ ములాయంసింగ్ యాదవ్ ఆ పార్టీపై నేరుగా విమర్శలు చేశారు.

మెయిన్పురి: ఓ పక్క బయట నుంచి తన మద్దతు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్పే సమాజ్ వాది పార్టీ ములాయంసింగ్ యాదవ్ ఆ పార్టీపై నేరుగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తప్పుడు విధివిధానాల వల్లే బీజేపీకి అధికారం వచ్చిందని ఆరోపించారు. కొన్ని లౌకిక పార్టీలు కూడా ఎవరికీ తెలియకుండా బీజేపీకి సహకరించాయని అన్నారు. 

తమ పార్టీ ఒక్కటే బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడిందని చెప్పారు. మెయిన్ పురిలో ఓ సైనిక పాఠశాలకు శంఖుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2017లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, అప్పుడు కూడా తమ పార్టీనే అధికారం చేపడుతుందని తెలిపారు. పేదల అభివృద్ధికోసం పాటుపడుతున్న దేశంలోని ఏకైక పార్టీ తమదేనని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement