
గతంలో మన దగ్గర జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్కి స్మిత లాంటి తారలు ప్రత్యేక పాటలతో అలరించినా.. కొన్నాళ్ల తర్వాత ఐటమ్ సాంగ్ హవా తగ్గిపోవడంతో వారంతా కనుమరుగైపోయారు.

అంతరించిన పోతున్న ఐటమ్ సాంగ్స్కి ఊపు తెచ్చిన నటి ముమైత్ ఖాన్. పూరీ జగన్నాథ్ - సూపర్స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో వచ్చిన పొకిరీలో స్పెషల్ సాంగ్ ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ ఎంత హిట్టయిందో అందరికి తెలిసిందే.

దానికి యాభై శాతం మణిశర్మ మ్యూజిక్ కారణం అయితే.. మరో యాభై శాతం ముమైత్ వేసిన స్టెప్పులే కారణం. అప్పట్లో ఏ ఈవెంట్లో చూసినా ఈ పాటే మారుమోగిపోయేది.

పోకిరి తర్వాత యోగి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, బుజ్జిగాడు, మగధీర, కెవ్వు కేక తదితర సినిమాల్లో ఐటమ్ సాంగ్కి తనదైన శైలీలో స్టెప్పులేసి అలరించింది.

పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి నటిగానూ మంచి మార్కులు కొట్టేశారు ముమైత్ ఖాన్. ఆ తర్వాత ఉన్నట్టుండి వెండితెరపై దూరమయ్యారు.

కొన్నాళ్ల తర్వాత బిగ్బాస్ రియాల్టీ షోలో మెరిసింది. ఆ తర్వాత సినిమాల్లో కానీ బయట ఎక్కడ గాని కనిపించలేదు.

ప్రస్తుతం ఈ స్పెషల్ బ్యూటీ బిజినెస్పై ఫోకస్ పెట్టింది. వ్యాపారం చేస్తూనే సినిమాల్లో నటిస్తానని చెబుతోంది.













