
శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో శనివారం ఉగాది మహోత్సవాలు ఆగమశాస్త్రానుసారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి

ఉగాది మహోత్సవాల్లో భాగంగా శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు భృంగివాహనసేవ నిర్వహించారు

ప్రత్యేక అలంకీకృతులైన అమ్మవారికి, వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు గ్రామ పురవీధుల గుండా గ్రామోత్సవం నిర్వహించారు

గ్రామోత్సవంలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారిని, భృంగివాహనాదీశులైన స్వామిఅమ్మవార్లను భక్తులు కనులారా దర్శించి కర్పూర నీరాజనాలు సమర్పించారు






























