SP
-
జీడీపీ వృద్ధికి ఎస్అండ్పీ కోత
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025–26) 6.7 శాతం వృద్ధి నమోదవుతుందన్న గత అంచనాలను తాజాగా 6.5 శాతానికి సవరించింది. 2024–25 సంవత్సరం మాదిరే వృద్ధి అంచనాలను ఇస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే రుతుపవనకాలం సాధారణంగా ఉంటుందని, కమోడిటీ, చమురు ధరలు కనిష్ట స్థాయిల్లోనే ఉంటాయన్న అంచనాల ఆధారంగా ఈ వృద్ధి రేటును ఇస్తున్నట్టు ఎస్అండ్పీ తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గడం, బడ్జెట్లో ప్రకటించిన పన్ను ప్రయోజనాలు, తక్కువ రుణ వ్యయాలు ఇవన్నీ భారత్లో విచక్షణారహిత వినియోగాన్ని పెంచుతాయని అంచనా వేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంపై అమెరికా టారిఫ్ల పెంపు ప్రభావం, ప్రపంచీకరణ నుంచి వెనక్కి తగ్గడం వంటి సవాళ్లను ప్రస్తావించింది. అయినప్పటికీ వర్ధమాన దేశాల్లో చాలా వాటిల్లో దేశీ డిమాండ్ బలంగా కొనసాగుతుందని అంచనా వేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సెంట్రల్ బ్యాంక్లు ఈ ఏడాది అంతటా వడ్డీ రేట్లను తగ్గించొచ్చని పేర్కొంది. ఒక శాతం వరకు రేట్ల తగ్గింపు.. ‘‘ఆర్బీఐ వడ్డీ రేట్లను మరో 0.75 శాతం నుంచి 1 శాతం వరకు ప్రస్తుత సైకిల్లో తగ్గించొచ్చు. ద్రవ్యోల్బణం తగ్గడం, తక్కువ చమురు రేట్ల ఫలితంగా ద్రవ్యోల్బణం ఆర్బీఐ లకి‡్ష్యత స్థాయి 4 శాతానికి సమీపంలో 2025–26లో ఉండొచ్చు’’అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది. బలమైన దేశీ డిమాండ్తో వర్ధమాన దేశాలు నిలదొక్కుకుంటాయని పేర్కొంది. దిగుమతులపై టారిఫ్లతో అమెరికా వృద్ధి తగ్గడమే కాకుండా, ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా వేసింది. దీంతో 2025లో యూఎస్ ఫెడ్ మరొక్కసారే 25 బేసిస్ పాయింట్ల మేర రేటు తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రోడ్డు ప్రమాదాలతో జీడీపీకి నష్టంఏటా 3 శాతం కోల్పోవాల్సి వస్తోంది: గడ్కరీ న్యూఢిల్లీ: దేశంలో ఏటా 5 లక్షల వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. వీటి కారణంగా 3 శాతం జీడీపీని నష్టపోవాల్సి వస్తోందని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. యూఎస్–భారత్ భాగస్వామ్యంతో ఢిల్లీలో రహదారి భద్రతపై ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా మంత్రి మాట్లాడారు. దేశానికి రహదారి ప్రమాదాలు అతి ముఖ్యమైన సమస్యగా ఉన్నట్టు చెప్పారు. ఏటా 4.80 లక్షల రహదారి ప్రమాదాల్లో 1.88 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్టు తెలిపారు. ఇందులో 10,000 మంది 18 ఏళ్లలోపు ఉంటుండడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.ఇదొక ప్రధానమైన ప్రజారోగ్య సమస్యే కాకుండా, ఏటా 3 శాతం జీడీపీని నష్టపోవాల్సి వస్తుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బలహీన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్లు) రహదారి ప్రమాదాలకు కారణాల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఖర్చు ఆదా చేసుకోవడం, ప్రాజెక్టు నిర్మాణాలను సీరియస్గా తీసుకోకపోవడం కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణమవుతన్నట్టు చెప్పారు. రహదారి ప్రమాద బాధితులకు సాయాన్ని ప్రోత్సహించేందుకు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు చెప్పారు. ‘‘ప్రమాద బాధితుల సాయానికి ముందుకు వచ్చే మూడో పక్ష వ్యక్తికి రూ.25,000 బహుమతి ఇవ్వాలని నిర్ణయించాం. ప్రమాదం లేదా ప్రమాదం అనంతరం ఎవరైనా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే గరిష్టంగా రూ.1,50,000 లేదా ఏడేళ్ల పాటు చికిత్స వ్యయాలకు చెల్లింపులు చేయనున్నాం’’అని మంత్రి గడ్కరీ వెల్లడించారు. -
పోలీస్ ఉద్యోగానికి రిజెక్ట్, కట్ చేస్తే ఐపీఎస్గా!
‘‘సాధించినదానికి సంతృప్తిని పొంది… అదే విజయమనుకుంటే పొరపాటోయి…ఆగకోయి భారతీయుడా.. కదిలి సాగవోయి ప్రగతిదారులా’’ ఈమాటల్ని మహాకవి శ్రీశ్రీ ఏ సందర్భంలో అన్నప్పటికీ.. ఈ మాటల్నే తనకు ప్రేరణగా తీసుకున్నాడో యువకుడు. కుటుంబాన్నీ పేదరికం నుంచి బయటపడేయడమే అతని అక్ష్యం. అలాగని సాధించిన ఉద్యోగంతో తృప్తి పడలేదు. పట్వారీగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, తరువాత తహసీల్దార్, అసిస్టెంట్ జైలర్, స్కూల్ లెక్చరర్గా పనిచేశాడు. ఆరేళ్లలో (2010-2016) 12 ప్రభుత్వ ఉద్యోగాలు. చివరికి ఐపీఎస్ ఆఫీసర్గా నిలిచాడు. ఎలా సాధ్యం అని ఆశ్యర్యపోతున్నారా? తన కలను సాకారం చేసుకునేందుకు ఐపీఎస్ అధికారిగా నిలిచేందుకు చేసిన కృషి ఇందుకు సమాధానం. పదండి అతని స్ఫూర్తిదాయకమైన కెరీర్ గురించి తెలుసుకుందాం. రాజస్థాన్లోని రసిసార్లో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ప్రేమ్సుఖ్ డెలు. ప్రారంభంలో ఒంటె బండి డ్రైవర్గా పనిచేశాడు. పశువుల మేతకోసి తెచ్చేవాడు. అయితే పేదరికం నుండి తన కుటుంబాన్ని పైకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో, చదువుకోవాలని నిర్ణయించాడు. ఎన్నిఇబ్బందులొచ్చినా చదువును సాగించాడు. ఆర్థిక ఇబ్బందుల భారం తన కలలకు అడ్డు రాకుండా జాగ్రత్త పడ్డాడు. అతని కుటుంబం కూడా చదువు ప్రాధాన్యతను గురించింది. ఎన్ని సవాళ్లెదురైనా, పరిమిత వనరులు ఉన్నప్పటికీ అతనిలో విశ్వాసాన్ని నింపింది. డెలు సంకల్పానికి కుటుంబ సహకారం మరింత బలాన్నిచ్చింది.గొప్ప గొప్ప బిరుదులు, హోదాలు కాదు... తనకుటుంబం ఆర్థిక కష్టాలనుంచి బైటపడి, గౌరవంగా బతకాలి ఇదే అతని పట్టుదల. ప్రేమ్ కష్టపడి చదువుతూ ఎంఏ హిస్టరీ పూర్తి చేశాడు. 2010లో తొలిసారి పట్వారీ (రెవెన్యూ ఆఫీసర్) ఉద్యోగం సంపాదించాడు. ఆ తరువాతి ఏడాదికే అసిస్టెంట్ జైలర్గా , ఆ తరువాత ఉపాధ్యాయుడిగా, అనంతరం కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం సంపాదించాడు. అయితే స్వల్పమార్కులతో పోలీస్ ఉద్యోగం చేజారినా ఐపీఎస్ అవ్వాలన్న కల స్థిమితంగా నిద్రపోనీయలేదు. మరోపక్క సాధించి చాల్లే..ఉన్నదాంతో సంతోషంగా బతుకుందాం అన్నారు కుటుంబ సభ్యులు. అయినా పట్టువీడని ప్రేమ్..2015లో యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్ రాశాడు. యూపీఎస్సీలో (UPSC) AIR 170 ర్యాంకుతో తన కలను సాకారం చేసుకునే తొలి అడుగు వేశాడు. ప్రస్తుతం గుజరాత్లోని జామ్నగర్లో పోలీసు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్గానూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.‘ఉద్యోగం చేసుకుంటూ యూపీఎసీసీకి సిద్ధమవ్వడం అంత సులభం కాదు. అంకిత భావంతో చదివాను. కేవలం ఆరేళ్ళలో 12 ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యాడు. అదే తనకు స్ఫూర్తినిచ్చింది। అంటాడు డైలు. ఇదీ కదా పట్టుదల అంటే.. ఇదీ కదా సక్సెస్ అంటే. అవిశ్రాంత దృఢ సంకల్పం , దృఢ నిశ్చయం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు డైలు. తనలాంటి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. -
నల్గొండ ఇంటలిజెన్స్ ఎస్పీ కవితపై వేటు
నల్గొండ, సాక్షి: జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్రమాలు, వసూళ్ల ఆరోపణల మీద ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. సొంత సిబ్బందిని సైతం వదలకుండా ఆమె భారీగా డబ్బు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఆమె అవినీతి(Corruption)పై సొంత శాఖ సిబ్బందే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఆ అక్రమాలపై బాధితులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగ్ల కోసం లంచం వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సిబ్బందితో అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం చేయించినట్లు లేఖలో తెలిపారు. దీని ఆధారంగా అధికారులు విచారణ చేపట్టగా.. గంజి కవిత బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారిగా గంజి కవిత(Ganji Kavitha) ఏడేళ్లు పని చేశారు. ఈ ఏడేళ్లలో ఆమె రేషన్, గుట్కా మాఫియాల నుంచి భారీగా ఆమె వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అలాగే సొంత సిబ్బందిని ఆమె వదల్లేదని తేలింది. ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో కవిత ఈ దందా నడిచిపించినట్లు సమాచారం. దీంతో ఆమె షాడో టీంపైనా విచారణ కొనసాగుతోంది. సమగ్ర విచారణ తర్వాత ఆమెను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. -
ఇండియా కూటమిలో లుకలుకలు!, ఈసారి..
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండియా కూటమిలో చీలికలు మరోసారి బయటపడ్డాయి. అదానీ అంశంపై చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనకు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు దరంగా ఉండటమే కారణం. సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో జరిగిన ఇండియా కూటమి భేటీకి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొట్టగా.. నేడు కాంగ్రెస్ చేపట్టిన నిరసనకు టీఎంసీతోపాటుసమాజ్వాదీ పార్టీ కూడా గైర్హాజరవ్వడం గమనార్హం.మంగళవారం ఉదయం ఉభ సభలు ప్రారంభమయ్యాక.. లోక్సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతుండగా కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. అదానీ అంశం, సంభాల్ హింసపై తక్షణమే చర్చ జరపాలని పట్టుబట్టాయి. దీనికి స్పీకర్ అంగీకరించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, శివసేన (ఉద్దవ్), ఎన్సీపీ(శరద్చంద్ర) పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.అనంతరం అదానీ అంశంలో జేపీసీ వేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలతో పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంకా గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్లకార్డులు చేతబట్టి భారీ ప్రదర్శన చేపట్టారు. అయితే ఆ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ మిత్రపక్షాలు సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మిస్సయ్యాయి. ఈ రెండు పార్టీల ఎంపీలు సభా కార్యకలాపాల్లో పాల్గొనడంచర్చనీయాంశంగా మారింది.చదవండి: సీఎం పదవిపై వీడని ఉత్కంఠ.. వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేతలుఇక సోమవారం జరిగిన ఇండియా కూటమి కీలక సమావేశాన్ని తృణమూల్ కాంగ్రెస్ దాటవేసింది. కాంగ్రెస్కు ఒకే ఎజెండా ఉందని, అది తమది కాదని సూచించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ అశాంతి వంటి ఆరు కీలక అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలని తాము భావిస్తున్నామని, అయితే కాంగ్రెస్ అదానీ అంశాన్ని మాత్రమే ఒత్తిడి చేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్లో జరిగిన సమావేశానికి ఆ పార్టీ నేతలు దూరంగా ఉన్నారని వారు తెలిపారు.ఇదిలా ఉండగా అదానీ, సంభాల్, అజ్మీర్ దర్గా, మణిపూర్ హింస సహా పలు అంశాలపై పార్లమెంట్ సమావేశాలు అట్టుడుకుతున్నాయి. వీటిపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సమావేశాలు ప్రారంభ రోజు నుంచి ఉభయ సభలు కార్యకలాపాలేవీ జరపకుండానే వాయిదా పడుతున్నాయి.దీనికి తెరదించేలా విపక్షాలను ఒప్పించేందుకు ఓం బిర్లా కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నారు. వాటికి కొనసాగింపుగా ఆయన సోమవారం అఖిలపక్ష బేటీ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగొయ్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుదిరిన సమన్వయ ఒప్పందం ప్రకారం సమాజ్వాదీ పార్టీ సంభాల్ అంశాన్ని, తృణమూల్ బంగ్లాదేశ్ సమస్యను లేవనెత్తేందుకు అనుమతించినట్లు సమాచారం. కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న మేరకు రాజ్యాంగంపై రెండు రోజుల ప్రత్యేక చర్చకు మోదీ సర్కార్ ఎట్టకేలకు అంగీకరించింది -
నాలుగుసార్లు ఎంపీ.. ఐదుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు గ్యాంగ్స్టర్
బీహార్: కొందరు రాజకీయ నేతలు అక్రమ దందాలు సాగిస్తున్నారనే వార్తలను మనం అప్పుడప్పుడు వింటుంటాం. అయితే నాలుగు సార్లు ఎంపీ, ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ప్రజాప్రతినిధి ఇప్పుడు గ్యాంగ్స్టర్గా మారాడంటే ఒక పట్టాన నమ్మలేం. కానీ ఇది నిజం. యూపీకి చెందిన ఒక నేత ప్రజాప్రతినిధి అనే పదానికే మచ్చతెచ్చేలా ప్రవర్తించాడు.రాజకీయాల్లో విజయంకల్తీ మద్యం కేసులో నిందితుడైన యూపీకి చెందిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే రమాకాంత్ యాదవ్ రాజకీయాల్లో పలు విజయాలను అందుకున్నారు. అజంగఢ్ నుంచి నాలుగు సార్లు ఎంపీ, ఫూల్పూర్ పొవై అసెంబ్లీ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2022లో మహూల్లో చోటుచేసుకున్న విషపూరిత మద్యం కుంభకోణం కేసులో చిక్కుకున్న ఆయన రెండేళ్లకు పైగా జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు రమాకాంత్ యాదవ్ ఐఆర్-42 గ్యాంగ్గా జాబితాలో చేరారు.1985లో రాజకీయ ప్రవేశంఫుల్పూర్ ప్రాంతంలోని అంబారి నివాసి రమాకాంత్ యాదవ్ 1985లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆఫుల్పూర్ పొవై అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో అజంగఢ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నాలుగు సార్లు ఎంపీ అయ్యారు. 2019లో బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్లో చేరారు. అయితే ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరి 2022లో ఫూల్పూర్ పోవై అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.బీఎస్పీ అభ్యర్థిపై దాడి1998 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపునకు ముందు రమాకాంత్ యాదవ్ బీఎస్పీ అభ్యర్థి అక్బర్ అహ్మద్ డంపీపై దాడి చేసినందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 2022లో మహుల్లో విషపూరిత మద్యం ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ కేసులో రమాకాంత్ యాదవ్ హస్తమున్నట్లు దర్యాప్తులో తేలింది. అప్పటి నుంచి ఆయన జైలులో ఉన్నారు.ఐఆర్ -42 ముఠా జాబితాలో..వారణాసి జోన్ ఏడీజీ హత్య, కల్తీ మద్యం తయారు చేయడం, లైసెన్స్ పొందిన దేశీయ మద్యం షాపులో దానిని విక్రయించడం లాంటి నేరాలకు పాల్పడి, జైలుకెళ్లిన ఎమ్మెల్యే రమాకాంత్ యాదవ్, అతనితో సంబంధం ఉన్న 15 మంది సభ్యులను ఐఆర్ -42 ముఠా జాబితాలో పోలీసులు చేర్చారు. ఇతనితో పాటు ఇతని ముఠా సభ్యులపై గ్యాంగ్స్టర్ చట్టం కింద పోలీసులు చర్యలు చేపడుతున్నారు.ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం -
Ambati: సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది
-
వేధింపులపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన మాజీమంత్రి అంబటి
-
‘అయోధ్య దీపోత్సవ్కు ఆహ్వానం అందలేదు’
లక్నో: అయోధ్యలో ఇవాళ (బుధవారం) నిర్వహించే దీపోత్సవ్ కార్యక్రమానికి తనను నిర్వాహకులు ఆహ్వానించలేదని సమాజ్వాదీ పార్టీ నేత, ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ తెలిపారు. మన పండుగల విషయంలో కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘దీపావళి సందర్భంగా అయోధ్య ప్రజలందారికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నేను ఇక్కడి నుంచి ఎన్నిక కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. మన పండుగలను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. దీపావళి పండుగను బీజేపీ రాజకీయం చేసి ప్రజలను విభజిస్తోంది. నాకు దీపోత్సవ్కు పాస్ లేదా ఆహ్వానం అందలేదు. ఈ పండుగ ఏ ఒక్క వర్గానికి చెందినది కాదు. ..నేను ఈరోజు అయోధ్యకు వెళ్తున్నా. నాకు నిర్వాహకుల నుంచి దీపోత్సవ్ కార్యక్రమానికి ఎటువంటి పాస్ లేదా ఆహ్వానం రాలేదు’’ అని అన్నారు. అయోధ్య ఆధ్యాత్మిక నగరం.. ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందన్న విషయం తెలిసిందే. అయోధ్యలో అట్టహాసంగా నిర్వహించనున్న దీపోత్సవ్ కార్యక్రమానికి స్థానిక ఎంపీని ఆహ్వానించకపోవటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.దీపావళి సందర్భంగా సరయూ నది ఒడ్డున లక్షలాది దీపాలు వెలిగించే దీపోత్సవ్ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇవాళ సాయంత్రం నుంచి రాత్రి వరకు సరయూ నది ఒడ్డున సుమారు 28 లక్షల దీపాలను వెలిగించటం ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
నెలకు ఒకసారే ఇంటికి..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ)లో లీవ్ (సెలవు) మాన్యువల్ మరోసారి చర్చనీయాంశం కానుంది. గతంలో 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లిన కానిస్టేబుళ్లు.. ఇకపై 26 రోజుల నుంచి నెల రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లేలా కొత్త లీవ్ మాన్యువల్ అమలు కానుండటమే ఇందుకు కారణం. వచ్చే నవంబర్ 1 నుంచి కొత్త మాన్యువల్ అమలు కానుండగా, తాజా నిబంధనలపై కానిస్టేబుళ్లలో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వారి కుటుంబాలు ప్రభుత్వం, అధికార వర్గా లపై మండిపడుతున్నాయి. ఇది ముమ్మాటికీ శ్రమ దోపి డీయేనని, బ్రిటిష్ కాలంనాటి చట్టాలను సవరించాల్సిందిపోయి, ఒత్తిడి మరింత పెంచేలా కొత్త విధానా లకు శ్రీకారం చుట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మళ్లీ పాత విధానం!హైదరాబాద్తో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 13 టీఎస్ఎస్పీ బెటాలియన్లు ఉన్నాయి. దాదాపు 8 వేల మంది పోలీసులు వివిధ ర్యాంకుల్లో పనిచేస్తున్నారు. బెటాలియన్లలోని ప్రతి 12 మందిని ఒక ప్లటూన్ లేదా సెక్షన్ అని పిలుస్తారు. వీరిలో నలుగురు హెడ్క్వార్టర్కు అందుబాటులో ఉంటారు. మిగిలిన 8 మందికి ఈ లీవ్ మాన్యువల్ వర్తిస్తుంది. ఒకరు సెలవు తీసుకుంటే ఏడుగురు కచ్చితంగా విధుల్లో ఉండాలి. ఈ ఏడుగురు ఒకరి తర్వాత మరొకరు నాలుగు రోజుల చొప్పున సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 నుంచి 7వ కానిస్టేబుల్ వరకు నాలుగు రోజుల చొప్పున లీవు తీసుకున్నాక 8వ కానిస్టేబుల్కు అవకాశం వస్తుందన్నమాట. అంటే 28 రోజుల డ్యూటీ తర్వాత 4 రోజుల సెలవు దొరుకు తుందన్నమాట. అంటే ప్రతి కానిస్టే బుల్ 28 రోజులకు ఒకసారి ఇంటికి వెళతారన్నమాట. ఒక వేళ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో సెలవు పెడితే ఈ క్రమం దెబ్బతిని తదుపరి వ్యక్తి తీసుకోవాల్సిన సెలవు మరింత ఆల స్యం అవుతుంది. 2012 వరకు ఇలాంటి నిబంధనలే ఉండేవి. అయితే 2012 ఆగస్టు 5వ తేదీన తమ భర్తలు ఇంటికి రావడం లేదంటూ కొండాపూర్ బెటాలియన్ ఎదుట కానిస్టే బుళ్ల భార్యాపిల్లలు భారీయెత్తున ధర్నా నిర్వహించారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లకు లీవుల విషయంలో కాస్త వెసులుబాటు కల్పించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మాన్యువల్లో మార్పులు చేసి ఒకసారి ఒక్కరిని కాకుండా ముగ్గురికి అవకా శం ఇవ్వడం ప్రారంభించారు. ఫలితంగా ప్రతి నెలా రెండుసార్లు అంటే 15 రోజులకు ఒకసారి ఇంట్లో వారిని చూసే అవకాశం కానిస్టేబుళ్లకు దక్కేది.అగచాట్లు తప్పవా?⇒ దాదాపుగా పాత పద్ధతి తరహాలోనే ఇకపై 26 రోజుల నుంచి నెల రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లేలా కొత్త లీవ్ మాన్యువల్ అమలు కానుండటంతో కానిస్టేబుళ్లతో పాటు వారి కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వారాలకు వారాలు భర్తలు తమకు, పిల్లలకు దూరంగా ఉండేలా చేస్తు న్న నిబంధనలపై భార్యలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి కాపురాల్లో కలహాలకు కారణమై విడాకుల వరకు వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ఇప్పటికే కుటుంబసభ్యులు అనా రోగ్యంతో బాధ పడుతున్నా ఇంటికి వెళ్లలేని స్థితిలో ఉంటున్నామని కానిస్టే బుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాజా ఆదేశాలు అమలైతే తమ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని అంటున్నారు. ఇంకోవైపు వీరికి స్థిరంగా విధులు ఎక్కడా ఉండక పోవడం కూడా వారిలో అసంతృప్తికి కారణమవుతోంది. ప్రతి వారానికి లేదా 15 రోజులకు అప్పుడప్పుడూ ప్రతి రోజూ మారతాయి. ఇక సాధారణ ఎన్నికలు, విపత్తులు, అల్లర్లు చెలరేగినపుడు వీరంతా సెలవులు రద్దు చేసుకుని మరీ బందోబస్తు విధుల్లో కొనసాగాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే కొత్త మాన్యువల్పై కానిస్టేబుళ్ల కుటుంబాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. బ్రిటిష్ కాలంలో రూపొందించిన చట్టాలను మార్చాలంటూ మరోసారి కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకోవాలి⇒ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తమ బాధల్ని అసెంబ్లీ వేదికంగా లోకానికి చాటిన రేవంత్రెడ్డి ప్రస్తుతం సీఎం, హోంమంత్రిగా ఉన్నారని, ఆయన గతాన్ని గుర్తుచేసుకుని తమ విషయంలో పెద్దమనసు చేసుకో వాలని వారు కోరుతున్నారు. 26 రోజులకు ఒకసారి లీవు విధానం అమలు చేయకుండా ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని, టీఎస్ఎస్పీ, సివిల్, ఏఆర్ బెటాలియన్లను కలిపి తమిళనాడు, కర్ణాటక తరహాలో ‘ఏక్ పోలీసింగ్’ విధానాన్ని అమలు చేయాలని, కుటుంబాలతో ఒకేచోట 3 నుంచి ఐదేళ్లపాటు కలిసి ఉండే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ టు ఐపీఎస్.. సేవలోనే సంతృప్తి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘మా నాన్న బాలాజీ పవార్. ఆయన డాక్టర్. ఎప్పుడూ ప్రజలతో మేమేకం అయ్యేవారు. ఆయనను చూశాక నాకూ అలాగే ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేయాలనిపించేది. అంతేకాదు.. కలెక్టర్లు, ఎస్పీల గురించి నాన్న ఎప్పుడూ చెబుతుండే వారు. నాన్న స్ఫూర్తితోనే సివిల్స్ వైపు వచ్చాను’ అని చెప్పారు యువ ఐపీఎస్ అధికారి శరత్చంద్ర పవార్. నల్లగొండ ఎస్పీగా పనిచేస్తున్న ఆయన.. ఐపీఎస్ సాధించడానికి స్ఫూర్తినిచ్చిన అంశాలను, తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉద్యోగ జీవితంలో అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. నా బాల్యం సికింద్రాబాద్లో గడిచింది. పదో తరగతి వరకు మహీంద్రాహిల్స్లోని ఆక్జిలియం హైసూ్కల్లో చదువుకున్నాను. నారాయణగూడలోని రత్న జూనియర్ కాలేజీలో ఇంటరీ్మడియట్ పూర్తిచేశా. ఆ తరువాత జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన ఐఐటీ బాంబేలో సీటు సాధించా. అక్కడ బీటెక్ పూర్తి చేశాక ఏడాది పాటు సాఫ్ట్వేర్ జాబ్ చేసి.. ఆ తర్వాత స్నేహితులతో కలిసి ఓ స్టార్టప్ను అభివృద్ధి చేసి, రెండేళ్లపాటు నిర్వహించా. అయినా, చిన్నతనంలోనే నా మనస్సులో నాటుకున్న సేవ అనే బీజం అక్కడ ఉండనీయలేదు. సాఫ్ట్వేర్ రంగంలో కేవలం నా కోసం నేను పనిచేస్తున్నట్లుగానే అనిపించేంది. అక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం లేదు. ఐపీఎస్ అధికారిగా ఇప్పుడు ప్రజలకు నేరుగా సేవలు అందించగలుగుతున్నా. నా వద్దకు వచ్చే బాధితులకు న్యాయం చేకూరిస్తే ఎంతో సంతృప్తి ఇస్తుంది.సాఫ్ట్వేర్లో ఉంటూనే సివిల్స్పై దృష్టిస్టార్టప్లో ఉండగా సివిల్స్పై దృష్టిపెట్టాను. సాఫ్ట్వేర్తో వచ్చే డబ్బులతోనే సివిల్స్కు ప్రిపేర్ అయ్యేవాడిని. రెండుసార్లు అటెంప్ట్ చేశా. ఇక మూడోసారి మరింత సీరియస్గా తీసుకొని పూర్తిగా సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలేసి సివిల్స్కు సిద్ధమయ్యాను. 2015లో సివిల్స్ మూడోసారి రాశాను. 2016లో ఐపీఎస్కు ఎంపికయ్యాను. శిక్షణ పూర్తయ్యాక 2018 డిసెంబర్లో ఏటూరునాగారం అదనపు ఎస్పీగా మొదటి పోస్టింగ్ వచ్చిది. ఆ తరువాత రామగుండం ఓఎస్డీ, మహబూబాబాద్ ఎస్పీగా పనిచేశా. ఆ తరువాత పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా, సెంట్రల్ జోన్ డీసీసీగా, నార్కొటిక్స్ ఎస్పీగా చేశా. అక్కడి నుంచి నల్లగొండ ఎస్పీగా వచ్చా.బాధితులకు న్యాయం చేస్తే ఎంతో తృప్తిఐఏఎస్ లేదా ఐపీఎస్ అయితే నేరుగా ప్రజలకు సేవ చేయొచ్చు. ఐపీఎస్ అధికారిగా ఇప్పుడు ప్రజలకు నేరుగా సేవలు అందించగలుగుతున్నా. మా వద్దకు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడటం ఎంతో సంతృప్తి ఇస్తోంది. ఇప్పుడు వచ్చే జీతం.. అప్పుడు సాఫ్ట్వేర్లో వచ్చే జీతం కంటే తక్కువే అయినా.. ప్రజలకు సేవలందించడం ద్వారా ఇప్పుడు కలిగే తృప్తి ముందు అది తక్కువే అనిపిస్తుంది. మహబూబాబాద్లో ఎస్పీగా ఉన్నప్పుడు రెండు జాబ్ మేళాలు నిర్వహించాను. దాదాపు 1200 మంది గిరిజన యువతకు ఉద్యోగాలు ఇప్పించగలిగా. అది ఎంతో సంతృప్తి ఇచ్చింది. నల్లగొండలో కూడా త్వరలో జాబ్ మేళాలు నిర్వహిస్తాం. ప్రస్తుతం యువత గ్రూప్స్కు ప్రిపరేషన్లో ఉంది. అవి పూర్తయ్యాక జాబ్మేళా నిర్వహిస్తాం.కుటుంబ నేపథ్యం ఇదీ..ఎస్పీ శరత్చంద్ర పవార్ తండ్రి బాలాజీ పవార్ ప్రభుత్వ వైద్యుడు. ఆయన ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ఎక్కువ కాలం నిజమాబాద్లో పనిచేశారు. ఆ తరువాత సంగా రెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో వైద్యారోగ్య శాఖ అధికారిగా పనిచేశారు. తల్లి గృహిణి. శరత్చంద్ర భార్య పూజ ఇంటీరియర్ డిజైనర్. వారికి ఇద్దరు పిల్లలు. సంవ్రీత్, ఐరా. ‘పోలీసు వృత్తిలో రోజూ ఏదోరకమైన ఒత్తిడికి లోనవుతుంటామని, ఎంత ఒత్తిడి ఉన్నా పిల్లలతో కాసేపు గడిపితే అన్నీ మర్చిపోతా..’ అంటున్నారు ఎస్పీ శరత్చంద్ర పవార్.అధిక వేతనం.. అయినా లోటుఐఐటీ బాంబేలో బీటెక్ పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్మెంట్లో సన్టెక్ బిజినెస్ సొల్యూషన్స్లో జాబ్ వచ్చింది. త్రివేండ్రం వెళ్లి అక్కడ ఏడాదిపాటు ఆ సంస్థలో ఇన్నోవేషన్ అనలిస్ట్గా పనిచేశా. ఆ తరువాత స్టార్టప్ ప్రారంభించాం. ఫుడ్ ఎన్ బ్రేవరేజెస్ ఇండస్ట్రీలో (ఎఫ్ఎన్బీ) రిసోర్స్ ఆప్టిమైజేషన్ చేశాను. రెండేళ్ల పాటు కొనసాగింది. మొదట ఏడాది జాబ్ చేసినప్పుడు వేతనం బాగానే వచ్చేది. స్టార్టప్లో ఉన్నప్పుడు బాగానే ఉంది. అయినా ఏదో వెలితిగా ఉండేది. అక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం లేదు. సాఫ్ట్వేర్ రంగంలో కేవలం నా కోసం నేను పనిచేస్తున్నట్లుగానే అనిపించేంది. నాన్న చూపిన బాటలో నడిచేందుకు సివిల్స్ వైపు మళ్లాను. -
వంద మందిని తీసుకురండి.. బీజేపీకి అఖిలేష్ యాదవ్ చురకలు
ఉత్తర ప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి భంగపాటు ఎదురవడంతో ఎన్నికల ఫలితాలపై కాషాయ పార్టీ మేథోమథనం నిర్వహించింది.సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ నాయకత్వంలో లుకలుకలు మొదలైనట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు భేదాభిప్రాయాలు బయటపడుతున్న వేళ ప్రతిపక్ష ఎస్పీఅధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీపై సెటైర్లతో విరుచుకుపడ్డారు.బీజేపీకి ‘మాన్సూన్ ఆఫర్’ ఇచ్చారు. ‘‘మాన్సూన్ ఆఫర్: వందమందిని తీసుకొచ్చి.. ప్రభుత్వం ఏర్పాటు చేయండి’’ అంటూ ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ను ఉద్దేశిస్తూ ఈ పోస్టు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని బీజేపీ పార్టీ యూనిట్లో అంతర్గత పోరు ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తుందని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించేవారు ఈ ప్రభుత్వంలో ఎవరూ లేరని ఆరోపించారు.मानसून ऑफ़र: सौ लाओ, सरकार बनाओ!— Akhilesh Yadav (@yadavakhilesh) July 18, 2024 కాగా.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో యూపీలో 80 సీట్లకు గాను బీజేపీ 33 మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీనికితోడు కేశవ్ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో దిల్లీలో ఒంటరిగా భేటీ కావడంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో పార్టీ అధినాయకత్వం రాష్ట్ర శాఖలో సమూల మార్పులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకే యూపీకి చెందిన ముఖ్య నేతలను ఒక్కొక్కర్నీ ఢిల్లీకి పిలిచి పార్టీ పెద్దలు మాట్లాడుతున్నట్లు సమాచారం.ఇక లోక్సభ ఎన్నికల్లో మెరుగైన సీట్లు రాకపోవడానికి అగ్నిపథ్ స్కీమ్, పేపర్ లీక్స్, రాజ్పుత్లలో అసంతృప్తి వంటి పది కారణాలను పార్టీ గుర్తించింది. యూపీలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోవడానికి దారితీసిన పలు అంశాలను 15 పేజీల నివేదికలో రాష్ట్ర పార్టీ చీఫ్ భూపేంద్ర చౌధరి వివరించారు. -
ఎస్పీలకు మెజిస్టీరియల్ పవర్స్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు ఉత్పన్నమైనపుడు, పరిస్థితులను తమ ఆ«దీనంలోకి తెచ్చుకునేందుకు పోలీసులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారాలను కొత్త నేర న్యాయ చట్టాలు కల్పించనున్నాయి. గతంలో ఇలాంటి మెజిస్టీరియల్ పవర్స్ కేవలం జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోల చేతిలో ఉండేవి. ఉదాహరణకు 144 సెక్షన్ అమలు చేయాలన్నా వారి అనుమతి తప్పనిసరి. కానీ, ఇప్పుడు ఆ అధికారాలను జిల్లాల్లో ఎస్పీలకు, నగరాల్లో డీసీపీ ర్యాంకు అధికారులకు కల్పిస్తూ కొత్త న్యాయ నేర చట్టాలను రూపొందించారు. ఈ చట్టాలు దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి పూర్తిస్థాయిలో అమలుకానున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ కమిషనరేట్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు యూనిట్లలో కొత్త చట్టాలపై రేపటితో శిక్షణ కార్యక్రమాలు ముగియనున్నాయి. కానిస్టేబుళ్ల నుంచి ఇన్స్పెక్టర్ ర్యాంకు ఆఫీసర్ల వరకు సంబంధిత యూనిట్ పరిధిలో శిక్షణ ఇస్తున్నారు. ఏసీపీ ఆపై ర్యాంకు అధికారులకు మాత్రం తెలంగాణ పోలీసు అకాడమీ (టీజీపీఏ)లో ట్రైనింగ్ ఇచ్చారు. కొత్తగా ఏ మార్పులు రానున్నాయి? జూలై 1 నుంచి ఐపీసీ, సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లన్నీ కాలగర్భంలో కలిసిపోనున్నాయి. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), సీఆర్పీసీ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్యా అధియాం (బీఎస్ఏ)లు రాబోతున్నాయి. బ్రిటిష్ కాలంలో రూపొందించిన ఈ చట్టాలను మరింత బలోపేతం చేయడం, శాస్త్రీయ పద్ధతిలో మెరుగైన విధానంలో దర్యాప్తు జరపడం, నేరాలకు కఠిన శిక్షలు విధించడం, సెక్షన్లు లేని కొన్ని రకాల నేరాలకు ప్రత్యేక సెక్షన్లు తీసుకురావడం, దర్యాప్తు కాలానికి నిర్దేశిత కాలపరిమితి విధించడం, వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేకూర్చడం వంటి లక్ష్యాలతో కొత్త నేర న్యాయ చట్టాలకు అంకురార్పణ జరిగింది. పెట్టీ నేరాలకు కమ్యూనిటీ సర్విస్.. కొత్త నేర న్యాయ చట్టాల ప్రకారం.. ఇకపై చిన్నతరహా (పెట్టీ క్రైమ్స్) నేరాలకు సమాజ సేవ చేసేలా శిక్షలు రూపొందించారు. ఉదాహరణకు న్యూసెన్స్, ఈవ్ టీజింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, కొట్లాటలు తదితర చిన్న నేరాలకు గతంలో జైలు, జరిమానాలు ఉండేవి. కొత్త చట్టాల ప్రకారం.. కమ్యూనిటీ సర్విస్ (సమాజసేవ) చేసేలా తీర్పులు రానున్నాయి.మనిషి మానసికంగా పరివర్తన చెందేలా ఈ శిక్షలు ఉండనున్నాయి. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారికి తాగి నడిపితే జరిగే నష్టాలపై ప్రచారం, ఈవ్ టీజింగ్ చేస్తే మహిళల ఔన్నత్యం తెలియజేసేలా నిందితుల్లో సామాజిక, మానసిక మార్పునకు దారి తీసేలా తీర్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. కొత్త సెక్షన్లు.. భారీ శిక్షలు గతంలో అనేక నేరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక సెక్షన్లు ఉండేవి కావు. ఉదాహరణకు గొలుసు దొంగతనాలు, మూకదాడులు, హిట్ అండ్ రన్, ఉగ్రవాద కార్యకలాపాల్లో సరిగ్గా సరిపోయే సెక్షన్లు ఉండేవి కావు. కానీ, జూలై 1 నుంచి ఇలాంటి నేరాలకు తగిన సెక్షన్లు రాబోతున్నాయి. వాటి ఆధారంగా గతంలో విధించిన జైలు శిక్ష కంటే రెట్టింపు కూడా ఉండనుంది. ఉదాహరణకు గతంలో హిట్ అండ్ రన్ కేసుల్లో గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష పడేది. తాజా చట్టాలతో గరిష్టంగా పదేళ్లు జైలు శిక్ష పడనుంది. » పోలీసు కస్టడీ కూడా మరింత పెరగనుంది. గరిష్టంగా 15 రోజుల వరకు నిందితులను రిమాండ్లోకి తీసుకోవచ్చు. రిమాండ్ అయిన 60 రోజుల్లోగా ఎప్పుడైనా తీసుకునే వెసులుబాటు పోలీసులకు కలగనుంది. » దర్యాప్తులో శాస్త్రీయ, నిపుణులు ఇచ్చే రిపోర్టులకు పెద్దపీట వేయనున్నారు. » కేసు దర్యాప్తును కూడా నిర్దేశిత కాలంలో పూర్తి చేయనున్నారు. ఉదాహణకు పోక్సో, మహిళలకు సంబంధించిన కేసుల్లో 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలి. మిగిలిన కేసుల్లో 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిïÙటు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకపరిస్థితుల్లో మాత్రం ఈ కాలపరిమితికి మినహాయింపు దక్కనుంది. »ఇక స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడ నుంచైనా జీరో ఎఫ్ఐఆర్ నమోదు, ఆన్లైన్లో వారంట్ జారీ » పిల్లలు, వికలాంగులు, వృద్ధులు, అనారోగ్యం ఉన్న వారు స్టేషన్ హాజరు నుంచి మినహాయింపు పొందవచ్చు. -
రాత్రి గస్తీ పెంచండి
కూడేరు: రాత్రి పూట గస్తీని పెంచి చోరీలను అరికట్టాలని ఎస్పీ గౌతమి శాలి ఆదేశించారు. కూడేరు ఎస్సీ కాలనీ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రూ.18,41,300 ఎత్తుకెళ్లిన విషయం విదితమే. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె చోరీ జరిగిన ఏటీఎం సెంటర్ను తనిఖీ చేశారు. సీసీ కెమెరా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాన రహదారి పక్కన ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సీఐ శివరాముడుని ఆదేశించారు. దేవాలయాలు, ఏటీఎం సెంటర్లపై నిఘా పెంచాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక పోలీసులు పాల్గొన్నారు. -
25 ఏళ్లకే ఎంపీలుగా రికార్డుకెక్కిన పుష్పేంద్ర, ప్రియా
న్యూఢిల్లీ: ఈ సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గిన అత్యంత పిన్నవయసు్కలు, అత్యంత వృద్ధుడు ఎవరో తెలుసా? ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులుగా కౌశంబీ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగిన పుష్పేంద్ర సరోజ్, మచిలీషహర్ లోక్సభ స్థానం నుంచి పోటీచేసిన ప్రియా సరోజ్ విజయం సాధించారు. వారిద్దరి వయసు 25 ఏళ్లే కావడం విశేషం. వీరిద్దరే ఈసారి అత్యంత పిన్నవయసు్కలైన ఎంపీలుగా రికార్డు సృష్టించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి టి.ఆర్.బాలు సులువుగా నెగ్గారు. 82 ఏళ్ల టి.ఆర్.బాలు ఈ ఎన్నికల్లో అత్యంత వృద్ధుడైన ఎంపీగా రికార్డుకెక్కారు. -
పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
సాక్షి, అమరావతి: ఎన్నికల రోజు ఉదయం నుంచి సాయంత్రం 7గంటల వరకు చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు, రిగ్గింగ్పై మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలు ఫిర్యాదు చేసినా జిల్లా ఎస్పీ బేఖాతర్ చేశారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మండలి విప్ లేళ్ల అప్పిరెడ్డితో కలిసి ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను గురువారం కలసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అరాచకాలు, హింసపై ఈసీ సరైన రీతిలో స్పందించకుంటే హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలపై టీడీపీ మూకలు దాడులకు తెగబడ్డాయన్నారు.ఈ అరాచకాలపై ఎన్నికల కమిషన్కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టీడీపీ యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడిందని, 60కి పైగా కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని కోరామన్నారు. వైఎస్సార్సీపీకి ఓటు వేసిన వారిపై టీడీపీ మూకలు దాడులకు తెగబడటాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చినా పోలీసులు ఏమాత్రం స్పందించలేదన్నారు. ఎన్నికల ముందు పోలీస్ అధికారులను ఈసీ ఆకస్మికంగా బదిలీ చేయడంతో హింస చెలరేగిందని చెప్పారు. దీనికి బీజేపీ, టీడీపీ, ఈసీ పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. టీడీపీ గూండాలు యథేచ్ఛగా రిగ్గింగ్ చేసినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బదిలీలతో చెలరేగిన హింస.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గురించి ముందుగానే ఈసీ దృష్టికి తెచ్చామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా తగిన భద్రత కలి్పంచాలని కోరామన్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో టీడీపీ బరి తెగించి రిగ్గింగ్, దాడులకు తెగబడిందన్నారు. చంద్రబాబు, పురందేశ్వరి ఒత్తిడితో ఈసీ అధికారులను బదిలీ చేసిన చోట్ల హింస చెలరేగిందన్నారు. రిగ్గింగ్, ఓటర్లను బెదిరించడం, బూత్ల క్యాప్చరింగ్ తదితరాలపై పోలింగ్ రోజే టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు శాసన మండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు.16 నియోజకవర్గాలకు సంబంధించి 60 పోలింగ్ బూత్లలో రీ పోలింగ్ జరపాలని కోరామన్నారు. రీ పోలింగ్ కోరుతున్న బూత్లలో లైవ్ వెబ్ క్యాస్టింగ్ ఫుటేజీని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పాల్వాయి గేట్, తుమృకోట, చింతపల్లి, ఒప్పిచర్ల, జెట్టిపాలెం, వెల్దుర్తిలో టీడీపీ విధ్వంసకాండపై ఈసీకి పోలింగ్ రోజే ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించిందని చెప్పారు. వీడియో ఫుటేజీల ఆధారంగా టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి, ఇతర అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నేత శ్రీనివాసరెడ్డి, పానుగంటి చైతన్య పాల్గొన్నారు. -
ఎస్పీ కి వైఎస్ఆర్సీపీ నేతల విజ్ఞప్తి
-
AP: వివాదాస్పద ఎస్పీలపై కీలక చర్యలు
సాక్షి, విజయవాడ: వివాదాస్పద ఎస్పీలపై ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అభియోగాలపై నోటీసులు జారీ చేసింది. ఈసీ సస్పెండ్ చేసిన ఎస్పీలు అమిత్ బర్దర్, బిందు మాధవ్, బదిలీ అయిన ఎస్పీ కృష్ణకాంత్కు నోటీసులు జారీ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి అల్లర్ల లో ఎస్పీల వైఫల్యం, పాత్రపై విచారణ జరగనుంది. ఎస్పీల వివరణ ఆనంతరం నేరుగా విచారించే అవకాశం ఉంది.ఏపీలో ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనలపై సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు(సోమవారం) ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. కాగా, ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పని ప్రారంభించింది. ఈ మేరకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. -
ఈసీ సీరియస్..కలెక్టర్, ఎస్పీలపై సస్పెన్షన్ వేటు
-
టీడీపీ అరాచకం.. తలలు పగిలినా, ఎస్పీ ఫోన్ కూడా ఎత్తలేదు.. అనిల్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్
-
బీజేపీలో సస్పెన్స్.. బ్రిజ్ భూషణ్కు టికెట్ దక్కేనా?
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుంది. మరోవైపు మొదటి దశ పోలీంగ్ సైతం సమీపిస్తోంది. 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో రెండు స్థానాల్లో ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కూటమిలోని ఎస్పీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా ఇంకా జాప్యం చేస్తోంది. యూపీలో కీలకమైన ఈ రెండు స్థానాలు.. వాయువ్య ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్, రాయ్బరేలీ. ఈ రెండు స్థానాలకు మే 20 పోలింగ్ జరగనుంది. ఇక.. నామినేషన్కు చివరి తేదీ మే 3. కాంగ్రెస్ కంచుకోట రాయ్బరేలీ.. మోదీ హవా కొనసాగిన 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత సోనియా గాంధీ విజయం సాధించారు. అయితే ఆమె ప్రస్తుతం రాజాస్తాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ‘కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ విషయంలో తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఇక పార్టీ ఎన్నికల ప్రక్రియకు సిద్ధమవుతోంది’ అని కాంగ్రెస్ నేత మనీష్ హిందవి తెలిపారు. బీజేపీ నిర్ణయంపై మిగతా పార్టీలు.. కైసర్గంజ్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై మహిళ రెజ్లర్ల చేసిన లైగింక వేధింపుల ఆరోపణలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో రెజ్లర్ల సమాఖ్యకు కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే 2019లో ఇక్కడ ఆయన సుమారు 2,60,000 మెజార్టీతో విజయం సాధించారు. కైసర్గంజ్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ పార్టీ కాకుండా ఎస్పీ, బీఎస్పీ పార్టీలు సైతం తమ అభ్యర్థిని ప్రకటించకపోవటం గమనార్హం. అయితే బీజేపీ నిలబెట్టే అభ్యర్థి నిర్ణయంపై మిగతా పార్టీలు నిర్ణయం తీసుకోవడానికి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆరుసార్లు ఎంపీగా గెలిచిన బ్రిజ్భూషన్కు సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. 2008లో అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో క్రాస్ ఓటింగ్కు పాల్పడినందుకు బ్రిజ్భూషన్ బీజేపీ బహిష్కరించింది. అనంతరం ఆయన ఎస్పీలో చేరారు. తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ బీజేపీలో చేరారు. ఎస్పీలో సందిగ్ధం.. ‘కైసర్గంజ్ స్థానంలో అభ్యర్థి ఎంపికపై పార్టీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నాం. ఇక్కడ ఎవరిని నిలబెట్టినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అభ్యర్థి గెలుపుకు కృషి చేస్తాం. ఈ విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది’ అని బహ్రైచ్ జిల్లా ఎస్పీ అధ్యక్షుడు రామ్ వర్ష యాదవ్ తెలిపారు. మరోవైపు.. ఈ స్థానంలో అభ్యర్థి ఎంపిక విషయంలో ఎస్పీ కూడా సందిగ్ధంలో ఉందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. కైసర్గంజ్ టికెట్ బ్రిజ్ భూషణ్కు దక్కేనా..? బీజేపీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని బహ్రైచ్ జిల్లా అధ్యక్షుడు బ్రిజేష్ పాండే స్పష్టం చేశారు. బీజేపీ బ్రిజ్భూషన్కు టికెట్ నిరాకరిస్తే మళ్లీ ఆయన ఎస్పీలోకి పార్టీ మారుతారని బీజేపీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. హర్యానా, పశ్చిమ యూపీలో కీలకమైన జాట్ సాజికవర్గంలో రెజ్లర్లపై వేధింపుల విషయంలో బ్రిజ్భూషన్పై వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఉన్న మొత్తం ఓటర్లలో జాట్లు నాలుగింట ఒక వంతు ఉన్నారని ఓ బీజేపీ నేత తెలిపారు. ఇక.. ఏప్రిల్ 19, 26 తేదీల్లో లోక్సభకు పోలింగ్ జరగనున్న పశ్చిమ యూపీలోని పలు జిల్లాల్లో గణనీయమైన సంఖ్యలో జాట్లు ఉన్నారు. అయితే వారిని దూరం చేసుకోడాన్ని బీజేపీ కోరుకోవడం లేదని అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ బ్రిజ్భూషన్కు టికెట్ నిరాకరించే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు ఉందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. -
‘వారి అదృష్టం కొన్ని గంటలే’.. మరోసారి ఎస్పీ అభ్యర్థుల మార్పు
లక్నో: ఉత్తర ప్రదేశ్లో లోక్సభ ఎన్నికలకు ప్రకటించిన అభ్యర్థులను సమాజ్వాదీ పార్టీ తరచూ మారుస్తోంది. మీరట్ స్థానానికి అభ్యర్థిని రెండోసారి మార్చింది. అలాగే భాగ్పట్ నియోజకవర్గ అభ్యర్థిని కూడా మార్చింది. ఇప్పుడు అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మ మీరట్ నుంచి పోటీ చేయనున్నారు. సోమవారం రాత్రి ‘ఎక్స్’లో షేర్ చేసిన జాబితాలో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ మీరట్, ఆగ్రా (రిజర్వ్డ్) పార్లమెంట్ స్థానాల నుంచి అతుల్ ప్రధాన్ సురేష్ చంద్ కదమ్ అభ్యర్థులుగా ఉంటారని పేర్కొంది. మీరట్ నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్న నటుడు అరుణ్ గోవిల్పై సమాజ్వాదీ పార్టీ మొదట భాను ప్రతాప్సింగ్ను పోటీకి నిలబెట్టింది. పార్టీ అలా తన పేరును ప్రకటించగానే అతుల్ ప్రధాన్ ‘ఎక్స్’ ద్వారా పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్కు కృతజ్ఞతలు కూడా తెలిపారు. తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే మీరట్ అభ్యర్థిని మరోసారి మారుస్తూ అతుల్ ప్రధాన్ స్థానంలో సునీత వర్మను పార్టీ ప్రకటించింది. ఇక భాగ్పట్లో మనోజ్ చౌదరి స్థానంలో అమర్పాల్ శర్మను బరిలోకి దింపింది. ప్రత్యర్థుల విమర్శలు సమాజ్వాదీ పార్టీ తమ అభ్యర్థులను తరచూ మారుస్తుండటంపై ప్రత్యర్థు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకప్పుడు మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్దళ్ అధినేత జయంత్ సింగ్ సమాజ్ వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. "ప్రతిపక్షంలో కొంతమందికి అదృష్టం కొన్ని గంటల పాటే ఉంటుంది” అంటూ ఎద్దేవా చేశారు. -
3 జిల్లాల ఎస్పీలు వివరణ ఇచ్చారు
సాక్షి, అమరావతి: నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో జరిగిన హత్యలు, పల్నాడు జిల్లాలో కారు దహనంపై ఆ మూడు జిల్లాల ఎస్పీలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాకు వివరణ ఇచ్చారు. సీఈవో మీనా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీరా రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి గురువారం సాయంత్రం సచివాలయంలోని సీఈవో కార్యాలయానికి వచ్చారు. అక్కడ సీఈవో ముఖేష్ కుమార్ మీనా, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) శంకబ్రత్ బాగ్చీ ఎదుట హాజరై ఆ సంఘటనలకు దారి తీసిన పరిస్థితులు, అనంతరం తాము చేపట్టిన చర్యలపై నివేదికలు అందజేశారు. అనంతరం సీఈవో మీనా విలేకరులతో మాట్లాడుతూ గిద్దలూరులో జరిగినది రాజకీయ హింసేనని ఎస్పీ నివేదిక ఇచ్చారని తెలిపారు. ఆళ్లగడ్డలో జరిగిన హత్య కుటుంబ కక్షల వల్ల జరిగిందని ఆ జిల్లా ఎస్పీ వివరించారన్నారు. మాచర్లలో రెండు వర్గాల ఘర్షణ సందర్భంగా కారు దహనం జరిగిందని, గురువారం రాత్రిలోగా నిందితులను అరెస్ట్ చేస్తామని పల్నాడు ఎస్పీ చెప్పినట్లు తెలిపారు. ఎస్పీలు ఇచ్చిన నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీకి) సమర్పిస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఎటువంటి హింసాత్మక ఘటనలు, రీపోలింగ్ లేకుండా నిర్వహించాలనేది తమ లక్ష్యమని చెప్పారు. రాజకీయ హింసను నిరోధించేలా కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. చెక్కులు పంపిణీ చేస్తే కోడ్ ఉల్లంఘనే నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో చెక్కులు పంపిణీ చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఆ జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు కోరినట్లు మీనా తెలిపారు. డబ్బులు పంపిణీ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేశారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో చేపట్టిన పరామర్శ యాత్ర కొనసాగించవచ్చని, కానీ చెక్కులు పంపిణీ చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని సభలో భద్రత వైఫల్యంపై ఈసీ నివేదిక కోరింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న చిలకలూరిపేట బహిరంగ సభలో భద్రత వైఫల్యంపై ఈసీ నివేదిక కోరిందని మీనా తెలిపారు. ఈ సభలో భద్రత వైఫల్యంపై వివిధ రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సభలో జరిగిన సంఘటనలపై వాస్తవాలను సమర్పించాలని ఈసీ కోరిందని, త్వరలోనే పూర్తి వివరాలను తెప్పించుకొని నివేదిక పంపుతామని తెలిపారు. -
యూపీలో రాజ్యసభ ఎన్నికల ఉత్కంఠ
ఉత్తరప్రదేశ్లో పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సమాజ్ వాది(ఎస్పీ) పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. వీరిలో ఎస్పీని వీడి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలు రాకేశ్ పాండే, అభయ్ సింగ్, రాకేష్ ప్రతాప్ సింగ్, మనోజ్ పాండే, వినోద్ చతుర్వేది, మహారాజీ ప్రజాపతి, పూజా పాల్, పల్లవి పటేల్ ఉన్నారు. దీంతో ఎస్పీలో చీలికలు వచ్చాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే కొన్ని కారణాలతో ఈ ఎమ్మెల్యేలు సమావేశానికి రాలేకపోయారని, ఈ విషయాన్ని ముందుగానే పార్టీ అధిష్టానానికి తెలియజేశామని ఎస్పీ నేతలు చెబుతున్నారు. ఈ ఎమ్మెల్యేలంతా నేడు (మంగళవారం) జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. మరోవైపు బీజేపీ దాని మిత్రపక్షాల ఎమ్మెల్యేలకు లోక్ భవన్ ఆడిటోరియంలో శిక్షణ సమావేశాన్ని నిర్వహించింది. సాయంత్రం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో పార్టీ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేశారు. బీజేపీ ఓటింగ్ శిక్షణ సమావేశానికి మిత్రపక్షాలైన అప్నా దళ్ (ఎస్), నిషాద్ పార్టీ, సుభాఎస్పీ నేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సరైన ఓటింగ్ విధానాన్ని అధికారులు వారికి వివరించారు. -
ఇండియా కూటమి..యూపీలో పొత్తుకు బ్రేక్ ?
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమికి బీటలు వారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 80 లోక్సభ స్థానాలున్న యూపీలో పొత్తులో భాగంగా కాంగ్రెస్కు ఇచ్చే స్థానాలపై సమాజ్వాద్ పార్టీ కొంత కఠినంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రెండు పార్టీల నేతల మధ్య జరిగిన సీట్ షేరింగ్ చర్చల్లో మొరాదాబాద్ డివిజన్లోని మూడు సీట్లపై ప్రతిష్టంభన నెలకొన్నట్లు సమాచారం. ఈ మూడు సీట్లను కాంగ్రెస్కు ఇచ్చేది లేదని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ హస్తం పార్టీ నేతలకు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. కాగా, సీట్ల పంపిణీ విషయంలో రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగే వరకు రాహుల్గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనేది లేదని అఖిలేశ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ యాత్ర యూపీలోనే కొనసాగతున్న విషయం తెలిసిందే. మరోవైపు పొత్తులో భాగంగా రాష్ట్రంలో మొత్తంగా 17 సీట్లను కాంగ్రెస్కు ఇచ్చేందుకు అఖిలేశ్ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. చర్చలు విఫలం -
YSR: ఆ కంటైనర్లలో అసలు ఏముందంటే..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కంటైనర్లలో రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని.. వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎం.డి షరీఫ్ హెచ్చరించారు. దేశ రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో పోలీసు, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్కార్ట్గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో రూ.వేలకోట్లు నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదని కడప డీఎస్పీ అన్నారు. దేశ రక్షణకు సంబంధించి సామాగ్రి తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, సామాగ్రి వెళ్తున్న రూటులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు, రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారుల ఎస్కార్ట్తో పాటు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చామని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అభూతకల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. -
కాసేపట్లో కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లతో సీఎం రేవంత్ భేటీ
-
AP: రెండో రోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం భేటీ
సాక్షి, విజయవాడ: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రెండో రోజు సీఈసీ బృందం సమావేశం కొనసాగుతోంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష జరుపుతోంది. మొదటి రోజు ఎన్నికల సన్నద్దతపై 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నేడు సీఈసీ బృందానికి ఎన్నికల సన్నద్దతపై నంద్యాల, కర్నూలు, సత్యసాయి, అనంత, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, రీపోలింగ్ కేంద్రాల పరిస్ధితి, భద్రతా చర్యలు, బందోబస్తు తదితర వాటిపై సమీక్ష చేయనున్నారు. చెక్ పోస్టులు.. తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై సీఈసీ బృందం ఆరా తీస్తోంది. సమస్యాత్మక.. సున్నిత ప్రాంతాల్లో భద్రతాపై సమీక్ష చేపట్టారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఎక్కువగా ఉన్న జిల్లాలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టాలని సీఈఓకు కేంద్ర బృందం సూచించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలను చాలా సీరియస్గా తీసుకుంటామని తొలి రోజు సమావేశంలో సీఈసీ బృందం హెచ్చరించింది. రాజకీయ పార్టీల ఫిర్యాదులపైనా సమీక్షించిన కేంద్ర ఎన్నికల బృందం.. బోగస్ ఓట్లు, డబుల్ ఎంట్రీలపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై వివరాలు తెలుసుకుంది. మధ్యాహ్నం సీఎస్, డీజీపీలతో పాటు ఎన్నికలతో సంబంధం ఉండే కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతోనూ ఈసీ బృందం భేటీ కానుంది. -
‘ప్రసాద్ తల్లిని కూడా హత్య చేయాలనుకున్నారు’
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఒకే ఇంట్లో ఆరుగురు హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రశాంత్తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు. ఆమె మంగళవారం కేసు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. ఒక్కొక్కరినీ ఒక్కో ప్రాంతానికి తీసకువెళ్లి హత్య చేశారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లలో కేసు నమోదైనట్లు తెలిపారు. ప్రశాంత్తో పాటు గుగులోతు విష్ణు, బానోతు వంశీ, వడ్డమ్మ, మరో మైనర్ బాలుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నవంబర్ 29 రోజు ప్రసాద్ను రాళ్లతో కొట్టి చంపి పూడ్చిపెట్టారని నిందితులను విచారిస్తే తెలిసిందన్నారు. ఈ హత్యలు చేయడానికి వాడిన టాటా ఆల్ట్రోజ్ కారు, భూమి పత్రాలు, రూ.30 వేలు, ఐదు సెల్ ఫోన్లు దొరికినట్లు చెప్పారు. ఆ ఫొన్లు కూడా మృతి చెందినవారివిగా గుర్తించామని అన్నారు. వారి ప్రణాళిక ప్రకారం ప్రసాద్ వాళ్ల అమ్మను కూడా హత్య చేయాలనుకున్నారని తెలిపారు. ఈ ఆరుగురి హత్యల్లో నిందితుడు ప్రశాంత్ తల్లి పాత్ర కూడా ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. పలు అనుమానాల ఆధారంగా ఇది కేవలం ప్రథమిక విచారణ అన్నారు. ఈ కేసులో అన్నివైపుల నుంచి లోతుగా తదుపరి దర్యాప్తు కొనస్తామని తెలిపారు. చదవండి: ఇంటిపై కన్నేసి ఇంటిల్లిపాదినీ బలిగొన్న స్నేహితుడు -
ఎస్పీని బదిలీ చేయాలని బీఎస్పీ పట్టు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎస్పీ సురేశ్కుమార్ను బదిలీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పట్టుబట్టడం జిల్లా రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. మూడురోజుల క్రితం ఆర్ఎస్పీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ను కలిసి ఫిర్యాదు చేశారు. సురేశ్కుమార్ ఎస్పీగా కొనసాగితే జిల్లాలో ఎన్నికలు సజావుగా సాగవని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా పార్టీ ప్రెస్మీట్లోనూ ఇదే విషయాన్ని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్తో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఓ మాజీ ఐపీఎస్ అధికారి.. విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారిపై ఇలాంటి ఆరోపణలు చేయడంతో అటు పోలీస్శాఖ, రాజకీయ, వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే దీనిపై ఎస్పీ సురేశ్కుమార్ స్పందిస్తూ.. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను తాను సన్మానించిన ఫొటోలు పాతవని, షెడ్యూల్ విడుదలయ్యాక పక్కాగా ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. నిష్పక్షపాతంగా పని చేస్తున్నట్లు ఎస్పీ సురేశ్కుమార్ వివరించారు. అయితే బీఎస్పీ మాత్రం అందుకు సంతృప్తి చెందక ఎస్పీని బదిలీ చేయాలంటూ పట్టుబడుతోంది. దీంతో ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని అధికారవర్గాలు ఆరా తీస్తున్నాయి. ఎన్నికల కమిషన్ ఆరా? ఎస్పీని బదిలీ చేయాలని ఫిర్యాదు రావడం, అందులో కొన్ని ఆధారాలు కమిషన్కు ఇవ్వడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. అలాగే రాష్ట్ర పోలీస్శాఖ కూడా ఈ వ్యవహారంలో ఇప్పటికే సమాచారం తీసుకుంది. ఈ ఫిర్యాదులో వాస్తవమెంత? అనే కోణంలో ఆధారాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సిర్పూర్ ఎమ్మెల్యేగా బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్పై రాజకీయ కోణంతో పాటు ఇతర కోణాల్లోనూ వివరాలు సేకరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన క్షణం నుంచే కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ష న్ కమిషన్ అధీనంలోనే పని చేయాల్సి ఉంటుంది. జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా కమిషన్ ఆదేశాలు పాటించాల్సిందే. బదిలీలు, ఇతర చర్యలు తీసుకోవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్లు అధికార పార్టీకి అనుబంధంగా పని చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల పది మంది ఐపీఎస్లు, నలుగురు కలెక్టర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం విధుల నుంచి తప్పించి బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. వారి స్థానంలో వేరే అధికారులను నియమించింది. ఈ క్రమంలో జిల్లాలో ఎస్పీ పైనా ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందోననే ఉత్కంఠ జిల్లా ప్రజల్లో నెలకొంది. -
నూతన సీపీలు, ఎస్పీల నియామకంపై డీజీపీ కసరత్తు.. హైదరాబాద్ సీపీ రేసులో ఉన్నది వీరే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సీపీ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలు, ఓ శాఖ కార్యదర్శి, మరో శాఖ డైరెక్టర్, ఇంకో శాఖ కమిషనర్లపై బదిలీ వేటు వేసింది. వీరిలో 18 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలకు శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని ఆంక్షలు విధించింది. బదిలీ అయిన అధికారులు సత్వరమే బాధ్యతల నుంచి తప్పుకొని తమ తర్వాతి స్థానంలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ మూడు శాఖలకు కొత్త ముఖ్య కార్యదర్శులతోపాటు బదిలీ వేటుపడిన 20 మంది అధికారుల స్థానంలో ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోగా కొత్త అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది ఈ క్రమంలో నూతన సీపీలు, ఎస్పీల నియామకంపై డీజీపీ అంజనీకుమార్ కసరత్తు ప్రారంభించారు. సీఈసీకి పంపే లిస్ట్ను డీజీపీ సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ సీపీ రేసులో మహేష్ భగవత్, షికా గోయల్, శివధర్రెడ్డి, కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, నాగిరెడ్డి, సజ్జనార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ముగ్గురి పేర్లతో సీఈసీకి ప్రభుత్వం లిస్ట్ పంపనుంది. ప్రతి పోస్టుకు ముగ్గురు పేర్లతో జాబితాను ప్రభుత్వం పంపనుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ఆయా పోస్టుల్లో ఈసీ ఎంపిక చేయనుంది. రాష్ట్ర సర్కార్ పంపిన ముగ్గురి జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు ఉంటే ఈసీ తిరస్కరించే అవకాశం ఉంది. మళ్లీ కొత్తగా పేర్లు ప్రతిపాదన చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ కోరనుంది. ఈసీ ఫైనల్ చేసిన తర్వాత ఆయా నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. -
ఎస్పీ రమణకుమార్ బదిలీ
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎస్పీ ఎం.రమణకుమార్కు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 11 మంది నాన్క్యాడర్ ఐపీఎస్లను బదిలీ చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఆయనకు బదిలీ అయ్యింది. 2021 జూలై 30 ఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సుమారు రెండేళ్ల మూడు నెలలపాటు విధులు నిర్వర్తించారు. ఎన్నికల నోటిఫికేషన్కు జారీకి ముందు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించింది. కీలకమైన శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించిన ఈసీ ఉన్నతాధికారులు రాష్ట్రంలో కీలక పదవుల్లో నాన్కేడర్ అధికారులు ఉన్నట్లు గుర్తించారు. ఎన్నికల కోడ్ అమలులోకి రాగా ఉన్నతాధికారులను బదిలీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా అడిషనల్ ఎస్పీ అశోక్కు బాధ్యతలు అప్పగించాలని ఈసీ ఆదేశించింది. -
‘అనంత’లో పనిచేయడం గొప్ప అనుభూతి
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: జిల్లాలో తక్కువ కాలం పని చేసినా.. తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని, ఇది మరువలేనిదని ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ వెస్ట్ జోన్ డీసీపీగా బదిలీ అయిన ఆయనకు బుధవారం పోలీసు పరేడ్ మైదానంలో ఏఆర్ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం పోలీసు క్వార్టర్సులో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రజలు, సిబ్బంది చూపించిన ప్రేమాభిమానాలను మరువలేనన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తాను పని చేసినా ఎక్కడా ఇంతటి సంతృప్తికరమైన విధులను చూడలేదన్నారు. నేరాలను ఛేదించే క్రమంలో పనిని సవాళుగా తీసుకోవడం, టీమ్ వర్క్ చేయడం లాంటి అనేక అంశాల్లో సిబ్బంది చూపిన ఆత్మస్థైర్యం స్ఫూర్తిదాయకమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచాలన్నారు. అనంత వాసుల్లో మానవత్వం ఎక్కువగా ఉందన్నారు. ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ రోడ్డు ప్రమాద సమయంలో అనిత ఆరోగ్యంపై అనంత వాసులు స్పందించిన తీరును కొనియాడారు. కష్టం ఎవరికి వచ్చినా కరిగిపోయి ఆపన్న హస్తాలందించే వ్యక్తిత్వం అనంత వాసుల సొంతమన్నారు. మంచి వాతావరణంలో పని చేశానన్నా సంతృఫ్తితో వెళుతున్నానన్నారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఆయన కుటుంబసభ్యులు, సెబ్ అదనపు ఎస్పీ జి.రామకృష్ణ, డీఎస్పీలు శ్రీనివాసులు, గంగయ్య, నర్శింగప్ప, శివారెడ్డి, మునిరాజ్, జి. ప్రసాద్రెడ్డి, సీఐలు జాకీర్ హుస్సేన్, ఇందిర, విశ్వనాథచౌదరి, దేవానంద్, రెడ్డప్ప, శివరాముడు, ధరణీకిషోర్, ప్రతాప్రెడ్డి, నరేంద్రరెడ్డి, నాగార్జునరెడ్డి, ఆర్ఐలు హరికృష్ణ, రాముడు, లీగల్ అడ్వైజర్ విష్ణువర్థన్రెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘం నేతలు పాల్గొన్నారు. -
Mahabubabad: రేఖా నాయక్ అల్డుడి ఆకస్మిక బదిలీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ బదిలీ అయ్యారు. ఆయనను తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీగా పనిచేస్తున్న చంద్రమోహన్ గుండేటిని నియమిస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆకస్మికంగా జరిగిన ఎస్పీ బదిలీపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకులు ఏరికోరి తెచ్చుకున్న ఎస్పీ ఎన్నికల వరకు ఉంటారని అందరూ భావించగా.. ఊహించని విధంగా బదిలీ కావడానికి ‘రేఖా నాయక్ ఎఫెక్ట్’ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ Ajmeera Rekha Nayak ఎస్పీకి స్వయాన బిడ్డను ఇచ్చిన అత్తగారు. ఈసారి ఆమెకు టికెట్ రాకపోగా, ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. రేఖా నాయక్పై కోపంతో ఆమె అల్లుడిని ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ మారతానని ప్రకటించిన గంటల్లోనే ఈ ఆదేశాలు వెలువడడం గమనార్హం. -
అత్తమీద కోపం.. అల్లుడిపై ప్రతాపం
సాక్షి, మహబూబాబాద్: జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ను రాష్ట్ర పోలీస్ అకాడమికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయంలోని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్లో ఎస్పీగా పనిచేస్తున్న చంద్రమోహన్ను బదిలీపై జిల్లాకు పంపారు. ఈ మేరకు మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆకస్మిక బదిలీపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. 2021 డిసెంబర్ 26న జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు ఏరికోరి తెచ్చుకున్న ఎస్పీ.. ఎన్నికల వరకు ఉంటారని అందరూ భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా 20 నెలల్లో బదిలీ కావడం.. దీని వెనుక ఏం జరిగింది అనేది అటు అధికారులు.. ఇటు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఆకస్మిక బదిలీతో షాక్.. జిల్లా పోలీస్బాస్ ఆకస్మిక బదిలీతో ఆశాఖ అధికారులు విస్మయానికి గురయ్యారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు జిల్లా ఎస్పీని బదిలీ చేయలేదు. దీంతో ఆయన ఎన్నికల వరకు ఉంటారని అందరు భావించారు. అయితే కుటుంబ సభ్యుల్లో జరిగిన రాజకీయ పరిణామాలే ఆయన బదిలీకి కారణం అని కొందరు చెబుతుండగా.. ఎస్పీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో శాఖ తీసుకున్న నిర్ణయం అని మరికొందరు చెబుతున్నారు. కుటుంబ రాజకీయ పరిణామాలే కారణమైతే ఎస్పీ బదిలీతోనే ఆగిపోతుంది. అలా కాకుంటే ఎస్పీతో పాటు మరికొందరిపై బదిలీ వేటు పడే అవకాశం ఉందని పలువురు సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఎస్పీ బదిలీ వార్తతో ఆయనకు అనుకూలంగా ఉండే అధికారులు మాత్రం ఆందోళనగానే ఉన్నట్లు సమాచారం. ఆ కోపమేనా..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ తన బిడ్డను ఎస్పీ శరత్చంద్ర పవార్కు ఇచ్చి పెళ్లి చేశారు. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వడం లేదు. ఇటీవల విడుదల చేసిన జాబితాలో కూడా ఆమె పేరు లేదు. దీంతో ఆమె మనస్తాపం చెందిగా.. భర్త శ్యాం నాయక్ ఉద్యోగం వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈమేరకు నేడో రేపో రేఖానాయక్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆమె పార్టీ మారకుండా ఉండేందుకు పలువురు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. అయినా చర్చలు ఫలించలేదు. దీంతో రేఖానాయక్పై కోపంతో ఆమె అల్లుడు ఎస్పీ శరత్ చంద్రపవార్ను ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసినట్లు మానుకోటలో ప్రచారం జరుగుతోంది. -
పుంగనూరు కేసులో అదే కీలకాధారం: చిత్తూరు ఎస్సీ
సాక్షి, చిత్తూరు: పుంగనూరులో పోలీసులపై దాడి కేసుకు సంబంధించిన 500 మంది నిందితులను గుర్తించామని.. వీళ్లలో 92 మందికి ఇప్పటివరకు అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ రిషాంత్రెడ్డి తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు వివరాలను సాక్షికి తెలిపారాయన. ‘‘ఫ్రీ ప్లాన్ గా పోలీసులపై దాడి చేశారు. ఈ విషయాన్ని ఈ కేసులో ప్రధాన నిందితుడైన పుంగనూరు టీడీపీ ఇంఛార్జి చల్లా బాబు పీఏ గోవర్ధన్ రెడ్డి, డ్రైవర్ నరీన్ కుమార్ రిమాండ్ రిపోర్ట్ లో అంగీకరించారు. ఈ కేసులో ఇదే కీలక ఆధారం. వీడియో పుటేజి ఆధారంగా మొత్తం 500 మంది నిందితులను గుర్తించాం, ఇప్పటి వరకు 92 మందిని అరెస్ట్ చేశాం, 408 మందిని ట్రేస్ చేయాల్సి ఉంది. ‘‘ఈనెల 1వ తేదీ నాడు పోలీసులు పై దాడికి ప్లాన్ చేశారు, ముందుగా సమావేశం అయ్యారు. అనుకున్న విధంగా ఈనెల 4వ తేదీన దాడి చేశారు,విధ్వంసం సృష్టించారు. పక్కాగా ప్రీ ప్లాన్డ్గానే ఈ దాడి చేశారు. నిందితులిద్దరూ రిమాండ్ రిపోర్ట్లో ఈ విషయాన్నే అంగీకరించారు. ప్రధాన నిందితుడు చల్లా బాబు దక్షిణాది రాష్ట్రాల్లో లొకేషన్స్ మారుస్తున్నారు. అయినా అతిత్వరలో అరెస్ట్ చేస్తాం. చల్లా బాబు హైకోర్టు లో బెయిల్ కోసం అప్లై చేస్తే.. న్యాయపరంగా ఎదుర్కొంటున్నాం అని ఎస్పీ రిషాంత్రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి: పవన్పై క్రిమినల్ కేసులో కీలక పరిణామం -
మణిపూర్ హింస: సీబీఐ దర్యాప్తు బృందంలో 29 మంది మహిళా అధికారులు
మణిపూర్ అల్లర్లలో వెలుగుచూసిన లైంగిక హింస వీడియో కేసును సీబీఐకి కేంద్రం అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించడానికి సీబీఐ దేశవ్యాప్తంగా ఉన్న తన యూనిట్ల నుంచి 53 మంది అధికారులను నియమించింది. వీరిలో 29 మంది మహిళా అధికారులు ఉన్నారు. ముగ్గురు డీఐజీలు లవ్లీ కతియార్, నిర్మలాదేవి, మోహిత్ గుప్తాతోపాటు ఒక ఎస్పీ రాజ్వీర్ సైతం ఉన్నారు. ఇద్దరు అదనపు పోలీసు సూపరింటెండెంట్లు, ఆరుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు ఆఫ్ పోలీస్లు 53 మంది సభ్యుల బృందంలో ఉన్నారు. వీరంతా మొత్తం దర్యాప్తును జాయింట్ డైరెక్టర్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్కు తమ నివేదికను నివేదించనున్నారు. కాగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఒకే కేసులో ఇంత భారీ సంఖ్యలో మహిళా అధికారులను తీసుకోవడం ఇదే తొలిసారని అధికారులు భావిస్తున్నారు. సీబీఐ విచారిస్తున్న ఈ కేసుల్లో చాలా వరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989లోని నిబంధనలకు సంబంధించినవని, వీటిని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి దర్యాప్తు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే ఇలాంటి కేసుల్లో డీఎస్పీలు పర్యవేక్షకులుగా ఉండటం సాధ్యం కానందున దర్యాప్తును పర్యవేక్షించడానికి సీబీఐ ముగ్గురు డీఐజీలను ఒక ఎస్పీని నియమించినట్లు పేర్కొన్నారు. చదవండి: మధ్యప్రదేశ్లో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’.. దిగ్విజయ్ హాట్ కామెంట్స్ ఈ బృందంలో 16 మంది ఇన్స్పెక్టర్లు, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లు కూడా ఉంటారని అధికారులు తెలిపారు. సాధారణంగా ఇంత పెద్ద సంఖ్యలో కేసులను సీబీఐకి అప్పగించాల్సి వస్తే సిబ్బందిని సమకూర్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సంబంధిత రాష్ట్రంపై ఆధారపడి ఉంటుందని, అయితే కానీ మణిపూర్ విషయంలో దర్యాప్తులో పక్షపాత ఆరోపణలు రాకుండా స్థానిక అధికారుల పాత్రను తగ్గించడానికి సీబీఐ ప్రయత్నిస్తోందని అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఇరు వర్గాల వ్యక్తుల ప్రమేయం ఉండకుండా ఉందేందుకు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే సీబీఐ ఎనిమిది కేసులు నమోదు చేసింది. ఇందులో రెండు కేసులో మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుకు సంబంధించినవి. మణిపూర్ హింసాకాండకు సంబంధించి మరో తొమ్మిది కేసులను దర్యాప్తు చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. దీంతో సంస్థ విచారించనున్న మొత్తం కేసుల సంఖ్య 17కు చేరింది.ఈ కేసులో కాకుండా మహిళలపై నేరాలు, లైంగిక వేధింపులకు సంబంధించిన మరే ఇతర కేసులను కూడా ప్రాధాన్యత ఆధారంగా విచారిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో చురచంద్పూర్ జిల్లాలో జరిగిన లైంగిక వేధింపుల కేసును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ స్వీకరించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మార్చి 3న మణిపూర్ హింస మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు.మే 4న కుకి జాతికి చెందిన ఓ గ్రామంపై దాడి చేసిన దుండగులు.. ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి, ఊరేగించారు. ఓ ఫేక్ వీడియోను చూసి, కోపంతో ఈ దారుణానికి ఒడిగనట్టు తెలుస్తోంది. బాధితుల్లో ఒకరిపై సామూహిక అత్యాచారం కూడా జరిగింది, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు జులై 26 వెలుగులోకి రాగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చదవండి: కొనసాగుతున్న వర్ష బీభత్సం.. రూ.10 వేల కోట్ల ఆస్తి నష్టం.. -
లైగింక వేధింపులపై ఎస్పీకి ఫిర్యాదు
తిరువళ్లూరు: ఉన్నత ఉద్యోగుల నుంచి తరచూ ఎదురవుతున్న లైగింక వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ బాధిత యువతులు బుధవారం ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. తిరువళ్లూరు జిల్లా తొడుగాడు గ్రామంలో కార్లకు బ్రేక్, తాళం తయారు చేసే సంస్థ ఉంది. ఈ సంస్థకు దక్షణ కొరియాకు చెందిన కియాంగ్ జూ లీ మేనేజింగ్ డైరెక్టర్గా, ఽహేమావతి, ధనశేఖర్ తదితరులు మేనేజర్లుగా పని చేస్తున్నారు. కంపెనీలో సుమారు 100 మంది యువతులు పని చేస్తున్నారు. కాగా కంపెనీలో పని చేసే యువతులకు కియాంగ్ జూలీ తరచూ లైగింక వేధింపులకు గురి చేస్తున్నాడని యువతులు వాపోయారు. వేధింపులపై ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. అనంతరం అదనపు ఎస్పీ మీనాక్షికి వినతి పత్రం సమర్పించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగం నుంచి తొలగించిన వారిని విధుల్లోకి తీసుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
వేటాడి.. వెంటాడి..
పట్నంబజారు(గుంటూరుఈస్ట్): పన్నెండేళ్ల బాలికకు తీరని అన్యాయం.. కొంతమంది మోసగాళ్ల చేతికి చిక్కి వ్యభిచార కూపంలో మగ్గిపోయింది.. ఆఖరుకు ఎలాగో తప్పించుకుని ఒక మహిళా అధికారి వద్దకు చేరుకుంది. బాలిక పట్ల మృగాళ్లు వ్యవహరించిన తీరు.. పలువురు మహిళలు చేయించిన అఘాయిత్యాలను చూసిన ఆ అధికారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎలాగైనా సరే నిందితులకు శిక్షలు పడేదాక విశ్రమించకూడదని నిర్ణయం తీసుకున్నారు. కేసు విచారణలో చూపిన ప్రతిభకు గాను గుంటూరు జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ కొర్లకుంట సుప్రజకు కేంద్ర ప్రభుత్వం ‘సెంట్రల్ హోం మినిస్టర్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్’ అవార్డును ప్రకటించింది. గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్స్టేషన్ పరిధిలో గతేడాది 12 ఏళ్ల బాలికను అపహరించి, వ్యభిచార కూపంలోకి దించిన కేసు విచారణ బాధ్యతలను అప్పటి వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా ఉన్న ప్రస్తుత ఏఎస్పీ కె.సుప్రజకు అప్పగించారు. అన్నీ తానై ఏపీ, తెలంగాణ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వయంగా విచారణ జరిపారు. తన నాలుగు నెలల పసిబిడ్డను తీసుకుని.. ఆఖరుకు ఆమె ప్రయాణిస్తున్న వాహనంలోనే ఆ చిన్నారికి ఊయల కట్టి వెళ్లిన పరిస్థితులున్నాయి. కేసులో వ్యభిచారం చేయించిన నిర్వాహకులు, వ్యభిచారానికి పాల్పడిన 80 మంది నిందితులను అరెస్ట్ చేశారు. డీఎస్పీ నుంచి ఏఎస్పీగా పదోన్నతి పొందాక సైతం ఈ కేసును పూర్తిస్థాయిలో సుప్రజతోనే విచారణ చేయించాలని కోర్టు ఆదేశించటంతో పాటు, కేసులో భారీ పురోగతి సాధించిన ఆమెను న్యాయస్థానం అభినందించింది. ఈ కేసులో సుమారు 500 పేజీల చార్జిషీట్ను కోర్టుకు సమర్పించారు. మరో బాలికకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్న పట్టుదలతో ఉన్నతాధికారుల సహకారంతో విచారణ చేసినట్టు ఏఎస్పీ సుప్రజ చెప్పారు. -
గాంధీనగర్ ఎస్పీగా తెలుగు యువకుడు
డా. బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ: గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ఎస్పీగా మన తెలుగువాడు నియమితుడు కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మామిడికుదురు మండలం పెదపట్నంలంకకు చెందిన వాసంశెట్టి రవితేజను గాంధీనగర్ ఎస్పీగా నియమించారు. రవితేజ సోమవారం బాధ్యతలు స్వీకరిస్తాడని అతని తండ్రి వాసంశెట్టి నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. రవితేజ తండ్రి నాగేశ్వరరావు, తల్లి మల్లికాదేవి తెలంగాణ హైకోర్టు న్యాయవాదులుగా పని చేస్తున్నారు. 2015 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రవితేజ విధి నిర్వహణలో ఉత్తమ సేవలకు గాను గతంలో డిప్యూటీ సీఎం నవీన్ పటేల్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ పోలీస్ డిప్యూటీ కమిషనర్గా పని చేశారు. అక్కడ పని చేస్తూ ఎస్పీగా పదోన్నతి పొందారు. -
అపుడు కరోడ్పతి షో సెన్సేషన్: మరి ఇపుడు
కేబీసీ కరోడ్పతి రవి మోహన్ సైనీ గుర్తున్నారా. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన టాప్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్పతి టెలివిజన్ షో 2001లో రవి పెద్ద నేషనల్ సెన్సేషన్. కేవలం 14 సంవత్సరాలకే కౌన్ బనేగా కరోడ్పతి జూనియర్ని రవి మోహన్ సైనీ గెలుచుకున్నారు.15 కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అప్పట్లో పెద్ద సంచలనం రేపాడు. అంతేనా దయాగాడి దండయాత్ర అన్నట్టు రవి విజయ పరంపర ఆగిపోలేదు. కేబీసీ జూనియర్ విజేత మాత్రమే కాదు, ఆ తరువాత డాక్టర్ అయ్యాడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి ఐపీఎస్గా ఆ తర్వాత వార్తల్లో నిలిచాడు. 20 ఏళ్ల తర్వాత 34 ఏళ్ల వయసులో 2021లో గుజరాత్లో పోరుబందర్కి ఎస్పీగా బాధ్యతలు చేపట్టడంతో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఊహించని విజయాలతో తన భవిష్యత్తును తీర్చిదిద్దుకున్న రవిసైనీ విజయగాథ ఇది. కేబీసీ నాటికి రవి 10వ తరగతి చదువుతున్నాడు. మెగాస్టార్ అబితాబ్ని కలవాలన్న కలతో పాటు షోలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని తానే ఒక స్టార్గా నిలిచాడు. అప్పటికే మంచి విద్యార్థి ,ఎప్పుడూ టాపర్ అయిన రవిలో ఇది మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. జైపూర్లోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన రవి యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఎలాంటి కోచింగూ తీసుకోకపోవడం మరో విశేషం. (టీసీఎస్లో భారీ కుంభకోణం: రూ.100 కోట్ల కమిషన్లు మింగేశారు!) 2012 లో మెయిన్స్ను క్లియర్ చేయలేకపోయాడు. దీంతో 2013లో, భారత తపాలా శాఖ ఖాతాలు, ఆర్థిక సేవలకు ఎంపికయ్యాడు. ఆ తరువాత మెడికల్ ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడే 2014లో, ఆల్ ఇండియా ర్యాంక్ 461తో అర్హత సాధించాడు. తండ్రి నేవీ అధికారి స్ఫూర్తితోనే ఐపీఎస్లో చేరానంటారు ఎస్పీ డా. రవి మోహన్ సైనీ. પોલીસ અધિક્ષકશ્રી પોરબંદર દ્વારા વાવાઝોડાથી સંભવિત નુકશાન થઈ શકે તેવા હાર્બર મરીન અને સુભાષ નગર જેટી વિસ્તારની મુલાકાત લઈ નાગરિકો અને સ્ટાફને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.@GujaratPolice@dgpgujarat@sanghaviharsh@Harsh_office @CMOGuj@Igp_jnd_range pic.twitter.com/pNSqC2Oh84 — SP Porbandar (@SP_Porbandar) June 13, 2023 మరిన్ని బిజినెస్ వార్తలు, ఇంట్రస్టింగ్ కథనాల కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
పుష్పారెడ్డికి నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో క్రైమ్, ఆపరేషన్స్ అడిషనల్ డీసీపీగా, ట్రాపిక్, అడ్మిన్ ఇన్చార్జ్ డీసీపీగా పనిచేస్తున్న కర్రి పుష్పారెడ్డికి శుక్రవారం ప్రభుత్వం నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి కల్పించింది. 2012 గ్రూప్–1 బ్యాచ్కి చెందిన పుష్పారెడ్డి 2014 నుంచి హైదరాబాద్ సీఐడీ, సైబర్ క్రైమ్ డీఎస్పీగా, 2018లో కల్వకుర్తి డీఎస్పీగా, 2019 నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్లో క్రైమ్, ఆపరేషన్స్ అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్నారు. 2020లో సెంట్రల్ జోన్ ఇన్చార్జ్ డీసీపీగా పనిచేశారు. ఈ మేరకు పుష్పారెడ్డికి సీపీ రంగనాథ్తోపాటు పలువురు పోలీస్ అధికారులు అభినందనలు తెలిపారు. -
తిరుమలలో ఎలాంటి ఉగ్రవాద కదలికలు లేవు
-
తనకంటే ముందే పూలమాల వేయడంపై ఎమ్మెల్యే కంచర్ల అభ్యంతరం
-
భూమి కబ్జాచేసి చంపేస్తామంటున్నారు.. పరిటాల శ్రీరామ్ నుంచి రక్షణ కల్పించండి
సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): తెలుగుదేశం నాయకుడు పరిటాల శ్రీరామ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చెరుకూరి వెంకటరాముడు సోమవారం ఎస్పీ రాహుల్దేవ్సింగ్కు ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా చేయడమేగాక దాన్ని రాసి ఇవ్వమంటున్నారని, లేకపోతే చంపేస్తామని ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని తెలిపారు. పరిటాల సునీత కబ్జాచేసిన తన భూమిని తనకు ఇప్పించాలని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. ‘నా ఆస్తిని కబ్జా చేశారు. నన్ను కిడ్నాప్ చేశారు. ఆ ఆస్తి రాసిస్తాననడంతో వదిలేశారు. కానీ తర్వాత నేను నా ఆస్తి ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో నన్ను హత్యచేసేందుకు కుట్ర పన్నినట్లు తెలిసింది. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ అండతోనే ఆయన అనుచరులు ఇలా చేస్తున్నారు. వారి నుంచి రక్షణ కల్పించాలి..’ అని పేర్కొన్నారు. జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’లో ఆయన ఎస్పీకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి రెవెన్యూ లో 141–2 సర్వే నంబరులో 9.81 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి 1930 సంవత్సరం ముందు నుంచి వెంకటరాముడు పూర్వీకుల పేరిట ఉంది. తర్వాత మూడు భాగాలుగా పంచుకున్నారు. అందులో మూడోవంతు.. అంటే 3.27 ఎకరాలు చెరుకూరి వెంకటరాముడుకు దక్కింది. అందులో 1.63 ఎకరాలను ఆయన ఇతరులకు విక్రయించారు. మిగిలిన 1.64 ఎకరాల భూమిని తమకు రాసివ్వాలంటూ పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పటి నుంచి వేధిస్తున్నారు. అంతేకాకుండా మొత్తం 9.81 ఎకరాల భూమి ఇంకా సబ్ డివిజన్లు కాకపోవడంతో మొత్తం భూమిపై పరిటాల కుటుంబం కన్నేసింది.. అని వెంకటరాముడు పేర్కొన్నారు. గత నెల 17న కిడ్నాప్ భూమి విషయమై గత నెల 17వ తేదీన ధర్మవరంలో ఉన్న వెంకటరాముడును కిడ్నాప్ చేశారు. పరిటాల అనుచరులు దాదా ఖలందర్, చింతలపల్లి మహేశ్నాయుడు, ఎల్.నారాయణచౌదరి, లిక్కర్ సుధాకర్నాయుడు ప్రోద్బలంతో కుంటిమద్ది అక్కులప్ప తన గ్యాంగ్తో వచ్చి కిడ్నాప్ చేసినట్లు అప్పట్లోనే వెంకట రాముడు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని చోటుకు తీసుకెళ్లి తనను తీవ్రంగా కొట్టారని, వారు కోరుకున్నట్లుగా భూమి రాసిస్తానని చెప్పిన తర్వాత అదేరోజు సాయంత్రం ప్రాణాలతో వదిలారని ఆ ఫిర్యాదులో తెలిపారు. చదవండి: టీడీపీ ‘సామాజిక’ చిచ్చు -
శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ జాషువా
-
గన్నవరంలో 144 సెక్షన్.. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు:ఎస్పీ జాషువా
సాక్షి, కృష్ణా: గన్నవరం నియోజకవర్గ పరిధిలో సోమవారం టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణులు మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ఇవాళ టీడీపీ తలపెట్టిన చలో గన్నవరం కార్యక్రమానికి అనుమతి లేదని కృష్ణా జిల్లా ఎస్పీ జూషువా తెలిపారు. టీడీపీ నాయకుడు పట్టాభి.. విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద దాడికి పురి గొల్పడం, బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేయడం వల్ల శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైందని చెప్పారు. ఈ ఘటనలో గన్నవరం సీఐ కనకారావు తలకు బలమైన గాయమైందని పేర్కొన్నారు. 'పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం. సుమోటోగా రియటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తప్పవు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 CRPC, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదు. గన్నవరం పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా చెక్ పోస్టులు, పికెట్స్ ఏర్పాటు చేశాం. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా ప్రవేశించాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.' అని ఎస్పీ జాషువా ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ లో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు. చదవండి: గన్నవరం రణరంగం.. ఎమ్మెల్యే వంశీపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన టీడీపీ నేతలు -
వీరసింహరెడ్డి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి నిరాకరణ వార్తల్లో నిజం లేదు
-
జనాన్ని ఎక్కువ సేపు నిలబెట్టిన కారణంగానే తొక్కిసలాట : జిల్లా ఎస్పీ
-
కందుకూరు సంఘటన దురదృష్టకరం : నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు
-
మాచర్లలో పథకం ప్రకారం రెచ్చిపోయిన టీడీపీ ముఠా
-
ఎస్పీ చెంతకు ఎలుక పంచాయితీ..ప్రశ్నించిన పాపానికి దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: కర్రీ పాయింట్లో కొనుగోలు చేసిన పప్పులో ఎలుక వచ్చిందని ప్రశ్నించిన పాపానికి తమ ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప దృష్టికి బాధితులు తీసుకువచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్పను బాధితులు కలసి ఫిర్యాదు చేశారు. వివరాలు... అనంతపురం నగరంలోని కమలానగర్లో ముత్యాలరెడ్డి డెయిరీ పక్కనే ఊటకూరి దుర్గాంజలి దంపతులు నివాసముంటున్నారు. ఈ నెల 2న మధ్యాహ్నం 2.56 గంటలకు దుర్గాంజలి... ముత్యాలరెడ్డి కర్రీ పాయింట్లో రూ.30 చెల్లించి పప్పు, రూ.20 చెల్లించి చెట్నీ పార్శిల్ తీసుకెళ్లారు. ఇంట్లోకి వెళ్లి అన్నంలోకి పప్పు వేసుకోగా అందులో చచ్చిన ఎలుక వచ్చింది. వెంటనే ఆ ప్లేటును తీసుకెళ్లి కర్రీపాయింట్ నిర్వహిస్తున్న యజమాని దృష్టికి తీసుకెళ్లారు. అది చూసిన వారు హోటల్లోని ఆహార పదార్థాల్లో ఎలుకలు, బల్లులు, బొద్దింకలు పడడం సర్వ సాధారణమంటూ సమాధానం ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో విషయాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. దీంతో కక్షకట్టిన ముత్యాలరెడ్డి కుటుంబసభ్యులు గుర్తు తెలియని వ్యక్తులతో తమ ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేస్తూ భయాందోళనకు గురి చేశారని ఫిర్యాదు చేశారు. (చదవండి: ఆర్టీసీ బస్టాండ్లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కొత్త పెళ్లికూతురు) -
20 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 20 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఇటీవల ప్రభుత్వం 20 మంది పోలీసు అధికారులకు నాన్ క్యాడర్ ఐపీఎస్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్యానల్ను ఆమోదించింది. వారికి నాన్ క్యాడర్ ఎస్పీలుగా పోస్టింగులు ఇవ్వడంతోపాటు మరో ఎస్పీని బదిలీ చేస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్గుప్తా బుధవారం ఉత్తర్వులిచ్చారు. బదిలీ అయిన 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీల జాబితా ఇదీ.. (1) బి.లక్ష్మీనారాయణ.. ఎస్పీ(ఇంటెలిజెన్స్), (2) కేఎం మహేశ్వరరాజు.. ఎస్పీ(స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో), పల్నాడు జిల్లా, (3)ఎ.సురేశ్బాబు.. ఎస్పీ(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), (4)కె.శ్రీనివాసరావు.. డీసీపీ(ట్రాఫిక్), విజయవాడ (5) కె.శ్రీధర్.. ఎస్పీ(ఎస్ఐబీ), (6) కె.తిరుమలేశ్వరరెడ్డి.. ఎస్పీ(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), (7) ఎం.సత్తిబాబు.. డీసీపీ, విజయవాడ, (8) ఎంవీ మాధవరెడ్డి.. ఎస్పీ(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), (9) జె.రామమోహన్రావు.. జాయింట్ డైరెక్టర్, ఏసీబీ, (10) ఎన్.శ్రీదేవిరావు.. ఎస్పీ(ఇంటెలిజెన్స్), (11) ఇ.అశోక్కుమార్.. ఎస్పీ(ఇంటెలిజెన్స్), (12) ఎ.రమాదేవి.. జాయింట్ డైరెక్టర్, ఏసీబీ (13)కేజీవీ సరిత.. ఎస్పీ, సీఐడీ (14) కె.ఆనందరెడ్డి.. డీసీపీ, విశాఖపట్నం (15) కె.చక్రవర్తి.. ఎస్పీ, ఆర్ఎస్ఏఎస్టీఎఫ్, తిరుపతి (16) కె.ఈశ్వరరావు.. ఏడీసీ, గవర్నర్ (17) కె.చౌడేశ్వరి.. ఎస్ఆర్పీ, గుంతకల్(18) ఇ.సుప్రజ.. జాయింట్ డైరెక్టర్, ఏసీబీ(19) కేవీ శ్రీనివాసరావు.. ఎస్పీ, ఇంటెలిజెన్స్, (20) కె.లావణ్యలక్ష్మి.. ఎస్పీ, ట్రాన్స్కో (21) ఎం.సుందరరావు.. ఎస్పీ, ఇంటెలిజెన్స్ -
గది ఖాళీ చేయమంటే.. చంపుతామంటున్నారు
సాక్షి, అనంతపురం: అనంతపురం నగరంలోని నందినీ హోటల్ ఎదురుగా ఉన్న జేసీ ట్రావెల్స్ గదిని ఖాళీ చేయకుండా తమను తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి బెదిరిస్తున్నారని మల్లికార్జున ఆచారి దంపతులు ఎస్పీ ఫక్కీరప్పను కలిసి కన్నీరు మున్నీరయ్యారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్కు హాజరైన వారు తమ ఆవేదనను ఎస్పీకి విన్నవించుకున్నారు. గ్రీవెన్స్లో ప్రజల నుంచి పిటీషన్లు స్వీకరిస్తున్న ఎస్పీ తమ షాపును 2000లో బాబాయ్య అనే వ్యక్తికి బాడుగకు ఇచ్చామని, అయితే తమ నుంచి అద్దెకు తీసుకొని అతను షాపును తాడిపత్రి జేసీ ట్రావెల్స్కు అద్దెకు ఇచ్చాడన్నారు. ఇప్పుడు వారిద్దరు కుమ్మక్కై నాకు బాడుగ ఇవ్వకుండా ఖాళీ చేయకుండా వేధిస్తున్నారని తెలిపారు. నేరుగా జేసీ ప్రభాకర్రెడ్డిని కలిశామని, స్పందించాల్సిన పెద్దమనిషి బెదిరించారన్నారు. షాపు పగల గొడతా, మర్డర్ చేస్తానన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. స్థానిక కమలానగరులో ఇండిపెండెంట్ బిజినెస్ కన్సల్టర్ సెంటర్ (ఐబీసీసీ) పేరుతో పేద విద్యార్థులకు డబ్బు ఆశ చూపి మోసం చేస్తున్న నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మతి హనుమంతురెడ్డి, ఏపీఎస్ఎఫ్ అధ్యక్షుడు ఆకుల రాఘవేంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర.. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 97 మంది నుంచి ఎస్పీ పిటీషన్లు స్వీకరించారు. అనంతం ఎస్పీ మాట్లాడుతూ ఆస్తులు కాజేయడం, కబ్జాలకు తెగబడటం, డబ్బు ఆశ చూసి చీటింగ్కు పాల్పడటం వంటి మోసాలకు పాల్పడివారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. అలాంటి వంచకులపై ఫిర్యాదులు అందితే తాట తీస్తామని హెచ్చరించారు. చదవండి: (మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో..) -
బాహుబలి సినిమాలో మాదిరి ఈ స్టేజ్ కదలాలా..బీటలు వారాలా!
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఎస్పీ నినాదం వివాదంగా మారింది. ‘జయహో జగదీశన్న’అంటూ స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని పొగిడి విద్యార్థులచే నినాదాలు చేయించారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. అంతకుముందు పట్టణంలో భారీ ఎత్తున యువకులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘మంత్రి జగదీశ్రెడ్డికి జై జై.. ఈ గడ్డ మీద మనం పుట్టినందుకు ఈతరం మంత్రికి రుణపడి ఉండాలి. మీ అందరికీ ఆకలవుతుందా.. ఆకలేస్తే కేకలు వేయాలన్నారు శ్రీశ్రీ.. అది అందరికీ గుర్తుందా.. అయితే ఇలా నినాదాలు చేయండి.. జయహో జగదీశన్న’అంటూ నినాదాలు చేయించారు. ‘అందరూ బాహుబలి సినిమా చూశారా.. బాహుబలి వచ్చిననప్పుడు వేదిక కదిలిన విధంగా మీ నినాదాలతో ఈ స్టేజీ కదలాలా.. బీటలు వారాలా..’అంటూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎస్పీ వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఉత్తమ్కుమార్రెడ్డి మంత్రి జగదీశ్రెడ్డిని పొగుడుతూ ఎస్పీ రాజేంద్రప్రసాద్ విద్యార్థులతో నినాదాలు చేయించడం సిగ్గుచేటని, గౌరవప్రతిష్టలు కలిగిన యూనిఫాం సరీ్వసుకే అగౌరవమని నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో కలెక్టర్లు సీఎం కాళ్లు మొక్కడం, ఆ తర్వాత వారిని ఎమ్మెల్సీగా చేయడం చూశామని గుర్తుచేశారు. ఎస్పీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: బాబాసాహెబ్ కలల సాకారంలో... -
అవాక్కయ్యే ఘటన.. ‘జయహో జగదీష్రెడ్డి’.. జిల్లా పోలీస్ బాస్ అత్యుత్సాహం
సాక్షి, సూర్యాపేట జిల్లా: సూర్యాపేటలో జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సాక్షాత్తూ ఒక జిల్లా ఎస్పీనే అత్యుత్సాహం ప్రదర్శించారు. వజ్రోత్సవాల్లో ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్.. ‘జయహో జగదీష్రెడ్డి’ అంటూ నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల్లో మంత్రి జగదీష్రెడ్డి, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చదవండి: నిజాం నిరంకుశత్వంపై నినదించిన ‘మా భూమి’ ఎస్పీ.. ‘‘జయహో జగదీష్రెడ్డి’’ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వేదిక ముందున్నవారితో కూడా ఎస్సీ.. ‘జయహో జగదీషన్న’ అంటూ నినాదాలు చేయించారు. జిల్లా పోలీస్ బాస్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టీఆర్ఎస్ నేత మాట్లాడినట్లుగా ఎస్పీ ప్రసంగం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
అనంతపురం ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అట్రాసిటీ కేసు నమోదు
సాక్షి, అనంతపురం: సాక్షాత్తు జిల్లా ఎస్పీపైనే అనంతపురం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. డిస్మిస్ అయిన కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదు ఆధారంగా ఎస్పీ ఫక్కీరప్ప, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్భాషాలపై అనంతపురం టూటౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వాస్తవానికి ప్రకాష్ను రెండు రోజుల క్రితమే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్నేళ్లలో 5 క్రిమినల్ కేసులు కానిస్టేబుల్ ప్రకాష్పై నమోదయ్యాయి. మహిళలపై వేధింపులు, దాడి, అక్రమ ఆయుధాల సరఫరా వంటి కేసులు ఉన్నాయి. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఓ మహిళను లొబర్చుకొని ఆమె నుంచి రూ.10లక్షల నగదు, 30 తులాల బంగారు కాజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రకాష్పై డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు. ఆరోపణలు నిజమని తేలడంతో కానిస్టేబుల్ ప్రకాష్ను డిస్మిస్ చేస్తూ అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలు జారీ చేశారు. చదవండి: (పోలీసులపై తప్పుడు కథనాలు.. ఈనాడుకు ఎస్పీ ఫకీరప్ప నోటీసులు) డిస్మిస్ వెనుక కక్ష సాధింపు ఉందని ఎల్లో మీడియా ద్వారా ప్రకాష్ అసత్య ప్రచారం చేశాడు. సీఎం జగన్ చెన్నేకొత్తపల్లి పర్యటన సమయంలో ప్రకాష్.. ఎస్పీ ఆపీస్ సేవ్ ఏపీ పోలీస్ అంటూ ప్లకార్డుతో నిరసన వ్యక్తం చేశాడు. అందుకే ప్రకాష్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేశారంటూ ఎల్లోమీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని కొట్టిపారేసిన ఎస్పీ ఫక్కీరప్ప ప్రకాష్ ప్రవర్తన బాగాలేకపోవడంతో డిస్మిస్ చేసినట్లు స్పష్టం చేశారు. అయితే కక్ష సాధింపుతోనే డిస్మిస్ చేశారని ప్రకాష్ ఆరోపించారు. ఎస్పీతో పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు చేశారు. ఎస్పీ ఫక్కీరప్ప, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్భాషాలపై అనంతపురం టూటౌన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు విచారణ బాధ్యతలను డిఐజీ రవిప్రకాస్ చూస్తున్నారు. -
చాట్-బాట్ సేవలకు ప్రతిష్టాత్మక అవార్డు
-
సాఫ్ట్వేర్ లవ్స్టోరీ.. బెంగళూరులో వివాహం.. రక్షణ కల్పించాలంటూ..
సాక్షి, తిరుపతి: రక్షణ కల్పించాలంటూ తిరుపతి ఎస్పీని ప్రేమ జంట ఆశ్రయించింది. అమ్మాయి తల్లిదండ్రులు నుండి తమకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు చేశారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి యువతి తల్లిదండ్రులు, బంధువులు అంగీకరించలేదు. చంద్రగిరి మండలం మల్లయ్యగారి పల్లికి చెందిన పవన్, అదే గ్రామానికి చెందిన నీరజను ప్రేమించి బెంగళూరులో వివాహం చేసుకున్నాడు. ఇరువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. చంద్రగిరి పోలీస్స్టేషన్లో యువతిపై మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును విచారించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. చదవండి: కెమెరాలకు చిక్కిన అరుదైన ఏటి కుక్కలు.. ఎప్పుడైనా చూశారా? -
ఎంపీ గోరంట్ల వీడియో ఫేక్: అనంతపురం ఎస్పీ ప్రకటన
సాక్షి, అనంతపురం: ప్రత్యర్థుల కుట్ర భగ్నమైంది. వైఎస్సార్సీపీని, ఆ పార్టీ నేత.. హిందూపురం ఎంపీ అయిన గోరంట్ల మాధవ్ను బద్నాం చేయాలనే ప్రయత్నం బెడిసి కొట్టింది. ఎంపీ గోరంట్ల మాధవ్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒరిజినల్ కాదని, ఫేక్ అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నాం ఈ వ్యవహారంపై మీడియాతో ఎస్పీ ఫకీరప్ప మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఒరిజినల్ కాదని, ఫేక్ అని చెప్పారు. ఆ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ వీడియోను చూస్తున్న విజువల్స్ను.. వీడియో తీసి పోస్ట్ చేశారు అని ఆయన వెల్లడించారు. వీడియోను మార్ఫింగ్ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేశారని తెలియజేశారు. ఈ మేరకే దర్యాప్తు చేపట్టామని అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఐ.టీడీపీ వాట్సాప్ గ్రూపులో మొదట వచ్చింది. 4వ తేదీ అర్ధరాత్రి 2.07కు +447443703968 నెంబర్ నుంచి పోస్ట్ చేశారు. యూకేలో రిజిస్టర్ అయిన నెంబర్తో వీడియో అప్లోడ్ అయ్యింది. ఈ వీడియోకు సంబంధించి బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదు. ఆ నెంబర్ ఎవరిదో కనుక్కునే పనిలో ఉన్నాం. వీడియో ఫార్వర్డ్, రీపోస్ట్ చేయడం వల్ల అది ఒరిజినల్ అని గుర్తించలేకపోతున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ అని నిర్ధారించలేమని, అలాగే ఒరిజినల్ వీడియో దొరికే దాకా ఏం చెప్పలేమని ఎస్పీ తేల్చి చెప్పారు. ఇదీ చదవండి: తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ -
అనంతపురం పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుంకర ప్రసాద్ నాయుడు
-
ఏపీలో పలువురు ఎస్పీల బదిలీ
-
వైఎస్ను అలా చూస్తూ ఉండిపోయా.. సీఎం జగన్ ఆప్యాయతకు మారుపేరు
ఓ మారుమూల పల్లె.. దిగువ మధ్యతరగతి కుటుంబం.. తండ్రి ఓ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగి.. తల్లి గృహిణి.. ముగ్గురు పిల్లలు.. ఇద్దరు కుమార్తెలు.. ఓ కుమారుడు. నీళ్లు లేక ఊళ్లో అప్పటికే పొలాలు పండని దైన్యం. నాన్న ముగ్గురు బిడ్డలకూ ఒక్కటే మాట పదేపదే చెప్పారు. చదువు.. చదువు.. చదువు.. ఆ ముగ్గురికీ అదే తారకమంత్రమైంది. మిషినరీ, సర్కారు బడులు, కాలేజీల్లో చదువుకున్నప్పటికీ ముగ్గురూ గ్రూప్–1, 2 ఉద్యోగాలు సాధించారు. ఆ ముగ్గురిలో ఓ విద్యార్థి డాక్టర్ అవ్వాలనుకున్నారు.. ఇంటర్లో బైపీసీ తీసుకున్నారు.. కానీ ఎంసెట్లో వచ్చిన ర్యాంక్కి డొనేషన్ కట్టాలి.. అంత సొమ్ము లేకపోవడంతో ఏమీ నిరుత్సాహపడలేదు.. చక్కగా డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత పీజీ వైపు చూడలేదు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. కష్టం ఫలించి మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–1 పరీక్షల్లో స్టేట్ 8వ ర్యాంక్ సాధించారు. డీఎస్పీ అయ్యారు.. సర్వీస్లోకి వచ్చిన కేవలం ఎనిమిదేళ్ల వ్యవధిలోనే ఏకంగా ముఖ్యమంత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వరకు ఎదిగారు.. ఆయనెవరో కాదు.. తిరుపతి జిల్లా ఎస్పీ పోతన్నగారి పరమేశ్వరరెడ్డి. ఆ స్ఫూర్తిదాయక ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఆయన మాటల్లోనే.. – సాక్షి ప్రతినిధి, తిరుపతి మాదో చిన్న పల్లెటూరు. ఐదు వందల గడపలు మాత్రమే ఉంటాయి. నాన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ)లో చిరుద్యోగిగా పని చేశారు. అమ్మ గృహిణి. మేం ముగ్గురు పిల్లలం. అక్క శ్రీలక్ష్మి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి. చెల్లి నాగజ్యోతి గ్రూప్–2 ఆఫీసర్. వ్యవసాయ నేపథ్యంలో కలిగిన మా కుటుంబంలో ఎస్ఎస్ఎల్సీ చదివిన ప్రథమ వ్యక్తి మా నాన్నే. సాగునీరు సరిగా లేక, బీడు భూముల్లో వ్యవసాయం చేయలేక ఊళ్లో రైతుల కష్టాలను కళ్లారా చూసిన వ్యక్తిగా ఆయన మాకె ప్పుడూ చదువు విలువను తెలియజేస్తూ ఉన్నత విద్య దిశగా నడిపించారు. కేజీ నుంచి డిగ్రీ వరకు మిషినరీ, సర్కారు కళాశాలలే.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అనంతపురం పట్టణంలోని సెయింట్ అగస్టీన్ స్కూల్లో విద్యనభ్యసించా. ఆరు నుంచి పదో తరగతి వరకు ఎల్ఆర్జి హైస్కూల్లో, ఇంటర్లో బైపీసీ తీసుకుని శ్రీసత్యసాయిబాబా జూనియర్ కళాశాలలో చదివాను. ఎంబీబీఎస్లో చేరేందుకు ఎంసెట్ రాసినా డొనేషన్తో చేరే ర్యాంక్ వచ్చింది. కానీ నాన్నకు ఆర్థిక భారం కాకూడదనుకున్నా. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బయోటెక్నాలజీలో బీఎస్సీ పూర్తి చేశాను. ఆ తర్వాత పీజీ కోసం వెంపర్లాడలేదు. డిగ్రీ పూర్తి కాగానే గ్రూప్స్కు సిద్ధమయ్యాను. స్ఫూర్తినిచ్చిన ఆర్ట్స్ కాలేజీ.. అనంతపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణ, నీలం సంజీవరెడ్డి ఇక్కడే చదువుకున్నారు. సంజీవరెడ్డి అయితే ఇక్కడ అధ్యాపకులుగా కూడా పనిచేశారు. డీజీపీలుగా పనిచేసిన జేవీరాముడు, అరవిందరావు కూడా ఇక్కడే చదివారు. ఇలా ఎందరో విద్యార్థులు ఇక్కడ చదివి ఐఏఎస్లు, ఐపీఎస్లుగా దేశవ్యాప్తంగా సేవలు అందించారు. ఆ స్ఫూర్తితోనే కళాశాలలో డిగ్రీ చదువుతుండగానే గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యాను. ఇక కళాశాలలో చదువుతున్న రోజుల్లో అనంతపురం ఎస్పీగా పనిచేసిన స్టీఫెన్ రవీంద్రకి పబ్లిక్లో ఉన్న క్రేజ్ చూసి పోలీసైతే బాగుండని అనుకున్నా. వైఎస్ను అలా చూస్తూ ఉండిపోయా.. 2008లో గ్రూప్–1కి ఎంపికైన అభ్యర్థులను అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఆయనలోని రాజసం, ముఖంపై చిరునవ్వు నన్ను ఎంతగానో ఆకర్షించాయి. ఆయన్ని అలా చూస్తూ ఉండిపోయా. ప్రజలకు సేవ చేసేందుకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ప్రభుత్వోద్యోగం. నిజాయితీగా, నిబద్ధతతో పనిచేయాలని ఆయన చెప్పిన మాటలు, ఆయన్ను చూసిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు. ఆయన ఆప్యాయతకు మారుపేరు ముఖ్యమంత్రి సీఎస్ఓగా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం అందరికీ రాదు. అరుదుగా వచ్చే ఈ అవకాశం నాకు త్వరగా వరించిందనే చెప్పాలి. తన దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరి పట్ల సీఎం వైఎస్ జగన్ ఎంతో ఆప్యాయంగా ఉంటారు. ఉద్యోగుల్లా కాకుండా కుటుంబ సభ్యుల్లా చూస్తారు. ప్రశాంతత ముఖ్యం విద్యార్థి దశ చాలా కీలకం. ఆ సమయంలో ప్రశాంతంగా.. ప్రణాళికా బద్ధంగా చదివితే ఉన్నత లక్ష్యాలను సులువుగా అందుకోవచ్చు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనో, లక్ష్యం గురితప్పిందనో నిరాశ చెందకూడదు. కనీస సౌకర్యాలు లేని గ్రామాల నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకున్న ఎందరో గొప్ప వ్యక్తులే మనకు ఆదర్శం. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం(ఫైల్) ఇష్టదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి మా కుటుంబానికి ఇష్టదైవం తిరుమల వేంకటేశ్వరస్వామి. నేడు అదే స్వామి వారి పాదాల చెంత జిల్లా ఎస్పీగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. శ్రీ వారి ఆశీస్సులతోనే నాకు ఈ జిల్లాలో పనిచేసే అవకాశం వచ్చిందనుకుంటున్నా. కుటుంబ నేపథ్యం పేరు: పోతన్నగారి పరమేశ్వరరెడ్డి పుట్టిన తేది: 30.07.1983 తల్లిదండ్రులు: నాగలక్ష్మి, నారాయణరెడ్డి సొంతూరు: పులేటిపల్లె గ్రామం, సీకేపల్లి మండలం, అనంతపురం జిల్లా భార్య: సాయిప్రసన్న(ప్రకాశం జిల్లా) పిల్లలు: ధాత్రిసాయిరెడ్డి, వైభవ్ విద్యాభ్యాసం: డిగ్రీ హాబీలు: సినిమాలు చూడటం ఉద్యోగ ప్రస్థానం: 2008లో నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో ర్యాంక్ వచ్చింది. శిక్షణ పూర్తయిన తర్వాత 2011లో మొదటి పోస్టింగ్ కృష్ణా జిల్లా గుడివాడ డీఎస్పీగా వచ్చింది. ఆ తర్వాత వరుసగా.. ►గ్రేహౌండ్స్ కమాండర్ ►కరీంనగర్ జిల్లా జగిత్యాల డీఎస్పీ ►తెలంగాణాలో సీఐడీ డీఎస్పీ ►నెల్లూరు ఏసీబీ డీఎస్పీ ►2018: ఏఎస్పీగా పదోన్నతి. నెల్లూరులోనే అడ్మిన్ ఏఎస్పీగా బాధ్యతలు ►2019: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సీఎం ముఖ్య భద్రతాధికారిగా అవకాశం. రెండేళ్ల పాటు విధులు. ►2021: ఐపీఎస్కి ఎంపిక. ►2022: తిరుపతి జిల్లా ఎస్పీగా నియామకం. -
ధైర్యం చెప్పి.. థింసా స్టెప్పులేసి.. పిల్లలతో సరదాగా గడిపిన ఎస్పీ
భువనేశ్వర్: ఆమె ఓ జిల్లాకు పోలీస్ బాస్. నిత్యం నేర సమీక్షలు, శాంతి, భద్రతల పరిరక్షణ, సిబ్బంది విధులపై పర్యవేక్షణ, ఫిర్యాదుదారులతో నిత్యం క్షణం తీరికలేకుండా ఉంటారు. ఐపీఎస్గా ఉన్నా.. ఆశ్రమ చిన్నారులతో కలిసి ఆడిపాడారు. నేనున్నానంటూ వారిలో మానసిక ధైర్యం నింపారు. ఆమె.. నవరంగ్పూర్ జిల్లా ఎస్పీ ఎస్.సుశ్రీ. నవరంగ్పూర్ జిల్లా కేంద్రం సమీపం లోని ప్రభుత్వ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న దీనదయాల్ ఆశ్రమాన్ని ఎస్పీ గురువారం సందర్శించారు. ఆమెతో పాటు కలెక్టర్ కమలోచన్ మిశ్రా ఉన్నారు. వీరిద్దరూ బాలికలకు మిఠాయిలు, మామిడి పళ్లు పంచిపెట్టారు. ఎస్పీ చొరవ కల్పించుకొని బాలికలలో ఒకరిగా కలసిపోయి కులాశాగా కబుర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో చిన్నారులంతా కొరాపుటియా థింసా నృత్యం చేయగా.. సుశ్రీ కూడా వారితో జత కలిసి, స్టెప్పులేశారు. స్వయానా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ తమతో డ్యాన్స్ చేస్తుండటంతో బాలికలు మరింత ఉత్సాహంగా ఆమెకు సూచనలు చేస్తూ ముందుకు సాగారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చూసిన వారంతా ఎస్పీ చొరవను అభినందిస్తున్నారు. చదవండి: వింత ఆచారం: కొరడాతో మహిళలను కొట్టి, ఈలలు వేస్తూ.. -
బరితెగించిన సీఐ.. ఏకంగా రూ.15లక్షలతో..
సాక్షి, కర్నూలు: కర్నూలు అర్బన్ తాలూకా సీఐ కంబగిరి రాముడిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ సుధీర్కుమార్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచలింగాల రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద ఈ నెల 19వ తేదీన సెబ్ తనిఖీల్లో రూ.75 లక్షల నగదు పట్టుబడింది. ఈ నగదుకు తగిన ఆధారాలు చూపినప్పటికి ఎస్పీకి మామూళ్లు ఇవ్వాలంటూ సీఐ కంబగిరి రాముడు రూ.15 లక్షలు వసూలు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. ఓర్వకల్లుకు చెందిన గౌరీశంకర్ ద్వారా మామూళ్ల వ్యవహారం నడిచింది. హైదరాబాద్కు చెందిన చంద్రశేఖర్రెడ్డి, కర్నూలుకు చెందిన భాస్కర్రెడ్డి ఇందుకు సహకరించడంతో ముగ్గురిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరచగా, సీఆర్పీసీ 41 నోటీసు జారీ చేసి పంపాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. పరారీలో ఉన్న కంబగిరి రాముడి కోసం గాలిస్తున్నారు. సీసీఎస్ సీఐగా ఉన్న శేషయ్యకు కర్నూలు అర్బన్ తాలుకా బాధ్యతలు అప్పగించారు. తప్పు చేస్తే తప్పించుకోలేరు: ఎస్పీ హెచ్చరిక ‘ఎవరు ఎలా పనిచేస్తున్నారో తెలుసు. తప్పు చేసి తలదించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. చట్ట పరిధిలో సక్రమంగా పనిచేస్తే సహకరిస్తా. అక్రమాలకు పాల్పడితే ఇంటికి పంపుతా’ అంటూ ఎస్పీ సీహెచ్ సుధీర్కుమార్రెడ్డి పోలీస్ అధికారులను హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శుక్రవారం నెల వారీ సమీక్ష నిర్వహించారు. హత్యలు, అత్యాచారాలు, పోక్సో కేసులపై ప్రధానంగా సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ‘బాధితులకు న్యాయం జరగాలి. నిందితులకు శిక్షలు పడాలి’ అనే లక్ష్యంతో పని చేయాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో వాటి నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసులను స్టేషన్ల వారీగా సమీక్షించి వచ్చే సమావేశం నాటికి వాటి సంఖ్యను సగానికి తగ్గించాలని ఆదేశించారు. జిల్లాలోని పోలీస్ అధికారులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతి కేసును కచ్చితమైన ప్రణాళికతో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. రెండు సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉన్న కేసులపై చర్చించారు. నంద్యాలలో జిల్లా పోలీస్ కార్యాలయం ఏర్పాట్లపై కూడా ఆ ప్రాంత అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. డీపీఓ కార్యాలయ సిబ్బందికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సందర్భంగా చర్చించి పరిష్కార సూచనలు చేశారు. అడిషనల్ ఎస్పీలు చిదానందరెడ్డి, రాజేంద్ర, డీఎస్పీలు మహేశ్వరరెడ్డి, వెంకటాద్రి, వెంకటరామయ్య, శ్రీనివాసులు, వినోద్కుమార్, యుగంధర్బాబు, రామాంజినాయక్, శ్రీనివాసరెడ్డి, శ్రుతి, జిల్లాలోని వివిధ స్టేషన్లకు చెందిన సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
Sakshi Cartoon: ప్రపంచంలో అతి పెద్ద అబద్ధాల పార్టీ..
దానికి అంత పెద్ద అబద్ధమాడాలని అంటున్నార్సార్! -
మాతో పెట్టుకుంటే మడతడిపోద్దీ!
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ సింహాసనాన్ని ఎవరు అధిరోహించాలన్నది నిర్ణయించడంలో యువతే కీలక భూమిక పోషించనుంది. తమ భవిష్యత్తు అవసరాలను తీర్చగలవని నమ్మిన పార్టీలను ఎన్నుకుంటూ వస్తూనే.. తమ కలలను నెరవేర్చని ప్రభుత్వాలను కూలదోస్తూ.. ప్రతి ఎన్నికలో కీలకంగా మారింది. అందుకే యూపీ జనాభాలో పావు శాతానికిపైగా ఉన్న యువతే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే.. ఏకంగా యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టోనే విడుదల చేసింది. నిర్ణయాత్మకంగా మారడంతో.. యూపీలో ప్రస్తుత ఎన్నికల్లో 15.02 కోట్ల మంది ఓటు వేయనుండగా.. అందులో ఏకంగా 4 కోట్ల మంది 18–39 ఏళ్ల మధ్య వయసున్న యువతే. అందులోనూ కొత్తగా 19.89 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న యువత ఓట్లను దృష్టిలో పెట్టుకొనే అన్ని రాజకీయ పార్టీలు వారిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఆకట్టుకునే హామీలతోపాటు, మెజార్టీ సంఖ్యలో సీట్లను కేటాయిస్తున్నాయి. ఈ క్రమంలోనే 2007 నుంచి ప్రతి ఎన్నికలో సుమారు 70 మంది యువ ఎమ్మెల్యేలు యూపీ అసెంబ్లీకి వస్తున్నారు. ప్రస్తుతం ముగుస్తున్న అసెంబ్లీలోనూ 71 మంది ఎమ్మెల్యేల వయసు 40 ఏళ్లకన్నా తక్కువే కావడం గమనార్హం. ఇక 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఎమ్మెల్యేలు ఏకంగా 128 మంది వరకు ఉన్నారు. హామీ మరిస్తే ఇంటికే.. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకున్నా, నిధుల కేటాయింపులో ప్రాధాన్యం తగ్గినా యువత తమ సత్తా చూపిస్తోంది. 2007లో మాయావతి (బహుజన సమాజ్ పార్టీ–బీఎస్పీ) యువత లక్ష్యంగా.. ఉద్యోగాల కల్పన, విద్యా ఖర్చుల తగ్గింపు, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఉపాధి వంటి హామీలు ఇచ్చారు. దానితో దళిత, ముస్లిం యువత మొత్తం ఆమె వెంట నడిచింది. ఆమె మొత్తం 403 సీట్లకుగాను 206 సీట్లు గెలుపొందారు. కానీ ఆమె అధికారంలోకి వచ్చాక 18–30 ఏళ్ల యువత కోసం ఒక్క పథకాన్ని కూడా తీసుకురాలేదు. ఐదేళ్ల పాలనా కాలంలో 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే ఇచ్చారు. పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు హామీ నీరుగారింది. దీనిపై ఆగ్రహించిన యువత బీఎస్పీకి దూరమైంది. ఫలితంగా 2012లో బీఎస్పీకి 80 సీట్లు మాత్రమే వచ్చాయి, 2017 నాటికి 19 సీట్లకు పడిపోయాయి. ►సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత అఖిలేష్యాదవ్.. 2012 ఎన్నికల్లో 3.8 కోట్ల మంది యువ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని, తమ మేనిఫెస్టోలో అనేక హామీలు గుప్పించారు. 10వ తరగతి పిల్లలకు ట్యాబ్లెట్, 12వ తరగతి పాసైన వారికి ల్యాప్టాప్, బాలికలకు గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య, నిరుద్యోగ భృతి కింద ప్రతి ఏటా రూ.12 వేలు వంటి హామీలు ఇచ్చారు. యువత మద్దతుగా నిలవడంతో ఎస్పీ ఏకంగా 224 సీట్లు గెలుచుకొని అధికారంలో వచ్చింది. అఖిలేష్యాదవ్ అధికారంలోకి వచ్చాక.. విద్యార్థులకు ట్యాబ్లెట్లు, ల్యాప్ట్యాప్ల పంపిణీ నామమాత్రంగానే సాగింది. ఆయన ఐదేళ్ల పాలనలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. ఇతర హామీలూ పూర్తిగా అమలుకాలేదు. దానితో 2017 ఎన్నికల్లో యువత దూరమై.. ఎస్పీ కేవలం 47 స్థానాలకే పరిమితమైంది. ►2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పోలింగ్ బూత్, ఐదుగురు యువకులు అనే నినాదంతో బీజేపీ ముందుకెళ్లింది. నాలుగు లక్షల ఉద్యోగాల కల్పనకు హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 312 సీట్లు గెలిచింది. కానీ హామీ ఇచ్చిన మేరకు ఉద్యోగాల కల్పనలో బీజేపీ సఫలం కాలేకపోయింది. పైగా నిరుద్యోగం పెరగడంతో యువత రోడ్లెక్కారు. ప్రయాగ్రాజ్, లక్నోలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. మరోవైపు టెట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశం సుమారు 20లక్షల మంది యువతను ఇబ్బందుల్లో నెట్టడంతో బీజేపీ సర్కారు అపఖ్యాతి పాలైంది. ఈ నష్టాన్ని పూడ్చుకొనేందుకు బీజేపీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అందులో రవికిషన్, గౌతమ్ గంభీర్, బబితా ఫోగట్, తేజస్వి సూర్య వంటి నాయకులకు ప్రాతినిధ్యం కల్పించి.. యువ, ప్రగతిశీల ఓటర్లలో బీజేపీని విస్తరించేలా కార్యక్రమాలు నిర్వహించింది. ప్రత్యేక మేనిఫెస్టోతో కాంగ్రెస్.. యువత ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఏకంగా యూత్ మేనిఫోస్టోనే తెరపైకి తెచ్చింది. రెండు రోజుల కింద కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దీనిని ఆవిష్కరించారు. ‘భారతీ విధాన్’ పేరుతో 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, ఇందులో 8లక్షల ఉద్యోగాలు మహిళలకు కేటాయిస్తామని ప్రకటించారు. గతంలో 25–30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ బీజేపీ ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు చేసి విఫలమైందని.. కాంగ్రెస్ అమలుచేసి చూపించి యువత విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుందని వారు పేర్కొన్నారు. -
దారిదోపిడీలకు పాల్పడుతున్న మూఠా అరెస్టు
-
సాయిబాబా కాలేజీ విద్యార్థిని జయలక్ష్మికి ఎస్పీ ఫక్కీరప్ప అభినందనలు
-
యూపీ అసెంబ్లీ ఎన్నికలు, అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని సోమవారం ప్రకటించారు. రానున్న అసెంబ్లీ పోరులో రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డి)తో పొత్తును ఖరారు చేసిన ఆయన సీట్ల పంపకంపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని తాజాగా చెప్పారు. అయితే యూపీ ముఖ్యమంత్రి బరిలో ఉంటారని భావిస్తున్న తరుణంలో అఖిలేష్ ప్రకటన సంచలనం రేపింది. పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాను సర్దార్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూతో పోల్చడం దుమారాన్ని రాజేస్తోంది. గత ఎస్పీ ప్రభుత్వం చేపట్టిన పనుల పేరు మార్చడం, యూపీ ప్రభుత్వం కొత్తగా చేసేందీమీ లేదు, 'బాబా ముఖ్యమంత్రి' అంటూ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆతిద్యనాథ్పై అఖిలేష్ మండిపడ్డారు. ఆదివారం జరిగిన ర్యాలీలో అఖిలేష్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. జిన్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్తో పోల్చడం సిగ్గుచేటని యూపీ సీఎం స్పందించారు. ఇది విభజనను నమ్మే తాలిబానీ మనస్తత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేశారు. ప్రస్తుతం ప్రధాని మోదీ నేతృత్వంలో ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ నిర్మాణ కృషి జరుగుతోందని యోగి పేర్కొన్నారు. కాగా ఉత్తరప్రదేశ్లో తమ అధికార పీఠాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ భారీ ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు తమ చేజారిపోయిన కంచుకోటను ఎలాగైనా దక్కించు కోవాలని కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో ముఖ్యంగా లఖీంపూర్ ఖేరీ హింస తరువాత కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా సుడిగాలి పర్యటనలతో సందడి చేస్తున్నారు. మహిళలకు 40 శాతం రిజర్వేషన్, అమ్మాయిలకు స్కూటీలూ లాంటి వాగ్దానాలతో తన వేగాన్ని పెంచిన సంగతి తెలిసిందే. -
కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం: ఎస్పీ విజయరావు
-
రేవంత్రెడ్డి పోలీసులను కించపరిచేలా మాట్లాడారు: ఎస్పీ రాజేష్చంద్ర
-
మావోయిస్టు కుటుంబాల యోగక్షేమాలు తెలుసుకున్న ఎస్పీ
సాక్షి, వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం): జిల్లాలోని అండర్ గ్రౌండ్ కేడర్ కలిగిన మావోయిస్టుల కుటుంబ సభ్యులను ఎస్పీ అమిత్ బర్దార్ సోమవారం కలిసి యోగక్షేమా లు అడిగి తెలుసుకున్నారు. ఉద్దానంలోని బాతుపు రం గ్రామానికి చెందిన యూజీ కేడర్ గల మావోయిస్టులైన మెట్టూరు జోగారావు, చెల్లూరి నారాయణరావుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అవ్వా.. బాగున్నావా అంటూ ఆప్యాయంగా మాట్లాడుతూ వారి జీవనోపాధి సాగుతున్న తీరు, కుటుంబ నేపథ్యం, పిల్లల చదువు, ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్నారు. మీకు మీ కుటుంబ స భ్యులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా, అవసరమైన వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సి ద్ధంగా ఉందన్నారు. మావోయిస్టుల తల్లులు మెట్టూ రు చిన్న పల్లెమ్మ, చెల్లూరి నీలమ్మలకు దుప్పట్లు, చీర, మెడికల్ కిట్తో పాటు పండ్లు, నిత్యావసర స రుకులను అందజేశారు. పోలీసులు ప్రజలతో స్నే హంగా ఉండాలని సూచించారు. పర్యటనలో ఆయ న వెంట కాశీబుగ్గ రూరల్ సీఐ డి.రాము, స్థానిక ఎస్ఐ కూన గోవిందరావు తదితరులు ఉన్నారు. జనజీవన స్రవంతిలో కలవండిఅడవి బాటను వీడి మావోయిస్టులు జన జీవన స్ర వంతిలో కలవాలని ఎస్పీ పిలుపు నిచ్చారు. అజ్ఞాత జీవనం గడుపుతున్న మావోయిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రస్తుతం కరోనా వచ్చి అడవిలో ఉంటున్న వారు జనజీవన స్రవంతిలో కలిస్తే మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. -
కుప్పంలో విగ్రహాల ధ్వంసం: చంద్రబాబుపై ఎస్పీ ఫైర్..
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలోని పురాతన విగ్రహాల ధ్వంసం ఘటనను పోలీసులు ఛేదించారు. కుప్పం మండలం గోనుగురు సమీపంలోని దేవతామూర్తుల విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ వేగవంతం చేసిన పోలీసులు సంఘటన జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించారు. మతిస్థిమితం లేని ఓ మహిళ విగ్రహాలు ధ్వంసం చేసిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు. గుడి చాలా మారుమూల ప్రాంతంలో ఉందని, వారానికి ఒకసారి మాత్రమే అక్కడ పూజలు జరుగుతాయని తెలిపారు. మతిస్థిమితం లేని మహిళ ఈ ఘటనకు కారణమని తేలిందన్నారు. విగ్రహాల ధ్వంసం చేసిన విషయాన్ని జ్యోతి అనే మహిళ ఒప్పుకుందన్నారు. విగ్రహాలు ధ్వంసం చేసే సమయంలో మహిళ మద్యం మత్తులో ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రార్థనాలయాలకు జియో ట్యాగింగ్ చేశామని, ఈ ఘటనపై కుట్ర జరిగిందనేలా చంద్రబాబు ట్వీట్ చేయడం సరికాదన్నారు. నిజానిజాలు నిర్ధారించుకుని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయకూడదని హితవు పలికారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టరీత్యా కేసులు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే, పోలీసులు, పీస్ కమిటీకి వెంటనే తెలియజేయాలని తెలిపారు. చదవండి: అడుగడుగునా మేసేశారు -
అందుకే చంద్రబాబును అడ్డుకున్నాం: తిరుపతి ఎస్పీ
-
అందుకే చంద్రబాబును అడ్డుకున్నాం: తిరుపతి ఎస్పీ
సాక్షి, చిత్తూరు : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తిరుపతిలో చేపట్టబోయే నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని తిరుపతి అర్భన్ ఎస్పీ అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు నిన్ననే తెలియజేశామని అన్నారు. కానీ ఆయన వినకుండా ఎయిర్పోర్టుకు చేరుకున్నారని, అందుకే అడ్డుకున్నామని స్పష్టం చేశారు. కాగా తిరుపతిలో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు సోమవరాం హైదరాబాద్ నుంచి తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకోగా.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎయిర్పోర్ట్ లాంజ్లో పోలీసులు ఆయనను అడ్డుకున్న విషయం తెలిసిందే. నిరసన తెలిపేందుకు అనుమతి లేదంటూ నోటీసులు అందజేశారు. అయినప్పటికీ వినని చంద్రబాబు.. లాంజ్లోని ఫ్లోర్పైనే బైటాయించి నానా హంగామా సృష్టించారు. ఈ మేరకు ఎస్పీ అప్పలనాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు నిరసన ప్రదర్శనకు అనుమతి లేదని చెప్పినా తిరుపతిలో బస్టాండ్ ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహం ఎదుట ధర్నాకు పూనుకున్నారని తెలిపారు. బస్టాండ్, రైల్వేస్టేషన్కు సమీపంలో గాంధీ విగ్రహం ఉందని, వారు ఎంపిక చేసుకున్న స్థలం భక్తులతో నిండి ఉంటుందన్నారు. అక్కడ ధర్నా చేస్తే తిరుమలకు వెళ్లే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదని చెప్పి టీడీపీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చామన్నారు. జన సమీకరణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. అదే విధంగా ధర్నాలు, ర్యాలీలు ఎన్నికల నియమావళికి, కోవిడ్ నిబంధనలకు విరుద్ధమని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. అందుకే చంద్రబాబు నాయుడి ధర్నాకు అనుమతి ఇవ్వలేదన్నారు. 5 వేల మందితో ధర్నా చేస్తున్నట్లు నిన్న రాత్రి లెటర్ ఇచ్చారని, అనుమతి ఇవ్వమని అప్పుడే చెప్పామని పేర్కొన్నారు.చిత్తూరు నడిబొడ్డులో ధర్నాకు అనుమతి కోరారని, సిటీ బయట అయితే చేసుకోవచ్చని చెప్పినట్లు తెలిపారు.అయినా వినకుండా ఈ రోజు ఉదయం కొందరు టీడీపీ నేతలు ధర్నా చేసేందుకు సిద్ధపడ్డారని వారందరినీ ముందస్తుగా అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అనుమతితో వస్తే అనుమతి ఇస్తామని, పంచాయితీ ఎన్నికల్లో అరాచకాలు జరిగాయని టీడీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు. చదవండి: రేణిగుంట ఎయిర్పోర్టులో చంద్రబాబు హైడ్రామా బాబుకు చిత్తూరు జిల్లాలో మనుగడ లేదు: పెద్దిరెడ్డి -
స్నేహలత హత్య కేసు: ఇద్దరు అరెస్ట్
సాక్షి, అనంతపురం : జిల్లాలోని బడన్నపల్లి గ్రామ సమీపంలో జరిగిన ఎస్బీఐలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని స్నేహలత (19) దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రియుడు గుత్తి రాజేష్, కార్తీక్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 302,201 కింద కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ బి.సత్యయేసు గురువారం సాయంత్రం మీడియాకు తెలిపారు. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. గత నాలుగేళ్లుగా స్నేహలత-రాజేశ్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలిపారు. ఇతర వ్యక్తులతో సంబంధాలున్నాయని రాజేశ్ వేధించాడని, ఈ క్రమంలో రాజేష్ మంగళవారం స్నేహలతను తన బైక్ మీద ధర్మవరం నుంచి అనంతపురానికి తీసుకొచ్చేందుకు వెళ్లాడని చెప్పారు. (యువతి దారుణ హత్య) బడన్నపల్లి సమీపంలోకి వచ్చే సరికి రోడ్డు పక్కన బైక్ ఆపి ఆమెతో గొడవపడి.. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న బ్యాంకు పేపర్లను శరీరంపై వేసి కాల్చి పరారయ్యాడయాని అనంతరం తల్లిదండ్రులు ఫిర్యాదుతో అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. నిందితులపై త్వరగా ఛార్జ్షీట్ వేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. స్నేహలతపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. కాగా స్నేహలత హత్య కేసు స్థానికలంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు స్థానిక ఎస్పీ పర్యవేక్షణలో కేసు విచారణ జరిగింది. దారుణ హత్యకు గురైన స్నేహలత కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. (స్నేహలత హత్యపై టీడీపీ రాజకీయాలు) -
ఎస్పీ చీఫ్ అఖిలేశ్ కీలక ప్రకటన
లక్నో: సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దీపావళీ పండగ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. 2022లో ఉత్తరప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అమలు చేయబోయే వ్యూహాన్ని వెల్లడించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడిన కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి కూటమిగా ఏర్పాటు కాబోమని ఆయన స్పష్టం చేశారు. శనివారం దీపావళి పండగ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. కొన్ని రోజులుగా లక్నో, ఏటవాలో పార్టీ ప్రముఖలతో పలు భేటీలు జరిపాము. అన్ని ప్రాంతాలను బీజేపీ ప్రభుత్వం విస్మరించింది. బీజేపీ అభివృద్ధి పనులు కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమైంది’ అన్నారు. రానున్న ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్తో ఎట్టి పరిస్థితుల్లో కూటమిగా ఏర్పడదని, కేవలం చిన్న పార్టీలతో మాత్రమే కూటమిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయిని తెలిపారు. చదవండి: (అవసరమైతే బీజేపీకి ఓటు వేస్తాం: మాయావతి) ఈ విషయాన్ని పలు వేదికలపై తెలిపానని ఆయన గుర్తు చేశారు. మరో వైపు జస్వంత్నగర్ విషయంలో ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీతో సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. అఖిలేశ్ యాదవ్ బాబాయ్ అయిన శివపాల్ యాదవ్ 2017 ఎన్నికల్లో సమాజ్వాది పార్టీగా అభ్యర్థిగా జస్వంత్నగర్ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఎస్పీ నుంచి బయటకు వచ్చి 2019లో సొంతంగా ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ నీ స్థాపించారు. ఇక ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి, 2022లో జరగనున్నాయి. -
వారితో కూడా యుద్ధం చేస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పాజిటివిటీ రేట్ 12.0 నుంచి 8.3కి తగ్గిందని తెలిపారు. టెస్టులు పెరిగాయని, కేసులు కూడా తగ్గుతున్నాయని సీఎం పేర్కొన్నారు. మంగళవారం ఆయన కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. కోవిడ్ తగ్గుతుందనడానికి ఇది నిదర్శనమని, కోవిడ్తో సహజీవనం చేస్తూనే, అప్రమత్తంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. జనవరికల్లా వ్యాక్సిన్ వచ్చే అవకాశం కనిపిస్తుందన్నారు. ‘‘104 నంబర్కు ఫోన్ కొడితే టెస్ట్లు, హాస్పిటల్స్ వివరాలు అందాలి. ఈ నంబర్కు మాక్ కాల్స్ చేసి నెంబర్ పనిచేస్తుందా లేదా పీరియాడికల్గా చెక్ చేయండి. ఎక్కడైనా లోటుపాట్లుంటే వెంటనే సరి చేసుకోవాలి. ప్రతీ రోజూ మానిటర్ చేయండి. ఈ నంబర్కు ఫోన్ చేయగానే అరగంటలోనే బెడ్ అందుబాటులో ఉందో లేదో చెప్పాలి. కాబట్టి ఈ నంబర్ పక్కాగా పనిచేయాలని’’ అధికారులకు సీఎం ఆదేశించారు. (చదవండి: ప్రభుత్వ సేవలు.. హెల్ప్లైన్ నంబర్లు) కోవిడ్ను ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా ట్రీట్ చేస్తున్న రాష్ట్రం మనదేనని, కోవిడ్ హాస్పిటల్స్ లిస్ట్ గ్రామ సచివాలయాల్లో ఉండాలన్నారు. ఎంప్యానల్ హస్పిటల్స్ లిస్ట్ కూడా అందుబాటులో ఉండాలని తెలిపారు. 104కు ఎవరు ఫోన్ చేసినా కోవిడ్ ట్రీట్మెంట్కు సంబంధించిన అన్ని వివరాలు అందాలని చెప్పారు. రిక్రూట్ చేసిన వారంతా కూడా కరెక్ట్గా డ్యూటీకి వెళుతున్నారా లేదా తనిఖీ చేయాలని సీఎం పేర్కొన్నారు. (చదవండి: ఉచిత బోర్లు.. పేద రైతులకు మోటార్లు) ‘‘పీరియాడికల్లీ చెకప్ ఉండాలి. దాదాపు 30 వేల మందిని కొత్తగా తీసుకొస్తున్నాం. వీరందరినీ మానిటర్ చేయాలి. 37000 వేల బెడ్స్, 240 హాస్పిటల్స్లో ఫుడ్, శానిటేషన్, ఇన్ఫ్రా, స్టాఫ్ వీటిపై మానిటరింగ్ పక్కాగా ఉండాలి. ప్రతీ రోజూ కలెక్టర్లు, జేసీలు మానిటర్ చేయాలి. ఈ నాలుగు కరెక్ట్గా ఉంటే చికిత్స కరెక్ట్గా అందుతుంది. కోవిడ్ కేర్ సెంటర్లలో కూడా ఫుడ్, శానిటేషన్, మెడికేషన్ కచ్చితంగా జరగాలి. అక్కడ కూడా హెల్ప్ డెస్క్ ఉండాలి. హోం ఐసొలేషన్లో ఉన్న వారికి కిట్లు ఇస్తున్నామా లేదా ప్రతీ ఒక్కరూ దృష్టి పెట్టాలి. కిట్లు రాలేదంటే ఖచ్చితంగా కలెక్టర్లు, జేసీలు బాధ్యత వహించాలి. ఏఎన్ఎంలు, లోకల్ డాక్లర్లు మ్యాపింగ్ చేయాలి. డాక్టర్ కూడా ఆ ఇంటికి వెళ్ళి చూడాలి, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, పిహెచ్సీ డాక్టర్ ముగ్గురూ కచ్చితంగా వారితో మాట్లాడాలి. 104 నంబర్ పబ్లిసిటీ కూడా బాగా జరగాలి. దానితో పాటు లోకల్ కంట్రోల్రూమ్ నంబర్ కూడా పబ్లిసిటీ చేయాలని’’ సీఎం సూచించారు. కోవిడ్ బాధితులను త్వరగా గుర్తించడం వలనే మరణాల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. ‘‘మనం చంద్రబాబు అనే వ్యక్తితో కాదు, నెగిటివ్ మైండ్సెట్తో ఉన్న ఎల్లో మీడియాతో కూడా యుద్దం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. మనం ఎంత మంచి చేస్తున్నా వేలెత్తి చూపే దుర్భుద్దితో పనిచేస్తున్నారు. అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం, నెగిటివ్ వార్తలు చదువుదాం. మనం కరెక్ట్ చేయాల్సినవి ఏమైనా ఉంటే చేసుకుందాం, వారు అతిగా రాసినవి కూడా ఎత్తిచూపుదాం’’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ – సన్నద్దత, రబీ పంటల సాగుపై ప్రణాళిక, వ్యవసాయ సలహా కమిటీల సమావేశాల నిర్వహణపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ పంట చేతికొస్తుంది కాబట్టి, అక్టోబర్ 15 నుంచి ధ్యాస పెట్టాలని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఆర్బీకేల ద్వారా మన ప్రొక్యూర్మెంట్ మరింత ఎఫెక్టివ్గా పనిచేయాలని, ఈ క్రాపింగ్ ప్రతీ పంటకు కంప్లీట్ కావాలన్నారు. ఈ క్రాపింగ్ ఎక్కడా కూడా పెండింగ్ ఉండకూడదని, దీనిపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►ఈ క్రాపింగ్ తర్వాత రైతుల రిజిస్ట్రేషన్ జరగాలి, తర్వాత లిస్ట్ ఆర్బీకేలలో పెట్టాలి ►ప్రతీ రైతు వివరాలు ఈ క్రాపింగ్లో పక్కాగా ఉండాలి. సోషల్ ఆడిట్ చేయాలి. మిస్ అయితే వెంటనే నమోదుచేయాలి ►ఫామ్గేట్ అనేది ప్రతీ పంటకూ చేయాలి ►కూపన్లు ఇచ్చి ఫలానా రోజు ప్రొక్యూర్ చేస్తామని చెప్పాలి ►ఎక్కడా కూడా మ్యాన్యువల్ సర్టిఫికెట్ ఉండకూడదు, ఈ క్రాపింగ్ తప్పనిసరిగా జరగాలి ►సీఎం యాప్ ద్వారా మానిటరింగ్ జరగాలి ►అగ్రికల్చర్ అసిస్టెంట్ వెంటనే అలర్ట్ చేయాలి ►జేసీలు వెంటనే రైతుకు మార్కెటింగ్ సౌకర్యం చూపాలి ►ఏ పంటకు ఎంత గిట్టుబాటు ధర అనేది అక్టోబర్ 1 న రిలీజ్ చేస్తాం.. అక్టోబర్ 5 కల్లా అన్ని ఆర్బికేలలో డిస్ప్లే చేయాలి ►కనీస గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ రేట్కు మనం అమ్మించగలగాలి ►రైతుకు పూర్తిగా తోడు నిలబడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్లు, జేసీలు పూర్తిగా ధ్యాస పెట్టండి ►స్టేట్లెవల్ అడ్వైజరీ కమిటీ, జిల్లా, మండల, ఆర్బీకేల స్ధాయి కమిటీలు వెంటనే ఏర్పాటుచేయాలి ►ఏ పంట గ్రామంలో వేయాలి, ఏ పంట వేయద్దు అనే అంశాలు కూడా కమిటీలు చర్చించాలి ►కలెక్టర్లు అందరూ గుర్తుపెట్టుకోవాలి, రైతు అనే వ్యక్తి నష్టపోతే అందరూ నష్టపోతారు. ఫార్మర్స్ ఈజ్ హయ్యెస్ట్ ప్రయారిటీ. వరద పరిస్థితిపై సమీక్ష.. భారీ వర్షాలు, పంట, ఆస్తినష్టం అంచనాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు కలెక్టర్లతో వరదల పరిస్థితిని సీఎం సమీక్షించారు. పంట, ఆస్తినష్టంపై త్వరగా అంచనాలు పంపించాలని సీఎం ఆదేశించారు. ఆర్బీకే లెవల్లో ఎన్యూమరేషన్ ఆఫ్ ఫార్మర్స్ డిస్ప్లే చేయాలన్నారు. ఇప్పటివరకు వరదల్లో 8 మంది చనిపోయినట్లు సమాచారం వచ్చిందని.. వారి కుటుంబాలకు వెంటనే రూ.5లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. -
వారి జీవితాల్లో నిజమైన పరివర్తన
‘‘నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. కృష్ణాజిల్లా ఎస్పీ సారు నిర్వహించిన జాబ్ మేళాలో నాకు కాల్ సెంటర్లో ఉద్యోగం వచ్చింది. నెలకు రూ.10 వేలు ఇస్తానన్నారు. చాలా సంతోషంగా ఉంది’’ అంటోంది శ్రావణి. కృష్ణాజిల్లా పోలీసులేమిటి, జాబ్మేళా నిర్వహించడం ఏమిటీ అని అనుమానం వస్తోంది కదా... అదేమిటో తెలుసుకోవాలంటే... ముందుగా ఆ జిల్లాలోని గిరిజన తండాలు, మైదానప్రాంతాల్లో ఏం జరుగుతోందో, అటువంటి వారిలో మార్పు తీసుకు వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటోందో తెలుసుకుందాం. కృష్ణాజిల్లాలోని గిరిజన తండాలు, మైదానప్రాంతాల్లో వందలాది కుటుంబాలు నాటుసారా తయారీనే జీవనోపాధిగా చేసుకుని దశాబ్దాలుగా దుర్భర జీవితాలను గడుపుతున్నారు. దొరికిన ప్రతిసారి కటకటాల పాలవడం... బయటకు రాగానే మళ్లీ సారా తయారీ చేయడం.. అమ్ముకోవడం వారికి కులవృత్తిగా మారిపోయింది. దీంతో ఆ గ్రామాల నిరుద్యోగ యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాదు చివరకు పిల్లనిచ్చేందుకు కూడా ఎవరూ ముందుకు రాని వివక్షకు గురయ్యారు. ఇలా దశాబ్దాలుగా ఇలాంటి వారు పడిన వెతలకు చెక్ పెడుతూ వారి జీవితాల్లో ‘నవోదయం’ తెచ్చేందుకు ప్రభుత్వం ‘పరివర్తన’ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది మిగిలిన జిల్లాలకు భిన్నంగా కృష్ణాజిల్లా పోలీసులను ఆలోచింపజేసేలా చేసింది. అరెస్టులు, కేసుల కంటె వారిలో ఉన్న ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని పారద్రోలడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమార్గంగా తలచి ఆ దిశగా అడుగులు వేశారు. వారిలో మార్పునకు బీజం వేశారు. సైనికుల్లా పనిచేసిన ఆ పోలీసుల కథేమిటో.. వారి కృషివల్ల వీరి జీవితాల్లో వచ్చిన ‘పరివర్తన’ ఏమిటో చూద్దాం. వారిలో ‘పరివర్తన’కు బీజం పైన చెప్పుకున్నట్లుగా కృష్ణాజిల్లా చాట్రాయి మండలం పోతనపల్లికి చెందిన శ్రావణి ఒక్కతే కాదు, ఆ పల్లెల్లో వందలాది నిరుద్యోగ యువత రేపటి భవిష్యత్ కోసం ఆశగా అడుగులు వేస్తోంది. చీకట్లను చీల్చుకుంటూ బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు.‘సారా’ గ్రామాలుగా ముద్రపడిన ఆ పలెల్లో ‘పరివర్తన’ తెచ్చే దశగా ఏడాది క్రితం అడుగులు పడ్డాయి. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టింది మొదలు రవీంద్రనాథ్బాబు తరచూ ఆ గ్రామాల్లో పర్యటిస్తూ వారిలో ఉన్న ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనాన్ని పారద్రోలాలని నిర్ణయించుకున్నారు. వారిలో పరివర్తనకు బీజం వేశారు. వారిచ్చిన భరోసాతో చాట్రాయి, కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన మండలాల్లో నాలుగు దశాబ్దాలుగా సారానే వృత్తిగా చేసుకుని జీవిస్తున్న ఏడు గ్రామాల్లోని 431 ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. సారాకు దూరంగా ఉంటామని ప్రతిన బూనారు. గిరిజనులకు భూములు.. యువతకు ఉద్యోగాలు సారాకు దూరంగా ఉంటామని ముందుకొచ్చిన 200 గిరిజనకుటుంబాలకు గిరిజన భూములపై హక్కులు కల్పిస్తున్నారు. చదువులేని నిరుద్యోగులకు, పనులు చేయగలిగే మహిళలకు స్థానిక కంపెనీల్లో దినసరి వేతన కూలీలుగా అవకాశాలు కల్పించారు. ఇక కొద్దో గొప్పో చదువుకున్న నిరుద్యోగ యువత కోసం పీవీఎన్ఆర్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి నగరాలకు 12కు పైగా కార్పొరేట్ కంపెనీలను ఒక వేదికపైకి తీసుకొచ్చి మెగా జాబ్మేళాలు నిర్వహించారు. అలా సారా ప్రభావిత గ్రామాల నిరుద్యోగ యువతలో దాదాపు 150 మందికి వారు కోరుకున్న ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కలలో కూడా ఊహించని రీతిలో కార్పొరేట్ కంపెనీలో జాబ్ ఆఫర్ లెటర్లు చేతికి రావడంతో వారిలో పట్టరాని ఆనందం వెల్లివిరుస్తోంది. ప్రభుత్వం తీసుకు వచ్చిన పరివర్తనతో ఆ పల్లెల్లో వెలుగు పూలు పూస్తున్నాయి. – పంపాన వరప్రసాదరావు, ఫొటోలు: అజీజ్ జుజ్జవరపు సాక్షి, మచిలీపట్నం మా జీవితాల్లో వెలుగులు నింపారు.. మా తాతముత్తాల నుంచి గత్యంతరం లేక ఈ పని చేస్తున్నాం. మా అబ్బాయి ఏడుకొండలును డిగ్రీ వరకు చదివించాం. ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ మా పని వల్ల వాడికి ఉద్యోగం రాలేదు. జిల్లా ఎస్పీ దొరగారు నిర్వహించిన జాబ్మేళాలో మా అబ్బాయికి చెక్ పోస్టులో ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. – మల్లవోలు శ్రీనివాసరావు, చినగొల్లపాలెం, కృత్తివెన్ను మండలం -
పోలీసు కోసం జనం పోరాటం!
ముంబై: సాధారణంగా పోలీసులకు, ప్రజలకు మధ్య అంత సత్సబంధాలు ఉండవు. సినిమాలో మాత్రమే నిజాయితీ గల పోలీసు ఆఫీసర్కు ఏదైన జరిగితే జనం పోరాడటం చూస్తూ ఉంటాం. అయితే అలాంటి ఘటన ఒకటి మహారాష్ట్రలోని పాల్ఘర్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే... నిజాయితీగా పనిచేస్తున్న పాల్ఘర్ జిల్లా ఎస్పీని మహారాష్ట్ర హోం మినిస్టర్ అనిల్ దేశ్ ముఖ్ సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అయితే ఆయనను వెనక్కి తీసుకురావాలంటూ పాల్ఘర్ గ్రామస్థులు ఆన్లైన్లో క్యాంపెయిన్ నిర్వహిస్తూ సంతకాలు స్వీకరిస్తోన్నారు. పాల్ఘర్ మూక దాడులకు సంబంధించి ఎస్పీ గౌరవ్ సింగ్ని 5 రోజుల క్రితం అత్యవసర సెలవు తీసుకొని వెళ్లాల్సిందిగా మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అయితే గౌరవ్ వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఇసుక మాఫీయా, గుట్కా, లిక్కర్ మాఫియాని అన్నింటిని అరికట్టారని పాల్ఘర్ ప్రజలు తెలిపారు. ఆయన వచ్చినప్పటి నుంచే ప్రజలకు, పోలీసులకు మధ్య మంచి బంధం ఏర్పడిందని చెప్పారు. గౌరవ్ వారందరి ఆస్తి అని, ఆయన సూపర్ కాప్ అని పేర్కొన్నారు. (ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆ ఛాన్స్!) అయితే పాల్ఘర్లో మూకదాడి జరిగిన వెంటనే ప్రభుత్వం అయనను వెంటనే మే 8 తేదీన సెలవు మీద పంపించేసింది. ఆయనను మళ్లీ వెనక్కి రప్పించడానికి సుజిత్సింగ్, సామాజిక కార్యకర్త కరణ్ చౌదరి ఆధ్వర్యలో ఒక ఆన్లైన్ క్యాంపెయిన్ను నడిపిస్తూ సంతకాలు కూడా స్వీకరిస్తోన్నారు. ఇప్పటి వరకు 350 మంది దీని మీద సంతకాలు చేశారు. రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ఠాఖ్రేకి గౌరవ్సింగ్ని వెనక్కి తీసుకురావాలంటూ విజ్ఞప్తి చేస్తోన్నారు. పాల్ఘర్ మూకదాడులలో ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు కేసుకు సంబంధించి రాష్ట్ర క్రిమినల్ ఇన్వేస్టిమెంట్ డిపార్ట్మెంట్ 12 మందిని అరెస్ట్ చేసింది. వారిలో ఒక మైనర్ కూడా ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన నిందితుల సంఖ్య 146 కి చేరింది. (సుప్రీంలో తొలిసారి ఏకసభ్య ధర్మాసనాలు) -
వరినాట్లు వేస్తున్న ఎస్పీ
సాక్షి, చిత్తూరు: ఏందబ్బా! ఈయనెరో పోలీసాయన్లా ఉండాడే.. వరినాట్లేస్తాండేందబ్బా.. అని అట్లా కళ్లార్పకుండా చూస్తాండారా!? పైన కనిపిస్తున్న ఫొటోలో ఉండేదంతా నిజమే..ఆ సారు తిరుపతి ఎస్పీ ఆవుల రమేష్రెడ్డి. మంగళవారం మిట్ట మజ్జానం ఎలబారి ఏర్పేడు మండలానికొచ్చినాడు..రాజులపాలెం ఊర్లో సరుకులు పంచేదానికి. ఆ ఊరికాడ రోడ్డు పక్కనే మడికయ్యల్లో వరినాట్లేస్తున్న కూలోల్లు, రైతుల్ని ఆయన్జూసినాడు. అప్పుడు టయిం ఒకటీ ముక్కాలైంది. నడినెత్తిన ఎండ సుర్రుమంటున్నా పనులు చేసేది చూసినాడు. ఆయన ఇస్కూలు సదివే టయింలో పొలం కాడ చేసిన పనులు గాపకం వచ్చినాయేమో!? కాలిబూట్లు తీసేసినాడు. మోకాలిదాకా ప్యాంటు ఎగదీసి, కయ్యలో దిగినాడు. పగ్గాలు పట్టుకుని ఎస్పీ సారు అదిలించేకాడికి కాడెద్దులు ముందుకు కదిలినాయి. కొంచేపు నల్లమాను పనులు చేసినాడు. కొంచేపటికి వరినాట్లు ఏసేది మొదలుబెట్టినాడు. ఆడ పనికొచ్చిన కూలీలు ఎస్పీతో కలిసి ఖుషీగా నాట్లేసినారు. ఆ తర్వాత ఎస్పీ వాళ్లందరికీ నిత్యావసర సరుకులు, అరటిపండ్లు, మాస్కులు పంపిణీ చేసి మాట్లాడారు. తానూ వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చానన్నారు. పుట్టుకతో పిల్లలకు భాష నేర్పించేందుకు ఎంత ప్రాధాన్యత ఇస్తామో వ్యవసాయానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ పల్లెలన్నీ పచ్చదనంతో కరోనాకు దూరంగా ఉండటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. వ్యవసాయ కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ఎస్పీ రమేష్ రెడ్డి -
ఇర్ఫాన్ కాల్ కోసం ఎదురు చూస్తా
సాక్షి, జైపూర్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణంపై ఆయన చిన్ననాటి స్నేహితుడు భరత్ పూర్ (రాజస్థాన్) ఎస్పీ హైదర్ అలీ జైదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తన స్నేహితుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన చెందారు. ఇర్ఫాన్ గొప్ప మనిషి అని వ్యాఖ్యానించిన ఆయన ఏ క్షణమైనా అతడినుంచి ఫోన్ వస్తుందని ఇప్పటికీ ఎదురు చూస్తున్నానంటూ కంటతడి పెట్టారు. ఇంతటి విషాదాన్ని తట్టుకునే ధైర్యం ఆ కుటుంబానికి కలగాలని ప్రార్థించారు. ఇర్ఫాన్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన జైదీ ఈ సందర్భంగా ఇర్ఫాన్ జీవితానికి సంబంధించి ఒక విషయాన్ని పంచుకున్నారు. ఇర్ఫాన్ ఉపాధ్యాయుడు కావాలని ఆమె తల్లి కోరుకున్నారని జైదీ గుర్తు చేసుకున్నారు. (ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత) క్యాన్సర్ బారిన పడిన ఇర్ఫాన్ ఖాన్ లండన్ లో కొంతకాలం చికిత్స పొందారు. ఇటీవలే భారత్కు తిరిగి వచ్చిన ఇర్ఫాన్ తీవ్ర అనారోగ్యంతో బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. కాగా గత వారం, ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీదా బేగం (95) జైపూర్లో కన్నుమూశారు. అయితే లాక్ డౌన్ కారణంగా తల్లి అంత్యక్రియలకు ఇర్ఫాన్ వెళ్లలేకపోయారు. Irrfan Khan's friend, Haider Ali Zaidi, the SP of Bharatpur, shares a video after coming to know of his death pic.twitter.com/IsZhRVAWEq — Jayadev (@jayadevcalamur) April 29, 2020 -
శభాష్ పోలీస్
-
రెండు వారాల్లో కరోనా క్లియర్
సాక్షి, కడప : జిల్లాలో కరోనా వైరస్పై వారం రోజుల్లో పూర్తి గ్రిప్ వస్తుంది. 14 రోజులకు ప్రాబ్లమ్ క్లియరవుతుంది. 28 రోజులు లాక్డౌన్ పాటిస్తే నూటికి నూరు శాతం కరోనా వైరస్ను జిల్లా నుంచి పారదోలుతామని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు.ప్రజల సహకారంతోనే లాక్డౌన్ విజయవంతమవుతోందని చెప్పారు. శుక్రవారం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో జిల్లా నలుమూలలనుంచి ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఎస్పీ సమాధానాలు ఇచ్చారు. ప్రశ్న : లాక్డౌన్ ఆంక్షలు ఎలా అమలు చేస్తున్నారు? ఎస్పీ : లాక్డౌన్ను కచ్చితంగా అమలు చేస్తున్నాం. కరోనా పాజిటివ్ ప్రాంతాలు, బయటి ప్రాంతాల్లో టూ వీలర్లో ఒకరికి చొప్పున అనుమతి ఇస్తున్నాం. అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు. ఉదయం 6 నుంచి 9 గంటల్లోపు మాత్రమే బయటికి వచ్చి వెళ్లాలి. భౌతిక దూరం పాటించాలి. చదవండి: మీ నిస్వార్థ సేవలకు సెల్యూట్ ప్రశ్న : పనులు లేక ఆటోలు, ట్యాక్సీవాలాలు ఇబ్బందులు పడుతున్నారు? ఎస్పీ : ట్రాన్స్పోర్టు ఆగడంతో ఇబ్బందులు తప్పలేదు. అయితే సరుకుల డెలివరీకి ఆటోలు, ట్యాక్సీలు వాడుతున్నాం. బయటి వారికి అనుమతి లేదు. ఎక్కడి ఆటోలు అక్కడ సరుకులు, కూరగాయలు రవాణాకు ఉపయోగిస్తున్నాం. వారికి ఉపాధి కల్పిస్తున్నాం. ప్రశ్న : కొందరు నేతలు సేవా కార్యక్రమాల పేరుతో మాస్క్లు లేకుండానే గుంపులుగా వస్తున్నారు? ఎస్పీ : ఇది మా దృష్టికీ వచ్చింది. సేవా కార్యక్రమాలు నిర్వహించే వారు మాస్క్లు ధరించాలని, జాగ్రత్తలు తీసుకుని తక్కువమంది వెళ్లాలని సూచించాం. ప్రశ్న : తండ్రి కేన్సర్ పేషంట్. ప్రతి నెలా హైదరాబాదు వెళ్లాలి. వెహికల్కు అనుమతి ఇస్తారా? ఎస్పీ : వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లే వారిని పోలీసులు అడ్డుకోరు. తగిన ఆధారాలు తప్పకుండా చూపించాలి. ప్రశ్న : కూరగాయల మార్కెట్లలో అమ్మకందారులు మాస్క్లు ధరించడం లేదు? ఎస్పీ : అన్ని మార్కెట్లలో వ్యాపారులు మాస్క్లు ధరించేలా చర్యలు తీసుకుంటాం. చదవండి: మరో 18 కరోనా పాజిటివ్ కేసులు ప్రశ్న : మందుల షాపులు, కిరాణా దుకాణాల వద్ద చాలామంది భౌతిక దూరం పాటించడంలేదు? పోలీసులు పట్టించుకోవడం లేదు? ఎస్పీ : ఇక నుంచి అలా జరగకుండా చూస్తాం. పోలీసులకు ఆ మేరకు ఆదేశాలు ఇస్తాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా భౌతిక దూరం పాటించాలి. అప్పుడే కరోనా నుంచి బయట పడగలం. ప్రశ్న : అధికారులు పండ్లు, కూరగాయలు తీసుకెళ్లి అమ్ముకోవాలని చెబుతున్నా కొందరు పోలీసులు అడ్డుకుంటున్నారు? ఎస్పీ : అలా జరగకుండా చూస్తాం. వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ చేసుకునేందుకు రైతులకు పూర్తి అనుమతులు ఇచ్చాం. పోలీసులు ఎవరూ అడ్డుకోరు. అలా జరిగితే వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రశ్న : జిల్లాలో కరోనా బాధితులు ఎంతమంది ఉన్నారు? ఎస్పీ : ఇతర దేశాల నుంచి వచ్చిన వారు, ఢిల్లీ తబ్లిక్ జమాత్కు వెళ్లి వచ్చిన వారితో కలిపి దాదాపు ఐదు వేల మంది ఉన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన 86 మందిలో నేరుగా 17 మందికి, వీరి బంధువులు, మిగిలిన వారు 12 మందితో కలిపి మొత్తం 29 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రశ్న : కరోనా విస్తరించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎస్పీ : అందరిపై నిఘా పెట్టాం.వారి సెల్ఫోన్లలో ప్రత్యేక యాప్ ఇన్స్టాల్ చేసి వారి కదలికలను కంట్రోల్లోకి తీసుకున్నాం. కరోనా అనుమానితులపై త్రీ బీట్ సిస్టమ్ అమలు చేస్తున్నాం. మహిళా పోలీసులు, విలేజ్ పోలీసులు, బీట్ కానిస్టేబుళ్లు ఇళ్ల వద్దకు వెళ్లి చెక్ చేస్తున్నారు. ప్రశ్న : బయటి వారి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎస్పీ : జిల్లాలో 39 చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. బయటి జిల్లాల నుంచి ఎవరినీ జిల్లాలోకి అనుమతించడం లేదు. అలా రావాలనుకునే వారు 14 రోజులు క్వారంటైన్లలో ఉండాల్సిందేనని ఆంక్షలు పెట్టాం. ప్రశ్న : పెట్రోలు బంకులు ఎప్పటి నుంచి పనిచేస్తాయి? ఎస్పీ : ఇక నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల కోసం, మధ్యాహ్నం తర్వాత గూడ్స్ వెహికల్స్కు పెట్రోలు, డీజల్ అందించేలా ఆదేశాలు ఇచ్చాం. ప్రశ్న : కరోనా లాక్డౌన్లో పోలీసుల పాత్ర? ఎస్పీ : జిల్లా వ్యాప్తంగా 4 వేల మంది పోలీసులు, అధికారులు లాక్డౌన్లో రేయింబవళ్లు పనిచేస్తున్నారు. కుటుంబాలను వదిలి ప్రజలకు సేవ చేస్తున్నారు.పోలీసులతోపాటు వైద్యులు, వలంటీర్లు,రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారు. ప్రశ్న : జిల్లా ప్రజల సహకారం ఎలా ఉంది? ఎస్పీ : కరోనాపై జిల్లా ప్రజలకు అపూర్వమైన అవగాహన వచ్చింది. వారి సహకారంతో లాక్డౌన్ విజయవంతమవుతోంది. జిల్లా వాసుల సహకారం ఎన్నటికీ మరువలేనిది. ప్రశ్న : ప్రజల ఇబ్బందులు ఎలా పరిష్కరిస్తున్నారు? ఎస్పీ : ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా అదనపు మార్కెట్లను అందుబాటులోకి తెచ్చాం. గ్రామీణ ప్రాంతాల్లో సబ్ ఇన్స్పెక్టర్ కిరాణాషాపులు, మెడికల్ షాపుల వారితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఇబ్బందులు రాకుండా కిరాణా, మందులు సరఫరా అయ్యేలా చూస్తున్నారు. -
కరోనా వైరస్: త్రిముఖ వ్యూహం..
సాక్షి, శ్రీకాకుళం: కరోనా కల్లోలం సృష్టిస్తుంటే జిల్లా వాసులకు ఆ త్రిమూర్తులు అభయమిచ్చారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించి సిక్కోలును కరోనా బారి నుంచి కాపాడడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. ము ఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి మధ్యనే గడు పుతూ ప్రజలకు ధైర్యం చెబుతున్నా రు. లాక్డౌన్లో జనాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నారు. లాక్డౌన్ నిర్వహణలో జిల్లా అధికార యంత్రాంగం అంతా చక్క గా పనిచేసినా వారిని సమన్వయపరచుకుని ముందుకెళ్లడంలో కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు విజయవంతమయ్యారు. ఈ ము గ్గురు అధికారుల వ్యూహాత్మక నిర్ణయాలతో ప్రజలకు ఇప్పటివరకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. కలెక్టర్ చొరవ ప్రశంసనీయం కరోనా ప్రభావం దేశంలో మొదలైన దగ్గరి నుంచే కలెక్టర్ జె.నివాస్ అప్రమత్తమయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై కన్నేసి ఉంచారు. అధికారుల దగ్గరి నుంచి వలంటీర్లు, ఆశ కార్యకర్తల వరకు అప్రమత్తం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారంతా హోమ్ క్వారంటైన్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వారి కదలికలపై నిఘా పెట్టారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చాక, వైరస్ వ్యాప్తి జోరుగా జరుగుతున్న వేళ స్వయంగా జనంలోకి వచ్చి అప్రమత్తం చేశారు. లాక్డౌన్తో ప్రజలు ఇబ్బంది పడకూడదని ని త్యావసర సరుకులు, మందులు, కూరగాయలు అందుబాటులోకి తెచ్చారు. నిర్దేశిత ధరలకు ప్రజల దరి చేర్చా రు. లాక్డౌన్కు ముందు ఒక్కసారిగా విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది రావడంతో వారిని ఊళ్లలోకి పంపించకుండా ప్రత్యేకంగా క్వారంటైన్ సెంటర్లు పెట్టారు. జిల్లాకు 1,445 మంది విదేశాల నుంచి రాగా వారిలో 562 మందిని ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లలో పెట్టి భోజన, వసతి సదుపాయాలు కల్పించారు. హోమ్ క్వారంటైన్లో ఉన్న వారి బాగోగులు కూడా చూసుకున్నారు. 819 మందికి ఉచితంగా సరుకులు డోర్ డెలివరీ చేయించారు. వలస కూలీల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. వారికి రోజుకో రకం భోజనం పెడుతున్నారు. అనాథలు, నిరాశ్రయులకు కూడా రెడ్క్రాస్ సాయంతో రోజూ భోజనం పెడుతున్నారు. ప్రభు త్వ ఆదేశాలను క్రమం తప్పకుండా పాటిస్తూ.. సొంత వ్యూహంతో ముందుకువెళ్లారు. ఢిల్లీ ఘటన తర్వాత మరింత అప్రమత్తమయ్యారు. ఇక్కడి ముస్లిం పెద్దలతో సమావేశమై సమస్త వివరాలు తెలుసుకున్నారు. ఆ సమయంలో ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించిన వారి వివరాలు తెలుసుకుని పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు లాక్డౌన్ కారణంగా గుజరాత్ రాష్ట్రంలో చిక్కుకున్న మత్స్యకారులకు అండగా ఓ బృందాన్నే అక్కడకు పంపారు. ఎస్పీ అవిశ్రాంత యోధుడు జనతా కర్ఫ్యూ దగ్గర నుంచి ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. లాక్డౌన్ అమల్లోకి వచ్చాక మరింత వేగం పెంచి, రోడ్లపైనే ఎక్కువగా ఉంటున్నారు. కరోనాపై స్వయంగా అవగాహన కలి్ప స్తున్నారు. ప్రధాన కూడళ్లల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోళ్ల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విధుల్లో ఉన్న పోలీసులకు తగు జాగ్రత్తలు సూచిస్తూ, వారిలో మానసిక స్థైర్యం నింపుతున్నారు. ప్రతి రోజూ పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓలకు ముఖ్యమైన ఆదేశాలిస్తూ వస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులను ముందుగా గుర్తించి క్వారంటైన్లో ఉంచడమే కాకుండా వారు బయటికి రాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. లాక్డౌన్లో రాష్ట్రంలో ప్రతి చోట పోలీసుల తీరుపై కొన్ని విమర్శలు వచ్చినా ఇక్కడా పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. దూసుకుపోతున్న జేసీ లాక్డౌన్ అమల్లోకి రాగానే తిండికి ఇబ్బంది వస్తుందేమోనన్న భయం ప్రతి ఒక్కరికీ పట్టుకుంది. వైరస్ వస్తే ఎలా ఉంటుందో తెలీదు గాని తినడానికి తిండి దొరకకపోతే ఇలాగే చనిపోతేమోనన్న ఆందోళన మొదట్లో ఉండేది. కానీ వాటిన్నింటినీ జాయింట్ కలెక్టర్ శ్రీని వాసులు పటాపంచలు చేశారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందుల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా, నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందులు దొరకలేదన్న విమర్శలు రాకుండా చూసుకోగలిగారు. సామాజిక దూరాన్ని పాటించేలా షాపుల వద్ద చర్య లు తీసుకుంటూనే కూరగాయలు, మొబైల్ రైతు బజా ర్లు, కూరగాయలు డోర్ డెలివరీ, నిత్యావసర సరుకు లు, మందులు డోర్ డెలివరీ ఇలా ప్రతీది ప్రజల వద్దకే తీసుకొచ్చారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు, మాంసం ధరలు పెంచకుండా చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ట్రేడర్స్, పౌల్ట్రీ యజమానుల సమావేశమై ధరలపై దిశా నిర్దేశం చేశారు. రబీ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు కూడా చేశారు. వ్యవసాయానికి ఇబ్బందుల్లేకుండా చూడగలిగారు. జిల్లా యంత్రాంగం పనితీరు భేష్: రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో కరోనా కేసులు నమోదు కాకపోవడం మన అదృష్టమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ వల్ల ఆంధ్రప్రదేశ్లో వ్యాధి నియంత్రణలో ఉందని అన్నారు. శ్రీకాకుళంలో రోడ్డుపై వాహనచోదకులను ఆపి జాగ్రత్తలు చెబుతున్న దాసన్న కరోనా నియంత్రణకు జిల్లా యంత్రాంగం, పోలీస్, వైద్య, రెవెన్యూ శాఖలు స మన్వయంతో చక్కగా పనిచేశాయని ప్రశంసించారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడంతో మీడియా చురుకైన పాత్ర పోషిస్తోందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి అహరి్నశలు ప్రజా సంక్షేమం తపిస్తోందన్నారు. కరోనా కట్టడిలో ఇది కీలక సమయమని, ఇక ముందు కూడా పూర్తి నిబద్ధత పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ ఎల్రక్టానిక్ మీడియా ప్రతినిధులకు బియ్యంతో పాటు నిత్యవసరాల కిట్లను పంపిణీ చేశారు. అలాగే సోమవారం శ్రీకాకుళం నగరంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద రోడ్లపై తిరుగుతున్న వారిని మంత్రి ఆపి కరోనా నియంత్రణకు సహకరించాలని కోరారు. సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రతనే కరోనా నియంత్రణ సాధ్యపడుతుందన్నారు. జిల్లాలో ఒక్క పాటిజివ్ కేసు కూడా నమోదు కాలేదని ఇకపై కూడా రాకుండా మనమంతా కలిసికట్టుగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా తమ వివరాలు తెలియజేసి జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. -
‘మెడికల్ ఎమర్జెన్సీలో ఉన్నాం’
సాక్షి, విజయవాడ: ప్రజల అవసరాలను వ్యాపారంగా మారిస్తే కఠిన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు హెచ్చరించారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన వివిధ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నామని.. ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 144 సెక్షన్ అమలులో ఉందని.. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగవద్దని సూచించారు. నిత్యావసరాల దుకాణాలకు సైతం ఉదయం 10 గంటల వరకే అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. (తెలంగాణలో ఒక్కరోజే 6 పాజిటివ్ కేసులు) మద్యం దుకాణాలను మూసివేయాలి కృష్ణా జిల్లా: ప్రభుత్వ మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ నియంత్రణ నివారణలో భాగంగా జిల్లాలో 144 సెక్షన్తో పాటు లాక్ డౌన్ అమలులో ఉన్నందున ప్రభుత్వ మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు, కల్లు దుకాణాలు నేటి నుండి 31 వరకు మూసివేయాలని ఆదేశించింది. కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. (కరోనా కట్టడికి మేము సైతం..) పేదలకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన పోలీసులు కైకలూరు: లాక్ డౌన్ నేపథ్యంలో కైకలూరు నియోజకవర్గ పరిధిలో ముదినేపల్లి మండవల్లి కలిదిండి మండలాల్లో 144 సెక్షన్ అమలవుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిత్యావసర షాపులు మినహా అన్ని దుకాణాలను పోలీసులు మూయించి వేశారు. కైకలూరులో హోటళ్లు మూత పడటంతో పేదలకు 100 భోజన ప్యాకెట్లను కైకలూరు టౌన్ పోలీసులు పంపిణీ చేశారు. లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ స్టేడియాన్ని పరిశీలించిన అధికారులు తిరువూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ కేంద్రమైన తిరువూరులో 100 పడకల ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేయడానికి మున్సిపల్ స్టేడియాన్ని రెవెన్యూ, వైద్య అధికారులు పరిశీలించారు. ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి ఆదేశాలతో మున్సిపల్ స్టేడియాన్ని తక్షణమే అందుబాటులో తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో నియోజకవర్గంలోని గంపలగూడెం, విస్సన్నపేట, కొండూరు, తిరువూరు మండలాల ప్రజలకు చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
రౌడీషీట్లు ఉన్నవారిని బైండోవర్ చేస్తున్నాం
-
ఫేస్బుక్, వాట్సాప్లో డిలీట్ చేసినా రికవరీ చేయొచ్చు
సాక్షిప్రతినిధి, కర్నూలు: ప్రజా రక్షణే తమ ధ్యేయమని జిల్లా ఎస్పీ కె.ఫక్కీరప్ప అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది, ప్రజల సహకారంతో అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ‘సాక్షి’ దినపత్రిక యూనిట్ ఆఫీసులో శుక్రవారం జరిగిన ‘కాఫీ విత్ సాక్షి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యూనిట్లోని వివిధ విభాగాలను సందర్శించారు. సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వార్తల సేకరణ ఎలా ఉంటుంది? ఎడిటింగ్, పేజినేషన్, ప్రింటింగ్ గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలోని శాంతిభద్రతలు, పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి ‘సాక్షి’కి వివరించారు. మహిళలకు రక్షణ కవచం ‘దిశ చట్టం’ మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దిశ చట్టంతో మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇస్తోంది. మహిళా పోలీసుస్టేషన్ను ‘దిశ పోలీసుస్టేషన్’గా మార్చాం. నిర్భయ చట్టాని కంటే మరింత పకడ్బందీగా శిక్ష పడే చట్టం దిశ. అయితే ప్రత్యేకమైన కేసుల్లోనే దిశ సెక్షన్ నమోదు చేస్తాం. ఇంట్లో భార్య, భర్త మధ్య తగాదా వచ్చి.. భార్య అనుమతి లేకుండా భర్త బలవంతం చేసినా అత్యాచారం కింద కేసు నమోదవుతుంది. ఇలాంటి వాటికి ‘దిశ’ వర్తింపజేయం. కానీ హైదరాబాద్లో జరిగిన ఘటనలాగా కేసులో తీవ్రత ఉంటే దిశ సెక్షన్ వర్తిస్తుంది. మూడువారాల్లో విచారణ పూర్తయి.. దోషికి శిక్షపడే కఠిన చట్టం దిశ. ఈ చట్టం మహిళలకు ఎంతో రక్షణగా ఉంటుంది. ప్రస్తుతం దిశ స్టేషన్కు ఒక డీఎస్పీ ఉన్నారు. మరో డీఎస్పీ పోస్టు మంజూరైంది. వీరితో పాటు ఐదుగురు ఎస్ఐలు ఉంటారు. ప్రస్తుతం ఇద్దరు ఉన్నారు. మరో ముగ్గురు వస్తారు. స్టేషన్లోని మొత్తం సిబ్బందిలో 50 శాతానికి తగ్గకుండా మహిళా పోలీసులు ఉంటారు. స్టేషన్ పరిధిలో 28 మంది సిబ్బంది ఉండాలి. కానీ కర్నూలు స్టేషన్లో 46 మంది పోలీసులు ఉన్నారు. ‘దిశ స్టేషన్’గా మార్చిన తర్వాత మరో 8 మందిని తీసుకుంటున్నాం. మహిళా పోలీసులతో నేరాల తగ్గుదల గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు ప్రస్తుతం పోలీసు ట్రైనింగ్ కాలేజీలో శిక్షణలో ఉన్నారు. వీరి నియామకంతో గ్రామస్థాయిలో నేరాలు తగ్గుతాయి. సంబంధిత సమాచారం పక్కాగా, వేగంగా వస్తుంది. పోలీసులు స్థానికంగా ఉండటంతో మంచి ఫలితాలు వస్తాయి. మండలానికి 20 గ్రామాల చొప్పున ఉన్నాయి. కానిస్టేబుళ్లు పూర్తిస్థాయిలో వెళ్లలేరు. అదే సచివాలయంలో ఒక పోలీసు ఉంటే ఆయా గ్రామపరిధిపై పూర్తి అవగాహన ఉంటుంది. సమయం కేటాయిస్తారు. దీంతో గ్రామంలో పోలీసు ఉన్నారనే భయంతో నేరాల తీవ్రత తగ్గుంది. ముఖ్యంగా మహిళలు వారి సమస్యలను మహిళా పోలీసులతో చెప్పుకోవచ్చు. దీంతో చిన్న చిన్న సమస్యలు స్టేషన్ దాకా రావు. సచివాలయంలోనే కౌన్సెలింగ్ ద్వారా పరిష్కారమవుతాయి. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే పోలీసుస్టేషన్కు వస్తారు. జీరో ఎఫ్ఐఆర్ ద్వారా3 కేసుల నమోదు జీరో ఎఫ్ఐఆర్ అనేది ప్రజలకు ఉపయుక్తమైంది. ఎవ్వరైనా, ఎక్కడైనా సమస్యపై ఫిర్యాదు చేయొచ్చు. ఉదాహరణకు కర్నూలుకు చెందిన వ్యక్తి బస్సులో ప్రయాణిస్తుంటాడు. బ్యాగు చోరీ అవుతుంది. వైఎస్సార్ జిల్లాలోని దువ్వూరు వద్ద చూసుకుంటారు. అతను అక్కడే దిగి దువ్వూరు స్టేషన్లో ఫిర్యాదు చేయొచ్చు. దీంతో బాధితులు తమ గ్రామం, స్టేషన్ పరిధి చూసుకోవాల్సిన పనిలేదు. ఎక్కడ ఫిర్యాదు చేసినా కేసు నమోదవుతుంది. మన జిల్లాలో ఆత్మకూరుతో పాటు మరో రెండు చోట్ల జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. సైబర్ ఫొరెన్సిక్ ల్యాబ్తోనేరాలకు చెక్ సాధారణ నేరాల కంటే సైబర్ నేరాలు 244శాతం పెరిగాయి. సైబర్మిత్ర అమలులోకి వచ్చిన తర్వాత సైబర్ ఫొరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేశాం. సైబర్ టూల్స్పై ప్రత్యేక శిక్షణ తీసుకున్న సిబ్బంది ఉన్నారు. ల్యాబ్ సాయంతో చాలా కేసులు పరిష్కారమయ్యాయి. సైబర్ కేసులు నమోదైతే.. ఫేస్బుక్, వాట్సాప్, ఎస్ఎంఎస్లోని సమాచారాన్ని మొబైల్, కంప్యూటర్లో తొలగించినా తిరిగి మొత్తం సమాచారాన్ని రివకరీ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఫేక్ అకౌంట్లతో నేరం చేసినా, మహిళలతో చాట్ చేసి మోసం చేసినా వారిని సులభంగా పట్టుకోవచ్చు. సైబర్ కేసుల్లో చాలామందికి నగదు రికవరీ చేశాం. దీనికి బ్యాంకర్ల సహకారం అవసరం. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి.. వారికి కూడా సైబర్ నేరాలు జరిగే తీరు, తీవ్రత వివరిస్తున్నాం. ఖాతాల నుంచి డబ్బు తస్కరణ వంటి సందర్భాల్లో బ్యాంకు స్థాయిలోనే లావాదేవీలు నిలిపేసేలా చేస్తాం. ఒక సీసీ కెమెరా వందమంది కానిస్టేబుళ్లతో సమానం సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత కేసుల ఛేదనకు తక్కువ సమయం పడుతోంది. ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి. మతపరమైన సమస్యలు రాకుండా నివారించేందుకు ఇవి దోహదపడతాయి. సీసీ కెమెరాల ఏర్పాటుకు పెద్ద ఖర్చు కూడా కాదు. రూ.3–4 వేలలోనే కెమెరాలు లభిస్తున్నాయి. బ్యాంకులు, షాపింగ్మాల్స్ వద్ద కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఫ్యాక్షన్ గ్రామాల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఆదోని డివిజన్ పరిధిలో ఎక్కువగా అమర్చాం. నంద్యాల, కర్నూలులో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎంపీలు పోచా బ్రహ్మానందరెడ్డి, డాక్టర్ సంజీవ్కుమార్ ఎంపీల్యాడ్స్ నుంచి రూ.50 లక్షల చొప్పున అందజేశారు. ఈ నిధులతో మున్సిపల్ కమిషనర్ల పరిధిలో టెండర్లు నిర్వహించి.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. మునిసిపాలిటీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అమర్చుతాం. ఇప్పటికే దొంగతనాలు తగ్గాయి. సీసీకెమెరాలు అన్ని ప్రాంతాల్లో పెడితే దొంగలు భయపడతారు. ఒకవేళ దొంగతనం జరిగినా కెమెరాలు ఉంటాయి కాబట్టి కచ్చితంగా దొంగలను పట్టుకుంటాం. ఒక సీసీ కెమెరా వందమంది కానిస్టేబుళ్లతో సమానం. స్పందనలో రాష్ట్రంలోనే ప్రథమం ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహణలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. మధ్యాహ్నం 12.30 వరకూ స్పందన నిర్వహించాలి. కానీ ప్రజలు ఎంతమంది వచ్చినా సమయంతో పనిలేకుండా ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కారమే పోలీసు ధ్యేయం! నేరాలపై తీవ్రంగా స్పందిస్తున్నాం జిల్లాలో ఏ నేరం జరిగినా సీరియస్గా తీసుకుంటున్నాం. కంటైనర్లను కొల్లగొట్టే కంజారా ముఠాను కూడా 20 రోజుల్లోపే పట్టుకున్నాం. అతి కిరాతకమైన ముఠా ఇది. రన్నింగ్లోని కొరియర్ వాహనాల్లోకి ఎక్కి కొల్లగొడతారు. డ్రైవర్లు గుర్తించి ప్రతిఘటిస్తే నిర్ధాక్షిణ్యంగా చంపేస్తారు. అలాంటి కిరాతక ముఠా అది! కర్నూలు తర్వాత ప్రకాశం జిల్లాలో చోరీ చేశారు. అక్కడ డ్రైవర్ మూతికి బట్టలు కట్టేసి రోడ్డుపక్కన పడేసి ఏకంగా కంటైనర్ను తీసుకెళ్లారు. ఇలాంటి కేసుల ఛేదనలో పోలీసు సిబ్బంది కృషి అభినందనీయం. టీమ్ వర్క్తోనే నేరాలు తగ్గిస్తున్నాం. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను కూడా అందరి కృషి, సహకారంతో ప్రశాంతంగా నిర్వహించాం. మంత్రాలయంలో తిక్కారెడ్డి ఘటనలో కూడా ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాం. ఏ సమస్య వచ్చినా 100కు డయల్ చేయండి మహిళలు, ప్రజలకు ఏ సమస్య వచ్చినా స్టేషన్కు వెళ్లాల్సిన పనిలేదు. డయల్ 100కు ఫోన్ చేస్తే పోలీసులు స్పందిస్తారు. రోడ్డు ప్రమాదాలు, మెడికల్ ఎమర్జెన్సీకి 112కు కాల్ చేయొచ్చు. డయల్ 100కు ఎక్కువగా ఫోన్లు వస్తాయి. సమస్య పోలీసు పరిధి కాకపోయినా 100కు ఫోన్ వస్తే పోలీసులు సంబంధిత శాఖకు సమాచారం అందిస్తున్నారు. ప్రజావాణిలో వ్యాసాలు రాశా పేపర్ ప్రింటింగ్ ప్రెస్ చూడగానే నేను సివిల్స్కు ఎంపికైన రోజులు గుర్తొస్తున్నాయి. మాది కర్ణాటకలోని బళ్లారి. సివిల్స్ ప్రిపరేషన్ టైంలో, ఐపీఎస్ అధికారిగా ఎంపికైన తర్వాత కూడా కన్నడ పత్రిక ప్రజావాణిలో వ్యాసాలు రాశా. నేను స్వయంగా కన్నడలో కంపోజ్ చేసి, పత్రిక కార్యాలయానికి పంపేవాణ్ని. సివిల్స్ విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా 2011 వరకూ వ్యాసాలు రాశా. పాడేరు ఏఎస్పీగా వెళ్లిన తర్వాత ఆపేశా. సిగ్నల్స్ సరిగా లేకపోవడం, విధినిర్వహణలో ఉండటంతో వ్యాసాలు రాయలేకపోయా. -
ప్రైవేట్ బోట్లును అనుమతించకండి: ఎస్పీ
సాక్షి, కృష్ణా : మంగళవారం జిల్లా ఎస్పీ రవీద్రనాథ్ బాబు మెరైన్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెరైన్ సేవలు మరింత విస్తృతం చేయాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ.. తీర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నామని తెలిపారు. మెరైన్ బోట్లను నిత్యం గస్తీ తిరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలు, మెరైన్ సిబ్బందితో కలిసి తీర ప్రాంత గ్రామాలలో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గిలకలదిండి, ఓర్లగొందితిప్ప, పాలకాయ తిప్పి పోలీస్ స్టేషన్లను సందర్శించి అక్కడ పరిస్థితులు సమీక్షిస్తామని అన్నారు. మత్స్యకారుల సంరక్షణ కోసం నిరంతర కార్యాచరణ రూపొందిస్తున్నామని, తీర ప్రాంత సంరక్షణ కోసం గ్రామాల్లో సభలు ఏర్పాటు చేయాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి, వేట వేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మెరైన్ పోలీస్ స్టేషన్లో సరిపడ సిబ్బందిని ఏర్పాటు చేసి, మెరైన్ ఉనికి చాటేలా కార్యాచరణ చేపడతామన్నారు. తీర ప్రాంత గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రిజిస్టర్ బోట్లు కాకుండా, ప్రైవేట్ బోట్లు అనుమతించ వద్దని అన్నారు. ఈ కార్యక్రమానికి ఏఎస్పీ సత్తిబాబు, కృష్ణ కాంత్ పటేల్ , డీఎస్పీ ధర్మేంద్ర, మెరైన్ ఎసై, సిఐలు పాల్గొన్నారు. -
2014లో సొంత ఇల్లు లేదు.. నేడు కోట్లకు పడగలు!
సాక్షి, ఒంగోలు: గ్రానైట్ మాఫియా గుండెల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డ మాఫియా డొంక కదులుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లో గ్రానైట్ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగింది. ఆయన తన అనుచరులు పావులూరి చిన కోటయ్య, చంద్రమౌళి ద్వారా ప్రకాశం జిల్లా నుంచి వేలాది లారీల గ్రానైట్ను బిల్లులు లేకుండా పొరుగు రాష్ట్రాలకు తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. గ్రానైట్ అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారికంగా నిర్ధారించారు. అనధికారిక సమాచారం ప్రకారం.. గ్రానైట్ మాఫియా రూ.1,000 కోట్లకుపైగానే దోచేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటిదాకా 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో యరపతినేని అనుచరుడు చంద్రమౌళి అలియాస్ సీఎం కూడా ఉన్నాడు. కోట్లకు పడగలెత్తిన చిన కోటయ్య గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన పావులూరి కోటేశ్వరరావు అలియాస్ చిన కోటయ్య 2014కు ముందు సొంత ఇల్లు కూడా లేక అద్దె ఇంటిలో నివాసం ఉండేవాడు. అతడిది సామాన్య మధ్య తరగతి కుటుంబం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు యరపతినేని నేతృత్వంలో నడిచిన గుట్కా, రేషన్, గ్రానైట్ మాఫియాకు కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. ఐదేళ్లలోనే చిన కోటయ్య రూ.కోట్లకు పడగలెత్తాడు. అక్రమాలకు సహకరించిన అధికారుల్లో వణుకు ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ, మార్టూరు, సంతమాగులూరు వంటి ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు రాజకీయ నాయకుల అండదండలతో నకిలీ కంపెనీలు సృష్టించి, వాటి పేరిట ఆన్లైన్ ద్వారా ఈ–వే బిల్లులు పొంది గ్రానైట్ లారీలను అక్రమంగా రాష్ట్రం దాటించారు. కొన్నిసార్లు అసలు బిల్లులు కూడా లేకుండా గ్రానైట్ లారీలను ఇతర రాష్ట్రాలకు తరలించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. గత టీడీపీ సర్కారు హయాంలో ఈ బాగోతం నిరాటంకంగా సాగిపోయింది. అద్దంకి సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వి.పి.శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి, లోతుగా దర్యాప్తు జరిపారు. గ్రానైట్ మాఫియా డొంకను కదిలించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాలకు తరలించిన గ్రానైట్ విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక నకిలీ వే బిల్లులతో వెళ్లిన లారీల సంఖ్య వేలల్లోనే ఉంటుందని చెబుతున్నారు. ఈ గ్రానైట్ లారీలు సక్రమంగా పన్నులు చెల్లించి ఉంటే ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్లకు పైగా ఆదాయం వచ్చేదని తేల్చారు. ప్రకాశం జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు యరపతినేని అనుచరుడు చంద్రమౌళిని అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలియగానే మరో అనుచరుడు చిన కోటయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసులో మరో 123 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు. అలాగే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గ్రానైట్ మాఫియాకు సహకరించిన ప్రభుత్వ అధికారుల్లో కలవరపాటు మొదలైంది. -
'ఏ ఒక్కరినీ వదలకండని సీఎం జగన్ ఆదేశించారు'
సాక్షి, ఒంగోలు: గుట్టుచప్పుడు కాకుండా అధికారులను మేనేజ్ చేస్తూ కోట్ల రూపాయలు గడించిన మైనింగ్ మాఫియాకు సంబంధించి కీలకంగా వ్యవహంచిన 16 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు వెల్లడించారు. 16 మంది నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచి వీరు ఏ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేశారో వివరించారు. ముంబై మాఫియాను తలపించే రీతిలో చేసిన వీరి మోసంపై సీబీఐ విచారణ అక్కర్లేదని, తామే మొత్తం నిందితులు గుట్టు రట్టు చేస్తామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ధీమా వ్యక్తం చేశారు. నేరం వెలుగు చూసింది ఇలా.. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థీకృత నేరంగా మారిన కేసు.. అద్దంకి స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వీపీ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి ట్యాక్స్లు కట్టకుండా నకిలీ ఫరంలతో 290 కోట్ల 49 లక్షల 75 వేల 81 రూపాయల వ్యాపారం చేసి 52 కోట్ల 20 లక్షల 19 వేల 33 రూపాయల పన్ను ఎగ్గొట్టారని, తాము విచారించగా ఫరంలన్నీ తప్పుడు చిరునామాలతో ఆన్లైన్లో సృష్టించినట్లుగా శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్టూరు పరిసర ప్రాంతాల్లో ఒన్మ్యాన్ ఫ్రీ బిజినెస్ పాలసీ కింద 2018 ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 2919 సెపె్టంబర్ 28వ తేదీ వరకు ఒన్మ్యాన్ ఫ్రీ బిజినెస్ పాలసీ కింద ప్రభుత్వం కలి్పంచిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడినట్లు శ్రీనివాస్ తేల్చడంతో నిందితుల నేరం వెలుగులోకి వచ్చింది. దీనిపై మార్టూరు ఎస్ఐ మల్లికార్జున్ తొలుత సాంకేతిక పరిజ్ఞానం, స్థానికుల ద్వారా సమాచారం సేకరించి నిందితులు గుట్టు వెలికితీయడంతో ఇదో పెద్ద మాఫియా అన్న వ్యవహారం స్పష్టమైంది. ఈ కేసును చేధించడం ఒక్క ఎస్ఐతో సాధ్యం కాదని భావించిన ఎస్పీ..ఏకంగా చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి, అద్దంకి సీఐ టి.అశోక్వర్థన్, ఇంకొల్లు సీఐ రాంబాబు, మార్టూరు ఎస్ఐ మల్లికార్జున, మేదరమెట్ల ఎస్ఐ బాలకృష్ణతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్)ను ఏర్పాటు చేశారు. చిన కోటయ్యకు లోడుకు రూ.6 వేలు ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దులు దాటించగలిగారు కానీ దాచేపల్లి వద్ద వీరి వ్యవహారానికి గండిపడింది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారంలో యరపతినేని అనుచరునిగా పేరుండి సీబీఐ కేసులో నిందితుడైన చినకోటయ్య రాజకీయ నాయకులు, అధికారులను మేనేజ్ చేసేందుకు లోడుకు రూ.6 వేలు చొప్పున అందించేవారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆయన్నూ విచారించేందుకు పోలీసులు దృష్టి సారించారు. తొలుత నలుగురు.. నేడు 16 మంది ఈ కేసుకు సంబంధించి రెండు నెలల క్రితం తాము నలుగురిని అరెస్టు చేశామని, ప్రస్తుతం 16 మందిని అరెస్టు చేశామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి ట్యాక్స్లు కట్టకుండా జీఎస్టీ, మైనింగ్ బిల్లులకు సంబంధించి రూ.300 కోట్ల నష్టం వాటిల్లిందని, బిల్లులు లేకుండా తరలి వెళ్లిన సరుకు విలువ రూ.900 కోట్లకుపైనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇంకా 123 మంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అంతే కాకుండా అక్రమ వ్యాపార లావాదేవీలు నిర్వహించిన మార్కర్లకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. నేరంలో పాత్ర ఉన్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టవద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సార్లు తమను ఆదేశించారని ఎస్పీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కేసు దర్యాప్తులో విశేషంగా కృషి చేస్తున్నారంటూ సిట్ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అరెస్టయిన నిందితులు వీరే.. పఠాన్ అరీఫుల్లా, షేక్ షబ్బీర్, షీక్ రహీం (మార్టూరు గొట్టిపాటి హనుమంతురావు కాలనీ), కోనేరు సతీష్ (మార్టూరు మద్ది సత్యనారాయణ కాలనీ), గడ్డం హేమంత్ (మార్టూరు ఎంఎల్ఏ క్వార్టర్స్), ఆలకుంట రవికుమార్ (బల్లికురవ మండలం వైదన), వేముల జెల్లయ్య (బళ్లారి సమీపంలోని టోర్నగల్ గ్రామం), పఠాన్ జానీబాషా (మార్టూరులోని గన్నవరం రోడ్డు), కల్లేపల్లి శివప్రసాద్ వర్మ (మార్టూరు మండలం రాజుగారిపాలెం), గుర్రంకొండ భార్గవ్ (మార్టూరు విద్యానగర్), చల్లగొండ కార్తీక్ చౌదరి (మార్టూరు తూర్పు బజారు), ఏలికా రవి (గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నవరం), పెద్దిశెట్టి రవికుమార్ (మార్టూరు విద్యానగర్ మొదటి లైను), బిళ్లా చినబాబు (మార్టూరు మండలం నాగరాజుపల్లి), కోటగిరి శ్రీనివాసరావు (మార్టూరు), కాకుమాను చంద్రమోహన్ అలియాస్ చంద్రమౌళి (గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం చించాలిడొంక). దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అక్రమాలు సిట్ దర్యాప్తులో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత యర్రపోగు మహేంద్ర, అమర్నేని వెంకటేశ్వర్లు మార్టూరు పరిసర ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి అవసరమైన రుణాలు ఇప్పిస్తామంటూ వారికి సంబంధించిన ధ్రువపత్రాలు సేకరించారు. వాటిని వారు జంపని వెంకట సుబ్బారావు, చేబ్రోలు రమే‹Ù, ఆడిటర్ చేబ్రోలు రమేష్నాయుడులకు ఇచ్చారు. వారు వాటి సాయంతో 26 ఫోన్ నంబర్లు, 17 ఈ మెయిల్స్ సాయంతో 278 నకిలీ ఫరంలు సృష్టించారు. ఒక్కో ఫరాన్ని వారు రూ.35 వేలు చొప్పున విక్రయించేవారు. ఇలా మొత్తం 19 గ్రూపులకు విక్రయించారు. ఒక్కో గ్రూపులో 6 నుంచి 10 మంది ఉంటారు.ఈ మొత్తం గ్రూపుల్లో మార్టూరు పరిసర ప్రాంతాల్లోని వారు 70 మంది ఉన్నట్లు వెల్లడైంది. ఈ 19 గ్రూపుల్లోని వారు తాము కొనుగోలు చేసిన ఫరంల ద్వారా నకిలీ వేబిల్లులు సృష్టించేవారు. ఇలా నకిలీ ఫరంలను పఠాన్ ఆరీఫుల్లా, దరియావలి, షబ్బీర్, జాని, కాలేషా, శివవర్మ, కార్తీక్, షరీఫ్, భార్గవ్, శివ, జైపాల్రెడ్డి, కాళి, రహీం, ఎల్లయ్య, హేమంత్, ఖలీల్, రవి, సందీప్, నాగరాజు అనే వారు కొనుగోలు చేశారు. వీరంతా సంబంధిత గ్రూపుల లీడర్లు. ఇలా తాము కొన్న నకిలీ ఫరం ద్వారా 33 మంది మార్కర్లతో వీరు వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒక్కో లారీ గ్రానైట్ లోడుకు ప్రభుత్వానికి రూ.75 వేలు నుంచి లక్ష రూపాయల వరకు మార్కర్ చెల్లించాల్సి ఉంటుంది. నకిలీ ఫరాలు కొనుగోలు చేసిన వారు అందుకు భిన్నంగా మార్కర్ల వద్ద రూ.30 వేలు తీసుకునేవారు. అందులో తాము రూ.20 వేలు ఉంచుకుని మిగిలిన రూ.10 వేలు చంద్రమౌళి, కామేశ్వరరావు అలియాస్ కాముడు, సుదీర్, నన్నేషు, జానీ, కరీం, చినబాబు, సుదర్శన్, మల్లికార్జున, అంజయ్య, నాగయ్య, శేషు అనే వారికి ఇచ్చి లారీలను రాష్ట్ర సరిహద్దులు దాటించే బాధ్యతను అప్పగించేవారు. ఇందుకుగాను ప్రతి గ్రూపులో ఉన్న సభ్యుల్లో ఏడుగురు అక్రమ గ్రానైట్ తరలుతున్న లారీలకు ముందు పైలెట్లుగా వ్యవహరించేవారు. ఎక్కడైనా అధికారులు ఉన్నా సమాచారం అందిస్తూ వాహనాలను దారి మళ్లించడం వీరి పని. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్లే లారీలను రాష్ట్ర సరిహద్దులు దాటించే బాధ్యత శేషు అనే వ్యక్తి తీసుకునేవాడు. మిగిలిన వారు మాచర్ల, దాచేపల్లి, చెన్నై, బెంగళూరు వైపు ఎటువంటి తనిఖీలు జరగకుండా, వాహనాలు సీజ్ కాకుండా జాగ్రత్త పడేవారు. -
దారుణం: జామాయిల్ తోటలోకి తీసుకెళ్లి..
సాక్షి, ఒంగోలు: ఏకాంతంగా ఉన్న జంటపై ఓ కానిస్టేబుల్ దాడి చేసి యువతిని బలవంతంగా పక్కకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. రెండు రోజుల తర్వాత ధైర్యం తెచ్చుకున్న బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చివరకు నిందితుడు కటకటాల పాలయ్యాడు. ఈ అమానుష ఘటన తాలూకా పోలీసుస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదీ..జరిగింది పట్టణానికి చెందిన యువతికి తల్లిదండ్రులు లేరు. ఓ షోరూంలో పనిచేస్తుంటుంది. ఆమెకు వినయ్ అనే యువకుడు స్నేహితుడు. ఇద్దరూ ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మంగమూరు రోడ్డు నుంచి పేర్నమిట్ట మార్గంలోకి వెళ్లారు. ఆ మార్గంలో ఓ జామాయిల్ తోట వద్ద ఆగి మాట్లాడుకుంటున్నారు. అక్కడకు ఓ వ్యక్తి వచ్చాడు. మీకు తోట వద్ద ఏం పనంటూ బెదిరించాడు. మీరెవరని ప్రశ్నించడంతో పాడు యువకుడిపై చేయి కూడా చేసుకున్నాడు. తాను కొత్తపట్నం కానిస్టేబుల్నంటూ ఐడీ కార్డు చూపించడంతో జంట నిజంగానే భయపడింది. యువకుడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. అనంతరం ఆమెను ఇంటి వద్ద దించుతానంటూ బెదిరించి మరీ బైకు ఎక్కించుకుని అక్కడి నుంచి ఆమెను మరో రెండు కిలో మీటర్లు తీసుకెళ్లాడు. అక్కడ మరో జామాయిల్ తోటలో బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువకుడు తన స్నేహితులకు ఫోన్ చేసి వారితో కలిసి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టాడు. చివరకు ఆమె నుంచి ఫోన్ రావడంతో హుటాహుటిన అక్కడకు వెళ్లి ఆమెపై అత్యాచారం జరిగిందని తెలుసుకున్నాడు. ఎవరి ఇంటికి వారు చేరుకున్నా కానిస్టేబుల్ వ్యవహారం మాత్రం వారిని మానసికంగా వేధించింది. వారు ధైర్యం చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించడంతో పాటు ఘటనకు కారకుడు కొత్తపట్నం పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ రాజుపాలెం ఆనంద్గా గుర్తించి అరెస్టు చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్లు 341, 323, 363, 376 కింద కేసులు నమోదు చేశారు. గతంలోనూ ఇదే తరహా కేసు నమోదు ఆనంద్ 2009 బ్యాచ్ కానిస్టేబుల్. ఇతనిపై 2013లో ఒక కేసు నమోదైంది. ఆ ఘటనలో బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో పోలీసులే అతడిపై సుమోటోగా కేసు నమోదు చేశారు. బీటెక్ చదువుతున్న జంట ఒంటరిగా శివారు ప్రాంతంలో ఉన్న సమయంలో కానిస్టేబుల్ ఆనంద్ ఆ యువతిని తనతో పాటు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడనేది అప్పట్లో వచ్చిన ఆరోపణ. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఒక యువతిని బాధితురాలిగా పేర్కొన్నారు. యువతి తనపై ఎటువంటి దాడి జరగలేదని పేర్కొనడంతో 2015లో కేసు కొట్టేశారు. దీంతో మళ్లీ పోలీసు శాఖలోకి ప్రవేశించాడు. శాఖాపరమైన చర్యలకు ఎస్పీ ఆదేశం ఈ కేసులో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్పందించారు. కానిస్టేబుల్ ఆనంద్ను అరెస్టు చేయడంతో పాటు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం వైద్యశాలకు పంపించారు. అంతే కాకుండా ఆనంద్పై శాఖాపరమైన చర్యలు చేపట్టేందుకు విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక అనంతరం అతడిని పోలీసు శాఖ నుంచి డిస్మిస్ చేసే అవకాశం ఉంది. -
ఛీఛీ.. బాలికపై పోలీస్ బాస్ లైంగిక దాడి
గువహతి: కంచే చేను మేసిన చందాన రక్షణ కల్పించాల్సిన పోలీసే బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అసోం రాష్ట్రంలోని కర్బీఅంగ్లాంగ్ పట్టణంలో పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)గా పనిచేస్తున్న గౌరవ్ ఉపాధ్యాయ్ ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అసోంలో కలకలం రేపింది. బాలిక ఫిర్యాదు మేరకు ఎస్పీ గౌరవ్ ఉపాధ్యాయ్పై పోస్కో చట్టం సెక్షన్ 10 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ ఎంపీ గుప్తా తెలిపారు. కాగా 2012 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఉపాధ్యాయ 2019 జనవరి 22 నుంచి కర్బీఅంగ్లాంగ్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చదవండి: 'ఆయన ముక్కు బాలేదు.. నాకీ పెళ్లొద్దు' చదవండి: రైలులో చిన్న వివాదం ఎంత పనిచేసింది? -
ఎస్పీ మాటల్లో తప్పేముంది? : డిప్యూటీ సీఎం
లక్నో : భారత్లో ఉండడం ఇష్టం లేకపోతే పాకిస్తాన్ వెళ్లిపోండి అని అన్న మీరట్ ఎస్పీ మాటల్లో తప్పేముందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తిరిగి ప్రశ్నించారు. ఆ మాటలు మొత్తం ముస్లిం సమాజానికి వర్తించవని, కేవలం పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేసిన వారికే వర్తిస్తాయని, విమర్శించేవారు ఇది గమనించాలని కోరారు. మౌర్య ఆదివారం ఓ మీడియాతో మాట్లాడుతూ.. సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో కొందరు పోలీసులపై రాళ్లు విసురుతూ పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. వారినుద్దేశించి మాత్రమే ఎస్పీ ఆ మాటలన్నారు. ఇందులో తప్పేముందో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. కాగా, ఇంతకు ముందు కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పందిస్తూ ఎస్పీ వ్యాఖ్యలు నిజమైతే ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. చదవండి : వాళ్లను పాకిస్తాన్ వెళ్లిపొమ్మని చెప్పండి : మీరట్ ఎస్పీ -
నా భర్తపై చర్యలు తీసుకోండి
సాక్షి, సంగారెడ్డి: నా భర్త ప్రతీ రోజు మద్యం సేవించి నన్ను కొడుతున్నాడు. మానసికంగా వేధిస్తున్నాడు. ఇంట్లో వస్తువులు అమ్ముకొని ఇబ్బంది పెడుతున్నాడు. పుట్టింటి నుండి అదనపు కట్నం తీసుకురమ్మని అత్తింటి వారి వేధింపులు ఎక్కువయ్యాయి. నాకు న్యాయం చేయండి అని హత్నూర మండలానికి చెందిన ఓ వివాహిత ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డికి విన్నవించింది. పోలీస్ గ్రీవెన్స్ సెల్లో భాగంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదులను సోమవారం ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి స్వయంగా స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి. ‘నా భార్య అత్యాచారం, హత్యకు గురైన కేసులో ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రకారం ప్రభుత్వం రూ.8.50 లక్షలను మంజూరు చేసింది. నా మానసిక స్థితి బాగోలేకపోవడంతో మరో వ్యక్తి నా బ్యాంకు అకౌంట్ నుండి డబ్బులను తీసుకున్నాడు. నా డబ్బు నాకు వచ్చేలా చూడండి’ అని కంది మండలానికి చెందిన ఓ ఫిర్యాదుదారుడు కోరారు. ‘నాకు 2008లో వివాహం జరిగింది. నా భర్త అదనపు కట్నం కోసం వేధించడంతో కేసు నమోదు చేయించాం. కోర్టు నా భర్తకు, మామకు జైలు శిక్ష వేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం నేను భర్త ఇంట్లోనే ఉంటున్నా. కానీ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని నన్ను వేధిస్తున్నాడు. ఇంటి నుండి వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. నాకు న్యాయం చేయాల’ని కంది మండలానికి చెందిన ఫిర్యాదుదారురాలు కోరారు. -
అధికారులకు ఎస్పీ సిద్ధార్థ్ సెమినార్
సాక్షి, ఒంగోలు: ఆన్లైన్ దర్యాప్తుపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సూచించారు. శనివారం స్థానిక పోలీసు కల్యాణ మండపంలో సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు ఆన్లైన్ దర్యాప్తుపై అవగాహన కల్పించేందుకు సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆన్లైన్ దర్యాప్తు అనగానే సైబర్ క్రైం కాదని గుర్తుంచుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా నేడు సాంకేతిక వినియోగం పెరిగిపోయిందన్నారు. అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు సాంకేతికతను వినియోగిస్తూ పౌరులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒకచోట నేరం చేస్తూ మరోచోట తలదాచుకునే వారి గుట్టును సులువుగా ఛేదించాలంటే ఆన్లైన్ దర్యాప్తుపై అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు ఒక అనుమానితుడి వేలిముద్రను గుర్తించినప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు యాప్ ద్వారా సులువుగా అతనిపై ఉన్న కేసులను తెలుసుకోవచ్చని, ఫింగర్ ప్రింట్ బ్యూరోకు పంపడం, వారు వాటిని సెర్చి చేసి నివేదిక అందించాల్సి రావడంతో వేగవంతమైన దర్యాప్తుకు ఆటంకం ఏర్పడుతోందన్నారు. ప్రాథమిక అవగాహన కోసమే సెమినార్ ప్రస్తుతం నిర్వహిస్తున్న సెమినార్ కేవలం ప్రాథమిక అవగాహన కోసమేనని, ఇంకా మలిదశలో మరికొన్ని సెమినార్లు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. అన్ని దశల్లో శిక్షణ పూర్తి చేసుకుని అవగాహన పెంపొందించుకుంటే మీరే సుశిక్షితులైన సైబర్ ఎక్స్పర్ట్గా ఉంటారని సీనియర్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు సూచించారు. ప్రతి ఒక్క ప్రభుత్వ సంస్థ డేటా బేస్ను అందుబాటులో ఉంచితే ఆన్లైన్ దర్యాప్తునకు అవకాశం ఏర్పడిందన్నారు. చాలామంది ఆన్లైన్ దర్యాప్తునకు కేవలం ఈ కాప్స్ మీద ఆధారపడుతున్నారని, ఇది సమంజసం కాదని ఎస్పీ స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి తగ్గట్లు మనం కూడా వాటిని అందిపుచ్చుకుంటూ ముందడుగు వేయాలని సూచించారు. ఒక ప్రాంతంలో నేరం చేసిన వ్యక్తి మరో ప్రాంతంలో ప్రభుత్వ పథకాలు పొందే అవకాశాలు లేకపోలేదని, ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంకు అకౌంట్, ఏటీఎం కార్డు వినియోగం, రేషన్ కార్డు వినియోగం, డ్రైవింగ్ లైసెన్స్ వినియోగం ఇలా అనేక రకాలైన వాటిలో ఏదో ఒకదాన్ని నేరగాడు తప్పకుండా వినియోగిస్తుంటాడని పేర్కొన్నారు. దర్యాప్తు అంశాలపై సెల్లో శిక్షణ పొందుతున్న పోలీసు అధికారులు క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం (సీసీటీఎన్ఎస్) ప్రస్తుతం అందుబాటులో ఉన్నా అందులో కొంత సమస్య ఉందని, వాటిని సైతం అధిగమించేలా ప్రతి ఒక్కరు మారాలన్నారు. ఇప్పటి వరకు ఎవరో ఒకరిని ఇన్ఫార్మర్గా పెట్టుకుని నిందితులను అరెస్టు చేసేవారని, ఇక నుంచి ఆన్లైన్ ద్వారా అతడిని ట్రేస్ చేసి ఎప్పుడు ఏ ప్రాంతంలో ఉంటాడో కూడా తెలుసుకోవడం ద్వారా దర్యాప్తు వేగవంతం కావాలని ఎస్పీ వివరించారు. పంజాబ్లో ఇటీవల నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారన్నారు. ఫలానా సమయంలో ఫలానా హత్య తానే చేశానని, ఎలా చేసింది కూడా వివరంగా సోషల్ మీడియాలో కొందరు పోస్టు చేస్తున్నారని, ఇటువంటి నేరస్తులను అరెస్టు చేయాలంటే సాంకేతి వినియోగంపై నైపుణ్యం తప్పనిసరన్నారు. అద్దంకి సీఐ అశోక్వర్థన్ ఇటీవల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సంచలన కేసులను ఛేదించారని, ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకుని చిత్తశుద్ధితో ప్రాక్టీస్ చేయాలని వివరించారు. ఇక నుంచి నైట్ షిఫ్ట్ల్లో పనిచేసే వారు సాంకేతికతను ఎలా వినియోగించుకుంటున్నారనే దాన్ని పరిశీలించేందుకు ఒక ఐటీ టీమ్ను కూడా నైట్ షిఫ్ట్లో కొనసాగించాలని నిర్ణయించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఏ నేరస్తుడికి సంబంధించిన కేసులు కోర్టులో నడుస్తున్నాయి, వారు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారనేది కూడా తెలుసుకోగలుగుతామన్నారు. ప్రతి ఒక్కరు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకుని సాంకేతిక నిపుణులుగా మారాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆకాంక్షించారు. దశల వారీగా తాము నిర్వహించే కార్యక్రమాల్లో ఎస్ఐ నుంచి డీఎస్పీ స్థాయి వరకు అధికారులు తాము ఏం నేర్చుకున్నామో కూడా అందరికీ వివరించాల్సి ఉంటుందన్నారు. సాయంత్రం వేలిముద్రలు, సైబర్ నేరాలకు సంబంధించిన వాటిపై ఆన్లైన్ ద్వారా ఎలా దర్యాప్తు చేయాలనే దానిపై డెమో ఇచ్చారు. డీఎస్పీ నేతృత్వంలో సంబంధిత సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలకు పెద్ద మానిటర్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. స్పెషల్ బ్రాంచి సీఐలు కె.శ్రీనివాసరావు, శ్రీకాంత్బాబు, ఐటీ కోర్ టీమ్ ఎస్ఐ నాయబ్రసూల్ పాల్గొన్నారు. -
వివేకా హత్య కేసులో పుకార్లను నమ్మొద్దు : ఎస్పీ
సాక్షి, వైఎస్సార్ కడప జిల్లా : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వస్తున్న వదంతులను నమ్మొద్దని జిల్లా ఎస్పీ అన్బురాజన్ కోరారు. ఎవరైనా అలాంటి అబద్దపు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా హత్య కేసులో సునీల్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు వస్తున్న వార్తల పట్ల ఎస్పీ స్పందించారు. అలాగే అవాస్తవాలను ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
నా కూతురిని వేధిస్తున్నవారిపై చర్యలు తీసుకోండి
సాక్షి, సంగారెడ్డి : నా కూతురికి 2012వ సంవత్సరంలో పెళ్లి చేశాను. డబ్బుల కోసం భర్త, అత్త, మామ, ఆడపడుచులు శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. మా అల్లుడు రెండో వివాహం చేసుకున్నాడు. మా అల్లుడితోపాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని జహీరాబాద్ మండలానికి చెందిన ఓ మహిళ అదనపు ఎస్పీని కోరింది. పోలీస్ ప్రజా విజ్ఞప్తుల దినం కార్యక్రమంలో సోమవారం అదనపు ఎస్పీ మహేందర్ను కలిసి పలువురు బాధితులు సమస్యలను విన్నవించారు. పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ గ్రీవెన్స్ సెల్కు అందిన మరికొన్ని ఫిర్యాదులు ఇలా ఉన్నాయి. ‘నా కూతురిని బలవంతంగా ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. నా కూతురి ఆచూకీ కోసం వారి ఇంటికి వెళితే అక్కడ కూడా అమ్మాయి కనిపించలేదు. నా కూతురు ఆచూకీ తెలుసుకొని నాకు అప్పగించాలి’ అని సదాశివపేటకు చెందిన ఓ ఫిర్యాదుదారుడు అడిషనల్ ఎస్పీని కోరాడు. నేను 2018లో చిట్కుల్ గ్రామంలో ఒక ప్లాట్ కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నా. అయితే దాన్ని అమ్మిన వ్యక్తి ఆ ప్లాట్ను ఇద్దరి పేర్లపై డబుల్ రిజిస్ట్రేషన్ చేశాడని ఆ తర్వాత తెలిసింది. దీనికి సంబంధించి ఆ వ్యక్తిని అడిగితే డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పాడు కానీ ఇంతవరకు చెల్లించలేదు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి అడిగితే మమ్మల్ని చంపుతానని బెదిరిస్తున్నాడు. మాకు న్యాయం చేయాలి’ అని ఇస్నాపూర్ మండలానికి చెందిన ఒక ఫిర్యాదిదారుడు అడిషనల్ ఎస్పీకి విన్నవించారు. నేను 2010వ సంవత్సరంలో ముత్తంగి గ్రామంలో కొంత భూమిని కొని నా కూతురికి కట్నంగా ఇచ్చాను. ఆ భూమికి చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంది. ఆ భూమి తమదని కొంత మంది వ్యక్తులు 2014వ సంవత్సరంలో కోర్టులో కేసు వేశారు. ఆ కేసులో కోర్టు మాకు అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చింది. అయినప్పటికీ కొంత మంది డబ్బులు ఇచ్చి ఆ భూమిని సెటిల్మెంట్ చేసుకోవాలని, లేకుంటే కాంపౌండ్ వాల్ కూలగొడతామని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. నాకు న్యాయం చేయండి అని నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ బాధితుడు అడిషనల్ ఎస్పీకి విన్నవించుకున్నాడు. -
పారదర్శకంగానే గ్రామ సచివాలయ నియామకాలు
సాక్షి, చిత్తూరు అర్బన్: జిల్లాలో జరగనున్న గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో ఎలాంటి సందేహాలూ వద్దని చిత్తూరు ఎస్పీ చింతం వెంకట అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఈ పోస్టుల్లో అక్రమాలకు, దళారులకు తావుండకూడదని ఇ ప్పటికే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. కొందరు వ్యక్తులు ప్రముఖలను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో సచివాలయ పోస్టులపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పుడు పోస్టులు పెడుతున్న వారిని గుర్తించడానికి ఓ బృందాన్ని నియమించామన్నారు. వాట్సప్, ఎఫ్బీ గ్రూపుల్లో ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే అడ్మిన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల నియామకం జరుగుతుందని, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పోస్టులు ఇప్పిస్తామని నమ్మించే ప్రయత్నం చేసినా, తప్పుడు ప్రచారాలు ట్రోల్ చేసినా డయల్–100, పోలీస్ వాట్సప్ నెంబరు– 9440900005కు ఫిర్యాదు చేయాలని కోరారు. -
అల్లర్లకు పాల్పడితే బైండోవర్ కేసులు
సాక్షి, కర్నూలు : అల్లర్లకు పాల్పడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ పక్కిరప్ప అన్నారు. గురువారం నందికోట్కూరు పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారాయన. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత ఎన్నికల్లో గ్రామాల్లో అల్లర్లు సృష్టించిన వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలు వెంటనే పరిష్కరించడంలో జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు. -
‘బీజేపీ నా భర్తను వేధిస్తోంది’
లక్నో: తన భర్తను బీజేపీ ప్రభుత్వం తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని సమాజ్వాదీ ఎంపీ ఆజంఖాన్ భార్య రాజ్యసభ సభ్యురాలు తాజిన్ ఫాటిమా ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తన భర్తపై రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని ఆమె అన్నారు. కాగా ల్యాండ్ మాఫీయా కేసులో ఆజంఖాన్ ఉన్నారంటూ యూపీ ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించినందుకు తన భర్తపై కుట్రపన్నారని ఆమె తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. తమను రాజకీయంగా ఎదుర్కొలేక, ఇలా అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని పేర్కొన్నారు. కాగా ఆజంఖాన్పై ల్యాండ్ మాఫీయాలో అనేక ఆరోపణలు ఉన్నాయని, ఇప్పటివరకు 30 కేసులు కూడా నమోదయిన్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాంపూర్ లోక్సభ పరిధిలో అనేక కేసులు ఉన్నట్లు సీనియర్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ తెలిపారు. ఆజంఖాన్ రెవెన్యూ శాఖమంత్రిగా ఉన్న (2012-2017) సమయంలో అమాయక రైతుల నుంచి భారీ ఎత్తున భూమిని లాక్కుని, పెద్దఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. అయితే ఆయనపై ఉన్న కేసులు కోర్టుల్లో రుజువైతే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందన్నారు. దీనిపై ఎస్పీ నేతలు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేతలపై కక్షసారింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. -
ఆజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు
లక్నో: వివాదాస్పద నేత, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఆజం ఖాన్ ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్య్ర వచ్చినప్పటి (1947) నుంచి భారతదేశంలో నివశించడానికి తాము (ముస్లింలు) డబ్బులు చెల్లిస్తున్నామని వ్యాఖ్యానించారు. ‘‘దేశ విభజన అనంతరం మా పూర్వీకులు చాలామంది పాకిస్తాన్, బంగ్లాదేశ్కు తరలివెళ్లిపోయారు. కానీ కొంతమంది మాత్రం ఇక్కడే ఉన్నారు. వారందరికీ ఇక్కడ తగిన శిక్ష పడుతోంది. ఇక్కడ నివశించడానికి మేం డబ్బులు చెల్లిస్తున్నాం’’ అని అన్నారు. అయితే శుక్రవారం బిహార్లో మూకదాడి జరిగిన విషయం తెలిసిందే. సరాన్ జిల్లాలో గేదెను దొంగిలించబోయారన్న కారణంతో జరిగిన ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. దీనిపై స్పందించి ఆజం ఖాన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. దాడిలో సంఘటనా స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారని ఎస్పీ హర్కిషోర్ తెలిపారు. ఇద్దరుముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించామని తెలిపారు. మరోవైపు దొంగిలించే ప్రయత్నం చేయకపోయినా, కావాలనే కొట్టి చంపారని మృతుల బంధువులు ఆరోపించారు. దీనిపై బిహార్ వ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఘటనపై ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతకు వ్యతిరేకంగాఉన్నాయంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కాగా ఖాన్పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పలు కేసులను నమోదు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న ల్యాండ్మాఫీయాను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలుచేపట్టింది. దీనిలోభాగంగా మాఫియా నేరారోపణలు ఎదుర్కొంటున్న పాల్పడిన అనేక మంది నేతలపై కేసులను నమోదు చేస్తోంది. ఆ జాబితాలో ఆజం ఖాన్ పేరును కూడా చేర్చింది. కేసులో నేరం రుజువైతే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. కాగా ఆయనపై గత పదేళ్లలో వివిధ నేరాల్లో 30కిపైగా కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఎస్పీతో పొత్తుకు స్వస్తి పలికామని బీఎస్పీ
-
ఇక ఒంటరి పోరే..
లక్నో : ఎస్పీతో పొత్తుకు స్వస్తి పలికామని బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రకటించారు. ఇక ఎలాంటి ఎన్నికల్లో అయినా తమ పార్టీ సొంతగానే పోటీచేస్తుందని ఆమె పేర్కొన్నారు. గతంలో అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పీ ప్రభుత్వం దళితులు, యాదవేతరుల అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని అదే సార్వత్రిక ఎన్నికల్లో తమ వైఫల్యానికి కారణమైందని మాయావతి ఎస్పీపై ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల అనంతరం ఎస్పీ తీరును గమనించిన తర్వాత ఆ పార్టీతో పొత్తు ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవడం సాధ్యం కాదని అవగతమైందని చెప్పారు. పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం రానున్న ఏ ఎన్నికల్లోనైనా ఒంటరి పోరుకే సిద్ధం కావాలని పార్టీ నిర్ణయం తీసుకుందని మాయావతి ట్వీట్ చేశారు. -
నిద్రపోయారు.. సస్పెండ్ అయ్యారు
భోపాల్ : విధుల్లో ఉండగా నిద్రపోయినందుకు గాను ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. వివరాలు.. విధి నిర్వహణలో అధికారులు ఎంత అలర్ట్గా ఉన్నారో పరీక్షించాలనుకున్నారు ఇండోర్ ఎస్పీ మహ్మద్ యూసఫ్ ఖురేషి. అందులో భాగంగా ఇండోర్లోని పలు పోలీస్ స్టేషన్లలో సోమవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. చాలా చోట్ల అధికారులు నిద్ర పోతున్నట్లు తెలిసిందన్నారు. వీరిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఓ కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుల్తో పాటు ఏఎస్సైని కూడా సస్పెండ్ చేసినట్లు ఖురేషి తెలిపారు. -
కొన్నిసార్లు అంతే.. !!
లక్నో: లోక్సభ ఎన్నికల్లో మహాకూటమి ఘోరంగా విఫలమవ్వడంతో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. మిత్రపక్షమైన ఎస్పీకి కనీస ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నట్టు మాయావతి మంగళవారం ప్రకటించారు. అంతేకాకుండా యూపీలో త్వరలో 11 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించి.. అఖిలేశ్ యాదవ్కు షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఏఎన్ఐ వార్తాసంస్థతో ముచ్చటించారు. యూపీలో పొత్తులు ఎందుకు వికటించాయో ఆయన విశ్లేషించారు. కొన్నిసార్లు ప్రయోగాలు విజయవంతం కాకపోయినప్పటికీ.. వాటి వల్ల మన బలహీనతలు ఏమిటో తెలుస్తాయని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు. మాయావతి అంటే ఇప్పటికీ తనకు ఎనలేని గౌరవముందని తెలిపారు. పొత్తులు, ఎన్నికల్లో పోటీ అనేవి రాజకీయ అంశాలని, వీటిలో అందరికీ అన్ని మార్గాలు ఉంటాయని విశ్లేషించారు. ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే విషయమై పార్టీ నేతలతో చర్చించి.. భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. -
ఇది శాశ్వతంగా వీడిపోవడం కాదు
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల నిమిత్తం ఉత్తరప్రదేశ్లో ఏర్పాటైన మహాకూటమికి గుడ్బై చెప్పినట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం ఢిల్లీలో అధికారికంగా ప్రకటించారు. రానున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ సొంతంగానే పోటీ చేస్తుందని ఆమె వెల్లడించారు. సమాజ్వాదీ పార్టీ తమ సొంత ఓటు బ్యాంకును కూడా ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో దక్కించుకోలేకపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో బీఎస్పీ-ఎస్పీ పొత్తు పనిచేయలేదని, యాదవ సామాజికవర్గం ఓట్లు బీఎస్పీ అభ్యర్థులకు బదిలీ కాలేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు ఒంటరిగా పోటీచేయడమే మంచిదని, సోమవారం జరిగిన పదాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. సమాజ్వాదీ పార్టీ ఓట్లు బీఎస్పీ అభ్యర్థులకు పడలేదని ఆమె విశ్లేషించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇది శాశ్వతంగా విడిపోవడం కాదని, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్తో రాజకీయాలకు అతీతంగా సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయని వెల్లడించారు. అఖిలేష్, డింపుల్ దంపతులు తనకు ఎంతో గౌరవం ఇచ్చారని, వారిని తన కుటుంబ సభ్యులుగా భావించానని చెప్పారు. -
కలిసుంటే మరో 10 సీట్లు
సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ దారుణంగా దెబ్బతింటుందన్న ఊహాగానాలన్నీ తలకిందులయ్యాయి. మహా కూటమి(మహాగఠ్ బంధన్)ను ఎదుర్కోవడం కమలనాథులకు కష్టమన్న రాజకీయ పండితుల జోస్యాలు కూడా వమ్మయ్యాయి. రాష్ట్రంలోని 80 సీట్లలో బీజేపీ కూటమి 64 సీట్లు గెలిస్తే, బీఎస్పీ–ఎస్పీ–ఆర్ఎల్డీల మహా కూటమి 15 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్కు ఒక్క సీటే వచ్చింది. అయితే, మహా కూటమిలో కాంగ్రెస్ కూడా ఉండి ఉంటే కూటమి పరిస్థితి మరీ ఇంత దయనీయంగా ఉండేది కాదని, కనీసం మరో పది సీట్లయినా వచ్చేవని రాజకీయ విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి, కాంగ్రెస్కు కలిపి 45.20 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి 49.56 శాతం ఓట్లు వచ్చాయి. కొన్ని నియోజకవర్గాల్లో విజేతకు వచ్చిన మెజారిటీ కంటే కాంగ్రెస్ లేదా కూటమి అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. కూటమిలో కాంగ్రెస్ ఉంటే ఫలితం మరోలా.. మహా కూటమిలో కాంగ్రెస్ చేరి ఉంటే అలాంటి చోట్ల కచ్చితంగా కూటమి అభ్యర్థే గెలిచేవారని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఈ పది చోట్ల కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకున్న బీజేపీ యేతర ఓట్లు పొత్తులో ఉంటే కూటమికి పడేవని వారంటున్నారు. ఉదాహరణకు బదౌన్లో బీజేపీ అభ్యర్థి సంఘమిత్ర మౌర్య 18,454 ఓట్ల ఆధిక్యతతో ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్పై గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్కు 51,947 ఓట్లు వచ్చాయి. ఒకవేళ కాంగ్రెస్ కూటమిలో ఉండి ఉంటే ఈ ఓట్లు ధర్మేంద్రకు పడేవి. దాంతో ఆయన గెలుపు సాధ్యమయ్యేది. అలాగే, బందాలో ఎస్పీ అభ్యర్థి శ్యామ్ చరణ్ 58,553 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 75,438 ఓట్లు వచ్చాయి. ఇవి కలిస్తే శ్యామ్ సునాయాసంగా గెలిచేవారు. బారాబంకిలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి రామ్ సాగర్ బీజేపీ చేతిలో 1,10,140 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తనూజ్ పునియాకు 1,59,611 ఓట్లు వచ్చాయి. కూటమిలో కాంగ్రెస్ చేరితే ఈ ఓట్లన్నీ కూటమికి పడి ఆ అభ్యర్థి గెలిచేవారు. ఇక ధరౌహ్రాలో బీఎస్పీ అభ్యర్థి ఇలియాస్ సిద్ధిఖి 1,60,601 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ కాంగ్రెస్కు 1,62,856 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్, కూటమిల్లో ఏవరో ఒకరే నిలబడి ఉంటే కచ్చితంగా వాళ్లే గెలిచేవారు. మచిలీషహర్లో బీఎస్పీ అభ్యర్థి రామ్ కేవలం 181 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ మద్దతిచ్చిన జన్ అధికార్పార్టీ అభ్యర్థికి 7వేల ఓట్లు వచ్చాయి. ఆ ఓట్లు కూటమికి వస్తే బీఎస్పీ అభ్యర్థే కచ్చితంగా గెలిచేవారు. మీరట్లో కూడా బీజేపీ మెజారిటీ(2,379) కంటే కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. బస్తి, సంత్ కబీర్ నగర్, సుల్తాన్పూర్ వంటి పది నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మహాకూటమితో కాంగ్రెస్ కలిస్తే ఈ సీట్లతో పాటు మరి కొన్ని సీట్లు కచ్చితంగా కూటమి ఖాతాలో పడేవని పరిశీలకులు చెబుతున్నారు. కాగా, కాంగ్రెస్ కూటమిలో చేరకపోవడం వల్ల బీఎస్పీ లాభపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. షహరన్పూర్లో బీఎస్పీ అభ్యర్థి గెలిచారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్కు రెండు లక్షల ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఓట్లను చీల్చిందని, దాంతో బీఎస్పీ లాభపడిందనేది పరిశీలకుల మాట. -
యూపీ వెనుకబడిన వర్గాల మొగ్గు ఎటువైపు?
ఉత్తర్ప్రదేశ్లోని 27 లోక్సభ స్థానాలకు చివరి రెండు దశల్లో జరిగే పోలింగ్ పాలకపక్షమైన బీజేపీకి అత్యంత కీలకమైనది. 2014లో రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో బీజేపీ, దాని మిత్రపక్షం 73 స్థానాలు కైవసం చేసుకున్నాయి. గతంలో యూపీలో వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న ఎస్పీ, బీఎస్పీ మరో ప్రాంతీయపక్షమైన ఆరెల్డీతో చేతులు కలిపి మహా కూటమి పేరుతో 2019 ఎన్నికల్లో పోటీచేయడం కొత్త పరిణామం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ చెల్లెలు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విస్తృతంగా ప్రచారం చేయడం రెండో ప్రధానాంశం. ప్రియాంక ప్రచారం కారణంగా కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో పది శాతం వరకూ ఓట్లు అదనంగా పడుతున్నాయని ఎన్డీటీవీ అధిపతి, ప్రసిద్ధ ఎన్నికల విశ్లేషకుడు ప్రణయ్ రాయ్ జరిపించిన సర్వేలో తేలింది. అయితే, కాంగ్రెస్కు పెరిగే ఈ ఓట్లు బీజేపీ వ్యతిరేక ఓట్ల నుంచే వస్తున్నందువల్ల ఎస్పీ–బీఎస్పీ కూటమికి నష్టదాయకం కావచ్చని అంచనా వేస్తున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల సగటు కన్నా ఉత్తర్ప్రదేశ్లో ఎక్కువ మంది దళితులు, ముస్లింలు ఉన్నారు. అలాగే పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ఓటర్ల శాతం యూపీలో ఎక్కువ. బీజేపీ నుంచి కాంగ్రెస్, కూటమి వైపు మొగ్గుతున్న దళితులు కిందటి లోక్సభ ఎన్నికల్లో కాషాయపక్షానికి అధిక సంఖ్యలో ఓట్లేసిన దళితుల్లో కొందరు ఈసారి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లేసే అవకాశం ఉందని కూడా సర్వేలో తేలింది. 2014లో బీజేపీకి పడిన దళితుల ఓట్లలో 10 శాతం కాంగ్రెస్కు, ఐదు శాతం మహా కూటమికి దక్కే అవకాశముంది. యూపీలో ముస్లింలు జనాభాలో 19 శాతం వరకూ ఉన్నారు. వారిలో 75 శాతం ఓటర్లు మహాగఠ్బంధన్కు, 25 శాతం మంది కాంగ్రెస్కు ఓటేసే వీలుందని కూడా ఈ సర్వే సూచిస్తోంది. 18–25 ఏళ్ల యువ ఓటర్ల మద్దతు ఎక్కువగా బీజేపీకే ఉంటుందని తెలుస్తోంది. ఇంకా మహిళలు, వెనుకబడిన వర్గాల్లో కూడా బీజేపీకి ఎక్కువ మద్దతు కనిపిస్తోంది. యూపీలోని బీసీల్లో సగానికి పైగా(55 శాతం) జనం బీజేపీ అభ్యర్థులకు ఓటేయడానినికి ఇష్టపడుతున్నారు. మిగిలిన 35 శాతం మహా కూటమికి, పది శాతం కాంగ్రెస్కు ఓటేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యువతలో సగం బీజేపీకే? ఉత్తర్ ప్రదేశ్ యువ ఓటర్లలో(18–25 ఏళ్ల వయసువారు) దాదాపు సగం మంది బీజేపీకి ఓటేయడానికే మొగ్గు చూపుతున్నారని, ఈ అంశం పార్టీలు సాధించే లోక్సభ సీట్ల సంఖ్యను నిర్ణయిస్తుందని కూడా క్షేత్రస్థాయిలో జరిపిన అధ్యయనాలు చెబుతున్నాయి. ఏ ఎన్నికల్లోనైనా ఉత్సాహంగా ఓటు వేస్తున్న మహిళల విషయానికి వస్తే, పురుషులతో సమానంగా మహిళలు బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. కాంగ్రెస్కు పడే ఓట్లలో మహిళల ఓట్లు ఎక్కువనీ, మహా కూటమికి దక్కే ఓట్లలో పురుషులవి ఎక్కువనీ ఈ సర్వే సూచిస్తోంది. బీసీలు, దళితుల మద్దతు అత్యధికంగా ఉన్న ఎస్పీ–బీఎస్పీ కూటమి ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో చేతులు కలపడం వల్ల గణనీయ సంఖ్యలో ఉన్న అగ్రవర్ణాలు బీజేపీకి అనుకూలంగా సమీకృతం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా ఈ సర్వేలో తేలింది. వారు అత్యధిక సంఖ్యలో కాషాయపక్షం అభ్యర్థులకు ఓటేస్తారని తెలుస్తోంది. మొత్తం మీద రాజకీయ, కుల సమీకరణలు కొంత వరకు బీజేపీకి అనుకూలంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. -
ప్రధానుల కర్మభూమి ఫూల్పూర్
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మూడు సార్లు ప్రాతినిధ్యం వహించిన యూపీలో ఫూల్పూర్ లోక్సభ స్థానంలో గెలుపుని ఇటు బీజేపీ, అటు ఎస్పీబీఎస్పీ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకసారి విజయాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఈ స్థానాన్ని తిరిగి రాబట్టుకోవాలనుకుంటోంది. బీజేపీని తిరిగి అడుగుపెట్టనివ్వరాదన్న దృఢసంకల్పంతో మహాకూటమి పనిచేస్తోంది. మే 12న పోలింగ్ జరిగే ఫూల్పూర్కి జవహర్ లాల్ నెహ్రూ, వీపీ సింగ్, విజయలక్ష్మి పండిత్ లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించడం విశేషం. 1971లో వీపీ సింగ్ ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున విజయాన్ని కైవసం చేసుకున్నారు. సోషలిస్టు పార్టీ నుంచి రామ్ మనోహర్ లోహియా 1962లో నెహ్రూపై పోటీ చేసి ఇక్కడ ఓడిపోయారు. ప్రముఖులను గెలుపుతీరాలకు చేర్చిన స్థానం... 1952లో జరిగిన తొలి ఎన్నికలు మొదలుకొని 1957, 1962ల్లో మూడు సార్లు వరుసగా భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫూల్పూర్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. జవహర్ లాల్ నెహ్రూ మరణించేవరకూ ఇదే స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో నెహ్రూ చెల్లెలు విజయలక్ష్మీ పండిత్ ఇక్కడి నుంచి గెలుపుబావుటా ఎగురవేశారు. 2009లో బీఎస్పీ అభ్యర్థి కపిల్ మున్వీ కర్వారియా గెలుపొందారు. వచ్చినట్టే వచ్చి చేజారిన బీజేపీ సీటు... ఈ లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 18 సార్లు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒకే ఒక్కసారి ఈ సీటుని గెలుచుకోగలిగింది. 2014లో తొలిసారి బీజేపీ అభ్యర్థి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈస్థానాన్ని కైవసం చేసుకున్నా, 2018 ఉప ఎన్నికల్లో ఎస్పీ బీఎస్పీ కలిసికట్టుగా పోటీ చేసి బీజేపీని ఓడించాయి. 2014లో బీజేపీ నుంచి గెలిచిన కేశవ్ ప్రసాద్ మౌర్య యూపీ ఉపముఖ్యమంత్రి అయ్యాక ఈ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ కి 60 వేల ఓట్ల మెజారిటీ రావడంతో బీజేపీ కంగుతినాల్సి వచ్చింది. 2019 ఎవరికి కలిసొస్తుంది? 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున కేసరి దేవి పటేల్ పోటీ చేస్తోంటే, ఎస్పీ పంధారీ యాదవ్ని బరిలోకి దింపింది. కాంగ్రెస్ తరఫున పంకజ్ నిరంజన్ పోటీ చేస్తున్నారు. అయితే ఈ సారి కూడా జాతీయవాదం, తీవ్రవాద వ్యతిరేక దాడులు బీజేపీ గెలుపునకు దోహదం చేస్తాయా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. కులం ప్రధానమే... 2018 ఉప ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో సైతం ఎస్పీ, బీఎస్పీ వ్యూహాత్మక కుల సమీకరణలు ఈసారి కూడా పనిచేస్తాయా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఫూల్పూర్ నియోజకవర్గంలోని రాంపూర్ గ్రామస్తుడు రామ్సింగ్ పటేల్ ‘‘ఇటీవల తీవ్రవాద స్థావరాలపై దాడులు తప్ప, నాకు ప్రధాని నరేంద్రమోదీ సాధించిన విజయాల గురించి ఏమీ తెలియదు. కానీ నేను బీజేపీకే ఓటు వేస్తున్నాను. ఎందుకంటే ఆ పార్టీ మా కులం నాయకుడిని పోటీకి దింపింది’’ అని వ్యాఖ్యానించడాన్ని బట్టి ఈ స్థానంలో కులం ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ అభ్యర్థి పంకజ్ పటేల్ మామ కూర్మి నాయకుడు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. అలాగే పంకజ్ పటేల్ అత్తయ్య కృష్ణ పటేల్ గోండా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఫూల్పూర్లో ఏ పార్టీ ముస్లింని బరిలోకి దింపకపోవడంతో ముస్లింల ఓట్లన్నీ ఎస్పీ అభ్యర్థికేనని కూడా స్థానిక ముస్లిం నేతలు స్పష్టం చేస్తున్నారు. ఫూల్పూర్లో 3 లక్షల మంది కుర్మీలు, ఒక లక్ష మంది జాటవ్ దళితులు, 1.5 లక్షల మంది జాటవేతరులు, దాదాపు 2 లక్షల మంది యాదవులు, 2 లక్షల మంది బ్రాహ్మణులు, మరో 2 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. -
క్లీన్బౌల్డ్ అయ్యాక అంపైర్పై నిందలు
బస్తి, ప్రతాప్గఢ్ (యూపీ)/వాల్మీకినగర్ (బిహార్): క్లీన్బౌల్డ్ అయ్యాక అంపైర్ను నిందించే బ్యాట్స్మన్లా, పరీక్షల్లో ఫెయిలై కుంటిసాకులు చెప్పే విద్యార్థిలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్లు విలువలకు తిలోదకాలిస్తున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్లోని బస్తి, ప్రతాప్గఢ్, బిహార్లోని వాల్మీకినగర్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎనిమిది సీట్లకు పోటీ చేస్తున్నవారు కూడా ప్రధానిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమవుతున్నారని మోదీ వ్యంగ్యంగా అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా సమష్టి పోరాటం చేస్తున్న మహాకల్తీ కూటమి బంధం ఎంతోకాలం సాగదని మోదీ ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. మహా కూటమి మహా అవినీతిని పెంచి పోషిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ‘ఓటు కాట్వా’(ఓట్ల కోత) స్థాయికి దిగజారిపోయిందని, త్వరలోనే అది తన పతనాన్ని చూస్తుందని అన్నారు. ఒకపక్క కాంగ్రెస్తో ఎస్పీ మెతగ్గా వ్యవహరిస్తుంటే మరోపక్క బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్పై దాడి చేయడం గమనార్హమన్నారు. రఫేల్ విషయంలో తనను అపఖ్యాతి పాలుచేసేందుకు రాహుల్ ప్రయత్నించారంటూ.. ఆయన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్గాంధీపై మోదీ విమర్శలు చేశారు. రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ఇమేజ్ చివరకు అవినీతి నంబర్ వన్ గా ముగిసిందని ఆరోపించారు. ఎస్పీ, బీఎస్పీల అవినీతిపై మోదీ ధ్వజమెత్తారు. ఎన్ఆర్హెచ్ కుంభకోణం, ఇసుక అక్రమ తవ్వకాలు, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేసిన తర్వాత కొన్ని వస్తువులు మాయం కావడం వంటివి ఆయన ప్రస్తావించారు. మహా కల్తీ కూటమితో పోల్చుకుంటే ఎన్డీయే పనితీరు విభిన్నమైనదని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు పాక్ చర్యలపై గగ్గోలు పెడుతుండేవని, శత్రు దేశం కంటే తమ ఓటు బ్యాంకే ప్రధానంగా భావించేవని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన తెలుగు రాష్ట్రాల్లో ఘర్షణ వాతావరణం కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య వైరుధ్యాన్ని మోదీ ప్రస్తావిస్తూ.. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పడిన కొత్త రాష్ట్రాలు ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లు తమ మాతృ రాష్ట్రాలతో ఎంతోబాగా మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిందంటూ.. ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొందని ఆయన చెప్పారు. -
శ్రీకాకుళం మాజీ ఎస్పీకి మళ్లీ పోస్టింగ్!
అమరావతి: శ్రీకాకుళం మాజీ ఎస్పీ అడపా వెంకటరత్నంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ పోస్టింగ్ ఇచ్చింది. డెప్యూటేషన్పై ఏపీ ట్రాన్స్కోకు వెంకటరత్నంను బదిలీ చేసింది. ఏపీ ట్రాన్స్కో చీఫ్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా వెంకటరత్నంను నియమించింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెంకటరత్నంపై తీవ్రంగా రావడంతో ఎన్నికల కమిషన్ ఆయనను ఆకస్మికంగా విధుల నుంచి తప్పించిన సంగతి తెల్సిందే. అప్పటి నుంచి వెంకటరత్నం ఖాళీగా ఉన్నారు. తనను అన్యాయంగా బదిలీ చేశారంటూ గతంలో ఈసీకి వెంకటరత్నం బహిరంగ లేఖ రాశారు. ఎన్నికలు ముగియడంతో తిరిగి వెంకటరత్నంకు పోస్టింగ్ ఇచ్చారు. -
పొరపాటున ఓటేసి.. వేలు కోసుకున్నాడు
అభిమానానికి అవధుల్లేనట్టే, వ్యతిరేకతలోనూ విపరీతం ఉంటుందని ఉత్తరప్రదేశ్లోని బులందర్షా పార్లమెంటు స్థానంలో జరిగిన ఈ ఘటన మరోమారు రుజువు చేసింది. ఉత్తరప్రదేశ్లోని బులందర్షా పార్లమెంటు స్థానంలో బహుజన్ సమాజ్ పార్టీ అధినాయకురాలు మాయావతి మద్దతుదారుడు పవన్ కుమార్ తాను ఓటు వేయాలనుకున్న బీఎస్పీ అభ్యర్థి యోగేష్ వర్మ గుర్తు ఏనుగుపై కాకుండా, పొరపాటున బీజేపీ కమలం గుర్తున్న మీటపై నొక్కాడు. అది కాస్తా బీజేపీ íసిట్టింగ్ అభ్యర్థి భోలాసింగ్కి పడింది. దీంతో తను చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా భావించాడేమో పవన్ కుమార్ తను ఓటు వేసిన వేలిని బ్లేడుతో కసిగా కోసుకున్నాడు. పైగా ఈ వ్యవహారాన్నంతటినీ తాపీగా వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. కట్టుకట్టిన చూపుడువేలితో కుర్చీలో కూర్చుని నింపాదిగా విషయాన్ని వివరిస్తోన్న సదరు ఓటరు పవన్కుమార్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈవీఎం మెషీన్లో బీజేపీ మీట నొక్కాలని ఎవరైనా బలవంతం చేశారా అన్న ప్రశ్నకు ఆయన కాదని సమాధానం చెప్పాడు. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, అజిత్ సింగ్ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బులందర్షా నియోజకవర్గం నుంచి యోగేష్ వర్మ పోటీచేస్తున్నారు. సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో భాగంగా బులందర్ షా సహా అలీఘర్, హాత్రస్, ఫతేపూర్ సిక్రీ, నగీనా, అమ్రోహ, మథుర, ఆగ్రాల్లో గురువారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. -
‘ఫతేపూర్’ బస్తీలో రాజ్బబ్బర్
ఉత్తర్ప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ లోక్దళ్ (ఆరెల్డీ)తో కూడిన మహాగఠ్ బంధన్లో స్థానం దక్కని కాంగ్రెస్కు ఉత్తర్ప్రదేశ్లో గెలుపు అవకాశాలున్న అతి కొద్ది సీట్లలో ఫతేపూర్ సిక్రీ ఒకటి. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ బాలీవుడ్ నటుడైన రాజ్బబ్బర్ రెండోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. 2009లో మొదటిసారి ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసి బీఎస్పీ అభ్యర్థి సీమా ఉపాధ్యాయ చేతిలో దాదాపు పది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే ఏడాది జరిగిన ఫిరోజాబాద్ ఉప ఎన్నికలో ఎస్పీ అభ్యర్థి, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ను బబ్బర్ ఓడించారు. 2014 ఎన్నికల్లో ఆయన ఘజియాబాద్లో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి ప్రస్తుత కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్ చేతిలో ఓడిపోయారు. అంతకుముందు ఆయన ఎస్పీలో ఉండగా ఆ పార్టీ తరఫున ఆగ్రా నుంచి 1999, 2004లో లోక్సభకు ఎన్నికయ్యారు. పునర్విభజనలో ఆగ్రా స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఆగ్రా జిల్లాలో సగ భాగం ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లున్న ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గం 2009లో ఏర్పాటయింది. 2014లో బీజేపీ అభ్యర్థి చౌధరీ బాబూలాల్ తన సమీప బీఎస్పీ అభ్యర్థి సీమా ఉపాధ్యాయను లక్షా 73 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. అప్పుడు కాంగ్రెస్–ఆర్ఎల్డీ కూటమి అభ్యర్థిగా పోటీచేసిన అమర్సింగ్కు డిపాజిట్ కూడా దక్కలేదు. ఈసారి బాబూలాల్కు బీజేపీ టికెట్ దక్కలేదు. రాజ్కుమార్ చాహర్ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. మహాగఠ్ బంధన్ తరఫున శ్రీభగవాన్ శర్మ అలియాస్ గుడ్డూ పండిత్ (బీఎస్పీ) పోటీ చేస్తున్నారు. ఆగ్రా నగరంలో పుట్టిన బబ్బర్ బలమైన అభ్యర్థిగా ఉన్నారు. మొత్తానికి ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. ఘజియాబాద్ వద్దన్న బబ్బర్.. రాజ్ బబ్బర్ను మొదట ఆయన కిందటిసారి ఓడిన ఘజియాబాద్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. బబ్బర్ మద్దతుదారులతో పాటు ఆయన కూడా అక్కడి నుంచి పోటీకి ఇష్టపడకపోవడంతో చివరికి ఫతేపూర్ సిక్రీ టికెట్ కేటాయించారు. ఎన్నికల్లో కులం కూడా ప్రధాన పాత్ర పోషించే ఈ నియోజకవర్గంలో రాజ్బబ్బర్ కులానికి (విశ్వకర్మ) చెందిన జనం బాగా తక్కువ. తనను చూసి అభిమానంతో చేతులు ఊపుతున్న ప్రజలంతా తన కులస్తులేనని, బంధువులని బబ్బర్ ఓ సందర్భంలో చమత్కరించారు. బాలీవుడ్ నటునిగా జనంతో ఉన్న పాత సంబంధం, స్థానికునిగా ఉన్న గుర్తింపు తనకు చాలని ఆయన భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఠాకూర్లు, బ్రాహ్మణుల తర్వాత జాట్ల జనాభా ఎక్కువ. బీజేపీ అభ్యర్థి చాహర్ జాట్. బీఎస్పీ నేత గుడ్డూ పండిత్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. జనాభా రీత్యా ఠాకూర్ల ఆధిపత్యం ఉన్నా ఈ వర్గం అభ్యర్థులెవరూ బరిలో లేరు. బీఎస్పీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సూరజ్పాల్ సింగ్, ధరమ్పాల్ సింగ్ (ఇద్దరూ ఠాకూర్లే) ఇటీవల కాంగ్రెస్లో చేరడంతో రాజ్ బబ్బర్ ప్రచారం ఊపందుకుంది. మోదీ ఇమేజ్పైనే బీజేపీ అభ్యర్థి భారం బీజేపీకి లోక్సభ అభ్యర్థిని చూసి తాము ఓట్లేయడం లేదనీ, ప్రధాని నరేంద్రమోదీ ప్రగతిశీల విధానాల కారణంగానే కాషాయ పక్షాన్ని గెలిపిస్తున్నామనే అభిప్రాయం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ అభ్యర్థి చాహర్ గతంలో సిక్రీ నుంచి అసెంబ్లీకి మూడుసార్లు పోటీచేసి ఓడిపోయారు. బబ్బర్ అనుచరునిగా పనిచేసిన నేపథ్యం కూడా చాహర్కు ఉంది. అయినా, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి నరేంద్రమోదీ ముఖం చూసి ఓటేసే వారి సంఖ్య యూపీలో గణనీయంగా ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. బీఎస్పీకి దూరమైన బ్రాహ్మణ ఓటర్లు? బ్రాహ్మణ వర్గంలో మంచి పలుకుబడి ఉన్న సీమా ఉపాధ్యాయకు బీఎస్పీ టికెట్ ఇవ్వలేదు. ఆమె పార్టీ టికెట్పై 2009 ఎన్నికల్లో గెలిచారు. అయితే ఈసారి ఆమె వర్గానికే చెందిన గుడ్డూ పండిత్కు బీఎస్పీ టికెట్ లభించింది. స్థానికేతురుడైన బులంద్శహర్ ఎమ్మెల్యే పండిత్కు మద్దతు ఇవ్వడానికి బ్రాహ్మణులు ఆసక్తి చూపడం లేదు. మాయావతి కులమైన జాటవులు మాత్రమే బీఎస్పీ అభ్యర్థి తరఫున ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనకు మంచి పేరు లేకపోవడం బబ్బర్కు అనుకూలాంశంగా మారింది. ఎస్పీకి చెందిన కొందరు బ్రాహ్మణ నేతలు బబ్బర్ తరఫున ప్రచారం చేయడంతో పోటీ ప్రధానంగా బీజేపీ అభ్యర్థి చాహర్, బబ్బర్ మధ్యనే ఉంటుందని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. -
హేమమాలిని, రాజ్బబ్బర్ భవితవ్యం తేలేది రేపే
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో ఎన్నికలు ఊపందకున్నాయి. రెండో దశలో ఎన్నికలు జరిగే 8 లోక్సభ స్థానాలకు 85 మంది వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీల నుంచి హేమాహేమీలు పోటీపడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజ్బబ్బర్, నిన్నటితరం నటి, బాలీవుడ్ డ్రీమ్గర్ల్గా పేరుగాంచిన హేమామాలిని మరోసారి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. నాగిన(ఎస్సీ), అమ్రోహ, బులంద్షార్(ఎస్సీ), అలీగడ్, హత్రాస్(ఎస్సీ), ఫతేఫూర్ సిక్రీ, మధుర, ఆగ్రా(ఎస్సీ) లోక్సభ స్థానాలకు రెండో దశలో రేపు పోలింగ్ జరగనుంది. ఫతేపూర్ సిక్రీలో రాజ్బబ్బర్(కాంగ్రెస్), రాజ్కుమార్ చాహర్(బీజేపీ), శ్రీభగవాన్ శర్మ(బీఎస్పీ) మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. టెంపుల్టౌన్ మధుర నియోజకవర్గంలో బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఆర్ఎల్డీ నుంచి కున్వర్ నరేంద్ర సింగ్, కాంగ్రెస్ నుంచి మహేశ్ పాఠక్ బరిలో ఉన్నారు. అమ్రోహ స్థానం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ కన్వర్ సింగ్ తన్వార్, బీఎస్పీ నుంచి నిలబడిన కున్వర్ డానిష్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. కున్వర్ దానిష్ ఇటీవలే జనతాదళ్(సెక్యులర్) పార్టీ జనరల సెక్రటరీ పదవిని వదిలేసి బీఎస్పీలో చేరారు. ఇప్పుడు జరుగుతున్న 8 లోక్సభ స్థానాలన్నీ 2014లో బీజేపీ గెలిచినవే. ప్రస్తుతం ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి నుంచి బీజేపీ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. రెండో దశలో జరుగుతున్న 8 స్థానాలకు గానూ 6 స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాగిన, అమ్రోహ, బులంద్షార్, అలీగడ్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తున్నది. ఎస్పీ, ఆర్ఎల్డీ పార్టీలు వరసగా హత్రాస్, మధుర స్ధానాల్లో అభ్యర్థులను నిలిపింది. రెండో దశలో జరుగుతున్న ఎన్నికలకు గానూ 8,751 పోలింగ్ సెంటర్లలో 16,162 పోలింగ్బూత్లను ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. -
కులగూరగంప
కిందటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన 282 స్థానాల్లో నాలుగో వంతు సీట్లు (71) అందించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 2014 ఎన్నికలకు ఏడు నెలల ముందు పశ్చిమ యూపీలోని ముజఫర్నగర్ జిల్లాలో చోటుచేసుకున్న మత ఘర్షణలు బీజేపీకి లబ్ధి చేకూర్చాయి. ముస్లింలపై ద్వేషంతో చెప్పుకోదగ్గ సంఖ్యలో హిందువులు కులాలకు అతీతంగా కాషాయ పక్షానికి ఓటేశారు. దీనికి తోడు రాష్ట్రంలో బలమైన పునాదులున్న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్–ఆరెల్డీ కూటమి విడివిడిగా పోటీ చేశాయి. ఇప్పుడు రెండు మతాల మధ్య అలాంటి ఉద్రిక్తతలు లేవు. మతపరమైన చీలికలు తేవడానికి పాలకపక్షం యత్నిస్తున్నా జనం బాహాటంగా స్పందించడం లేదు. బీఎస్పీ, ఎస్పీ, ఆరెల్డీ కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేస్తున్నాయి. దళితులు, యాదవులు, ముస్లిం వర్గాల మద్దతు ఉన్న ఈ కూటమి బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి. మరోపక్క కిందటి పార్లమెంటు ఎన్నికల్లో 7.5 శాతం ఓట్లతో రెండు సీట్లు గెల్చుకున్న కాంగ్రెస్కు పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ చెల్లెలు ప్రియాంక రంగ ప్రవేశం కొత్త ఉత్సాహం ఇస్తోంది. పశ్చిమ యూపీలోని 8 సీట్లకు మొన్న జరిగిన తొలి దశ పోలింగ్పై ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పూర్తి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 18న జరగబోయే యూపీలోని మరో ఎనిమిది స్థానాలు కూడా పశ్చిమ యూపీలోనివే. ఈ స్థానాల్లో కూడా మహాగఠ్ బంధన్ విజయం సాధిస్తుందనీ, మొదటి దశలో బీజేపీపై కూటమి ఆధిక్యం సాధించిందని ఆయన ప్రకటించారు. ఇందులో నిజానిజాలెలా ఉన్నా మూడు పార్టీల కూటమి ఈసారి బీజేపీకి గట్టి పోటీయే ఇస్తుందని రాజకీయ పరిశీలకులు నమ్ముతున్నారు. 2014లో ఒంటరిగా పోటీ చేసిన బీఎస్పీ, ఎస్పీ వరుసగా 22.2, 19.6 శాతం ఓట్లు సాధించాయి. ఎస్పీకి ఐదు, కాంగ్రెస్కు రెండు దక్కగా బీఎస్పీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. అప్నాదళ్తో కలిసి పోటీచేసిన బీజేపీ 42.3 శాతం ఓట్లతో మొత్తం 80 సీట్లలో 71 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఫోకస్ 2022? ప్రియాంకను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (తూర్పు యూపీ ఇన్చార్జ్)గా నియమించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి మళ్లీ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసమే తాము కృషి చేస్తున్నామని రాహుల్, ప్రియాంక అనేక సందర్భాల్లో ప్రకటించారు. అంటే ఈ ఎన్నికల్లో తమతో పొత్తుకు ఎస్పీ–బీఎస్పీ కూటమి నిరాకరించడంతో తన ఉనికిని కాపాడుకునే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైందని భావించాలి. అయితే, కాంగ్రెస్ ఎన్ని నియోజకవర్గాల్లో, ఎంత మేరకు ఓట్లు సాధిస్తుందనే అంశమే బీజేపీ నిలబెట్టుకునే సీట్ల సంఖ్యను నిర్ణయిస్తుంది. బ్రాహ్మణులు, వైశ్యులు, రాజపుత్రులు, కాయస్త వంటి అగ్రకులాల ఓట్లను స్వల్ప సంఖ్యలో కాంగ్రెస్ చీల్చుకునే అవకాశాలున్నాయి. ఈ వర్గాలకు చెందిన బలమైన అభ్యర్థులను నిలిపిన చోట్ల అగ్రవర్ణాల ఓట్లు బీజేపీకి పూర్తిగా పడవని భావిస్తున్నారు. అలాగే, పశ్చిమ యూపీలో కూడా కాంగ్రెస్ తరఫున నిలబడే జనాదరణ ఉన్న ముస్లిం నేతలు కూడా మైనారిటీల ఓట్లను గణనీయ సంఖ్యలో సాధిస్తారని అంచనా. ప్రియాంక ఇన్చార్జ్గా ఉన్న తూర్పు యూపీలోని అత్యధిక సీట్లకు చివరి మూడు దశల్లో (మే 6, 13, 19) పోలింగ్ జరుగుతుంది. ఈ సీట్ల ఫలితాలు ప్రియాంక ప్రచారం ప్రభావం ఎంతో తేల్చేస్తాయి. రెండో దశ పోలింగ్కు రెడీ పశ్చిమ యూపీలోని ఎనిమిది సీట్లలో ఈ నెల 18న పోలింగ్ జరగనుంది. వాటిలో నగీనా, బులంద్శహర్, హాథ్రస్, ఆగ్రా ఎస్సీ రిజర్వుడు సీట్లు. అమ్రోహా, అలీగఢ్, మథుర, ఫతేపూర్ సిక్రీ జనరల్ స్థానాలు. ఈ నియోజకవర్గాల్లో హిందువుల జనాభా 75 నుంచి 88 శాతం వరకు ఉంది. ముస్లింలు 12 నుంచి 25 శాతం వరకు ఉన్నారు. ఇక్కడ బీసీ, ఎస్సీ కులాల జనాభా ఎక్కువ. మొత్తం మీద 80 శాతం జనాభా గ్రామాల్లోనే నివసిస్తోంది. బీసీల్లో విశ్వకర్మ, కుమ్మరి వంటి బాగా వెనుకబడిన కులాల (ఎంబీసీ) మొగ్గు ఈ స్థానాల్లో బీజేపీ వైపే ఉంది. దళితుల్లో చర్మకారులైన జాటవుల జనాభా ఎక్కువ. వారితోపాటు ఎస్సీల జాబితాలో ఉన్న ధోబీ, భంగీ, కోరీలు, కంజర్లు బీఎస్పీకి గట్టి మద్దతుదారులు. అంచనాకు అందదు.. 2014లో ఎస్పీ, బీఎస్పీకి పడిన ఓట్లను కలిపితే 41 లోక్సభ స్థానాల్లో బీజేపీపై ఆధిక్యం కనిపిస్తోంది. ఈ రెండు పార్టీలకూ ఆరెల్డీ ఓట్లు తోడైతే మరికొన్ని స్థానాల్లో మహాగఠ్ బంధన్ విజయం సాధించాలి. పైన చెప్పినట్టు గత పార్లమెంటు ఎన్నికల్లో ఈ పార్టీలకు పోలైన ఓట్లను బట్టి కచ్చితంగా ఎవరు ఎన్ని సీట్లు గెలిచేదీ చెప్పడం సాహసమే అవుతుంది. ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమితో పాటు కాంగ్రెస్ కూడా యూపీ జనాభాలో 19 శాతం ఉన్న ముస్లింల ఓట్ల కోసం పోటీ పడుతున్నాయి. ముస్లింల మొగ్గు మహాగఠ్ బంధన్ వైపే ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థులు బీజేపీని ఓడించేంత బలంగా ఉన్న స్థానాల్లో హస్తం గుర్తుకే వారు ఓటేస్తారని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ ప్రధాని కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్సింగ్ నాయకత్వంలోని ఆరెల్డీ బలం జాట్లతోపాటు ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న పశ్చిమ యూపీకే పరిమితం. ఈ పార్టీతో పొత్తు ఎస్పీ, బీఎస్పీకి లాభిస్తుంది. ముజఫర్నగర్ ఘర్షణల నాటి విద్వేషాలు జాట్లు, ముస్లింల మధ్య లేకపోవడం కూడా మహాగఠ్ బంధన్ ఇక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. అయితే, పుల్వామా ఉగ్ర దాడి తర్వాత పాక్లోని బాలాకోట్పై భారత వాయుసేన మెరుపు దాడుల ఫలితంగా హిందువుల ఓట్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో బీజేపీకి పడతాయని అంచనా. జాట్లు, గుజ్జర్లదే ఆధిపత్యం రెండో దశ పోలింగ్ జరిగే ఈ ప్రాంతంలో వ్యావసాయిక కులాలైన జాట్లు, గుజ్జర్లదే ఆధిపత్యం. ఈ రెండు కులాల ఓట్లు బీజేపీ, మహాగఠ్ బంధన్ మధ్య చీలిపోతాయని భావిస్తున్నారు. జాట్లు, మాయావతి కులమైన జాటవుల మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల బీఎస్పీ ఓట్లను ఎస్పీ, ఆరెల్డీ అభ్యర్థులకు బదిలీ అయ్యేలా చూడటం మాయావతికి కష్టమైన పనిగా కనిపిస్తోంది. ఎస్సీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు వివిధ ఎంబీసీ, దళిత కులాల ఓట్లు ఎక్కువ పడతాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ యూపీలోని ఈ ప్రాంతం లో ఇప్పటికే ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్గాంధీ, బీఎస్పీ నాయకురాలు మాయావతి భారీ బహిరంగసభల్లో పాల్గొని ప్రచారం చేశారు. ► మథురలో బీజేపీ తరఫున సినీ నటి, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ హేమమాలిని పోటీచేస్తుండగా, ఆరెల్డీ అభ్యర్థి నరేంద్రసింగ్ రంగంలో ఉన్నారు. ► ఫతేపూర్ సిక్రీలో యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ నటుడు రాజ్ బబ్బర్ బీజేపీ అభ్యర్థి రాజ్ కుమార్ చాహర్తో తలపడుతున్నారు. ఇక్కడ బీఎస్పీ తరఫున రాజ్వీర్సింగ్ పోటీ చేస్తున్నారు. ► అమ్రోహాలో బీజేపీ సిటింగ్ సభ్యుడు కన్వర్సింగ్ తన్వర్, కాంగ్రెస్ నేత సచిన్ చౌధరీ రంగంలో ఉన్నారు. ఇటీవలి వరకూ జేడీఎస్లో ఉన్న కన్వర్ దానిష్ అలీ బీఎస్పీ అభ్యర్థిగా పోటీపడుతున్నారు. ► అలీగఢ్లో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సతీష్ కుమార్ గౌతమ్ మళ్లీ పోటీలో నిలవగా, మహాగఠ్ బంధన్ నుంచి అజిత్ బలియాన్ సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ బ్రిజేష్సింగ్ తలపడుతున్నారు. తన్వర్, రాజ్ బబ్బర్, సచిన్, కున్వర్, రాజ్వీర్, హేమమాలిని, రాజ్కుమార్ -
బ్యాంక్ బ్యాలెన్స్లో బీఎస్పీ టాప్
న్యూఢిల్లీ: 2014 లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయిన బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) బ్యాంకు బ్యాలెన్స్ విషయంలో మాత్రం అగ్రస్థానంలో ఉంది. ఆ పార్టీ ఖాతాల్లో ప్రస్తుతం రూ.669 కోట్లున్నాయి. బీఎస్పీ తర్వాతి స్థానాల్లో వరుసగా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, టీడీపీ ఉండగా ఐదో స్థానంలో అధికార బీజేపీ ఉండటం గమనార్హం. ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి అందించిన నివేదికల ద్వారా ఈ విషయం వెల్లడయింది. ఫిబ్రవరిలో ఎన్నికల సంఘానికి అందించిన నివేదిక ప్రకారం.. బహుజన్ సమాజ్ పార్టీకి దేశ రాజధానిలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని పార్టీకి చెందిన 8 ఖాతాల్లో రూ.669 కోట్ల నిధులున్నాయి. దీంతోపాటు రూ.95.54 లక్షలు నగదు రూపంలో కూడా ఉన్నట్లు తెలిపింది. ఇదంతా విరాళాల ద్వారానే సేకరించినట్లు బీఎస్పీ పేర్కొందని అధికారులు వివరించారు. రూ.471 కోట్ల నిల్వలతో సమాజ్వాదీ పార్టీ తర్వాతి స్థానంలో నిలిచింది. అయితే, ఇటీవల మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీల ఎన్నికల తర్వాత ఈ మొత్తం రూ.460 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. ఇదే సమయంలో తమకు రూ.24 కోట్ల మేర విరాళాలు అందడంతో నిల్వలు రూ.669 కోట్లకు చేరినట్లు బీఎస్పీ వెల్లడించింది. బ్యాంకు బ్యాలెన్స్ విషయంలో రూ.196 కోట్లతో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. అయితే, ఈ లెక్కలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక గత ఏడాది నవంబర్లో ఈసీకి సమర్పించిన వివరాల్లో పేర్కొన్నవి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత బ్యాంకు బ్యాలెన్స్ వివరాలను కాంగ్రెస్ ఈసీకి అందజేయలేదు. అధికార బీజేపీ విషయానికొస్తే.. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టినట్లు వెల్లడించిన ఈ పార్టీ రూ.82 కోట్లు మాత్రమే నిల్వ ఉన్నట్లు వెల్లడించింది. 2017–18 సంవత్సరాల్లో ఎలక్టోరల్ బాండ్లు, విరాళాల ద్వారా అందిన రూ.1,027 కోట్లలో రూ.758 కోట్లను ఎన్నికల్లో వెచ్చించినట్లు ఈసీకి బీజేపీ తెలిపింది. ఈ విషయంలో రూ.107 కోట్లున్న తెలుగుదేశం పార్టీ కంటే బీజేపీ వెనుకబడి ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఆయా పార్టీల నిధుల్లో 87 శాతం వరకు స్వచ్ఛంద విరాళాల ద్వారా అందినవేనని పేర్కొనగా బీజేపీ మాత్రమే 2017–18 కాలంలో రూ.210 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లభించినట్లు తెలిపింది. కాగా, ఆయా పార్టీలు ఆదాయ పన్ను రిటర్నుల్లో చూపిన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) విశ్లేషించింది. 2016–17, 2017–18 సంవత్సరాల్లో బీజేపీ అత్యధికంగా రూ.1,034 కోట్లు, రూ.1,027 కోట్లు విరాళాల రూపంలో అందుకున్నట్లు వెల్లడైంది. ఇదే సమయంలో ఆ పార్టీ ఆదాయం రూ.174 కోట్ల నుంచి రూ.52 కోట్లకు పడిపోయింది. అదేవిధంగా, 2016–17లో కాంగ్రెస్ ఆదాయం రూ.225 కోట్లుగా ఉంది. తర్వాతి ఆర్థిక సంవత్సరంలో ఆ పార్టీ ఈసీకి ఆదాయ వివరాలను అందజేయలేదు. సీపీఎం ఆదాయం గత కొద్ది సంవత్సరాలుగా రూ.100 కోట్లుగా ఉంది. -
ప్రకాశం ఎస్పీ బదిలీ
-
ప్రకాశం ఎస్పీ బదిలీ
ప్రకాశం: జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్పై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం చర్యలు తీసుకుంది. అధికార టీడీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించడంతో ఈసీ ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో సిద్ధార్ద్ కౌషిల్ను ఎస్పీగా నియమించింది. ఖాకీ బట్టలు తీసేస్తే తానూ రాజకీయ నేతనేనని గతంలో కోయ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న తీవ్ర ఆరోపణలు రావడంతో తాడేపల్లి, మంగళగిరి సీఐలపై కూడా చర్యలు తీసుకుంది. వారిని బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తాడేపల్లి సీఐ వై.శ్రీనివాస్ స్థానంలో సురేష్ కుమార్ను నియమించింది. -
లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఆసిఫాబాద్: లోక్సభ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఎస్పీ మల్లారెడ్డి, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 11న ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దానితో ఓటు వేసేందుకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ లోక్సభ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో 283, ఆసిఫాబాద్లో 300 కేంద్రాలు, మొత్తం 583 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. మహిళల కోసం ప్రత్యేకంగా రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తుది ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 4,02,663 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందులో వికలాంగులు 6,388 మంది ఉన్నారన్నారు. ఇప్పటి వరకు 3,87,578 మందికి ఓటరు స్లిప్లు పంపిణీ చేశామని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 1863 మంది సిబ్బందిని నియమించగా, 1276 మందికి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. ఈ ఎన్నికల్లో వారు పోస్టల్ బ్యాలెట్ అవసరం లేకుండా నేరుగా విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామన్నారు. జిల్లాలోని 96 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామని, వీటిలో ఆసిఫాబాద్లో 37, సిర్పూర్లో 59 ఉన్నాయన్నారు. ఆసిఫాబాద్లో 28, సిర్పూర్లో 65 మంది వీడియోగ్రాఫర్లు వీడియో చిత్రీకరణ చేస్తారని కలెక్టర్ వెల్లడించారు. వీరితో పాటు 342 మంది వాలంటీర్లు సైతం ట్యాబ్లతో వీడియో రికార్డింగ్ చేయనున్నట్లు తెలిపారు. వికలాంగులకు సహకరించేందుకు 479 మంది ఆశా, అంగన్వాడీ కార్యర్తలు సాయం అందిస్తారని, వీరిలో ఆసిఫాబాద్లో 262, సిర్పూర్లో 270 మంది ఉన్నారన్నారు. వికలాంగులను తరలించేందుకు 464 వీల్చైర్లు అందుబాటులో ఉంచామని, వీటిలో ఆసిఫాబాద్లో 252, సిర్పూర్లో 212 ఉన్నాయన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాల్లో తాత్కాలికంగా నీడ వసతి, తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే వారికి అవసరమైన ప్రతి సామగ్రిని పంపిణీ చేస్తామన్నారు. ఎన్నికల నిబంధనలు అమలు చేసేందుకు ఇప్పటికే జిల్లాలో ఎంసీఎంసీ కమిటీ పని చేస్తుందన్నారు. ఎస్పీ మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 583 పోలింగ్ కేంద్రాల పరిధిలో 74 సమస్యాత్మక, వామపక్ష తీవ్రవాదమున్న 60 పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక అదనపు బలగాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే చెక్పోçస్టుల వద్ద ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు, గతంలో విధులకు ఆటంకం కలిగించిన వారిని బైండోవర్లు, లైసెన్సు కలిగి ఉన్న ఆయుధాలు డిపాజిట్ చేయించామన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సివిల్, ఆర్మ్డ్ ఫోర్స్, హర్యాణా పోలీసులు, ఫారెస్టు, ఆర్టీసీ, లీగల్ మెట్రాలజీ శాఖల నుంచి సిబ్బందిని వినియోగించుకుంటున్నట్లు వెల్లడించారు. మొత్తం 1218 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీస్శాఖ అన్నిచర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ సందర్భంగా ఈవీఎం, వీవీప్యాట్ల ద్వారా ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించే పోస్టర్ను కలెక్టర్, ఎస్పీ విడుదల చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల అధికారి విజయలక్ష్మి, డీపీఆర్వో తిరుమల పాల్గొన్నారు. -
ఎస్పీ-బీఎస్పీ కూటమిలో బీటలు
లక్నో(ఉత్తర్ ప్రదేశ్): ఎస్పీ-బీఎస్పీ సారధ్యంలో ఏర్పడిన ‘గట్బంధన్’ నుంచి నిశాద్ పార్టీ వైదొలగింది. మహారాజ్ గంజ్ స్థానం నుంచి తన పార్టీ చిహ్నంపై పోటీచేయడానికి కూటమి నుంచి ఒక ఏకాభిప్రాయం రాకపోవడంతో పాటు కూటమిలో తమను పక్కకు పెడుతున్నట్లుగా నిశాద్(నిర్బల్ ఇండియన్ షోషిట్ హమారా ఆమ్ దళ్) పార్టీ అధ్యక్షులు సంజయ్ నిశాద్ భావించినట్లుగా తెలిసింది. ఈ పరిణామాలతో మహారాజ్గంజ్ స్థానం నుంచి పార్టీ సొంత గుర్తుపై పోటీ చేయాలని సంజయ్ నిశాద్ భావిస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. నిశాద్ పార్టీ అధ్యక్షులు సంజయ్ నిశాద్, ఆయన కుమారుడు ప్రవీణ్ నిశాద్(ప్రస్తుతం గోరఖ్పూర్ ఎంపీ సమాజ్వాదీ పార్టీ నుంచి) శుక్రవారం సాయంత్రం ఉత్తర్ప్రదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ను కలిశారు. ఈ పరిణామాలతో నిశాద్ పార్టీ బీజేపీ కూటమిలో చేరుతున్నట్లు తెలుస్తోంది. మూడు దశాబాద్దాలుగా గోరఖ్పూర్ లోక్సభ స్థానంలో బీజేపీ హవానే సాగింది. వరసగా ఏడుసార్లు బీజేపీ అధ్యర్థులే విజయం సాధించారు. ఐదుసార్లు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యానాథే గెలిచారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక గోరఖ్పూర్ లోక్సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో 2018లో గోరఖ్పూర్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ స్థానంలో ఎస్పీ అభ్యర్థిగా నిశాద్ పార్టీ అధ్యక్షులు సంజయ్ నిశాద్ కుమారుడు ప్రవీణ్ నిశాద్ బరిలోకి దిగారు. నిశాద్ పార్టీ సహకారంతో ఎస్పీ ఈ స్థానం గెలుచుకోగలిగింది. ఈ విజయంలో నిశాద్పార్టీ కీలకపాత్ర పోషించింది. ఈ విజయం తర్వాత ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో బద్దశత్రువులుగా ఉన్న ఎస్పీ,బీఎస్పీ పార్టీలు కూటమిగా ఏర్పడటానికి అవకాశాలు ఏర్పడ్డాయి. కొత్తగా బీజేపీ, నిశాద్ పార్టీ మధ్య ఏర్పడిన మైత్రిపై ఎస్పీ గోరఖ్పూర్ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్ యాదవ్ స్పందించారు. బీజేపీ, నిశాద్పార్టీ కలిసి పోటీ చేసినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలో గోరఖ్పూర్ లోక్సభ స్థానం గెలిచామే కానీ నిశాద్ పార్టీ నాయకత్వంలో కాదని వ్యాఖ్యానించారు. -
నాలుగు స్తంభాలాట
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ–బీఎస్పీ) కూటమి అత్యంత ప్రభావశీలిగా మారనుంది. సుమారు 24 ఏళ్ల క్రితం బీఎస్పీ అధ్యక్షుడిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేసిన సంఘటన తరువాత ఉప్పు నిప్పుగా ఉన్న ఈ రెండు పార్టీలు ఈసారి ఒకే వేదికపైకి వచ్చి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్కు ప్రచారం చేసేందుకు సిద్ధం కావడం ఇరు పార్టీల మధ్య సమన్వయానికి నిదర్శనం. గత ఇరవై ఏళ్లలో మాయావతి ఏనాడూ ములాయం గురించి ఒక్క మంచి మాట కూడా మాట్లాడకపోవడాన్నిఇక్కడ గుర్తు చేయాలి. ఎవరికివారే.. ఎన్నికలకు ఇంకో రెండు వారాలు మాత్రమే సమయం ఉంది. అన్ని పార్టీలూ ప్రచారం జోరు పెంచే పనిలో ఉన్నాయి. చర్చలు ఎప్పుడో అటకెక్కాయి. కులం, వ్యక్తిగత భేషజాలు, ప్రాంతాల ప్రభావాలకే పెద్దపీట వేసిన పార్టీలు.. విపక్షాల ఐక్యతను పక్కనపెట్టి ఎవరికివారే చందంగా మారిపోయాయి. సోనియా, రాహుల్గాంధీపై గౌరవంతో తాము రాయ్బరేలీ, అమేథీలో ఎవరినీ పోటికి పెట్టడం లేదని ఎస్పీ–బీఎస్పీ కూటమి ప్రకటిస్తే.. యూపీ మొత్తమ్మీద ములాయం కుటుంబసభ్యులు పోటీ చేసే ఏడు స్థానాల్లో తామూ ప్రత్యర్థులను పెట్టబోమని కాంగ్రెస్ కుండబద్దలు కొట్టింది. విపక్షాల అనైక్యతకు ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదు. ఈ పరిణామాలన్నీ బీజేపీ ఆశించినవే. చూడాల్సిందల్లా.. విపక్షాల అనైక్యత కాషాయదళానికి ఎంతమేరకు లాభిస్తుందన్నది మాత్రమే! కులం ప్రాతిపదికగా ఏర్పడ్డ ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఢీకొట్టగలవని ఇటీవలి ఉప ఎన్నికలు ఇప్పటికే రుజువు చేశాయి. గోరఖ్పూర్, ఫుల్పూర్, కైరానా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కూటమి తరఫున నిలబడిన అభ్యర్థులు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికల్లో ఈ మూడు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. తాజా ఎన్నికలకు సంబంధించి ఎస్పీ–బీఎస్పీ కూటమిలో అజిత్ సింగ్కు చెందిన రాష్ట్రీయ లోక్దళ్ కూడా ఉండటం బీజేపీని ఢీకొట్టేందుకు మరింత శక్తినివ్వనుంది. పుంజుకుంటున్న కాంగ్రెస్.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ ఎస్పీ –బీఎస్పీల కూటమి.. బీజేపీ మధ్య మాత్రమే కాదు. గత ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ కూడా తన శక్తిని కూడగట్టుకుంటూ పోటీదారుగా నిలవనుంది. పార్టీని బలోపేతం చేసుకునేందుకు రెండేళ్ల క్రితం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు ఇందులో భాగమైనప్పటికీ ఫలితాలు మాత్రం దారుణంగా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ సొంతంగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగా ప్రియాంక గాంధీని తూర్పు ఉత్తరప్రదేశ్కు ఇన్చార్జ్గా నియమించింది. పేరుకు తూర్పు యూపీ ఇన్చార్జ్ కానీ.. ప్రియాంక యూపీ కాంగ్రెస్ కమిటీని నామమాత్రం చేసేశారు. దాదాపు అన్ని అంశాల్లోనూ ఆమె మాటే చెల్లుబాటవుతోంది. వారణాసి, ప్రయాగ్రాజ్ (అలహాబాద్), మిర్జాపూర్, అయోధ్యతో కూడిన తూర్పు యూపీ నుంచే కాంగ్రెస్ ప్రచారాన్ని మొదలుపెట్టడమే కాకుండా.. సమాజంలోని అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక చిన్న పార్టీలతో జట్టు కడుతోంది. వీటన్నింటి ఫలితంగా రాష్ట్రం మొత్తమ్మీద చాలా స్థానాల్లో కాంగ్రెస్ మిగిలిన పక్షాలకు గట్టిపోటీ ఇచ్చే స్థాయికి చేరుకుంది. ఈ రకమైన ముక్కోణపు పోటీ ఏర్పడగల స్థానాల్లో ముఖ్యమైనవి ఖుషినగర్, సహారన్పూర్, ఫరూఖాబాద్, ఫతేపూర్ సిక్రి, బారాబంకి, ఘజియాబాద్ ఉన్నాయి. వ్యతిరేక ఓటు కాస్తా కాంగ్రెస్, ఎస్పీ–బీఎస్పీ కూటమికి మళ్లిపోవడం వల్ల కొన్నిచోట్ల బీజేపీ కూడా లాభపడే అవకాశముంది. శివపాల్ ప్రభావం ఎంత? ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రసవత్తరమైన ఇంకో కోణం ఏమిటంటే.. ములాయంసింగ్ యాదవ్ తమ్ముడు శివపాల్ యాదవ్ సొంతంగా పార్టీ పెట్టుకోవడం. చిన్న చిన్న పార్టీలను కలుపుకోవడం ద్వారా శివపాల్ తక్కువ సమయంలోనే శక్తిగా ఎదిగారు. ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ (లోహియా)తోపాటు పీస్ పార్టీ, అప్నాదళ్తో ఈయన జట్టుకట్టారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. శివపాల్ యాదవ్ బలంగా ఉన్నచోట్ల పోటీ చతుర్ముఖం అవుతుంది. ఇది కాస్తా బీజేపీకే లాభిస్తుంది. మొత్తమ్మీద చూస్తే.. బీజేపీపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మలచుకునేందుకు ఎస్పీ –బీఎస్పీ పొత్తు పెట్టుకున్నప్పటికీ కొన్ని స్థానాల్లో ఈ ప్రయోజనం దక్కని పరిస్థితి ఏర్పడిందన్నమాట. సరిగ్గా ఇదే లక్ష్యంతో బీజేపీ తెరవెనుక నుంచి శివపాల్కు మద్దతిస్తోందని ఎస్పీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో శివపాల్ చివరకు కాంగ్రెస్తో జట్టుకట్టవచ్చునని కూడా వార్తలున్నాయి. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కొంతకాలంగా చెబుతున్నది కూడా ఇదే. కాంగ్రెస్ విపక్షాల ఐక్యతకు కాకుండా తను సొంతంగా బలపడేందుకే ఇష్టపడుతోందని మాయావతి ఆరోపిస్తున్నారు. డేట్లైన్ లక్నో రతన్ మణిలాల్ (ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కేంద్రంగా పనిచేస్తున్న రచయిత టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్ మాజీ సంపాదకులు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వేర్వేరు పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. జైపూరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, స్కూల్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ అధిపతిగానూ వ్యవహరించారు) -
ఎస్పీ వెంకటరత్నం సరెండర్
సాక్షి, శ్రీకాకుళం: జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అడాల వెంకటరత్నంను సరెండర్ చేస్తూ ఎన్నికల కమిషన్ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఆయన కమిషనరేట్లో రిపోర్టు చేయాలని కూడా ఈసీ ఆదేశించింది. ఆయన సరెండర్కు కారణాలు తెలియకపోయినప్పటికీ.. ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించకపోయినా, ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నా ఎన్ని కల సంఘం వేటు వేసే అవకాశం ఉం టుంది. కొద్దికాలం జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఎం.రామారావును సరైన సమాచారా న్ని ఇవ్వని కారణంగా ఎన్నికల సంఘం కొద్ది కాలం క్రితం బదిలీ చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరూ డైరెక్టు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కారు. కన్ఫర్మ్డ్ ఐఏఎస్, ఐపీఎస్లను టీడీపీ ప్రభుత్వం ఇక్కడ నియమించిన విషయం గమన్హారం. ఎస్పీ వెంకటరత్నం హోం మంత్రి చినరాజప్ప వద్ద ఓఎస్డీగా పనిచేస్తూ శ్రీకాకుళం ఎస్పీగా వచ్చారు. ఇటీవల జిల్లాలో వేలాది మందిపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. వీరిలో అనేక మంది కొన్నేళ్లుగా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. టీడీపీ నేతలు సూచించిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయడంతో పోలీస్శాఖపై దుమారం చెలరేగింది. అలాగే మరికొన్ని విషయాల్లో కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. జిల్లాకు వచ్చిన ఎన్నికల పరిశీలకుల నుంచి సమాచారాన్ని సేకరించిన ఈసీ ఎస్పీ వెంకరత్నంను సరెండర్ చేసినట్టు సమాచారం. ఆయన స్ధానంలో ఇప్పటివరకూ ఎవరినీ నియమించలేదు. బుధవారం ప్రభుత్వం సూచించే ఐదుగురిలో ఒకరిని ఎస్పీగా ఎంపిక చేసే అవకాశం ఉంది. -
సుప్రీంకోర్టులో ములాయం కుటుంబానికి చుక్కెదురు
న్యూఢిల్లీ: ములాయం సింగ్ కుటుంబానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారులు అఖిలేష్ యాదవ్, ప్రతీక్ యాదవ్లకు ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో వ్యతిరేకంగా నమోదైన అభియోగాలను దర్యాప్తు నివేదికలో పొందుపరచాలని సుప్రీంకోర్టు సోమవారం సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన బెంచ్, ప్రస్తుత దర్యాప్తు పత్రాలతో సహ దీనికి సంబంధించిన మరింత సమాచారాన్నిసేకరించి రెండు వారాల్లో సీబీఐ తమ బాధ్యతను నిర్వహించాలని సూచించింది. కేసు దర్యాప్తును కోర్టుకు అప్పగించాలని సీబీఐని ఆదేశించింది. కాంగ్రెస్ నేత విశ్వనాథ్ చతుర్వేది వేసిన పిటిషన్ను విచారించిన బెంచ్ ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది. -
బీజేపీ కులం కార్డు
ఎంత సిద్ధాంతానికి కట్టుబడిన పార్టీ అయినా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి కుల సమీకరణాలకు తలొగ్గక తప్పదని బీజేపీ నిరూపించింది. కీలకమైన ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ (ఎస్పీ)–బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూటమికి దీటుగా నిలిచేందుకు చివరి నిమిషంలో ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చింది. కుల సమీకరణాలతో లబ్ధి పొందే ఎలాంటి అవకాశాన్ని విపక్ష కూటమి ఇవ్వకుండా ఉండేందుకే బీజేపీ ఈ మార్పులు చేసింది. అభ్యర్థులను మార్చిన ఆరు నియోజకవర్గాల్లో నాలుగు రిజర్వుడు నియోజకవర్గాలే. ఆగ్రాలో మొదట కేంద్ర మాజీ మంత్రి రాంశంకర్ కతేరియాను ప్రకటించారు. ప్రస్తుతం ఆయన స్థానంలో రాష్ట్ర మంత్రి ఎస్పి సింగ్ బఘేల్ను ఎంపిక చేశారు. షాజహాన్పూర్లో సిట్టింగ్ ఎంపీ కృష్ణ రాజ్ బదులు అరుణ్ సాగర్ను నిలబెట్టారు. ఇక, బదాన్ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థిగా ధర్మేంద్ర యాదవ్ బరిలో ఉన్నారు. ఆయనపై పోటీకి బీజేపీ సంఘమిత్ర మౌర్యను దింపింది. సంఘమిత్ర తండ్రి స్వామి ప్రసాద్ మౌర్య బీఎస్పీ అధినేత మాయావతికి నమ్మిన బంటు. ఆయన కూతురును పోటీకి పెట్టడం ద్వారా నియోజకవర్గంలో యాదవేతర ఓట్లను రాబట్టుకోవచ్చని కమలనాథుల ఆశ. హర్దోయి, మిస్రిక్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉండటంతో బీజేపీ ఆ ఇద్దరినీ కూడా మార్చింది. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
సూర్యాపేట రూరల్ : సూర్యాపేట నియోజకవర్గంలో శుక్రవారం నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సిబ్బందికి గురువారం సూర్యాపేట మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ మోహన్రావు ఆధ్వర్యంలో ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. సూర్యాపేట రెవిన్యూ డివిజన్ పరిధిలోని నాగారం మండలం మినహా మిగతా 13 మండలాలకు కేటాయించిన ఎన్నికల సిబ్బందికి ఈ సామగ్రిని అందజేశారు. ఒక్కో మండలానికి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఓపీఓ, వెబ్కాస్టింగ్, వీడియో గ్రాఫర్, మైక్రో అబ్జర్వర్ చొప్పున సిబ్బందిని కేటాయించామని, సూర్యాపేట ఏవీఎం పాఠశాలలో అదనపు సిబ్బందిని నియమించామని ఆర్డీఓ వెల్లడించారు. 13 మండలాలకు 80 మంది సిబ్బందిని నియమించామన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట ఆర్డీఓ మోహ న్రావు, ఏఓ శ్రీలత, డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ వెంకటేశ్వరరెడ్డి, సూర్యాపేట తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, ఎలక్షన్ తహసీల్దార్ రాంరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ పరిశీలన సూర్యాపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఎన్నికల సామగ్రి పంపిణీని కలెక్టర్ అమయ్కుమార్, ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పకడ్బందీగా బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ పోలీసులను ఆదేశించారు. -
పోలీసులకు దీటుగా ఎన్సీసీ విద్యార్థులు
సాక్షి,వనపర్తి క్రైం: ఇటీవల జరిగిన అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణతో పోలీసులకు దీటుగా ఎన్సీసీ విద్యార్థులు విధులు నిర్వహించారని ఎస్పీ అపూర్వరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కో–ఎడ్యుకేషన్ కళాశాల సమావేశ మందిరంలో ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఎన్సీసీ విద్యార్థులకు నగదు రివార్డులు అందజేశారు. అనంతరం ఎన్సీసీ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ముందుగా భవిత, హైమావతి, రాజేశ్వరి, రవి, ఖాజ ఎన్సీసీ విద్యార్థులు మాట్లాడుతూ ఎన్నికల్లో విధులు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విధులు నిర్వహిస్తూ ఉంటే ప్రజలకు సేవలందించే అనుభూతి కలిగిందని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన ఎస్పీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ఎస్పీ అపూర్వరావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన విద్యార్థులకు రూ.వెయ్యి చొప్పున రూ.4వేలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎన్సీసీ విద్యార్థులు చక్కగా విధులు నిర్వహించి, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించారన్నారు. ఎన్సీసీ క్రమశిక్షణతో భావిభారత పౌరులను తయారుచేయడంలో ప్రధానపాత్ర పోషిస్తుందన్నారు. ఇదే క్రమశిక్షణతో చదువుకుని జీవితంలోనూ ఉన్నతంగా రాణించాలన్నారు. అనంతరం ఎన్నికల విధులు నిర్వహించిన ఎన్సీసీ విద్యార్థులకు నగదు రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారావు, పీఆర్ఓ రాజగౌడ్, సీసీ మధు తదితరులు ఉన్నారు. -
కెమిస్ట్రీ కోసం తంటాలు
ఒకటికి ఒకటి కలిస్తే రెండు అని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. గణితంలో ఈ లెక్క కరెక్టే కావచ్చు కానీ రాజకీయాల్లో కాదు. ఇటీవల తెలంగాణ ఎన్నికలు రుజువు చేసిందిదే.. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితి అన్నీ ఒక్కటై మహా కూటమిగా ఏర్పడ్డా.. ఆయా పార్టీలకు గతంలో ఓటేసిన వాళ్లందరూ మళ్లీ వేయలేదు. దీంతో కాగితాలపై మాత్రమే బలంగా కనిపించే పొత్తులు వాస్తవంలో ఏమవుతాయో తెలియదు. సార్వత్రిక ఎన్నికల వేళ జాతీయ స్థాయిలో ఇలాంటి పొత్తులను ఒక్కసారి చూస్తే.. దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు బువా – భతీజా (అత్తాఅల్లుడు).. అదేనండి సమాజ్వాదీ పార్టీ యువనేత అఖిలేశ్ యాదవ్.. బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి జట్టుకట్టి ఎన్నికల బరిలోకి దిగారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ 21.8 శాతం ఓట్లతో 47 సీట్లు గెలుచుకుంది. బీఎస్పీ 22.2 శాతం ఓట్లు తెచ్చుకున్నా.. వచ్చిన సీట్లు 19 మాత్రమే. అప్పట్లో ఇరు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. భారతీయ జనతా పార్టీ ఆ ఎన్నికల్లో ఏకంగా 300 సీట్లు గెలిచి అధికారం చేపట్టింది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ–ఎస్పీ జట్టు కట్టాయి. గత ఎన్నికల్లో తమకు వచ్చిన ఓట్లు (21.8 + 22.2) మొత్తం ఉమ్మడి అభ్యర్థికి పడతాయన్నది పొత్తు వెనుక ఉన్న ఉద్దేశం కానీ.. ‘పోలింగ్ రోజు’ ఇలాంటివేవీ పనిచేయవని చరిత్ర చెబుతోంది. ఓట్ల బదలాయింపు పూర్తిస్థాయిలో జరగాలంటే లెక్కలేసుకుంటే సరిపోదు.. ఇరు పార్టీల ఓటర్ల మధ్య కెమిస్ట్రీ కుదరాలన్నది, ఓట్లు ఒకరి నుంచి ఇంకొరికి బదిలీ కావాలన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. కెమిస్ట్రీ కోసం తంటాలు ఉన్న 80 సీట్లలో ఎస్పీ 37 స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీఎస్పీ 38 స్థానాల్లో బరిలో నిలవనుంది. పొత్తు కుదిరినప్పటి నుంచి ఇరు పార్టీల కార్యకర్తలు కెమిస్ట్రీ పండించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎస్పీ వాళ్లు తాము సాధారణంగా చేసే నినాదాలకు జై భీమ్, జై కాన్షీరామ్ జోడిస్తే.. బీఎస్పీ వాళ్లు లోహియా గళం ఎత్తుకుంటున్నారు. ఇక, ఈ రెండు పార్టీల మధ్య కుదిరిన పొత్తు ఎంత వరకు పండుతుందనేది చూస్తే.. ఇరవై ఏళ్లుగా బద్ధ శత్రువులుగా ఉన్న ఇరు పార్టీలు ఈసారి జట్టు కట్టినంత మాత్రాన కార్యకర్తలు, మద్దతుదారులందరూ ఒకేవైపునకు మొగ్గు చూపుతారన్నది కల్లే. 1985లో మాయావతిపై సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు కొందరు దాడులు చేయడంతో మొదలైన శత్రుత్వం తొందరగా మరచిపోయేది కాదన్నది కొందరి అభిప్రాయం. నాయకత్వం మాత్రం గతం గతః అన్నట్టుగా ముందుకెళ్లాలని సూచిస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉండగా యాదవులు తమను చాలా ఇబ్బందుల పాల్జేశారని అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా మాయావతి దళితుల దృష్టిలో కొంత చులకనయ్యారని కొంతమంది కార్యకర్తలు చెబుతున్నారు. అప్పటి మాదిరిగానే పని చేస్తుందా? ఎస్పీ, బీఎస్పీ మధ్య కెమిస్ట్రీపై కొంతమంది పెదవి విరుస్తున్నా.. ఒకప్పుడు బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్, ఎస్పీ నేత ములాయం కలిసికట్టుగా పనిచేసినట్టే ఈసారీ ఇరు పార్టీ సభ్యులు ఒక్కతాటిపై పనిచేస్తారని కొందరి విశ్లేషణ. బాబ్రీ మసీదు విధ్వంసం తరువాత ఆ రెండు పార్టీలు జట్టు కడితే.. పెద్దనోట్ల రద్దు ప్రభావం వల్ల ఇప్పుడు వారిద్దరూ కలిసి పనిచేస్తారని అంచనా. పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని ఆగ్రా ప్రాంతంలోని చెప్పుల తయారీ దుకాణాలు బోలెడన్ని మూతపడ్డాయి. పెద్దనోట్ల రద్దుతో నష్టపోయిన వారిలో ఎక్కువ మంది దళితులు, ఓబీసీలే కావడం గమనార్హం. మాయావతి పాలన.. ప్రస్తుత యోగీ –మోదీ పాలన కంటే ఎంతో మెరుగ్గా ఉండిందని.. కాబట్టి ఈసారి ‘బువా – భతీజా’ జోడీకి తిరుగులేదన్నది కొందరు యాదవుల అంచనా. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ కూటమికి మంచి ఆదరణే ఉంటుందని నగరాల విషయం చెప్పలేమని వీరంటున్నారు. -
తూర్పుగోదావారి జిల్లా వ్యాప్తంగా 2255 పోలింగ్ కేంద్రాలు
-
విజయనగరం...మీ ఓటు చెక్ చేసుకొండి ..
సాక్షి, విజయనగరం : నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (www.nvsp.in) ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.inవెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సెల్ నెం:9491602905 జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు. ఈ నెల 15వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. - ప్రజల్లో చైతన్యం కోసం సాక్షి ప్రయత్నం -
మధ్యప్రదేశ్,ఉత్తరాఖండ్ల్లో ఎస్పీ,బీఎస్పీ కూటమి
-
ఎంపీ, ఉత్తరాఖండ్లో ఎస్పీ-బీఎస్పీ పొత్తు ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ ఇప్పటికే పొత్తును ప్రకటించగా, తాజాగా మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కలిసి పోటీ చేసే స్ధానాలపై ఇరు పార్టీలు ఓ అంగీకారానికి వచ్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ముందు పొత్తు వివరాలను బీఎస్పీ, ఎస్పీ చీఫ్లు మాయావతి, అఖిలేష్ యాదవ్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఉత్తరాఖండ్లోని ఐదు లోక్సభ స్ధానాల్లో ఎస్పీ రెండు స్ధానాల్లో, బీఎస్పీ మూడు స్ధానాల్లో పోటీ చేస్తాయి. ఇక మధ్యప్రదేశ్లో ఎస్పీ బాల్ఘాట్, టికంగఢ్, ఖజరహా స్ధానాల్లో పోటీచేస్తుంది. బీఎస్పీ మిగిలిన 26 స్ధానాల్లో తమ అభ్యర్ధులను బరిలో దింపుతుంది. ఇక యూపీలో ఇప్పటికే ఎస్పీ-బీఎస్పీలు సీట్ల సర్ధుబాటును ప్రకటించిన సంగతి తెలిసిందే. 80 లోక్సభ స్ధానాలు కలిగిన యూపీలో ఎస్పీ 37 స్ధానాల్లో బీఎస్పీ 38 స్ధానాల్లో పోటీ చేయనున్నాయి. మూడు సీట్లు ఆర్ఎల్డీకి కేటాయించిన ఎస్పీ-బిఎస్పీ రాహుల్, సోనియా పోటీ చేసే అమేథి, రాయ్బరేలి నియోజకవర్గాల్లో పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించాయి. -
అఖిలేష్ నిర్ణయంపై ములాయం ఆగ్రహం..!
లక్నో : ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ పొత్తుపై సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఈ పొత్తువల్ల ఎస్పీ తీవ్రంగా నష్టపోనుందని ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమారుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీని కాపాడాల్సిన వారే బద్ధ శత్రువైన బహుజన్ సమాజ్వాది పార్టీతో చేతులు కలిపి భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సార్లు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పటిష్టమైన ఎస్పీని సొంత మనుషులే నాశనం చేస్తున్నారని వాపోయారు. (మోదీ మళ్లీ ప్రధాని కావాలి: ములాయం) యూపీలో ఉన్న 80 ఎంపీ స్ధానాలకు గాను ఎస్పీ 37, బీఎస్పీ 38 స్ధానాల్లో పోటీ చేస్తాయని మయావతి, అఖిలేష్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈప్రకటన వెలువడిన కొద్దిసేపటికే పార్టీ కార్యకర్తల సమావేశంలో ములాయం ఈ వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీకి 38 సీట్లు కేటాయించడం మరీ మింగుడు పడని వ్యవహారమని అన్నారు. ఇక మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు విపక్షాలతో కలిసి అఖిలేష్ అడుగులేస్తుండగా.. మళ్లీ మోదీయే ప్రధాని కావాలని పార్లమెంటు సాక్షిగా ములాయం ఆకాక్షించారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ములాయం అన్నారు. (పొత్తు ఖరారు : బీఎస్పీ 38, ఎస్పీ 37) -
పొత్తు ఖరారు : బీఎస్పీ 38..ఎస్పీ 37
లక్నో : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్లో పొత్తును ఎస్పీ, బీఎస్పీలు గురువారం ఖరారు చేశాయి. యూపీలో మొత్తం 80 స్ధానాలకు గాను ఎస్పీ 37 స్ధానాల్లో, బీఎస్పీ 38 స్ధానాల్లో పోటీ చేసేలా అంగీకారం కుదిరింది. ఈ మేరకు తాము పోటీ చేసే స్ధానాలను వెల్లడిస్తూ ఇరు పార్టీలు జాబితాను విడుదల చేశాయి. అమేథి, రాయ్బరేలిలో అభ్యర్ధులను ప్రకటించబోమని ఎస్పీ, బిఎస్పీలు ఇప్పటికే ప్రకటించగా, మిగిలిన మూడు స్ధానాల్లో అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్ఎల్డీ పోటీచేస్తుంది. ఇక ఎస్పీ-బీఎస్పీ పొత్తు ఖరారు కావడంతో యూపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఖాయమని తేలింది. కాగా యూపీలో మొత్తం 80 స్ధానాల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులను బరిలో దింపుతుందని ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో పాటు యూపీ బాధ్యతలను ఆమెకు అప్పగించడంతో కీలక రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. -
ఎస్పీ త్రివిక్రమ వర్మ బదిలీ
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న డాక్టర్ సీఎం త్రివిక్రమవర్మకు బదిలీ అయింది. ఈయనకు ఇటీవల డీఐజీగా పదోన్నతి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈయన్ని ఏలూరు రేంజ్ డీఐజీగా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈయన స్థానంలో ఇదివరకూ జిల్లాలో ఏఎస్పీగా పనిచేసిన సెంథిల్కుమార్ జిల్లా ఎస్పీగా రానున్నట్లు సమాచారం. బదిలీపై వెళ్తున్న సీఎం త్రివిక్రమవర్మ 2017 జూన్ 26న శ్రీకాకుళం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన హయాంలో వంశధార నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించే విషయంలో చురుగ్గా వ్యవహరించారు. అలాగే కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ (సీపీవో) వ్యవస్థను జిల్లాకు పరిచయం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై శ్రద్ధ కనబర్చారు. దొంగతనాలు అరికట్టడంలో, దొంగల భరతం పట్టేందుకు వీలుగా ఎల్హెచ్ఎంఎస్ ప్రత్యేక యాప్ను రూపొందించడంలో, జిల్లాలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఈయన హయాంలోనే జరిగింది. రాత్రి వేళళ్లో ముమ్మర గస్తీ నిర్వహించడం, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారికి చలానాలు నమోదు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదుతో పాటు పోలీసులకు వీక్లీ ఆఫ్లు కూడా త్రివిక్రమవర్మ హయాంలోనే జరిగాయి. -
ఆ ‘పొత్తు’ దేశానికే నమూనా!
ఉత్తరప్రదేశ్లో సమాజ్ వాది, బహుజన సమాజ్పా ర్టీలు రెండూ కలిసి పొత్తు ఏర్పాటు చేసుకొని, 2019 లోక్సభ ఎన్నికల్లో ఉమ్మ డిగా పోటీ చేయ్యాలనే నిర్ణ యానికి రావడాన్ని సోషల్ జస్టిస్ పార్టీ తరపున ఆహ్వానం పలుకుతున్నాం. మొత్తం 80 స్థానాల్లో చెరి 38 స్థానాలు కలిపి 76 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుని, తద్వారా ఐక్యకూటమి పని విధానానికి ఆ రెండు పార్టీలు ఒక నమూనాగా నిలిచాయి. మిగిలిన 4 సీట్లను మిత్రు లకు వదిలివేయాలని భావించి, కలుపుకొని వెళ్ళే దృక్పథాన్ని ఆ పార్టీలు ప్రదర్శించాయి. దీంతో 1993లో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత కాన్షీరామ్, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాద వ్లు ఐక్యంగా పోరాడి, అధికారం సాధించిన గొప్ప చరిత్ర మళ్ళీ పునరావృతం కానుంది. ఇరుపార్టీలు విడివిడిగా పోటీచేసిన దుష్ఫలితంగానే 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ, 2017 శాసనసభ ఎన్నికల్లోనూ అగ్రకులోన్మాద, మతోన్మాద శక్తులు పైచేయి సాధిం చాయి. ఆ తరువాత జరిగిన గోరఖ్పూర్, పూల్పూర్, ఖైరానా లోక్సభ నియోజక వర్గాల ఉపఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు కలిసికట్టుగా పోటీచేయగా, బీజేపీ మట్టికరచింది. ఈ విజయాలు కాంగ్రెస్తో నిమిత్తం లేకుండానే సాధించటం విశేషం. తాజాగా, ఈ రెండు పార్టీలే ఒక ఎన్నికల ఒప్పం దానికి రావటం భారత రాజకీయాల్లోనే ఒక మలుపు, నిజానికి ఎస్పీ, బీఎస్పీల కలయిక అంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యతే. ప్రసుత్తం ఏర్పడిన ఈ రెండు పార్టీల పొత్తు జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రవచించిన సామాజిక న్యాయం, సామా జిక ప్రజాస్వామ్య లక్ష్యాల దిశగా వేసే మరో ముందడుగుగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఈ రెండు పార్టీల కలయిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజకీయ ఐక్యత ప్రాముఖ్యం కేవలం యూపీకే పరి మితం కాదు. యావత్ దేశానికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా నికి కూడా వర్తిస్తుంది. జాతీయంగాగానీ, ప్రాంతీ యంగాగానీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలూ, వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు అన్నీ ఆధిపత్య కులం అనే ఉమ్మడి స్వభావం కలిగినట్టివే. అవి జాతీయ స్థాయిలోనూ, ప్రాంతీయస్థాయిలోనూ, ఒక దానికి మరొకటి నిజమైన ప్రత్యామ్నాయం కాజాలవు. బీజేపీకి, కాంగ్రెస్కి మధ్య ఎలాంటి భిన్నమైన సామాజిక స్వభావం గానీ, ఆర్థిక విధానాలు గానీ లేవు. హిందుత్వ స్వభావం మాత్రం రెంటికీ ఉమ్మడి గుణమే. అది ఇటీవలి రాహుల్గాంధీ దేవాలయాల సందర్శనలు, పూజా పునస్కారాల ద్వారా అతి స్పష్టంగా బహిర్గతమౌతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ మేకవన్నె పులిలాగా తన నిజస్వరూపాన్ని కప్పిపుచ్చు కుంటూ మోసపూరితమైన వాదనలతో లౌకికవాద జపంచేస్తూ కుయుక్తులతో ఎస్పీ, బీఎస్పీల సామాజిక శిబిరంలో దూరాలని కుటిలప్రయత్నం చేస్తోంది. గొర్రెలమందలోనికి దూరాలని తోడేలు చేసే దుష్ప్రయత్నం వంటిదే, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది. అయితే, ఈ కుట్రను పసిగట్టిన అఖిలేశ్, మాయావతిలు కాంగ్రెస్ని సరిగ్గానే దూరంగా పెట్టారు. ఈ విధానం తాత్కాలిక ఎత్తుగడగానే కాకుండా, వ్యూహాత్మకంగానే కొనసాగిస్తూ, జాతీయ స్థాయిలో నిజమైన సామాజిక ప్రత్యామ్నాయ రాజ కీయశక్తులను కూడగట్టడం ఆ రెండు పార్టీల ముందున్న నేటి చారిత్రక కర్తవ్యం. ఇందుకు దోహ దపడే విధంగా, ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే, అన్ని రాష్ట్రాలలోనూ పోరాడుతోన్న సామాజిక, రాజకీయ, ప్రజాస్వామిక శక్తులు తమ తమ విధానాలను, కార్యాచరణనూ మలచుకోవాలి.ఈ మహత్తర కార్య క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని సామాజిక రాజకీయ శక్తులు కూడా క్రియాశీలకపాత్ర వహించాలి. ఆంధ్ర ప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రజలు ఒక స్వతంత్ర రాజకీయశక్తిగా 2019 ఎన్నికల్లో పోటీ చెయ్యాలి. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. పార్లమెంట్లో ఇటీవల 124వ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణాలకు ఆర్థిక వెనుకబాటుతనం ముసు గులో 10% రిజర్వేషన్లు కల్పించిన సందర్భంలో ఎస్పీ, బీఎస్పీలు తీసుకున్న వైఖరి ప్రస్తుత రిజర్వేషన్ వర్గాలకు నష్టకరం అనే విషయం సుస్పష్టమే. ఎందు కంటే, రిజర్వేషన్లకు మౌలిక ప్రాతిపదికగా ఉంటున్న సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా, ఆర్థిక వెనుక బాటుతనాన్ని మాత్రమే ప్రాతిపదికగా చేసుకొని కల్పించిన రిజర్వేషన్లను దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రజలందరూ ముక్తకంఠంతో తిరస్కరి స్తు న్నారు. ఎస్పీ, బీఎస్పీలు ఈ విషయమై తమ వైఖరిని పునరాలోచించుకోవాలి. ఏదేమైనా ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీల పొత్తును ఆహ్వానిస్తూ, రాష్ట్రం లోనూ, దేశంలోనూ ఆ నమూనాలో 2019 ఎన్నికల్లో తగుచర్యలు తీసుకొన వలసిన తక్షణ కర్తవ్యం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాజకీయశక్తులపై ఉంది. ఓట్లు మనవే సీట్లూ మనవే, మన ఓట్లు మనకే వేసుకొం దాం. రాజ్యాధికారాన్ని సాధించుకొందాం. వై. కోటేశ్వరరావు వ్యాసకర్త సీనియర్ అడ్వకేట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, మొబైల్ : 98498 56568 -
ఎస్పీ–బీఎస్పీ కూటమికి ఆర్జేడీ మద్దతు
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఇటీవల ఏర్పడిన ఎస్పీ–బీఎస్పీ కూటమికి రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) మద్దతు తెలిపింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ఈ రెండు పార్టీలు తీసుకున్న నిర్ణయం దేశమంతటా ప్రభావం చూపనుందని పేర్కొంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సోమవారం అఖిలేశ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘యూపీలోని మా పార్టీ శ్రేణులు ఎస్పీ–బీఎస్పీ కూటమికి మద్దతునిస్తాయి. యూపీ పరిణామం దేశవ్యాప్తంగా సంకేతాలు పంపింది. కేంద్రంలో అధికారంలోకి ఎవరు రావాలనే విషయాన్ని యూపీ, బిహార్ రాష్ట్రాలే నిర్ణయించనున్నాయి’ అని తేజస్వీ వ్యాఖ్యానించారు. తేజస్వీ ప్రకటనతో యూపీలో తమ కూటమి మరింత బలోపేతమవుతుందని అఖిలేశ్ అన్నారు. ‘మా కూటమిని అందరూ స్వాగతించారు. దేశ ప్రజలు బీజేపీ పాలనతో విరక్తి చెందారు. బీజేపీ ప్రజలను మోసం చేసింది. అందుకే ప్రజలు ఆ పార్టీని గద్దె దించాలనుకుంటున్నారు’ అని అఖిలేశ్ తెలిపారు. యూపీ కూటమి నుంచి కాంగ్రెస్ను పక్కనపెట్టారు కదా అని తేజస్వీని ప్రశ్నించగా.. ‘అందరి లక్ష్యం ఒక్కటే, అదే బీజేపీని ఓడించడం. వీళ్లు ఇక్కడ గెలుస్తారు..మేం అక్కడ గెలుస్తాం’ అంటూ బిహార్లో కాంగ్రెస్తో కొనసాగుతున్న పొత్తుపై బదులిచ్చారు. తన తండ్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కన్న కలలను నిజం చేసిన ఎస్పీ–బీఎస్పీ నేతలకు కృతజ్ఞతలు చెప్పేందుకే లక్నో వచ్చినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం మాయావతి కాళ్లకు నమస్కరిస్తున్నట్లుగా ఉన్న ఫొటోలను తేజస్వీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, బీజేపీ పన్నిలో ఉచ్చులో ఇరుక్కున్న ఎస్పీ, బీఎస్పీలు యూపీలో తమతో సంబంధం లేకుండానే కూటమిగా ఏర్పడ్డాయని కాంగ్రెస్ తెలిపింది. యూపీలోని లౌకికవాద రాజకీయ పార్టీలను ఏకం కాకుండా చేసి ఓట్లను చీల్చడం ద్వారా వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలవాలనే బీజేపీ ప్రయత్నాలు విజయవంతమయ్యాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్పీఎన్ సింగ్ అన్నారు. -
యూపీని స్వీప్ చేస్తాం : రాజ్నాథ్
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ కూటమికి ఘోరపరాభవం తప్పదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ జోస్యం చెప్పారు.2019 లోక్సభ ఎన్నికల్లో యూపీని స్వీప్ చేస్తామని, ఆ రాష్ట్రంలో గతంలో లభించిన 72 స్ధానాలను అవలీలగా తిరిగి దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు ఘనవిజయం కట్టబెట్టారని గుర్తుచేశారు. విపక్షాలు ఎన్ని కూటములు కట్టినా యూపీలో 80 లోక్సభ స్ధానాలకు గాను 72 స్ధానాలు తగ్గకుండా బీజేపీ గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా యూపీలో బీజేపీకి చెక్పెట్టేందుకు దశాబ్ధాల తరబడి తమ మధ్య నెలకొన్న విభేదాలను పక్కనపెట్టి ఎస్పీ, బీఎస్పీ ఏకమైన సంగతి తెలిసిందే. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చెరో 38 స్ధానాల్లో పోటీ చేసేందుకు ఇరు పార్టీలు అంగీకరించాయి. మిగిలిన నాలుగు స్ధానాల్లో అమేథి, రాయ్బరేలి స్ధానాలను కాంగ్రెస్కు విడిచిపెట్టగా మరో రెండు స్దానాలను ఆర్ఎల్డీ వంటి పార్టీలకు అప్పగించనున్నాయి. మరోవైపు యూపీలో ఒంటరిపోరుకు కాంగ్రెస్ సంసిద్ధమవుతోంది. -
కమలనాథులకు తగ్గిపోనున్న ప్రత్యామ్నాయాలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు వైరి పక్షాలైన ఎస్పీ, బీఎస్పీలు రాబోయే లోక్సభ ఎన్నికల కోసం చేతులు కలపడంతో బీజేపీ ముందున్న ప్రత్యామ్నాయాలు తగ్గిపోయే అవకాశాలున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్ని ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీల మధ్య పోరుగా చిత్రీకరించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. అందుకే విపక్షాలనన్నింటిని కలిపి మహాకూటమిగా అభివర్ణిస్తూ, ఎన్నికల్ని మోదీ పాలనపై రిఫరెండంగా ప్రచారం చేయాలనుకుంటోంది. అదే జరిగితే మోదీకి తిరుగుండదని, ప్రజాదరణలో మోదీని ఓడించడం కష్టమని కాషాయ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఎస్పీ–బీఎస్పీ కూటమితో బీజేపీకి కొత్త తలనొప్పులు తలెత్తే పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో సార్వత్రిక ఎన్నికలకు ఏదో ఒకే అంశాన్ని ప్రచారాస్త్రంగా ఎంచుకుని బరిలోకి దిగేవారు. కానీ ఇప్పుడు జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ప్రాథమ్యాలు మారి పోయాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎజెండా, ప్రచారాస్త్రంతో పోటీకి దిగడం జాతీయ పార్టీకి కత్తిమీద సాముగా మారింది. అసలే దక్షిణాదిలో బీజేపీ కేడర్ అంతంత మాత్రమే. ఎస్పీ–బీఎస్పీ బాటలోనే ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా నడిస్తే బీజేపీ అవకాశాలు మరింత కుంచించుకుపోతాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్ని మోదీ పాలనకు రిఫరెండంగా భావించే పరిస్థితి కూడా ఉండదు. అప్పుడలా..ఇప్పుడిలా.. కాగితంపై చూస్తే ఎస్పీ–బీఎస్పీ కూటమికి బీసీలు, దళితులు, ముస్లింలు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో ఈ రెండు పార్టీ లు విడివిడిగా పోటీచేయడంతో ఓట్ల చీలికతో బీజేపీ లబ్ధి పొందిందన్నది కాదనలేని వాస్తవం. 1993 అసెంబ్లీ ఎన్నికల్లో జతకట్టిన ఎస్పీ–బీఎస్పీలు అప్పటికే బలోపేతమైన బీజేపీని ఓడించిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. ఇక 2014 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఎస్పీ, బీఎస్పీల ఉమ్మడి ఓటు షేరు 42.1 శాతం కాగా, బీజేపీకి 42.6 శాతం ఓట్లు దక్కాయి. ప్రస్తుతం బీజేపీ ఓట్ల శాతం ఒకటో, రెండో పాయింట్లు పడిపోయి ఉంటుందని అంచనావేస్తున్నారు. తన ఓట్లను ఎస్పీకి బదిలీచేయగలనని గతేడా ది జరిగిన ఉపఎన్నికలో బీఎస్పీ నిరూపించింది. మాయావతి ప్రధాని అభ్యర్థిత్వానికి అఖిలేశ్ మద్దతుపలకడం, ఆమెను అవమానిస్తే తననూ అవమానించినట్లేనని పార్టీ కార్యకర్తలకు సూచించడం ద్వారా ఎస్పీ, బీఎస్పీ కార్యకర్తలు కలసి పనిచేసేలా ప్రోత్సహించారు. ‘వర్ణ’ రాజకీయాలే కీలకం: 80 లోక్సభ స్థానాలున్న యూపీలో అధిక సీట్లు గెలుచుకోవడమే బీజేపీకి మొదటి సవాల్. ఇందుకోసం ఆ పార్టీ వేర్వేరు వ్యూహాలు అనుసరించాల్సి ఉంటుంది. దళితులు, అధిక సంఖ్యాక ఓబీసీల్లో పార్టీ పట్ల ఉన్న వ్యతిరేక భావాన్ని ఎదుర్కోవడం ప్రధానమైంది. కానీ, యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక బీజేపీలోనే ఓబీసీ రాజకీయాలు చాపకింద నీరులా పెరిగిపోవడం అసలు సమస్యగా మారింది. అగ్రవర్ణాల్లో ఉన్న పార్టీ వ్యతిరేకతను తగ్గించే ప్రయత్నంలో భాగంగా మోదీ నిరుపేదలకు 10 శాతం కోటా తీసుకువచ్చారు. అయోధ్యలో రామాలయాన్ని బీజేపీ నిర్మించనుందనే అంచనాలు హిందుత్వ ఓటర్లలో పెరిగిపోయాయి. కుంభమేళా సందర్భంగా జరిగే ధర్మ సంసద్లో హిందుత్వ వాదులు తమ గళాన్ని మరింత తీవ్రంగా వినిపించే అవకాశాలున్నాయి. అదే జరిగితే బీజేపీ వైఖరికి, హిందుత్వ అతివాదానికి మధ్య మోదీ సయోధ్య ఎలా కుదుర్చుతారో వేచి చూడాలి. తగ్గనున్న కాంగ్రెస్ స్థాయి ఎస్పీ, బీఎస్పీ కూటమి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒకే నినాదం, ఒకే అజెండాతో ప్రజల ముందుకు వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. మాయావతి, అఖిలేశ్ కలిసి కాంగ్రెస్ను కూటమిలో చోటివ్వక పోవడం ద్వారా ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లయింది. మిగతా ప్రాంతీయ పార్టీల నేతలు కూడా ఇదే బాటను అనుసరిస్తూ కాంగ్రెస్ను పక్కనబెట్టడమో లేదా ఇష్టం లేకున్నా రాష్ట్ర స్థాయిలో పొత్తులు పెట్టుకోవడమో చేసేందుకు ఈ పరిణామం దోహదపడింది. అఖిలేశ్, మాయావతి కలయిక.. మోదీని ఓడించేందుకు కాంగ్రెస్ వంటి జాతీయ స్థాయి ప్రత్యామ్నాయం అక్కర్లేదు.. రాష్ట్ర స్థాయిలో ఏకమైతే చాలనే సందేశాన్ని మిగతా పార్టీలకు పంపింది. -
పశ్చిమ యూపీలో రాహుల్ ర్యాలీలు
లక్నో : యూపీలో కాంగ్రెస్ను పక్కనపెట్టి ఎస్పీ, బీఎస్పీలు సీట్ల సర్ధుబాటు చేసుకోవడంతో కీలక రాష్ట్రంలో సొంతంగా పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం లౌకిక శక్తుల ఏకీకరణతో పాటు యూపీలో బలం పెంచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఫిబ్రవరిలో పశ్చిమ యూపీలో ఏకంగా 15 ప్రచార ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రైతుల సమస్యలను ప్రధానంగా లేవెనెత్తుతూ ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చేపటిన వ్యవసాయ రుణాల మాఫీని ప్రజల ముందుకు తీసుకువెళ్లేలా ఈ ర్యాలీలకు రూపకల్పన జరుగుతోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ వైఫల్యాలు, వ్యవసాయ సంక్షోభం, రైతుల దుస్ధితిని ఈ ర్యాలీల్లో రాహుల్ ప్రజల ముందుంచనున్నారు. పశ్చిమ యూపీలోని హపుర్తో తొలి ర్యాలీని చేపట్టే రాహుల్ అనంతరం మొరదాబాద్, షహరన్పూర్, బరేలీ ర్యాలీల్లో పాల్గొంటారు. కాగా యూపీలో కాంగ్రెస్తో పొత్తు ఉండదని అఖిలేష్, మాయావతి ప్రకటించిన నేపథ్యంలో యూపీపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని రాహుల్ పార్టీ నేతలకు సూచించారు. ఎస్పీ, బీఎస్పీలు రాజకీయ నిర్ణయం తీసుకున్నాయని, కాంగ్రెస్ యూపీలో పూర్తిసామర్థ్యంతో పోరాడుతుందని దుబాయ్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాహుల్ వ్యాఖ్యానించారు. -
ఎస్పీ, బీఎస్పీ.. చెరో 38
లక్నో/న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు కూటమిగా బరిలోకి దిగాలని గతంలో బద్ధశత్రువులైన బీఎస్పీ, ఎస్పీ పార్టీలు శనివారం నిర్ణయించుకున్నారు. శనివారం లక్నోలో∙మీడియా సమావేశంలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్, బీఎస్పీ చీఫ్ మాయావతి ఈ విషయం ప్రకటించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలు చెరో 38 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి ఉంచుతాయని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా సొంత నియోజకవర్గాలు అమేథీ, రాయ్బరేలీల్లో తమ అభ్యర్థులు బరిలో ఉండరని వీరు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 80 లోక్సభ స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీలు పోటీ చేయగా మిగిలిన మరో రెండు సీట్లను చిన్న పార్టీలకు వదిలివేస్తున్నట్లు ప్రకటించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో బీజేపీ 71 సీట్లు, అప్నా దళ్ రెండు చోట్ల గెలిచాయి. ఎస్పీకి 5, కాంగ్రెస్కు 2 స్థానాలు దక్కగా బీఎస్పీ ఒక్కటీ కూడా గెలవలేదు. వారిద్దరికీ నిద్ర కరువే 1995లో తనపై ఎస్పీ కార్యకర్తలు చేసిన దాడిని మనసులో ఉంచుకోనని, జాతి ప్రయోజనాల కోసం, బీజేపీ విధానాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం అప్పట్లో జరిగిన ఆ ఘటనను పట్టించుకోనని మాయావతి స్పష్టం చేశారు. తమ కూటమి ఏర్పాటుతో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు ఇకపై నిద్ర కరవవుతుందన్నారు. ‘మాది సహజ కూటమి. మా బంధం లోక్సభ ఎన్నికల్లోనే కాదు యూపీ అసెంబ్లీ ఎన్నికల వరకూ కొనసాగుతుంది. ఇది రాజకీయ విప్లవం’ అని ప్రకటించారు. ‘ఈవీఎం దుర్వినియోగం, రామ మందిరం అంశం వంటివి లేకుంటే బీజేపీని ఓడిస్తాం’ అని తెలిపారు. అందుకే కాంగ్రెస్ను కలుపుకోలేదు కూటమిలో కాంగ్రెస్ను చేర్చుకోకపోవడంపై మాయావతి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పాలనలో దేశంలో పేదరికం, నిరుద్యోగం, అవినీతి విపరీతంగా పెరిగిపోయాయి. రక్షణ రంగ ఒప్పందాల్లో భారీ కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. గతంలో కాంగ్రెస్తో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సమయంలో మాకు ఎలాంటి లాభం కలగలేదు. మా పార్టీ ఓట్లు కాంగ్రెస్కు బదిలీ అయ్యాయి. కానీ, ఆ పార్టీ ఓట్లు మా అభ్యర్థులకు పడలేదు. మళ్లీ కాంగ్రెస్తో పొత్తుతో మాకు ప్రయోజనం ఉండదు. కానీ, ఎస్పీ– బీఎస్పీ బంధంతో ఓట్ల బదిలీ పక్కాగా జరుగుతుంది’ అని వివరించారు. నాకూ అవమానమే: అఖిలేశ్ మాయావతి ప్రధానమంత్రి అభ్యర్థి అయితే మద్దతిస్తారా అన్న ప్రశ్నకు అఖిలేశ్ సూటిగా సమాధానం ఇవ్వకుండా ‘నేను ఎవరికి మద్దతిస్తానో మీకు తెలుసు’ అని అన్నారు. గతంలో యూపీ పలువురు ప్రధానమంత్రి అభ్యర్థులను దేశానికి అందించింది. మరోసారి అలాగే జరిగితే చాలా సంతోషం అని అన్నారు. మాయావతికి తగు గౌరవం ఇవ్వాలని ఈ సందర్భంగా తమ పార్టీ శ్రేణులకు అఖిలేశ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ‘మాయావతిని గౌరవిస్తే నన్ను గౌరవించినట్లే. ఆమెకు అవమానం నాకూ అవమానమే. బీజేపీ నేతలు కానీ మరెవరైనా కానీ ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడితే, అది నాకు వ్యతిరేకంగా మాట్లాడినట్లే భావించాలి’ అని అన్నారు. 1995లో మాయావతిపై జరిగిన ఎస్పీ కార్యకర్తల దాడిని దృష్టిలో ఉంచుకుని తమ శ్రేణులకు ఆయన ఈ వార్నింగ్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. ‘సహనంతో ఉండి బీఎస్పీ కార్యకర్తలతో సోదరభావంతో మెలగండి’ అని ఎస్పీ కార్యకర్తలను అఖిలేష్ కోరారు. ఈ కూటమి ఏర్పాటును తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులు స్వాగతించారు. 1995లో ఏం జరిగింది? 1993లో బీజేపీని నిలువరించేందుకు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం చేతులు కలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి 167 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది. నేతల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాల నేపథ్యంలో 1995లో ఓ సమావేశంలో పాల్గొన్న బీఎస్పీ నేత మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారు. ఆమె కార్యాలయాన్ని ధ్వంసం చేసి, అసభ్యంగా ప్రవర్తించారు. ఆ సమయంలో బీజేపీ నేత ఒకరు ఆమెను కాపాడారు. అనంతర పరిణామాలతో బీజేపీతో చేతులు కలిపి బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఎస్పీతో మాయావతి సంబంధాలు తెంచుకున్నారు. రెండు దశాబ్దాల అనంతరం మళ్లీ ఎస్పీకి మాయావతి స్నేహ హస్తం చాశారు. మొత్తం స్థానాల్లో పోటీ చేస్తాం: రాహుల్ లోక్సభ ఎన్నికల్లో యూపీలోని అన్ని చోట్ల నుంచి అభ్యర్థులను బరిలో ఉంచుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. ఎస్పీ, బీఎస్పీ కూటమిలో కాంగ్రెస్కు చోటు కల్పించకపోవడంపై దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన స్పందించారు. ‘ఎస్పీ, బీఎస్పీ పార్టీల నేతలపై నాకు ఎనలేని గౌరవం ఉంది. నచ్చిన విధంగా వ్యవహరించే స్వేచ్ఛ వారికుంది. ఆ రెండు పార్టీలు రాజకీయ నిర్ణయం తీసుకున్నాయి. యూపీలో పార్టీని బలోపేతం చేసుకోవడం మా బాధ్యత. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయనున్నాం’ అని స్పష్టం చేశారు. ఈ కూటమి అస్తిత్వం కోసమే తప్ప, దేశం కోసమో, లేక ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కోసమో కాదని బీజేపీ విమర్శించింది. ఎస్పీ– బీఎస్పీ మైత్రిని అవినీతి– గూండాయిజం కూటమిగా యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఎద్దేవా చేశారు. -
పాత పొత్తులు–కొత్త ఎత్తులు
త్రికాలమ్ ఉత్తరాదిలో చలి ఎముకలు కొరుకుతున్నప్పటికీ రాజకీయాలు మాత్రం వేడెక్కుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకున్నాయి. గెలు పోటములపైన దేశ ప్రజలలో ఇప్పటికే చర్చ జరుగుతున్నది. ప్రధానిగా నరేంద్రమోదీ మరోసారి ప్రమాణం చేస్తారా? కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి దేశాన్ని నడిపించగల శక్తిసామర్థ్యాలు ఉన్నాయా? ఒక వేళ బీజేపీకి సీట్లు బాగా తగ్గితే, లోగడ సోనియాగాంధీకి ఇచ్చిన గౌరవం కాకలు తీరిన ప్రాంతీ యపార్టీల నాయకులు ఇప్పుడు రాహుల్గాంధీకి ఇస్తారా? ఉత్తరప్రదేశ్ (యూపీ) రాజకీయాలు ఎట్లా ఉంటాయి? బిహార్లో లాలూప్రసాద్ పట్ల సానుభూతి పవనాలు వీస్తున్నాయా? యూపీ, బిహార్ల ఫలితాలæ ప్రభావం జాతీయ రాజకీయాలపై ఎట్లా ఉంటుంది? ఎక్కడ విన్నా ఇదే చర్చ. మలుపు తిప్పే రోజు శనివారం దేశ రాజకీయ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యం సంతరించుకున్న రోజు. యూపీ రాజకీయాలను మలుపు తిప్పే విధంగా సమాజ్వాదీపార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లు ఎన్నికల పొత్తు కుదుర్చుకు న్నాయి. బీఎస్పీ అధినేత మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్యాదవ్లు సంయుక్తంగా మీడియా సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. యూపీలో ఉన్న 80 లోక్ సభ స్థానాలలోనూ చెరి 38 స్థానాలకు పోటీ చేస్తామనీ, రెండు కాంగ్రెస్పార్టీకి వదులుతామనీ చెప్పారు. మిగిలిన రెండు అజిత్సింగ్ నాయ కత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్ (ఆరెల్డీ)కి కేటాయించాలని నిర్ణయం. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని తెగేసి చెప్పారు. బీఎస్పీ–కాంగ్రెస్ కూటమి 1996లో ఓడిపోయింది. 2017లో ఎస్పీ–కాంగ్రెస్ కూటమి పరాజయం చెందింది. అందుకే కాంగ్రెస్తో పొత్తు నష్టదాయకమని మాయావతి, అఖిలేష్ తీర్మా నించుకున్నారు. నిన్ననే ఢిల్లీలోని రాంలీలా మైదానంలో బీజేపీ జాతీయ మండలి విస్తృత సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్పైనా, సోని యాగాంధీ కుటుంబంపైనా ధ్వజమెత్తారు. సుదీర్ఘమైన, ప్రభావవంతమైన ప్రసంగంతో రాబోయే పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ ప్రచారానికి తెరదీశారు. అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లనూ, సర్జికల్దాడులనూ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)నీ, గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ)నీ, రామ మందిరం నిర్మాణాన్నీ ఎన్నికల ప్రచారాంశాలుగా చేయబోతున్నట్టు సంకేతం ఇచ్చారు. మచ్చలేని ప్రభుత్వం భారతదేశ చరిత్రలో తనదేనంటూ ప్రకటిం చుకున్నారు. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో అవినీతి లవ లేశమైనా లేదంటూ ఈ దేశంలో పసిబాలలను అడిగినా చెబుతారని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ఆంధ్రప్రదేశ్లోకీ, పశ్చిమబెంగాల్లోకీ, ఛత్తీస్ గఢ్లోకీ ప్రవేశించనీయబోమని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయిం చడం చట్టవిరుద్ధమంటూ విమర్శించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సీబీఐ తననూ, అమిత్షానూ వేటాడినప్పటికీ (అమిత్షా జైలులో కూడా ఉన్నారు) ఆ సంస్థను గౌరవించామే కానీ ఎన్నడూ గుజరాత్లోకి ప్రవేశం నిషేధించలేదని గుర్తు చేశారు. రాజ్యాంగం సర్వోన్నతమైనదనీ, అంద రికీ శిరోధార్యమనీ చెప్పారు. మాయావతి–అఖిలేష్ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, కూటములు ఏర్పాటు చేసుకొని దేశాన్ని కొల్లగొట్టాలని ప్రయత్నించేవారు. తమ సహాయసహకారాలపైన ఆధారపడే ‘మజ్బూర్ సర్కార్’ కావాలని కోరుకుం టారనీ, దేశ ప్రగతిని ఆకాంక్షించేవారు పటిష్టమైన, స్థిరమైన ‘మజ్బూత్ సర్కార్’ ఉండాలని ఆశిస్తారనీ మోదీ ఉద్ఘాటించారు. రామమందిరం నిర్మా ణానికి న్యాయస్థానాలలో అవరోధాలు సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయ త్నిస్తున్నదని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, హిందూమహాసభ వంటి సంస్థలు ప్రభుత్వంపైన మందిర నిర్మాణం విషయంలో ఒత్తిడి తెస్తున్నాయి. ‘అభీ నహీ తో కభీ నహీ (ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాదు)’ అంటూ నినాదాలు చేస్తు న్నాయి. సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూడకుండా సుగ్రీవాజ్ఞ (ఆర్డి నెన్స్) ద్వారా రామాలయం నిర్మించాలని కోరుతున్నాయి. సర్వోన్నత న్యాయ స్థానం తీర్పు వెలువడిన తర్వాతనే మందిరం విషయంలో ముందడుగు వేస్తా మని మోదీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్పైన నిందమోప డానికి ఈ అంశాన్ని మోదీ సంపూర్ణంగా వినియోగించుకోబోతున్నారు. హిందూత్వ ప్రభావం ఒక్కటే గెలిపించదు హిందూత్వ ప్రచారం ముమ్మరం చేసినప్పటికీ మెజారిటీ స్థానాలు గెలుచుకునే అవకాశం నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్టీఏ)కి లేదని బీజేపీ నాయ కత్వం గ్రహించింది. 2014లో యూపీఏ పదేళ్ళ పాలన పట్ల వ్యతిరేకత ఉండేది. ఇప్పుడు ఎన్డీఏ పాలనపైన కూడా ఎంతోకొంత వ్యతిరేకత ఉంది. అందుకే కొత్త మిత్రులకోసం అన్వేషణ. తమిళనాడులో డిఎంకె, ఏఐఏడి ఎంకెలతో, రజనీకాంత్ పార్టీతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామంటూ స్వయంగా మోదీ అన్నారు. తాము బీజేపీతో పొత్తుకు సుముఖంగా లేమంటూ డిఎంకే, ఏఐఏడిఎంకేలు స్పష్టం చేశాయి. రజనీకాంత్ ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో యూపీలో పరిస్థితులు తారుమారైతే ఎన్టీఏ మనుగడ కష్టం. యూపీలో ఇదివరకటి కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామనీ, 74 స్థానాలు గెలిచి చూపిస్తామనీ బీజేపీ అధ్యక్షుడు అమిత్షా డాంబికం ప్రదర్శించినా క్షేత్రవాస్తవికత ఇందుకు భిన్నం. 2018 మార్చిలో గోర ఖ్పూర్, ఫుల్పూర్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలలో ఎస్పీ అభ్యర్థులు బీఎస్పీ మద్దతుతో బీజేపీ అభ్యర్థులను ఓడించారు. నిరుడు మేలో కైరానా లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆరెల్డీ అభ్యర్థి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల సమష్టి మద్దతుతో బీజేపీ అభ్యర్థిని ఓడగొట్టారు. ఎస్పీ, బీఎస్పీ భుజం కలిపితే బీజేపీకి నష్టం జరుగుతుందనే అవగాహన మోదీకి లేకపోలేదు. విధానాలూ, సూత్రాలూ ప్రాతిపదిక కాకుండా కేవలం ఒకేఒక వ్యక్తిని ఓడించేందుకు కూట ములు ఏర్పడుతున్నాయంటూ మోదీ విమర్శించడం అందుకే. ఈ కూటము లకు ‘ఒక నేత లేడు. ఒక నీతి లేదు’ అంటూ, రాబోయేది మూడో పానిపట్టు యుద్ధమంటూ అమిత్షా చేసిన వ్యాఖ్యలు పొంతన లేనివే అయినా జరగబోయే ఎన్నికలు దేశానికి దిశానిర్దేశం చేస్తాయని మాత్రం నిశ్చయంగా చెప్పవచ్చు. బీహార్, యూపీలు ఎన్టీఏ పతనానికి బాట వేస్తాయని లాలూ ప్రసాద్ తనయుడు, ఆర్జేడీ అధినేత తేజశ్వియాదవ్ వ్యాఖ్యానించారు. దీనిని ఉత్తరకుమారుడి ప్రేలాపన అంటూ కొట్టివేస్తే గోడమీది రాతను చదవడానికి నిరాకరించినట్టే. ఉత్తరప్రదేశ్ ఒక ప్రయోగశాల. అక్కడ అన్ని రకాల ప్రయోగాలూ జరిగాయి. బిహార్లో లాలూప్రసాద్ యాదవ్ లాగానే యూపీలో సోషలిస్టు నాయకుడు ములాయంసింగ్ యాదవ్ ఎస్పీని నెలకొల్పారు. యాదవులనూ, ఇతర వెనుకబడిన కులాలవారినీ, ముస్లింలనూ ఒక తాటిపైకి తెచ్చారు. దళిత మేధావి, దార్శనికుడు కాన్షీరాం దళితులకోసం ప్రత్యేకంగా బీఎస్పీని ఆవి ష్కరించారు. 1989లో ములాయం మొదటిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1991లో గద్దె దిగారు. బీజేపీ నాయకుడు కల్యాణ్సింగ్ పగ్గాలు చేపట్టారు. అయోధ్య ఉద్యమం, రథయాత్ర, బాబరీ మసీదు విధ్వంసం ఫలితంగా బలం పుంజుకొని బీజేపీ జోరుమీదున్నది. బాబరీ మసీదు కూల్చి వేసిన వెంటనే నాటి ప్రధాని పీవీ నరసింహారావు నాలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించారు. అనంతరం 1993లో జరిగిన ఎన్నికలలో బీజేపీని నిలువరించడం కోసం కాన్షీరాం ములాయం సింగ్లు పొత్తు పెట్టుకున్నారు. ఒక పార్టీ ఓట్లు మరో పార్టీకి బదిలీ అయ్యాయి. ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. బీజేపీకి 177 స్థానాలు లభిస్తే ఎస్పీ–బీఎస్పీ కూటమికి 176 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ మద్దతుతో ములాయంసింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1995లో ములాయంసింగ్ ప్రభు త్వానికి బీఎస్పీ మద్దతు ఉపసం హరించుకున్నది. అప్పటికే మాయావతి చేతు ల్లోకి బీఎస్పీ పూర్తిగా వచ్చింది. మద్దతు ఉపసంహరించుకున్నందుకు నిరసనగా మాయావతి బసచేసిన అతిథిగృహాన్ని ఎస్పీ కార్యకర్తలు ముట్టడించారు. మాయావతి గదిలో తలు పులు వేసుకొని ఉన్నారు. అప్పుడు బీజేపీ శాసనసభ్యుడు బ్రహ్మదత్ ద్వివేదీ మాయావతిని కాపాడి గవర్నర్ బంగ్లాకు తీసుకొని వెళ్ళారు. అక్కడి నుంచే అటల్బిహారీ వాజపేయితో మాట్లాడి మాయావతికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. బీజేపీ మద్దతుతో తొలివిడత ముఖ్యమంత్రిగా మాయావతి ప్రమాణం చేశారు. దేశంలో ఒక దళిత మహిళ ఒక (అతిపెద్ద) రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అదే ప్రథమం. ప్రజాస్వామ్యంలో జరిగే అద్భుతం ఇది (ఐ్ట జీట్చ ఝజీట్చఛిl్ఛ జీn ఛ్ఛీఝౌఛిట్చఛిy) అని నాటి ప్రధాని పీవీ వ్యాఖ్యానించారు. 1997, 2002లో కూడా మాయావతి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి కాగలిగారు. 2003లో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవ డంతో ఆమె రాజీనామా చేశారు. 2003 నుంచి 2007 వరకూ తిరిగి ములా యంసింగ్ యాదవ్ ముఖ్యమంత్రి. మళ్ళీ మాయావతి 2007 నుంచి 2012 వరకూ పూర్తి కాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2012లో అఖిలేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2017లో ఎస్పీ–కాంగ్రెస్ కూట మిని మట్టికరిపించి బీజేపీ అఖండ విజయం సాధించింది. 25 ఏళ్ళ తర్వాత ఎస్పీ–బీఎస్పీ కూటమి 2018లో మరో అరుదైన పరిణామం సంభవించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా ఫలితంగా ఖాళీ అయిన గోరఖ్పూర్ లోక్సభ స్థానా నికీ, ఉప ముఖ్యమంత్రి కేశవ్ప్రసాద్ ఖాళీ చేసిన ఫుల్పూర్ స్థానానికీ ఉపఎన్నికలు వచ్చాయి. రెండు స్థానాలలోనూ ఎస్పీ అభ్యర్థులను బీఎస్పీ బలపరిచింది. ఎస్పీ అభ్యర్థులు గెలుపొందారు. ఆ సందర్భంలో అఖిలేష్ లక్నోలో మాయావతి నివాసానికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పారు. అంటే, అతిథిగృహాన్ని ఎస్పీ కార్యకర్తలు ముట్టడించిన తర్వాత 24 సంవత్సరాలకు తిరిగి ఎస్పీ, బీఎస్పీ నాయకులు స్నేహపూర్వకంగా కలుసుకున్నారు. ఎస్పీ–బీఎస్పీ కూటమిని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు తెచ్చారు. ఇది బీజేపీ యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలలో బీజేపీకి ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఈ రిజర్వేషన్ కారణంగా అగ్రవర్ణాల పట్ల దళితులకూ, వెనుకబడినవర్గాలకూ వ్యతిరేకత పెరుగుతుంది. సరిగ్గా పాతికేళ్ళ కిందట ఎస్పీ, బీఎస్పీ మొదటి దఫా పొత్తు పెట్టుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితి ఉన్నదో ఇప్పుడూ అదే వాతావరణం ఉండటం యాదృచ్ఛికం. యోగి పాలనలో ఠాకూర్లదీ, ఇతర అగ్రవర్ణాలదే పెత్తనం. దళితులపైనా, ముస్లిం లపైనా దాడులు పెరిగిపోయాయి. అయినప్పటికీ, బీజేపీని తక్కువగా అంచనా వేయకూడదు. దళితులలో జాతవ్ కులానికి మాయావతి తిరుగులేని నాయకురాలు. తక్కిన దళితులను బీజేపీ 2014లో, 2017లో సమీకరించి మాయావతిని ఓడించింది. వెనుకబడిన కులాలలో యాదవులు అఖిలేష్కి విధేయులు. తక్కిన వెనుకబడిన కులాలను ఎస్పీకి దూరం చేసి ఎస్పీ–కాంగ్రెస్ కూటమిని బీజేపీ 2017లో ఓడించింది. అదే ప్రయత్నం ఇప్పుడూ చేస్తారు. దళితుల ఓట్లు ఎస్పీ అభ్యర్థులకు పడే విధంగా మాయావతి కట్టడి చేయగలరు. కానీ యాద వులందరూ బీఎస్పీ అభ్యర్థులకు ఓట్లు వేస్తారని పూచీ లేదు. 2014లో బీజేపీ స్వయంగా 71 స్థానాలు గెలుచుకున్నది. ఎస్పీకి అయిదూ, కాంగ్రెస్కు రెండూ దక్కాయి. బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. బీజేపీ మిత్ర పక్షమైన అప్నాదళ్ రెండు స్థానాలు కైవసం చేసుకున్నది. అయిదేళ్ళ కిందట జరిగిన పోలింగ్ సరళిని గమనంలోకి తీసుకొని ఆరెల్డీని కూడా కూటమిలో కలిపితే ఎస్పీ–బీఎస్పీకి ఆధిక్యం ఉండే సీట్ల సంఖ్య 42. కాంగ్రెస్ని సైతం ఈ కూటమిలో చేర్చుకుంటే దాదాపు 58 స్థానాలలో కూటమికి పైచేయి ఉంటుందని అంచనా. ముఖ్యంగా ముస్లిం ఓట్లు చీలకుండా సంఘటితంగా ఉంటాయి. ఎస్పీ–బీఎస్పీ వదిలే రెండు సీట్లు కాంగ్రెస్ ఎట్లాగయినా గెలు చుకుంటుంది. 2009 లోక్సభ ఎన్నికలలో యూపీలో కాంగ్రెస్ 22 నియో జకవర్గాలలో విజయం సాధించింది. 2014లో పదేళ్ళ ప్రభుత్వ వ్యతిరేకత, మోదీ ప్రభంజనం ఫలితంగా రెండు స్థానాలే దక్కాయి. కాంగ్రెస్ను కలు పుకోకపోతే ముక్కోణపు పోటీ జరుగుతుంది. బీజేపీకి లాభం. ఎన్నికలు ఇంకా మూడు మాసాలు ఉన్నాయి. బీజేపీ చేతులు కట్టుకొని కూర్చోదు. రాహు ల్గాంధీ ప్రయాగలో అర్ధకుంభమేళాకు వెళ్ళకుండా ఉండరు. ఇంకా అనేక పరిణామాలు సంభవిస్తాయి. ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటు అవుతుంది. కె. రామచంద్ర మూర్తి -
ఆ రెండు పార్టీల పొత్తు మాకే లాభం : యోగి
లక్నో : రానున్న లోక్సభ ఎన్నికల కోసం సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కుదుర్చుకున్న పొత్తుపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని ఎస్పీ తమ ఉనికి కోసమే ఏకమయ్యాయని ఆరోపించారు. ప్రజలకు ఈ పార్టీల గురించి బాగా తెలుసునని, తగిన విధంగా ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.(ఎస్పీ- బీఎస్పీ పొత్తు ఖరారు) ‘‘తమ ఉనికిని కాపాడుకోవడానికే ఈ ప్రయత్నం. అంతకన్నా మరేమీ లేదు. వారి పొత్తు మాకే(బీజేపీ) లాభాన్ని చేకూరుస్తుంది. ప్రజలకు తెలుసు అసలు నిజాలేమిటో, అందుకు అనుగుణంగా ఓట్లు వేస్తారు. బీజేపీ 2014లో సాధించిన స్థానాలక కన్నా ఎక్కువ స్థానాలను 2019 లోక్సభ ఎన్నికల్లో గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 73 స్థానాలు లభించాయి. 2019ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు కలిసి బరిలోకి దిగనున్నాయి. ఇరుపార్టీలు చెరో 38 స్థానాల్లో, ఆర్ఎల్డీ రెండు స్థానాల్లో పోటీకి దిగనున్నాయి. కాంగ్రెస్ కోసం అమేథీ, రాయ్బరేలీ స్థానాల్లో పోటీచేయబోమని ప్రకటించారు. -
కాంగ్రెస్ లేకుండానే ఎస్పీ, బీఎస్పీ కూటమి
లక్నో: వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో తలపడేందుకు కలిసి పోటీ చేయాలని ఉత్తరప్రదేశ్లోని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లు నిర్ణయించుకున్నాయి. అయితే, ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేకుండానే ఈ కూటమి రూపుదాల్చనుండటం గమనార్హం. కూటమి ఏర్పాటును ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి నేడు లక్నోలోని ఓ హోటల్లో జరిగే ఉమ్మడి మీడియా సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన అఖిలేశ్.. కాంగ్రెస్ను కలుపుకుని పోవడంపై సమాధానం దాటవేశారు. తమ కూటమిని చూసి బీజేపీతోపాటు కాంగ్రెస్ భయపడుతున్నాయన్నారు. ఈ రెండు పార్టీలు యూపీలోని 80 స్థానాల్లో చెరి 37 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నాయి. బీజేపీ నియంతృత్వ పాలనకు ముగింపు పలకడమే ప్రతిపక్షాల లక్ష్యం కావాలి. కానీ, మమ్మల్ని వదిలేసి కూటమి ఏర్పాటు చేయడం చాలా ప్రమాదకరమైన పొరపాటు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అన్నారు. కాంగ్రెస్కు అమేథీ, రాయ్బరేలీ సీట్లను మాత్రమే వదిలివేసేందుకు ఎస్పీ, బీఎస్పీ నిర్ణయించుకున్నట్లు వచ్చిన వార్తలపై యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ బక్షి స్పందించారు. యూపీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగేందుకు సైతం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎస్పీ, బీఎస్పీ కూటమిలో చేరే విషయమై ఆర్ఎల్డీ అధ్యక్షుడు అజిత్ సింగ్ స్పందించారు. తాము ఆరు సీట్లు కోరుతున్నామనీ, చర్చలు సాగుతున్నాయని తెలిపారు. -
ప్రభుత్వానికి సీబీఐ పెంపుడు చిలుక
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సీబీఐని పెంపుడు చిలకలా మార్చేసిందని సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ఆరోపించింది. సీబీఐని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందనీ, ఆ సంస్థ అధికార పార్టీకి తొత్తుగా మారిందని విమర్శించింది. ఇసుక కుంభకోణానికి సంబంధించి ఎస్పీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ను సీబీఐ ప్రశ్నించనుందనే వార్తలు సోమవారం పార్లమెంట్ను కుదిపివేశాయి. లోక్సభలో సమాజ్వాదీ సభ్యులు ఆగ్రహంతోతమ వద్ద ఉన్న పత్రాలను చించివేసి, పెద్దగా నినాదాలు చేసుకుంటూ వెల్లోకి దూసుకెళ్లారు. సభ సెక్రటరీ జనరల్ డెస్క్లోని అధికారుల వద్ద ఉన్న పత్రాలను లాక్కునేందుకు కూడా ప్రయత్నించారు. ఇదే అంశంపై రాజ్యసభలో ఎస్పీ, బీఎస్పీ, ఆప్, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. వీరితోపాటు రఫేల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించాలని ఉభయ సభల్లోనూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. కావేరీ నదిపై కర్ణాటకలో డ్యామ్ నిర్మాణాన్ని ఆపాలంటూ ఏఐఏడీఎంకే సభ్యులు వెల్లో నిలబడ్డారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకుగాను ఏఐఏడీఎంకేకు చెందిన ముగ్గురు, టీడీపీ సభ్యుడు ఒకరిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. ఈ గందరగోళం మధ్యనే పర్సనల్ లా, బాలలకు ఉచిత నిర్బంధ విద్య, ఉపాధ్యాయ విద్య జాతీయ కౌన్సిల్ సవరణ బిల్లులను లోక్సభ ఆమోదించింది. కాంగ్రెస్వి దురుద్దేశపూరిత సందేహాలు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)కు రూ.లక్ష కోట్ల విలువైన కాంట్రాక్టులిచ్చినట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన అబద్ధమంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై మంత్రి నిర్మలా సీతారామన్ సభకు వివరణ ఇచ్చారు. ‘2014–18 మధ్య కాలంలో హెచ్ఏఎల్కు ప్రభుత్వం రూ.26వేల కోట్ల విలువైన కాంట్రాక్టులిచ్చింది. మరో రూ.73 వేల కోట్ల ఆర్డర్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో 83 తేజస్ విమానాలు (రూ.50 వేల కోట్లు), 200 హెలికాప్టర్లు (20 వేల కోట్లు), 19 డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్లు (3,400 కోట్లు), ఇతర రకాల హెలికాప్టర్లు (15 వేల కోట్లు), ఏరో ఇంజిన్ (8,400 కోట్లు) ఉన్నాయి. ప్రతిపక్షం అసత్యాలు చెబుతూ తప్పుదోవ పట్టిస్తోంది’ అని పేర్కొన్నారు. అయితే, సభను మంత్రి తప్పుదోవ పట్టించినందున సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ తెలిపారు. హెచ్ఏఎల్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూ ఆ సంస్థ సీఎండీ మాధవన్ ప్రకటించిన నేపథ్యంలో దీనిపై విచారణకు జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ పొడిగింపు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ కార్యకలాపాలను కేంద్రం మరో రోజు పొడిగించాలని నిర్ణయించింది.ఈబీసీ కోటా బిల్లును ప్రవేశపెట్టేందుకు వీలుగా 9వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని అంగీకరించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. -
యూపీలో ఎస్పీ–బీఎస్పీ సీట్ల ఖరారు!
న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకం ఒప్పందంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ మరింత చేరువయ్యారు. ప్రతిపాదిత కూటమిపై తుది చర్చలు జరిపేందుకు మాయావతితో అఖిలేశ్ శుక్రవారం ఢిల్లీలో సమావేశమైనట్లు ఎస్పీ వర్గాలు చెప్పాయి. దీనిపై ఇరు పార్టీల నుంచీ అధికారిక ప్రకటనేదీ రాలేదు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ సీట్లుండగా ఈ ఇరు పార్టీలు చెరో 37 స్థానాల్లో పోటీ చేసి, మిగిలిన 6 సీట్లను కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్దళ్ వంటి పార్టీలకు వదిలేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్కు అమేథీ, రాయ్బరేలీ సీట్లు ఇచ్చే చాన్సుంది. -
తాలూకా సీఐపై ఎస్పీకి బాలినేని ఫిర్యాదు
ఒంగోలు: తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్న తీరు ఏకపక్షంగా ఉందని, పోలీసు విధుల్లో ఉన్న వారు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ఏమిటంటూ ఎస్పీ సత్యఏసుబాబుతో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఎస్పీ నిర్వహించిన గ్రీవెన్స్కు ఆయన స్వయంగా హాజరయ్యారు. ఇటీవల ఇందిరమ్మ కాలనీలో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమం సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు ఫ్లెక్సీలు కట్టారని, ఆ ఫ్లెక్సీలో పలువురు మహిళలు కూడా ఉన్నారన్నారు. ఈ క్రమంలో కోటేశ్వరి అనే మహిళ పట్ల సాయి అనే వ్యక్తి అసభ్యంగా మాట్లాడటంతో ఆమె అతడిని ప్రశ్నించిందని ఎస్పీ దృష్టికి బాలినేని తీసుకెళ్లారు. దీనికి అతను పరుష పదజాలం వాడడంతో మనస్తాపానికి గురైన ఆమె తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయగా మరునాడు రమ్మని సూచించారన్నారు. ఆదివారం ఆమె పోలీసుస్టేషన్కు వెళ్తే ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు స్టేషన్లో ఉంచుకొని ఫిర్యాదు చేసిన మహిళను మనస్తాపానికి గురిచేశారని బాలినేని పేర్కొన్నారు. అంతే కాకుండా సోమవారం ఉదయం మళ్లీ పోలీసుస్టేషన్కు రావాలని తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు హెచ్చరించాడన్నారు. ఫిర్యాదు చేసిన వారిపై వేధింపులు సరైన చర్యలు కాదని, ఇటీవల కేశవరాజుకుంట వ్యవహారంలో కూడా సీఐ స్థానిక మహిళల పట్ల ఉపయోగించిన పదజాలం బాధాకరమన్నారు. ఈ మేరకు రాతపూర్వకంగా వైఎస్సార్ సీపీ నాయకులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ.. ఇందిరమ్మ కాలనీ ఘటనపై పూర్తి సమాచారంతో తనకు సోమవారం సాయంత్రానికి రిపోర్టు అందజేయాలని తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లును ఆదేశించారు. అంతే కాకుండా విధి నిర్వహణలో వివాదం తెచ్చుకోవద్దంటూ హితవు పలికారు. సోమవారం జిల్లా ఎస్పీ నిర్వహించిన గ్రీవెన్స్కు మొత్తంగా 45 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను పరిశీలించిన ఎస్పీ వాటిని పరిశీలించి న్యాయం చేయాలంటూ సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. -
శాంతిభద్రతల కోసమే రేవంత్ అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్రెడ్డిని అదుపులోకి తీసుకోవడంలో ఎక్కడా కూడా చట్ట నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఎన్నికల సమయంలో వికారాబాద్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించిన అన్నపూర్ణ హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించే చర్యల్లో భాగంగానే రేవంత్ని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. కోస్గిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు హాజరవుతున్న సభ లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతోనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రేవంత్ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, అందువల్ల అధికారిక సీలు అందుబాటులో లేకపోయిందని వివరించారు. అదుపులోకి తీసుకునే ముందు బయటకు రావాలని రేవంత్ను పలుమార్లు పిలిచామని, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో గేట్లు పగులగొట్టి లోనికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. గదిలో రేవంత్తోపాటు ఆయన భార్య, కుమార్తె ఉన్నారని, వారికి రేవంత్ అరెస్ట్కు దారి తీసిన కారణాలు వివరించి వాటికి సంబంధించిన కాగితాలపై సంతకాలు కోరగా నిరాకరించారని ఆమె తెలిపారు. పోలీసులు చట్ట విరుద్ధంగా రేవంత్ను నిర్బంధించారని, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కౌంటర్కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాదికి అవకాశం ఇచ్చి తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
నిర్భయంగా ఓటు వేయాలి
ఆదిలాబాద్టౌన్: రేపు నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ సూచిస్తున్నారు. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు తగిన బందోబస్తు, ఏర్పాట్లు చేశామని వెల్లడిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా సహకరించాలని కోరుతున్నారు. పోలింగ్ నేపథ్యంలో తీసుకుంటున్న పోలీస్ బందోబస్తు చర్యలపై ‘సాక్షి’ బుధవారం ఆయనను పలకరించింది. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. సాక్షి: పోలింగ్ నేపథ్యంలో తీసుకుంటున్న బందోబస్తు చర్యలు.? ఎస్పీ: ఎన్నికల నేపథ్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు చేపడుతున్నాం. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 25 మంది ఎస్సైలు, 550 సివిల్ ఫోర్స్, 200 మంది ఏఆర్ ఫోర్స్తో పాటు నాలుగు కంపనీలకు చెందిన 400 మంది, ఏపీఎస్పీకి సంబంధించి 200 మంది, ఆదిలాబాద్కు చెందిన 165 మంది హోంగార్డులు, యావత్మాల్కు చెందిన 400 మంది హోంగార్డులు ఎన్నికల విధుల్లో ఉంటున్నారు. సాక్షి: సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి నిఘా ఏర్పాటు చేశారు..? ఎస్పీ: జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో 130 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాం. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీడియో చిత్రీకరణ చేపడుతున్నాం. బీఎస్ఎఫ్ బలగాలతో బందోబస్తు చేపట్టనున్నాం. సాక్షి: పోలింగ్ సజావుగా జరిగేలా తీసుకుంటున్న చర్యలు.? ఎస్పీ: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి జిల్లాలో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసి ఎస్ఎస్టీంలు, పోలీసుల ద్వారా జిల్లాకు వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయిస్తున్నాం. దీంతో పాటు మొబైల్ పార్టీ, స్ట్రైకింగ్ ఫోర్స్, క్లస్టర్ పెట్రోలింగ్ పోలీసులతో ప్రత్యేక భద్రత చర్యలు చేపడుతున్నాం. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఇప్పటి వరకు 400 బైండోవర్ కేసులు నమోదు చేసి 1500 మందికి పైగా బైండోవర్ చేశాం. అలాగే 17 లైసెన్స్ గల పిస్టోళ్లను స్వాధీనం చేసుకున్నాం. ఎన్నికలు జరిగే రోజున జిల్లాతో పాటు సరిహద్దు ప్రాంతాలైన మహారాష్ట్రలోని యావత్మాల్, నాందేడ్లలో మద్యం దుకాణాలు బంద్ పాటించేలా ఆ ప్రాంత అధికారులను కోరాం. సాక్షి: అక్రమంగా మద్యం, డబ్బు తరలింపుపై ఎలాంటి నిఘా పెట్టారు.? ఎస్పీ: ఎన్నికల దృష్ట్యా సరిహద్దు ప్రాంతాల నుంచి జిల్లాకు అక్రమంగా ఎలాంటి మద్యం, డబ్బు తరలించకుండా 9 ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టాం. ఈ చెక్పోస్టుల ద్వారా ఇప్పటివరకు రూ.11.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాం. దీంతో పాటు అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుకొని 114 కేసులు సైతం నమోదు చేశాం. మద్యం విలువ రూ.7లక్షల వరకు ఉంటుంది. సాక్షి: ఓటర్లను మభ్యపెడితే ఎలాంటి చర్యలు ఉంటాయి.? ఎస్పీ: ఎన్నికల నియామవళిని ఎవరూ ఉల్లంఘించరాదు. ఆయా రాజకీయ పార్టీల నాయకులు ఓటర్లను మభ్యపెడితే క్రిమినల్ కేసులు నమో దు చేస్తాం. ఓటర్లను నాయకులు పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేయరాదు. మోడల్ కోడ్ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఉదయం నుంచి రాత్రి వరకు పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. సాక్షి: ఓటర్లకు మీరిచ్చే సందేశం.? ఎస్పీ: ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక పోలీసు బలగాలతో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాం. ఓటర్లు నిర్భయంగా కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఎవరైనా భయబ్రాంతులకు గురిచేస్తే, ప్రలోభాలు పెడితే పోలీస్ కంట్రోల్ రూమ్కు 08732–226246లో సమాచారం అందించాలి. అలాగే డయల్ 100కు కూడా ఫోన్చేసి సమాచారం ఇవ్వొచ్చు. సీవిజిల్కు ఫొటోలు లేదా వీడియో తీసి పంపితే అరగంటలో అధికారులు చేరుకుని చర్యలు తీసుకుంటారు. -
సమాచారం ఇస్తే రూ.5లక్షల బహుమతి
సాక్షి, ఆసిఫాబాద్: మావోయిస్టుల సమాచారం తెలిపిన వారికి రూ.5లక్షల బహుమతి ఇస్తామని ఎస్పీ మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల భూపాలపల్లి జిల్లాలో పోలీసుల తనిఖీల్లో ఇద్దరు యాక్షన్ టీం సభ్యులు పట్టుబడ్డ నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు ఎస్పీ గోద్రుతో కలిసి నిర్వహించిన సమావేశంలో నిషేధిత మావోయిస్టు పార్టీ యాక్షన్ టీం సభ్యుల పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మావోయిస్టు పార్టీకి చెందిన యాక్షన్ టీం సభ్యులు విధ్వంసానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. యాక్షన్ టీంల సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణలో జరిగేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ప్రజాపోరాటం ముసుగులో శాంతి యుతవాతావరణం విచ్ఛిన్నం చేసేలా మావోయిస్టులు ప్రజాఆస్తులను విధ్వంసం చేసి సాధించేది శూన్యమన్నారు. జిల్లాలో నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తులు యాక్షన్ టీమ్ సభ్యులుగా ఏర్పడి రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా చేసుకొని పనిచేయుటకు అవకాశం ఉన్నందున ముందస్తుగా జిల్లా ఇతర రాష్ట్రాలతో సరిహద్దును పంచుకున్న గ్రామాల్లో వారి కదలికలను పసిగట్ట వారి చర్యలను నిర్వీర్యం చేసేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మావోయిస్టులను గుర్తించేందుకు వీలుగా వారి ఫొటోలతో కూడిన పోస్టర్ను ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విడుదల చేసినట్లు ఎస్పీ తెలిపారు. పోస్టర్లలో ఉన్న మావోయిస్టుల సమాచారం తెలిపిన వారికి పారితోషికం ఇవ్వడంతోపాటు, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా ప్రొజెక్టర్ ద్వారా మావోయిస్టుల చిత్రాలను చూపించారు. సమావేశంలో రిజర్వ్ ఇన్పెక్టర్ శేఖర్బాబు, ఐటీకోర్ సభ్యుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.