
పరమ్ సూపర్ కంప్యూటర్
న్యూఢిల్లీ: భారత శాస్త్రవేత్తలు రూపొందించిన పరమ్ యువ- 2 సూపర్ కంప్యూటర్ ప్రపంచంలో విద్యుత్ను సమర్థంగా వినియోగించుకునే కంప్యూటర్ సిస్టమ్లలో ఒకటిగా నిలిచింది. అమెరికాలోని డెన్వర్లో జరిగిన సూపర్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్(ఎస్సీ 2013)లో ఈ మేరకు ‘గ్రీన్500’ జాబితా విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీ-డాక్) తయారు చేసిన పరమ్ యువ-2 సూపర్ కంప్యూటర్ దేశంలో మొదటి స్థానంలో.. ఆసియాలో 9వ స్థానంలో, ప్రపంచంలో 44వ స్థానంలో నిలిచింది. విద్యుత్ను తక్కువగా వినియోగించుకునే కంప్యూటర్లకు ‘గ్రీన్-500’ ర్యాంకులను ప్రకటిస్తూ ఉంటుంది.