
ఏడుగంగల జాతరతో జంగమయ్య క్షేత్రం పులకించిపోయింది

సప్తగంగల వైభవాన్ని చాటుతూ జరిగిన ఏడుగంగల జాతర ప్రాభవాన్ని చూసి తరించేందుకు తరలివచ్చిన అశేష భక్తులతో శ్రీకాళహస్తి జనసంద్రమైంది

అమ్మలారా.. మమ్ము చల్లంగా చూడమ్మా అంటూ కుల, మతాలకతీతంగా భక్తిశ్రద్ధలతో కొలిచారు

కొబ్బరికాయలు కొట్టి, పిండి దీపారాధన లు చేసి, ప్రసాదాలు నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి గంగమ్మలను నిమజ్జనం చేశారు






