
సాధారణంగా నటీనటులు కాంట్రవర్సీలకు దూరంగానే ఉంటారు.

కొందరు మాత్రం వివాదాల్ని వెంటేసుకుని తిరుగుతుంటారు. అలాంటి బ్యూటీనే ఊర్వశి రౌతేలా.

గతంలో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది కానీ ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తోంది.

ఈమె పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 25). ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.

ఉత్తరాఖండ్కు చెందిన ఈ బ్యూటీ.. 15 ఏళ్లకే మోడలింగ్ లోకి వచ్చింది. అలా మిస్ టీన్ ఇండియా-2009 టైటిల్ గెలుచుకుంది.

చైనాలో జరిగిన మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ 2011 టైటిల్ను కూడా గెలుచుకుంది.

ఆ తర్వాత 2013లో 'సింగ్ సాబ్ ది గ్రేట్' అనే సినిమాతో నటిగా మారింది.

హేట్ స్టోరీ 4, గ్రేట్ గ్రాండ్ మస్తీ, సనమ్ రే, పగల్పంతి తదితర చిత్రాల్లో నటించింది.

ఈమె హీరోయిన్ గా చేసిన సినిమాలు 6 వరకు ఉంటాయి. ఇవి కాక అప్పుడప్పుడు ఐటమ్ సాంగ్స్ చేస్తుంటుంది.

కానీ ఎప్పటికప్పుడు వివాదాలు, డేటింగ్ రూమర్స్ తో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్... బాలీవుడ్ నిర్మాతలైన భూషణ్ కుమార్, సమీర్ నాయర్ తదితరులతో ఊర్వశి డేటింగ్ అని అప్పట్లో రూమర్స్ వచ్చాయి.

మొన్నీమధ్య హీరో సైఫ్ పై దాడి గురించి అడిగితే ఏదేదో మాట్లాడి ట్రోలింగ్ కి గురైంది.

రీసెంట్ గా 'డాకు మహారాజ్'లో దబిడి దిబిడి ఐటమ్ పాటకు స్టెప్పులేసింది.

సోషల్ మీడియాలోనూ ఏ సెలబ్రిటీ చేయనంతగా ఎప్పుడూ హడావుడి చేస్తూనే ఉంటుంది.

పెద్దగా సినిమాలు చేయనప్పటికీ.. లగ్జరీ లైఫ్, ఆస్తులు ఎలా సంపాదిస్తుందనేది చాలామందికి ఉన్న సందేహం!

