mumaith khan
-
మేకప్ అండ్ బ్యూటీ అకాడమీ ప్రారంభించిన సినీనటి ముమైత్ఖాన్ (ఫోటోలు)
-
వయసు చెప్పి టాలీవుడ్ని షేక్ చేసిన ఈ ‘స్పెషల్’ బ్యూటీ గుర్తుందా? (ఫోటోలు)
-
నలుగురితో రిలేషన్ ..ఒక్కరు కనెక్ట్ కాలేదు: ‘స్పెషల్’ బ్యూటీ
ఇండస్ట్రీలో కొన్ని పాత్రలు కొంతమంది నటులకే సెట్ అవుతాయి. ఆ పాత్రను చూడగానే పలానా నటుడు అయితేనే ఇలా చేయగలడు అనుకుంటాం. వారు తప్ప వేరేవాళ్లు ఆ పాత్రల్లో కనిపించినా.. అంతగా ఆకట్టుకోలేరు. అలాగే పాటలు, డ్యాన్స్ల విషయంలోనూ ఆడియన్స్ కొందరికే కనెక్ట్ అవుతారు. ఐటమ్ సాంగ్ అనగానే అందరికి గుర్తొచ్చే పేరు ముమైత్ ఖాన్(Mumaith Khan). గతంలో మన దగ్గర జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్కి స్మిత లాంటి తారలు ప్రత్యేక పాటలతో అలరించినా.. కొన్నాళ్ల తర్వాత ఐటమ్ సాంగ్ హవా తగ్గిపోవడంతో వారంతా కనుమరుగైపోయారు. ఆ తర్వాత తెలుగులో అడపా దడపా స్పెసల్ సాంగ్స్ వచ్చినప్పుటికీ.. అంతగా ఆకట్టుకోలేదు.ఇక అంతరించిన పోతున్న ఐటమ్ సాంగ్స్కి ఊపు తెచ్చిన నటి ముమైత్ ఖాన్. పూరీ జగన్నాథ్ - సూపర్స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో వచ్చిన పొకిరీలో స్పెషల్ సాంగ్ ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ ఎంత హిట్టయిందో అందరికి తెలిసిందే. దానికి యాభై శాతం మణిశర్మ మ్యూజిక్ కారణం అయితే.. మరో యాభై శాతం ముమైత్ వేసిన స్టెప్పులే. అప్పట్లో ఏ ఈవెంట్లో చూసినా ఈ పాటే మారుమోగిపోయేది. ఆ ఒక్క పాటతో ముమైత్ ‘స్పెషల్ సాంగ్’ స్పెషలిస్ట్గా మారిపోయింది. పోకిరి తర్వాత యోగి, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, బుజ్జిగాడు, మగధీర, కెవ్వు కేక తదితర సినిమాల్లో ఐటమ్ సాంగ్కి తనదైన శైలీలో స్టెప్పులేసి అలరించింది. పలు చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి నటిగానూ మంచి మార్కులు కొట్టేశారు ముమైత్ ఖాన్. ఆ తర్వాత ఉన్నట్టుండి వెండితెరపై దూరమయ్యారు.కొన్నాళ్త తర్వాత బిగ్బాస్ రియాల్టీ షోలో మెరిసింది.ఆ తర్వాత సినిమాల్లో కానీ బయట ఎక్కడ గాని కనిపించలేదు. రీసెంట్ ఈ ఐటమ్ భామ వరుస ఇంటర్వ్యూలో ఇస్తూ తన గురించి ఆసక్తికర విషయాలు చెబుతోంది. తనకు ఆ మధ్య పెద్ద యాక్సిడెంట్ అయ్యిందని, కోలుకోవడానికి టైం పట్టడంతో ఇంటికే పరిమితమైనట్లు చెప్పింది. అలాగే ప్రేమ పెళ్లి గురించి మాట్లాడుతూ.. గతంలో నలుగురితో డేటింగ్ చేశానని.. వారిలో తనకు ఒక్కరు కూడా కనెక్ట్ కాకపోవడంతో బ్రేకప్ చెప్పానని చెప్పింది. ప్రస్తుతం ఒంటరిగా హాయిగా జీవితాన్ని గడుపుతున్నానని, భవిష్యత్తులో పెళ్లి అనేది రాసుంటే ఖచ్చితంగా చేసుకుంటానని ముమైత్ చెప్పింది. -
నా చైల్డ్ హుడ్ లైఫ్ అంటే అందరికి బాగా ఇంట్రస్ట్
-
ముమైత్ ఖాన్ తన పేరెంట్స్ గురించి..!
-
ముమైత్, స్రవంతి ఎలిమినేట్, ఏడ్చేసిన బిందుమాధవి
బిగ్బాస్ నాన్స్టాప్ షోలో ఆరోవారం ఎలిమినేషన్ జరిగింది. ఈసారి డబుల్ ఎలిమినేషన్తో సర్ప్రైజ్ చేశాడు నాగ్. ఈ వారం నామినేషన్లో పది మంది ఉండగా అందులో ముమైత్ ఖాన్, స్రవంతిని ఎలిమినేట్ చేసి బయటకు పంపించేశారు. అయితే దీనికంటే ముందు నటరాజ్ మాస్టర్, యాంకర్ శివపై మండిపడ్డాడు నాగ్. లుంగీ ఎత్తుతూ నటరాజ్ను రెచ్చగొట్టేలా ప్రవర్తించడం తప్పని శివను హెచ్చరించాడు నాగార్జున. అలాగే నోటికొచ్చినట్లు మాట్లాడటం కూడా తప్పంటూ నటరాజ్ను మందలించాడు. అనంతరం అషూ డ్రెస్ను బాత్రూమ్లో కిందపడేసి తొక్కిన శివ వీడియోను ప్లే చేసి చూపించాడు. ఆ పని చేయడం కరెక్టేనా అని ప్రశ్నిస్తూ అతడికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలని బిందుమాధవిని అడిగాడు. అలా చేయడం తప్పని చెప్పిన బిందు వారం రోజులవరకు అమ్మాయిల బట్టలు ఉతకాలని చెప్పింది. దీంతో ఇదే శిక్షను ఫైనల్ చేశాడు నాగ్. అనంతరం స్రవంతి, ముమైత్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. స్రవంతి వెళ్లిపోతుంటే బిందుమాధవి ఏడ్చేసింది. ఆమె కంట్లో నుంచి మొదటిసారి కన్నీళ్లు చూస్తున్నానన్నాడు నాగ్. మరోవైపు స్రవంతి.. షోలో నుంచి వెళ్లిపోతున్నానన్న బాధ కన్నా అఖిల్, అజయ్ను మిస్ అవుతున్నానన్న బాధే ఎక్కువగా ఉందని ఎమోషనలైంది. అనంతరం తన పర్సనాలిటీని కించపరచడం నచ్చలేదంటూ నటరాజ్ మాస్టర్కు పంచ్ ఇచ్చింది. ఎవరిని హగ్ చేసుకుంటావు అన్న ప్రశ్నకు అఖిల్ పేరును చెప్తూ ఏడ్చేసింది. అలాగే అజయ్, అషూ, బిందు మాధవి, అరియానాలకు హగ్ ఇచ్చి వీడ్కోలు తీసుకుంది. చదవండి: కిరాక్ ఆర్పీ ఇల్లు చూశారా? లిఫ్ట్, హోమ్ థియేటర్.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి! చూడకూడని స్థితిలో బావను చూశాను, విడిపోదామనుకున్నా: ఏడ్చేసిన అరియానా -
Bigg Boss: డబుల్ ఎలిమినేషన్, ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు అవుట్!
బిగ్బాస్ నాన్స్టాప్ ప్రారంభమై అప్పుడే ఆరు వారాలు పూర్తి కావస్తోంది. ఇప్పటివరకు ముమైత్ ఖాన్, శ్రీరాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. వీరిలో తొలివారంలోనే ఎలిమినేట్ అయిన ముమైత్ గతవారమే రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ వారం మిత్ర శర్మ, నటరాజ్, మహేశ్ విట్టా, అషూ రెడ్డి, హమీదా, బిందు మాధవి, యాంకర్ శివ, అజయ్, స్రవంతి, ముమైత్ ఖాన్ నామినేషన్లో ఉన్నారు. ఈ పది మందిలో ముమైత్ ఖాన్, స్రవంతి, మిత్ర శర్మకు తక్కువ ఓట్లు నమోదయ్యాయని, ఈ ముగ్గురే డేంజర్ జోన్లో ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రాకరాక నామినేషన్లోకి వచ్చిన స్రవంతిని, వైల్డ్ కార్డ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ముమైత్ను ఇంటి నుంచి బయటకు పంపుతున్నారంటూ లీకువీరులు దండోరా వేస్తున్నారు. ఇక ప్రతివారం నామినేషన్లో ఉంటూ వస్తున్న మిత్రశర్మ పెద్దగా గేమ్ ఆడకపోయినా సేవ్ అవుతూ వస్తుండటం గమనార్హం. ఈసారి కూడా ఆమె ఎలిమినేట్ అయ్యేట్లు కనిపించడం లేదు. ఫలితంగా నిజంగానే ముమైత్, స్రవంతి బ్యాగు సర్దేసుకుని బయటకు వచ్చేలా కనిపిస్తున్నారు. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే రేపు నాగార్జున అధికారికంగా ప్రకటించేవరకు ఎదురు చూడాల్సిందే! చదవండి: అతడి కోసం సిగరెట్ మానేసిన ముమైత్ ఖాన్ రెండేళ్లు సహజీవనం..బ్రేకప్..20 ఏళ్లకు మళ్లీ పెళ్లి! -
ఇంటి నుంచి పారిపోయా, తిరిగెళ్దాం అనుకునేలోపు అమ్మ చనిపోయింది
బిగ్బాస్ షోలో ఈరోజు విచిత్రం జరగబోతోంది. సందు దొరికితే చాలు కారాలు మిరియాలు నూరుకునే కంటెస్టెంట్లు ఈరోజు మాత్రం ఒకరిపై ఒకరు ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఇంట్లో ఉన్న పర్ఫెక్ట్ మ్యాచ్ ఎవరో తెలుసుకోమని చెప్తూనే వారిని ఫిదా చేయాలంటూ ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. దీంతో కంటెస్టెంట్లు వారి కోపాలను పక్కనపెట్టి ఇతర హౌస్మేట్స్ను ఇంప్రెస్ చేసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ముమైత్ అజయ్ కోసం సిగరెట్ తాగడం మానేస్తానంది. అరియానా మహేశ్కోసం ఆమ్లెట్ చేయడమే కాక స్వయంగా తినిపించింది. మరోపక్క శివను కాకా పట్టే పనిలో పడింది హమీదా. ఇదిలా ఉంటే బిగ్బాస్ వీరికి మరో టాస్క్ను సైతం ఇచ్చాడు. తొలి ప్రేమ అనుభవాలను పంచుకోమని హౌస్మేట్స్ను ఆదేశించాడు. బిందుమాధవి మాట్లాడుతూ.. తన ఫస్ట్ లవ్ స్టోరీ బ్రేకప్తో ముగిసిపోయిందని చెప్పింది. స్రవంతి.. ప్రేమించిన వ్యక్తి కోసం ఇంటి నుంచి వచ్చేశానని, కానీ ఇంటికెళ్దాం అనుకునేలోపే అమ్మ చనిపోయిందని ఫోన్ వచ్చిందంటూ ఏడ్చింది. మరి వారి లవ్ స్టోరీలు తెలుసుకోవాలంటే నేడు రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: అకీరా బాక్సింగ్ వీడియో షేర్ చేసిన రేణు దేశాయ్, అవి నమ్మొద్దని విజ్ఞప్తి -
బిగ్బాస్: వారానికి ముమైత్ ఖాన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్బాస్ నాన్స్టాప్ నుంచి తొలివారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వారియర్స్ టీమ్ కంటెస్టెంట్ అయిన ముమైత్కు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్బాస్ హౌజ్ను వీడాల్సి వచ్చింది. అయితే ఆమె ముందునుంచి భయపడ్డట్టే జరిగింది. హౌజ్లో అడుగుపెట్టిన మరు క్షణం నుంచి ముమైత్ తీరు గమనిస్తే ఆమె ఆట మీద కంటే.. నామినేషన్స్ ఎలిమినేషన్ మీదే ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఆమె ప్రతి ఒక్కరి దగ్గర సింపతి గేన్ చేసే పనిమీదే ధ్యాస ఉంచినట్లు కనిపించింది. ఇలా బయటికి వచ్చిన ముమైత్.. తాను ఇంత తొందరగా బయటకు వస్తానని ఊహించలేదంటూ స్టేజ్పైనే ఎమోషనల్ అయ్యింది. చదవండి: సమంతపై దారుణమైన ట్రోల్స్.. చీచీ ఇలా దిగజారిపోతున్నావేంటి? ఇదిలా ఉంటే బిగ్బాస్లో ముమైత్ ఖాన్ రెమ్యునరేషన్ హాట్టాపిక్ మారింది. దీంతో బిగ్బాస్ నిర్వాహకులు ఆమెకు బిగ్బాస్ నిర్వాహకులు పారితోషికం ఎంత ఇచ్చారా అని ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఒక్క వారానికి రూ. 80 వేలు పారితోషికం ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దిన్ని బట్టి చూస్తే ఆమె రెమ్యునరేషన్ లక్ష రూపాయల లోపే ఉండవచ్చని సమాచారం. ఇక షో నుంచి బయటకు వచ్చేముందు హౌజ్లో విలువైన వ్యక్తులు(వర్తీ), పనికిరాని వాళ్లు(వేస్ట్) అనే ట్యాగ్ ఎవరికీ ఇస్తావని హోస్ట్ నాగార్జున అడగ్గా.. అఖిల్, అజయ్, తేజస్విని, అరియానా, అషురెడ్డిలకు వర్తీ ట్యాగ్, సరయు, మిత్ర, శివ, బిందు, ఆర్జే చైతులకు వేస్ట్ ట్యాగ్ ఇస్తానని ముమైత్ తెలిపిన సంగతి తెలిసిందే. చదవండి: నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా: మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్ -
నన్ను చూడగానే అందరూ భయపడుతున్నారు, ఆ ఐదుగురు వేస్ట్!
బిగ్బాస్ నాన్స్టాప్ షోలో మొదటి వారం ఎలిమినేషన్ జరిగింది. సరయు, మిత్ర శర్మ కాకుండా ఊహించని కంటెస్టెంట్ ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. సండే ఫండే ఎపిసోడ్లో నాగార్జున ఆమెను దగ్గరుండి బయటకు పంపించాడు. మరి ఆ సంగతులేంటో మార్చి 7 నాటి కథనంలో చూసేయండి.. సండేను ఫండే చేసేందుకు నాగార్జున హౌస్మేట్స్తో సరదా గేమ్స్ ఆడించాడు. అందులో భాగంగా రెండు టీములతో డ్యాన్సులు కూడా చేయించాడు. ఈ పోటీ వారియర్స్, చాలెంజర్స్ పోటీపడి స్టెప్పులేశారు. బిగ్బాస్ మొదలై వారం రోజులైతున్న సందర్భంగా అందరి మనసులో ఏముందో అడిగి తెలుసుకున్నాడు. అలాగే మహేశ్ విట్టా పెళ్లి గురించి ఆరా తీయగా.. అతడు మాట్లాడుతూ.. మా రిలేషన్కు ఐదేళ్లు. రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకుందామనుకున్నాం. కానీ కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వస్తూనే ఉన్నాయి. ఈ కరోనా తగ్గాక పెళ్లి చేసుకుందామని ఆగాం. త్వరలోనే అది కూడా జరుగుతుంది అని చెప్పాడు. నచ్చినవాళ్లకు ఎర్ర గులాబీ, నచ్చనివాళ్లకు నల్ల గులాబీ ఇవ్వాలని నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో మెజారిటీ ఎర్ర గులాబీలు వచ్చిన తేజస్వికి లవ్ బ్యాడ్జ్, ఎక్కువ నల్ల గులాబీలు వచ్చిన మిత్ర శర్మకు హేట్ బ్యాడ్జ్ పెట్టారు. అనంతరం ఎలిమినేషన్ జోన్లో సరయు, ముమైత్ ఖాన్ ఇద్దరే మిగిలారు. ఈసారి కూడా ఫస్ట్ వీక్లోనే వెళ్లిపోతాననుకున్న సరయు గుక్కపెట్టి ఏడ్చేసింది. ఫైనల్గా ముమైత్ ఎలిమినేట్ అని ప్రకటించడంతో సరయు కిందపడి కన్నీళ్లు పెట్టుకుంది. నా వ్యక్తిత్వం గురించి చెడుగా మాట్లాడారు, అందుకే ఎలిమినేట్ అవాల్సి వచ్చిందని ఫైర్ అయింది ముమైత్. అప్పటిదాకా గొంతులోనే దుఃఖాన్ని ఆపుకున్న ఆమె అఖిల్ను హత్తుకోగానే ఏడ్చేసింది. స్టేజీపైకి వచ్చాక కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోవడంతో నాగార్జున ఆమెను ఓదార్చాడు. తర్వాత ఆమెతో నాగ్ టాస్క్ ఆడించాడు. హౌస్లో ఉండాల్సిన ఐదుగురు, అవసరం లేని కంటెస్టెంట్లు ఎవరో చెప్పాలన్నాడు. దీనికి ముమైత్.. అఖిల్, అషూ, తేజస్వి, అజయ్, అరియానా ఉండాల్సిన వారని చెప్పింది. చైతూ, శివ, మిత్ర, సరయు, బిందు మాధవి వేస్ట్ కంటెస్టెంట్లని చెప్పుకొచ్చింది. చివరగా అఖిల్ నీ స్నేహం అంటూ పాటతో ముమైత్కు వీడ్కోలు పలికాడు. -
ముమైత్ ఎలిమినేట్.. బిందు మాధవిపై షాకింగ్ కామెంట్స్
Bigg Boss Non-Stop Buzz: బిగ్బాస్ నాన్స్టాప్.. తొలివారం పూర్తి చేసుకుంది. నో కామా నో ఫుల్ స్టాప్ అంటూ నాగార్జున మొదలుపెట్టిన ఈ షో నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్తో ముందుకి సాగుతుంది. ఫన్, ఫ్రస్టేషన్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా 17మందితో మొదలైన బిగ్బాస్ షో రసవత్తరంగా సాగుతుంది. మాజీ కంటెస్టెంట్లతో పోటీపడి మరీ కొత్త కంటెస్టెంట్లు తమదైన ఆట కొనసాగిస్తున్నారు. ఇక బిగ్బాస్ ఓటీటీలో తొలి ఎలిమినేషన్ చోటుచేసుకుంది. చదవండి: ఆర్జీవీపై యాంకర్ శ్యామల ఆసక్తికర వ్యాఖ్యలు ఈ వారం వారియర్స్ టీమ్ కంటెస్టెంట్ ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యి బిగ్బాస్ హౌజ్ను వీడింది. 24/7 డిస్నీ హాట్ స్టార్లో నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తున్న బిగ్బాస్ అన్ని సీజన్ల మాదిరిగానే బిగ్బాస్ నాన్స్టాప్ బజ్ను షోను కూడా నిర్వహిస్తోంది. ఈ షో ద్వారా ఎలిమినేట్ అయిన సభ్యులు మిగతా కంటెస్టెంట్స్పై ఉన్న తమ అభిప్రాయాన్ని చెప్పుకొవచ్చు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో యాంకర్ రవి ఈ షోకు హోస్ట్గా కనిపించాడు. ఈ సందర్భంగా రవితో కలిసి బిగ్బాస్ హౌజ్ ముచ్చట్లు చెప్పిన ముమైత్ మిగతా కంటెస్టెంట్స్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: ఎల్లలు దాటిన అభిమానం, ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఏకంగా థియేటర్నే కొనేశారు! బిందు మాధవిని నాగినితో పోల్చింది. ఇక తన తర్వాత హౌజ్ను వీడేది ఎవరని అడగ్గా.. ఆర్జే చైతూ అంటూ ధీమాగా సమాధానం ఇచ్చింది. ఇలా రవి.. ముమైత్ మనసులోని మాటలను ఎలా బయట పెట్టించాడో తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ చూసేయండి. ఇదిలా ఉంటే బిగ్బాస్ నాన్స్టాప్లో యాంకర్ రవి సందడి చేయనున్నాడంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో మొదలయ్యాక రవి కనిపించకపోవడంతో అతడి ఫ్యాన్స్ నిరాశ చెందారు. చివరికి కంటెస్టెంట్గా కాకుండా హోస్ట్గా రవికి బిగ్బాస్ నుంచి పిలుపు వచ్చిందని తెలిసి అతడి ఫాలోవర్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
బిగ్బాస్: తారుమారైన ఓటింగ్.. ముమైత్ ఖాన్ ఎలిమినేట్!
బిగ్బాస్ నాన్స్టాప్.. తొలివారం పూర్తి చేసుకుంది. నో కామా నో ఫుల్ స్టాప్ అంటూ నాగార్జున మొదలుపెట్టిన ఈ షో నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్తో ముందుకి సాగుతుంది. . ఫన్, ఫ్రస్టేషన్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా 17మందితో మొదలైన బిగ్బాస్ షో రసవత్తరంగా సాగుతుంది. మాజీ కంటెస్టెంట్లతో పోటీపడి మరీ కొత్త కంటెస్టెంట్లు తమదైన ఆట కొనసాగిస్తున్నారు. ఇక 24/7 డిస్నీ హాట్ స్టార్లో ప్రసారం కానుండటంతో ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఇక బిగ్బాస్ ఓటీటీలో మొదటి వారం నామినేషన్స్లో సరయు, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతు అరియానా గ్లోరి, నటరాజ్ మాస్టర్ ఉన్నారు. వీరిలో ఎవరు మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ జరుగుతుంది. అయితే సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం.. ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. నిజానికి మిత్రా శర్మ ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ లాస్ట్ మినిట్లో ఓటింగ్ తారుమారు అవ్వడంతో ఆమె సేఫ్ అయ్యి ముమైత్ ఎలిమినేట్ అయినట్లు లీకు వీరులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగానే ముమైత్ ఎలిమినేట్ అయ్యిందా అనేది తెలియాలంటే రేపు జరగనున్న సండే ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. -
సిగరెట్ల కోసం ఏడుస్తుంది, ముమైత్ ముఖం చూడబుద్ది కాదు: చైతూ
ఏడాదికోసారి వచ్చే బిగ్బాస్ షో అంటే బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. అంతలా షోను ఆదరించేవారి కోసం బిగ్బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు నిర్వాహకులు. ఇదివరకే పరియమున్న కంటెస్టెంట్లతోపాటు కొత్తవాళ్లను సైతం షోలోకి ఆహ్వానించి గేమ్ మొదలు పెట్టారు. అలా కొత్త, పాతల కలయికతో బిగ్బాస్ నాన్స్టాప్ మొదలైంది. మరి బిగ్బాస్ షోలో ఏం జరుగుతోంది? ఎవరు కెప్టెన్ అయ్యారు? చైతూకు, ముమైత్కు మధ్య గొడవకు కారణమేంటి? అన్న విషయాలు మార్చి 4 నాటి ఎపిసోడ్లో చూసేద్దాం.. స్మోకింగ్ రూమ్లో దమ్ము లాగుతూ ముమైత్ ఏడుస్తుండటంతో ఆమెను ఊరడించే ప్రయత్నం చేసింది అషూ. ఆమెను ఎలాగైనా నవ్వించాలనుకున్న అషూ అందుకు అఖిల్ను పావుగా వాడుకుంది. ఆ సీజన్లో ఆమె(మోనాల్)ను, ఈ సీజన్ను ఈమె(ముమైత్)ను ఎందుకు ఏడిపిస్తున్నావ్? అని సరదాగా కౌంటర్లు వేసింది. కానీ ఆమె మాటలకు అఖిల్ హర్టవడంతో తప్పు తెలుసుకున్న బ్యూటీ అతడికి క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ ఆ బాధలో నుంచి అంత త్వరగా తేరుకోలేకపోయిన అఖిల్ మోనాల్ గుర్తొస్తోందని బాధపడ్డాడు. తర్వాత బిగ్బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఉదయం లేవగానే ఎవరి ముఖం చూడాలనుకుంటారు? ఎవరి ముఖం చూడొద్దనుకుంటారో చెప్పాలన్నాడు. మొదటగా చైతూ మాట్లాడుతూ.. బిందుమాధవి ముఖం చూస్తే రోజంతా హ్యాపీగా ఉంటుందంటూ ఆమెకు హార్ట్ సింబల్ బ్యాడ్జ్ పెట్టాడు. పొద్దున లేవగానే బిగ్బాస్తో గొడవలు పడే ముమైత్ ఖాన్ ముఖం చూడకూడదనుకుంటున్నానని అసహ్యపు ఎమోజీ ఉన్న బ్యాడ్జ్ పెట్టాడు. తర్వాత తేజస్వి ముమైత్కు హార్ట్ బ్యాడ్జ్, కుళ్లు జోకులేసే అజయ్ ముఖం చూడొద్దనుకుంటున్నానని అతడికి అసహ్యపు బ్యాడ్జ్ పెట్టింది. యాంకర్ స్రవంతి.. తేజస్వికి హార్ట్ బ్యాడ్జ్, తొడపాశం పెడతానన్న అజయ్కు అసహ్యపు బ్యాడ్జ్ ఇచ్చింది. అషూ.. నటరాజ్ మాస్టర్కు హార్ట్, శివకు అసహ్యపు బ్యాడ్జ్ పెట్టింది. ఓ వైపు టాస్క్ జరుగుతుండగానే ముమైత్ ఏడుపందుకుంది. తెలుగు సరిగా రాదు కాదు కాబట్టి సరిపోయింది, లేకపోతే గుద్దుతా, నాన్సెన్స్, నన్ను టార్గెట్ చేస్తున్నాడు, నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అంటూ చైతూ ఫైర్ అయింది ముమైత్. పొద్దుపొద్దునే సిగరెట్ల కోసం ఏడుస్తుంది, అలా పొద్దున ఏడవకూడదని చెప్పాను. అది తప్పా? అని ఫ్రస్టేట్ అయ్యాడు చైతూ. వీళ్ల మధ్య ఇలా గొడవ కొనసాగుతున్న సమయంలోనే కెప్టెన్సీ టాస్క్ జరగ్గా ఇందులో తేజస్వి గెలిచి మొదటి కెప్టెన్గా అవతరించింది. తేజస్వి నటరాజ్ మాస్టర్ను రేషన్ మేనేజర్గా ఎన్నుకుంది. ఇదిలా ఉంటే బిగ్బాస్ కెప్టెన్కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. పర్మినెంట్గా బెడ్రూమ్ యాక్సెస్, లగేజీ ఉంచుకునే అవకాశాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారని అడగ్గా తేజస్వి.. అషూ పేరు చెప్పింది. దీంతో అషూ వారియర్స్తో పాటు బెడ్రూమ్లో నిద్రించే అవకాశం దక్కించుకుంది. -
బిగ్బాస్ తర్వాత లైఫే మారిందంటున్న ముమైత్ ఖాన్
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ ఐటం సాంగ్స్తో కుర్రకారుకు ముచ్చెమటలు పట్టించింది ముమైత్ ఖాన్. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒడియా, బెంగాలీ భాషల్లోని పలు చిత్రాల్లో నటించింది. బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె తక్కువకాలంలోనే స్టార్ డ్యాన్సర్గా ఎదిగింది. బిగ్బాస్ మొదటి సీజన్లో అడుగుపెట్టి వివాదాలతో, గొడవలతో సంచలనంగా మారిన ముమైత్ మరోసారి ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. కానీ అప్పటికి, ఇప్పటికి చాలా మారానంటోంది ముమైత్. తన ఆలోచనలు, కోపం, అవకాశాలు.. జీవితమే మారిపోయిందని చెప్పుకొచ్చింది. బిగ్బాస్ ఓటీటీలోకి డైనమైట్గా అడుగుపెట్టిన ముమైత్ గేమ్ప్లాన్ ఈసారి ఎలా ఉండబోతోంది? వచ్చీరాని తెలుగుతో ఆడియన్స్ను అట్రాక్ట్ చేస్తుందా? వంటి విషయాలన్నీ త్వరలో తేలిపోనున్నాయి. -
‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసు: కెల్విన్తో ఫోన్కాల్స్ మర్మమేమిటి?
సాక్షి, హైదరాబాద్: ‘టాలీవుడ్ డ్రగ్స్’ కేసు విచారణలో భాగంగా నటి ముమైత్ ఖాన్ను బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆమెను ఏడు గంటలకుపైగా విచారించారు. మనీలాండరింగ్ కోణంలో ఈ విచారణ సాగింది. ఆమె 2016–17 కు సంబంధించిన తన బ్యాంకు స్టేట్మెంట్ను అధికారులకు అందించారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్తో ఆమె జరిపిన ఫోన్, వాట్సాప్ కాల్స్పై అధికారులు ఆరా తీశారు. ఈవెం ట్ మేనేజర్ అయిన కెల్విన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించిన నేపథ్యంలోనే తనకు పరిచయమయ్యాడని ముమైత్ స్పష్టం చేశారు. సినీ రంగానికి సంబంధించిన అంశాలపైనే అతడిని సంప్రదించానని, అంతేతప్ప తనకు డ్రగ్స్ దందాతో సంబం ధాలు లేవని వివరణ ఇచ్చారు. 2015–17 మధ్య తాను పెద్దగా తెలుగు సినిమాల్లో నటించలేదని, ఎక్కువగా ముంబైలోనే ఉన్నానని చెప్పారు. చదవండి: సినీ ఈవెంట్లకే ఎఫ్ క్లబ్కు వెళ్లా పూరీ జగన్నాథ్ సినిమాల్లో ఎక్కువగా నటించానని, ఆ సందర్భాల్లోనే ఈవెంట్ మేనేజర్గా కెలి్వన్ కలిసేవాడని వివరించారు. ఎఫ్–లాంజ్ క్లబ్ సహా అనేక పబ్బులకు తాను వెళ్లిన మాట వాస్తవమేనని అంగీకరించిన ముమైత్, వీటిలో ఎక్కడా డ్రగ్స్ కొనలేదని, వాడలేదని స్పష్టం చేశారు. ముమైత్ విదేశీ పర్యటనలపైనా ఈడీ ప్రశ్నించగా సినిమా షూటింగ్స్, వ్యక్తిగత పర్యటనల నిమిత్తం గోవా, బ్యాంకాక్ తదితర ప్రాంతాలకు వెళ్లానని వివరించారు. ‘టాలీవుడ్ డ్రగ్స్’కేసు విచారణలో భాగంగా శుక్రవారం నటుడు తనీష్ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. -
కొనసాగుతున్న నటి ముమైత్ఖాన్ విచారణ
-
వైరల్ : ముమైత్ఖాన్పై సీరియస్ అయిన ఓంకార్
బుల్లితెరపై యాంకర్గా ఓంకార్కు ప్రత్యేక స్థానం ఉంది. తనదైన స్టైల్తో షో టీఆర్పీ రేటింగ్స్ పెంచడంలో ఓంకార్ ముందుంటారు. ప్రస్తుతం ఓ బుల్లితెరపై ప్రసారం అయ్యే డ్యాన్స్ షోకు ఓంకార్ హోస్ట్గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఓ గొడవలో షో జడ్జిగా వ్యవహరిస్తున్న ముమైత్ ఖాన్కు ఓంకార్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు ఏమైందంటే..జడ్జిమెంట్ టైంలో ఓ కంటెస్టెంట్కు, ముమైత్ ఖాన్కు గొడవ జరుగుతుంది. దీంతో కంటెస్టెంట్ పైకి ముమైత్ గట్టిగా అరుస్తుండటంతో ఎందుకు సీరియస్ అవుతున్నారు అంటూ ఓంకార్ ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ముమైత్ తగ్గకపోగా, ఓంకార్పై కూడా వేలు చూపిస్తూ తన కోపాన్ని ప్రదర్శించింది. ఈ సంఘటనతో సీరియస్ అయిన ఓంకార్..మీరు మీరు గొడవపడుతున్నప్పుడు నన్నెందుకు పాయింటౌట్ చేస్తున్నారు అంటూ సీరియస్ అయ్యాడు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్తో ఏం చెయ్యాలో తెలియక ముమైత్ సైలంట్ అయిపోతుంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ టెలికాస్ట్ కావాల్సి ఉంది. అయితే ఈ ప్రోమోపై సోషల్ మీడియాలో పలు మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. చదవండి : అందరు చూస్తుండగానే మోనాల్కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్! ప్రముఖ డ్యాన్స్ షోలో ప్రమాదం..కంటెస్టెంట్కు తీవ్ర గాయం! -
డిన్నర్లో మత్తు మందు ఇచ్చి.. భారీ చోరీ
సాక్షి, గచ్చిబౌలి: కూర, గ్రీన్ టీలో మత్తు మందు కలిపిన నేపాల్ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. రూ.15.10 లక్షల నగదు, రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో ఉడాయించింది. మత్తు నుంచి 11 గంటల తర్వాత తేరుకున్న ఐదేళ్ల బాలుడు అయాన్ నాన్నమ్మకు కట్టిన తాళ్లను కత్తిరించడంతో ఆ కుటుంబం ప్రాణాపాయం నుంచి బయటపడింది. సోమవారం రాత్రి రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని బీఎన్ రెడ్డి హిల్స్లో చోటుచేసుకున్న ఘటన వివరాలను మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. చౌటుప్పల్కు చెందిన బోర్వెల్ వ్యాపారి గూడూరు మధుసూదన్ రెడ్డి, శైలజ దంపతులు కుమారుడు నితీష్రెడ్డి, కోడలు దీప్తి, అయిదేళ్ల మనవడు అయాన్ రెడ్డితో కలిసి బీఎన్ రెడ్డి హిల్స్లో నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం నవీన్ అనే మధ్యవర్తి ద్వారా నేపాల్కు చెందిన రవి అలియాస్ రాజేందర్, అతని చెల్లెలు సీతతో కలిసి మధుసూధన్రెడ్డి ఇంట్లో హౌస్కీపింగ్ పనుల్లో చేరారు. రవి ద్వారా 15 రోజుల క్రితం నేపాల్కు చెందిన మనోజ్ క్లీనింగ్, అతని భార్య జానకి వంట మనిషిగా చేరారు. అక్కడే సెల్లార్లోని సర్వెంట్ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. పప్పులో కలిపి.. సోమవారం రాత్రి డిన్నర్ కోసం రైస్, చపాతి, పప్పు రెడీ చేశారు. పప్పులో మత్తు మందు కలిపారు. రాత్రి 8 గంటలకు మధుసూదన్ రెడ్డి, నితీష్, దీప్తి, అయాన్ పప్పుతో రైస్, చపాతి తిన్నారు. శైలజ మాత్రం ఉదయం వండిన కూరతో చపాతి తిన్నారు. దీంతో శైలజకు నిందితులు గ్రీన్ టీలో మత్తు మందు కలిపి ఇచ్చారు. అరగంట తర్వాత అందరూ స్పృహ తప్పారు. మధుసూదన్రెడ్డి బాత్రూంలో పడిపోయారు. ఆయన కుమారుడు, కోడలు, మనవడు బెడ్రూంలో పడిపోయారు. శైలజ హాల్లోని కుర్చీలోనే కూర్చుని స్వల్పంగా స్పృహ తప్పారు. ఆమెను నిందితులు కుర్చీకి తాళ్లతో కట్టి, బెదిరించి వివరాలు తెలుసుకుని రూ.15.10 లక్షల నగదు, రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రెండు సెల్ఫోన్లు చోరీ చేశారు. సెల్లార్లో ఉన్న శునకానికికూడా పెరుగన్నంలో మత్తు మందు కలిపిపెట్టారు. సర్వెంట్ క్వార్టర్ వద్ద ఓ లాకర్ను పగలగొట్టడంతో పాటు సీసీ టీవీ ఫుటేజీని తీసుకొని ఉడాయించారు. ఈ ఘటన రాత్రి 9 నుంచి 10 గంటలలోపే చోరీ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయాన్ తేరుకుని.. మంగళవారం ఉదయం 7 గంటలకు అయాన్ తేరుకొని నాన్నమ్మ శైలజ వద్దకు వచ్చాడు. ఆమెకు ఉన్న తాళ్లను నాన్నమ్మ చెప్పినవిధంగా కత్తిరించాడు. వారు బయటికొచ్చి సమీపంలోని సైట్ వద్ద ఉన్న వాచ్మన్ రాములును పిలిచి విషయం చెప్పారు. అతను.. శైలజ బంధువులు సూర్యారెడ్డి, ఆనంద్రెడ్డిలను తీసుకొచ్చాడు. అనంతరం 100కు కాల్ చేసి సమాచారమిచ్చారు. మధుసూదన్ రెడ్డితో పాటు కొడుకు, కోడలు, మనవడిని కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ఆస్పత్రికి తరలించారు. మధుసూదన్రెడ్డి ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని, మిగతావారు కోలుకుంటున్నట్లు డీసీపీ చెప్పారు. నిందితులు ఏడుగురు.. పక్కా ప్లాన్నే నేపాల్ గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. మొదట పనిలో చేసిన రవి ఆ తర్వాత సీతను పనిలో పెట్టించాడు. చోరీ చేయాలని ప్లాన్ చేసుకున్న తర్వాత మనోజ్, జానకిలను చేర్పించాడు. చోరీ సమయంలో వీరితో పాటు మరో ముగ్గురు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సమీప రోడ్లపై ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ట్యాబ్లెట్ల పౌడర్ కలిపి ఉండొచ్చు.. నిందితులు మత్తునిచ్చే ట్యాబ్లెట్ల పౌడర్.. కూర, గ్రీన్ టీలో కలిపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత నిందితులు వేర్వేరుగా నడుచుకుంటూ వెళ్లినట్లు వారు నిర్ధారణకు వచ్చారు. సెల్ఫోన్ నంబర్ల లొకేషన్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44, 45 వరకు చూపించిందని పోలీసులు తెలిపారు. సంవత్సరం క్రితం శామీర్పేట్ పీఎస్ పరిధిలో, గత జనవరిలో నార్సింగి పీఎస్ పరిధిలో నేపాల్ గ్యాంగ్ ఇదే తరహాలో చోరీ పాల్పడినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు. తాజా చోరీ కేసులోనూ పాత నేరస్తులు ఉండే అవకాశం ఉందనే కోణంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ముమైత్ ఖాన్పై పోలీసులకు ఫిర్యాదు పంజగుట్ట: సినీ నటి మొమైత్ ఖాన్ ఒప్పందం ప్రకారం తనకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని ఓ క్యాబ్ డ్రైవర్ మంగళవారం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి .. గత నెల 16న సినీ నటి మొమైత్ ఖాన్ కొంపల్లికి చెందిన రాజును సంప్రదించి గోవాకు వెళ్లాలని నాలుగు రోజులకు గాను రూ.22 వేలు చెల్లించేలా, రూ. 1500 బత్తా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఒప్పందం ప్రకారం నాలుగు రోజులు కాకుండా మరో నాలుగు రోజులు అదనంగా ఉందని, అదనంగా ఉన్న రోజులకు డబ్బులు చెల్లించాలని కోరగా ఇవ్వకపోగా తనను బెదిరిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. గోవా అడ్డాగా ఐపీఎల్ బెట్టింగ్! సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్స్పై రాజధానిలో పోలీసుల నిఘా పెరిగింది. నగరంలో టాస్క్ఫోర్స్, సైబరాబాద్, రాచకొండల్లో స్పెషల్ ఆపరేషన్ టీమ్ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన బుకీలు ఇతర మెట్రో నగరాలను అడ్డాగా చేసుకుని తమ దందా కొనసాగిస్తున్నారు. గోవా కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్న ముగ్గురు హైదరాబాదీలను అక్కడి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. మోర్జిమ్ ప్రాంతంలోని ఓ హోటల్పై సోమవారం దాడి చేసిన ప్రత్యేక బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. ప్రత్యేక యాప్తో బెట్టింగ్స్ ఈ త్రయం బెట్టింగ్స్ నిర్వహణకు ప్రత్యేక సాఫ్ట్వేర్తో కూడిన యాప్ వినియోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన సందీప్ పటేల్, కృష్ణకాంత్, భోజ భూపాల్ యాదవ్ క్రికెట్ బుకీలుగా మారారు. కొన్నేళ్లుగా ఈ దందా చేస్తున్న వీరు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ, ఎలాంటి మ్యాచ్లు జరుగుతున్నా తమ ‘పని’ ప్రారంభిస్తూ ఉంటారు. అయితే పోలీసుల నిఘా తప్పించుకునేందుకు వివిధ నగరాల్లో అడ్డాలు ఏర్పాటు చేసుకునే వీరికి దేశ వ్యాప్తంగా అనేక మంది పంటర్లతో (పందాలు కాసేవారు) సంబంధాలు ఉన్నాయి. లావాదేవీలను ప్రత్యేక సాఫ్ట్వేర్ కూడిన బెట్టింగ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్నారు. పంటర్లకు యూజర్ ఐడీ ఆన్లైన్ ద్వారానే పరిచయమైన పంటర్లకు ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్ కేటాయిస్తున్న వీరు అతడితో ఆన్లైన్లోనే బెట్టింగ్ కాయిస్తున్నారు. నగదు లావాదేవీలను వివిధ ఈ–వాలెట్స్ ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రతి బాల్కు సంబంధించిన మ్యాచ్ వివరాలు, బెట్టింగ్ రేష్యో తదితరాలను ఆ యాప్ వీరికి అందిస్తూ ఉంటుంది. ఈ వ్యవహారాల్లో తమకు సహకరించడానికి వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. నెల రోజులుగా గోవాలో మకాం నెల రోజుల క్రితం గోవా వెళ్లిన వీరు మోర్జిమ్ ప్రాంతంలోని ఓ హోటల్లో టూరిస్టుల ముసుగులో బస చేశారు. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి పందాలు నిర్వహిస్తున్నారు. దీనిపై అక్కడి క్రైమ్ బ్రాంచ్ అధికారులకు సోమవారం సమాచారం అందడంతో దాడి చేసిన అధికారులు ముగ్గురినీ అరెస్టు చేసి, సాఫ్ట్వేర్, యాప్లతో కూడిన సెల్ఫోన్లు, ల్యాప్టాప్, ఎల్ఈడీ స్క్రీన్లతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. గోవాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, లాడ్జిల్లో ఇలాంటి ముఠాలు మరికొన్ని మకాం వేశాయని అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారాలపై కన్నేసి ఉంచడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. గోవాలో హైదరాబాద్కు చెందిన సందీప్ పటేల్, కృష్ణకాంత్, భోజ భూపాల్ యాదవ్ అరెస్టు అయిన విషయాన్ని తెలుసుకున్న ఇక్కడి పోలీసులు స్థానికంగా వీరి వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. బహుమతులిస్తాడు...ఆ తర్వాత దోచేస్తాడు సాక్షి, హైదరాబాద్: వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని అమ్మాయిలను నమ్మించి బహూమతులతో వారిని మెప్పించి...అవసరమైతే వివాహేతర సంబంధం కొనసాగించి మరీ ఆ తర్వాత బంగారు ఆభరణాలతో ఉడాయిస్తున్న కరుడుగట్టిన నేరగాడిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇతడి అరెస్టుతో సైబరాబాద్తో పాటు ఏపీ, తమిళనాడు, గోవా రాష్ట్రాల్లో 12 కేసులు ఛేదించినట్లయ్యింది. ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సందీప్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, టంగుటూరు శివాలయం వీధికి చెందిన అబ్దూరి సోమయ్య అలియాస్ సోమయ్య చౌదరి అలియాస్ అక్కినేని కార్తీక్ దారి మళ్లించి సొత్తు దోచుకోవడంలో దిట్ట. సైబరాబాద్తో పాటు, ఏపీ, గోవా, తమిళనాడు ప్రాంతాల్లో 12 దొంగతనాలు చేశాడు. లగ్జరీ హోటల్స్లో మకాం.. తరచూ హైదరాబాద్కు వచ్చి వెళ్లే సోమయ్య మాదాపూర్, గచ్చిబౌలిలోని లగ్జరీహోటల్స్, గెస్ట్ హౌస్లలో బస చేసేవాడు ఉండేవాడు. అక్కడికి వచ్చే యువతులతో వ్యాపారవేత్తగా పరిచయం చేసుకునేవాడు. అనంతరం వారితో సన్నిహితంగా ఉంటూ బహుమతులు ఇచ్చేవాడు. కొన్నిసార్లు వివాహేతర సంబంధం కూడా కొనసాగించేవాడు. అనంతరం అదను చూసుకుని వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు ల్యాప్టాప్లు, సెల్ఫోన్లను కొట్టేసేవాడు. సొంతూరికెళ్లి జల్సాలు తన సొంతూరుకు వెళ్లి చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడు. ఇతని నేరాలపై మాదాపూర్ ఠాణాలో ఫిర్యాదు అందడంతో ఎస్ఓటీ బృందం రంగంలోకి దిగింది. టెక్నికల్ డాటాతో అతనిపై నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు మంగళవారం నగరానికి వచ్చిన అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 12 కేసులకు సంబంధించి రూ.36 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. సోమయ్యపై గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 80 కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లో స్థానిక పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయినా అతని బుద్ధి కూడా మారలేదని, మళ్లీ దొంగతనాల బాట పట్టినట్లు అదనపు డీసీపీ తెలిపారు. అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. నిందితుడిని అరెస్టు చేసిన ఇన్స్పెక్టర్ సుధీర్తో పాటు సిబ్బందిని రివార్డులతో సత్కరించారు. సెల్ఫోన్ స్నాచింగ్ గ్యాంగ్కు చెక్ సాక్షి, హైదరాబాద్: నగరంలోని రద్దీ మార్కెట్లను టార్గెట్గా చేసుకుని సెల్ఫోన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠాకు మొఘల్పుర పోలీసులు చెక్ చెప్పారు. ఈ గ్యాంగ్ సూత్రధారి పరారీలో ఉండగా పాత్రధారులైన ఐదుగురిని పట్టుకున్నామని, వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. దక్షిణ మండల డీసీపీ గజరావ్ భూపాల్తో కలిసి మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ నగరంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన బండి రాము, అక్షింతల కళ్యాణ్, మేకల జగపతి బాబు, తోట పోతురాజు, రామ్ చంద్ర ప్రధాన్, సహా ఇద్దరు మైనర్లతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ప్రశాంత్ ఆదేశాల మేరకు వీరు రద్దీగా ఉన్న మార్కెట్లు, ఇతర ప్రాంతాలకు వెళతారు. టార్గెట్గా చేసుకున్న వ్యక్తి చుట్టూ చేరే ఈ ముఠా అతడి దృష్టిని మళ్లిస్తుంది. మిగిలిన వారు అదును చూసుకుని అతడి జేబులోని సెల్ఫోన్ తస్కరిస్తారు. దొంగతనం చేసిన ఫోన్ను వీరు నేరుగా ప్రశాంత్కు అప్పగిస్తారు. అతగాడు దానిని విక్రయించగా వచ్చిన సొమ్ములో కొంత మొత్తం ముఠా సభ్యులకు ఇచ్చేవాడు. వీరు ఇదే పంథాలో నగర వ్యాప్తంగా 26 చోరీలు చేశారు. ఈ గ్యాంగ్ వ్యవహారాలపై పాతబస్తీలోని మొఘల్పుర పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన అధికారులు సూత్రధారి మినహా మిగిలిన వారిని పట్టుకున్నారు. -
పంజాగుట్ట పీఎస్లో ముమైత్ ఖాన్ ఫిర్యాదు
-
రాజు నన్ను వేధించాడు: ముమైత్ ఖాన్
సాక్షి, హైదరాబాద్: క్యాబ్ బిల్లు విషయంలో తనపై ఆరోపణలు చేస్తున్న డ్రైవర్పై నటి ముమైత్ ఖాన్ గురువారం పంజాగుట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రెండు రోజుల నుంచి నాపై జరుగుతున్న ఆరోపణలపై ఫిర్యాదు ఇచ్చాను. నా మీద వస్తున్న వార్తలు అన్ని అవాస్తవాలు.12 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నాను. నా క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. నాకు క్యాబ్ డ్రైవర్ని చీట్ చేయాల్సిన అవసరం ఏంటి. కొన్ని మీడియా చానళ్లు నా పరువుకి భంగం కలిగేలా వార్తలు ప్రసారం చేశాయి. నా క్యారెక్టర్ను జడ్జ్ చేసే అధికారం మీకు ఎక్కడిది. ఒక్కసారి ఆలోచించండి. క్యాబ్ డ్రైవర్ కి 23500 చెల్లించాను. అయినా డ్రైవర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. డ్రైవర్ రాజు నన్ను వేధించాడు. ఫ్లయిట్స్లో పెట్స్ను అనుమతించకపోవడంతో క్యాబ్లో వెళ్లాను.’ అన్నారు ముమైత్. (చదవండి: థియేటర్లో తొలి సినిమా కరోనా వైరస్: ఆర్జీవీ) ఇక తన క్యాబ్లో గోవా టూర్ వెళ్లొచ్చిన ముమైత్ రూ.15 వేల వరకు బాకీ పడిందని రాజు అనే క్యాబ్ డ్రైవర్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ మొత్తం తిరిగి చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులు గోవాకు కారు బుక్ చేసుకున్న ముమైత్ ఖాన్.. ఆ తర్వాత టూర్ని ఎనిమిది రోజులకు పొడిగించిందని రాజు తెలిపాడు. టోల్ చార్జీలకు, డ్రైవర్ అకామిడేషన్కు డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. మరో డ్రైవర్కు ఇలా జరగకూడదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. -
ముమైత్ ఖాన్ మోసం చేసింది: క్యాబ్ డ్రైవర్
-
ముమైత్ ఖాన్ మోసం చేసింది: క్యాబ్ డ్రైవర్
సాక్షి, హైదరాబాద్: సినీ నటి ముమైత్ ఖాన్ డబ్బులు ఎగ్గొట్టిందని ఓ క్యాబ్ డ్రైవర్ ఆరోపించాడు. తన క్యాబ్లో గోవా టూర్ వెళ్లొచ్చిన ముమైత్ రూ.15 వేల వరకు బాకీ పడిందని రాజు అనే క్యాబ్ డ్రైవర్ మీడియాకు తెలిపాడు. ఆ మొత్తం తిరిగి చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మూడు రోజులు గోవాకు కారు బుక్ చేసుకున్న ముమైత్ ఖాన్.. ఆ తర్వాత టూర్ని ఎనిమిది రోజులకు పొడిగించిందని రాజు తెలిపాడు. టోల్ చార్జీలకు, డ్రైవర్ అకామొడేషన్కు డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. మరో డ్రైవర్కు ఇలా జరగకూడదని అన్నాడు. ఘటనపై క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్తో చర్చించిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. (చదవండి: నా బలం నాకు తెలుసు) -
మ్యూజికల్ హారర్
‘‘మిస్టర్ 7, చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ’ వంటి చిత్రాలకు సంగీతం అందించిన మున్నా కాశీ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హేజా’ (ఎ మ్యూజికల్ హారర్). ముమైత్ ఖాన్, నూతన నాయుడు (బిగ్ బాస్ ఫేమ్), లక్ష్మణ్ (ఆర్ఎక్స్ 100ఫేమ్), లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేవీఎస్ఎన్ మూర్తి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. మున్నా కాశీ మాట్లాడుతూ– ‘‘ఒక మ్యూజికల్ హారర్గా మంచి కథతో తెరెకెక్కించాం. టీజర్కి, పాటలకి మంచి స్పందన వస్తోంది. సినిమా బాగా రావడానికి కారణమైన కేవీఎస్ఎన్ మూర్తి, సహ నిర్మాత వి.యన్జ వోలెటిగార్లకు కృతజ్ఞతలు. విజయంపై నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ‘‘ఇప్పటి వరకూ వచ్చిన హారర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు కెవీఎస్ఎన్ మూర్తి. -
రిలీజ్కు రెడీ అవుతున్న ‘హేజా’
మిస్టర్ 7, చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని మంచి ప్రశంసలు పొందారు మున్నా కాశీ. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘హేజా’. వి ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. ముమైత్ ఖాన్, బిగ్ బాస్ ఫేమ్ నూతన నాయుడు, ఆర్.ఎక్స్ 100 ఫేమ్ లక్ష్మణ్, లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ ని అందించారు.మ్యూజికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ మంచి రెస్సాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగాజరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ... ‘ఇప్పటి వరకు చాల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాను. ఫస్ట్ టైమ్ హీరోగా, దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా ఇది. ఒక మ్యూజికల్ హారర్గా అధ్బుతమైన కథాంశంతో తెరెక్కుతున్న చిత్రం. ఇప్పటికే విడుదలైన టీజర్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ తో పాటు ఆర్ఆర్ హైలెట్ గా నిలవనుంది. టెక్నికల్ గా హై రేంజ్ లో ఉండే చిత్రం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన సహనిర్మాత వి.యన్ వోలెటి, నిర్మాత కెవిఎస్ఎన్ మూర్తి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా అత్యాధునిక 5.1 మిక్సింగ్, డాల్బీ మిక్సింగ్తో రూపొందుతోంది. సినిమాకి సపోర్ట్ చేసిన అందరికి ధన్యవాదాలు. ఈ సినిమాతో ముమైత్ ఖాన్ రీఎంట్రీ ఇస్తున్నారు. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమా విజయంపై కాన్ఫిడెంట్ గా ఉన్నాం’ అన్నారు. -
వ్యూహాలు ఫలించాయా?
సుమన్ రంగనాథన్, ముమైత్ఖాన్, బెనర్జీ, వెంకట్, సంజీవ్కుమార్ ముఖ్య తారలుగా కేటీ నాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘దండుపాళ్యం 4’. వెంకట్ నిర్మించిన ఈ సినిమా అదే పేరుతో తెలుగులో ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ– ‘‘జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా? లేక విజయం సాధించారా? అనే అంశాలతో రూపొందిన చిత్రమిది. ఏడుమంది ఉన్న గ్యాంగ్కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటించారు. ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆగస్టు 15న విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘దండుపాళ్యం 1,2’ చిత్రాలకు మా సినిమాకి సంబంధం లేదు. ఇందులో కథ, కథనాలు కొత్తగా ఉంటాయి’’ అన్నారు కె.టి.నాయక్. -
అవసరమైతే కోర్టుకి వెళతాను
బెనర్జీ, వెంకట్, ముమైత్ఖాన్, సంజీవ్ కుమార్, సుమన్ రంగనాథన్ ప్రధాన పాత్రధారులుగా కేటీ నాయక్ దర్శకత్వం వహించిన చిత్రం ‘దండుపాళ్యం 4’. వెంకట్ నిర్మించారు. ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ– ‘‘మా దండుపాళ్యం 4’ చిత్రానికి ఇంతకుముందు వచ్చిన దండుపాళ్యం ట్రయాలజీకి ఎలాంటి సంబంధం లేదు. జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? పోలీసులు ఎలాంటి ఎత్తుగడలు వేశారు? అనే అంశాలతో మా ‘దండుపాళ్యం 4’ రూపొందింది. ఇందులో ఏడుగురు ఉన్న గ్యాంగ్కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటించారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘షూటింగ్ పూర్తయిన మా సినిమాను సెన్సార్కు అప్లై చేశాను. కంటెంట్ పరంగా సినిమాలో ఏదైనా సమస్య ఉంటే ఫలానా సన్నివేశాన్ని, ఫలానా డైలాగ్ని తొలగించడం జరుగుతుంది. నా సినిమాను చూసిన సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ సినిమాలో కొన్ని సీన్లు తొలగించాలి, లేకుంటే రిజెక్ట్ చేస్తానని అన్నారు. సినిమాలో ఉన్న సమస్య ఏంటో చెప్పకండా రిజెక్ట్ చేస్తాననడం మొదటిసారి చూశా. ఆ తర్వాత ఆయన ఈ సినిమాను సెన్సార్ చేయను. రివైజింగ్ కమిటీకి వెళ్లండన్నారు. ప్రస్తుతం నేను అదే పని మీద ఉన్నాను. రివైజింగ్ కమిటీనే కాదు... ట్రిబ్యునల్.. అదీ కాకపోతే కోర్టుకి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలో మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మా సినిమాతో సెన్సార్ బోర్డుకి ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సినిమాను మార్చిలో విడుదల చేస్తాం’’ అన్నారు దర్శకుడు. ముత్యాల రాందాసు, బెనర్జీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మస్త్.. ముమైత్
న్యూఇయర్ హంగామాకు సిటీ సిద్ధమవుతోంది. ఈ ఏడాది వేడుకల్లో బాలీవుడ్, టాలీవుడ్ ముద్దుగుమ్మలు డ్యాన్స్లతో హోరెత్తిస్తారని కంట్రీక్లబ్ సీఎండీ వై.రాజీవ్రెడ్డి తెలిపారు. క్లబ్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో హీరోయిన్లు మనారాచోప్రా, ముమైత్ఖాన్, షెఫాలీ జరీవాలా, మరియం జకారియాలతో కలిసి న్యూఇయర్ ఈవెంట్ పోస్టర్ను ఆవిష్కరించారు. -
బిగ్బాస్: మరో ఎలిమినేషన్.. ఇక నో రిటర్న్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరిస్తున్న బిగ్బాస్ రియాలిటీ షో విజయవంతంగా 50 ఎపిసోడ్లు పూర్తిచేసుకుంది. జూలై 16న ప్రారంభమైన ఈ రియాలిటీ షో సక్సెస్పుల్గా రన్ అవుతూ.. గత ఆదివారంతో 50 ఎపిసోడ్ల మైలురాయిని అధిగమించింది. ఎన్టీఆర్ హోస్ట్గా ఉండటం.. మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుండటంతో మంచి టీఆర్పీ రేటింగ్లో ఈ షో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 14 మంది సెలబ్రిటీలతో ప్రారంభమైన బిగ్బాస్ షో నుంచి తాజాగా నటి మొమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. ఈ వారం ఎలిమినేషన్లో జోన్లో నవదీప్, ప్రిన్స్, దీక్ష, అర్చన, మొమైత్ఖాన్లు ఉండగా.. నవదీప్, ప్రిన్స్ శనివారమే సేఫ్జోన్లోకి వెళ్లిపోయారు. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్లో దీక్ష, అర్చన సేఫ్గా ఉన్నట్టు ప్రకటించడంతో మొమైత్ఖాన్ ఇంటిదారి పట్టింది. గతంలో ఎలిమినేట్ అయినప్పటికీ మరోసారి బిగ్బాస్ హౌజ్లో గడిపేందుకు మొమైత్కు అవకాశం దక్కిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం అలాంటి రీఎంట్రీ చాన్స్ లేకుండా ఇంటికి వెళ్లిపోయింది మొమైత్. ఈ సందర్భంగా హోస్ట్ ఎన్టీఆర్ ఇచ్చిన బిగ్బాంబ్ను మొమైత్ హరితేజపై విసిరింది. ఈ టాస్క్ ప్రకారం హౌస్లో ఉన్న సభ్యులు గేమ్స్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడల్లా.. హరితేజ వెళ్లి స్విమ్మింగ్పూల్లో దూకాలంటూ మొమైత్ ట్విస్ట్ ఇచ్చింది. మొత్తానికి వినోదభరితంగా సాగుతున్న బిగ్బాస్ షోలో శనివారం నాటి ఎపిసోడ్లో ఎన్టీఆర్కు సీనియర్ యాంకర్ సుమ జతకలిసి.. షోను మరింత హుషారెత్తించారు. -
రవితేజపై సిట్ ప్రశ్నల వర్షం!
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన హీరో రవితేజకు సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్, జీశాన్తో సంబంధాలపై ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో రవితేజ సోదరులు డ్రగ్స్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై సిట్ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ‘మీ సోదరులతో మీకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయా?. కెల్విన్, జీశాన్ మీకు ఎన్నేళ్లుగా పరిచయం?. కెల్విన్తో మీకు పనేంటి...ఏ పరిస్థితుల్లో అతడు పరిచయం అయ్యాడు?. షూటింగ్ లేని సమయాల్లో ఎక్కడ ఉంటారు. మీరు ఏయే పబ్బుల్లోకి ఎక్కువగా వెళతారు?. దర్శకుడు పూరీ జగన్నాథ్తో మీకు ఎన్నేళ్లుగా పరిచయం?. మీ రక్త నమూనాలు తీసుకోవచ్చా?.’ అంటూ ప్రశ్నలు కురిపించినట్లు సమాచారం. కాగా ఈ కేసులో నోటీసులు అందుకున్న రవితేజ శుక్రవారం ఉదయం విచారణ నిమిత్తం సిట్ అధికారుల ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను కూడా సిట్ విచారణ చేసింది. ఈ కేసుల్లో నోటీసులు జారీ చేసిన వారిని వరుసగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ మాఫియా కేసులో ఇప్పటివరకూ సిట్ అధికారులు 19మందిని అరెస్ట్ చేశారు. కాగా మైక్ కమింగతో లింకులు ఉన్న మరో ఇద్దరి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. -
సిట్ విచారణకు హాజరైన హీరో రవితేజ
-
సిట్ విచారణకు హాజరైన హీరో రవితేజ
హైదరాబాద్ : ప్రముఖ హీరో రవితేజ శుక్రవారం సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న ఆయన ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి నాంపల్లిలోని అబ్కారీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే తన తరఫు న్యాయవాదుల సలహాలు తీసుకున్న రవితేజ సిట్ విచారణకు వచ్చారు. రవితేజకు తానే స్వయంగా డ్రగ్స్ సరఫరా చేసినట్లు డ్రగ్స్ మాఫియా కేసులో నిందితుడు జీశాన్ వెల్లడించడంతో ఆ కోణంలో అధికారులు ఆరా తీయనున్నారు. అలాగే కెల్విన్, జీశాన్తో గల సంబంధాలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం. మరోవైపు హీరో రవితేజను చూసేందుకు సిట్ కార్యాలయం వద్దకు భారీగా జనాలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్, సినీనటి చార్మీ, ముమైత్ ఖాన్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇక తన కుమారుడికి డ్రగ్స్ వాడే అలవాటే లేదని, ఆయన తల్లి రాజ్యలక్ష్మి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
గోవా, బ్యాంకాక్ ట్రిప్పులెందుకు?
-
గోవా, బ్యాంకాక్ ట్రిప్పులెందుకు?
పూరి, కెల్విన్ పరిచయంలో మీ పాత్రేమిటి? ముమైత్ఖాన్పై సిట్ ప్రశ్నల వర్షం ⇒ స్వేచ్ఛా జీవిని... పర్యటనలు నా హాబీ ⇒ ఈవెంట్ మేనేజర్గానే కెల్విన్ తెలుసు ⇒ సిగరెట్ తాగుతా.. డ్రగ్స్ వాడను ⇒ కావాలంటే గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ ఇస్తా ⇒ వద్దన్న సిట్ అధికారులు ⇒ ఆరు గంటల పాటు ముమైత్ విచారణ ⇒ ఆమె వెంటే బిగ్బాస్ నిర్వాహకులు ⇒ విచారణ కాగానే రాత్రి పుణేకు పయనం ⇒ నేడు సిట్ ముందుకు సినీ హీరో రవితేజ సాక్షి, హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ ముందుకు వస్తుందో రాదోననుకున్న సినీ నటి ముమైత్ఖాన్ చివరికి షెడ్యూల్ మేరకే విచారణకు హాజరయ్యారు. బిగ్బాస్ టీవీ షో షూటింగ్లో ఉన్న ఆమె గురువారం ఉదయం 10 గంటలకే నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జె.హరికృష్ణ నేతృత్వంలోని ముగ్గురు మహిళా అధికారుల బృందం ఆమెను 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 దాకా ఆరు గంటల పాటు విచారించింది. ‘‘సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ కెల్విన్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నట్టు మా వద్ద ఆధారాలున్నాయి. వారిద్దరి కాల్డేటాలో పదేపదే మీ ఫోన్ నంబర్ ఉందెందుకు? పూరికి కెల్విన్ కాల్ చేసిన వెంటనే ఒకసారి కెల్విన్ నుంచి, మరోసారి పూరి నుంచి మీ ఫోన్కు కాల్స్ వచ్చినట్టు కాల్ డేటాలో స్పష్టంగా ఉంది. దీని వెనక కారణమేమిటి?’’అంటూ ఆధారాలు ముందు పెట్టి సిట్ అధికారులు ప్రశ్నించారు. ‘‘నేను పూరి సినిమాల్లో ఎక్కువగా నటించా. కెల్విన్ ఈవెంట్ మేనేజర్ అవడం, సినీ పరిశ్రమలో బడా నిర్మాతలు, హీరోలు, దర్శకులతో పదేపదే కనిపించడం వల్ల నాకు పరిచయమయ్యాడంతే. ఈవెంట్ మేనేజ్మెంట్లు చేస్తుండటం వల్ల నాకు కాల్స్ చేస్తుండేవాడు. అంతకు మించి డ్రగ్స్ తీసుకోవడం వంటివి నాకు తెలియదు’’అని ముమైత్ బదులిచ్చినట్టు తెలుస్తోంది. కెల్విన్ చెప్పిందంతా నిజమేనా? డ్రగ్స్ దందాలో మీరూ పాత్రధారులని విచారణలో కెల్విన్ చెప్పాడని సిట్ అధికారులు ముమైత్ను ప్రశ్నించారు. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఎప్పట్నుంచి ఉందంటూ కూడా ప్రశ్నించినట్టు సిట్ వర్గాలు తెలిపాయి. తెలుగు ఇండస్ట్రీతో తనకు దూరం పెరిగిందని, ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నానని ఆమె బదులిచ్చినట్టు తెలిసింది. మూడేళ్లుగా తెలుగులో పెద్దగా సినిమాలు చేయని తనకు ఇక్కడ కెల్విన్ సరఫరా చేశాడంటున్న డ్రగ్స్తో లింకేమిటని ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. కావాలంటే తన కాల్ డేటాలో ఉన్న నంబర్లు, తన ముంబై అడ్రస్, సెల్ టవర్ లొకేషన్ల ఆధారంగా విచారించుకోవచ్చని తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. సీసీ ఫుటేజులు పరిశీలించుకోవచ్చు ‘‘హైదరాబాద్లో ఉండగా మీరు పబ్బుల్లోనే ఎక్కువ గడిపేవారన్న వార్తలున్నాయి. ఆ సందర్భంగా డ్రగ్స్ అలవాటు చేసుకున్నారా?’’అని ముమైత్ను సిట్ ప్రశ్నించింది. తాను పబ్బులకు వెళ్లడం నిజమేనన్న ఆమె, తనకు సిగరెట్ కాల్చే అలవాటుందని, డ్రగ్స్ తీసుకుంటానన్న ఆరోపణ మాత్రం సరైంది కాదని చెప్పారు. కావాలంటే పబ్బుల్లోని సీసీ కెమెరాలు పరిశీలించుకోవచ్చన్నారు. పదేపదే గోవా, బ్యాంకాక్, విదేశాలు ఎందుకు వెళ్తారని ప్రశ్నించగా, తాను స్వేచ్చ జీవినని, విదేశీ పర్యటనలు, కొత్త ప్రాంతాలు చూడటం హాబీ అని ముమైత్ బదులిచ్చారు. తాను డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమానాలుంటే తన రక్తనమూనాలతో పాటు గోర్లు, వెంట్రుకల శాంపిల్స్ ఇచ్చేందుకు సిద్దమన్నారు. అయితే ఆమె శాంపిల్స్ తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. నో లంచ్.. ఓన్లీ జ్యూస్ మధ్యాహ్నం 2.15కు ముమైత్కు సిట్ అధికారులు భోజనం ఏర్పాట్లు చేశారు. డైటింగ్లో ఉన్నానని చెప్పడంతో ఆమె కోరిక మేరకు బొప్పాయి జ్యూస్, పుచ్చకాయ ముక్కలు ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. నోరు విప్పలేదు.. ఫోన్ తీయలేదు బిగ్బాస్ షో నుంచి బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ముమైత్ ముంబై నుంచి çవిమానంలో హైదరాబాద్ వచ్చారు. బిగ్బాస్ షో ఒప్పందం ప్రకారం 70 రోజుల పాటు సెల్ఫోన్లో మాట్లాడకూడదు, షో విషయాలను షేర్ చేయకూడదు. అత్యసవరాల్లో బయటకు వెళ్లాల్సి వచ్చినా ఇతరులతో ఏమీ మాట్లాడొద్దన్న నిబంధనలున్నాయి. దీనితో నిర్వాహకుల తరఫున నలుగురు వ్యక్తులు ముమైత్తో పాటు హైదరాబాద్ వచ్చారు. ప్రైవేట్ హోటల్లో బస చేసి ఉదయం సిట్ కార్యాలయానికి కూడా వారు వచ్చారు. సాయంత్రం విచారణ పూర్తయ్యాక వారితో కలిసి ముమైత్ తాను బస చేసిన హోటల్కు వెళ్లారు. రాత్రి 7.30 ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విచారణ బాగానే జరిగిందని అక్కడ మీడియాకు చెప్పారు. రాత్రి 8.45 గంటల విమానంలో ఆమె పుణే వెళ్లినట్టు తెలిసింది. మరో ఇద్దరి విచారణ ముమైత్ విచారణ జరుగుతుండగానే సాద్ నజీర్, ముబీన్ అనే మరో ఇద్దరు వ్యక్తులను సిట్లోని మరో బృందం డ్రగ్స్కు సంబంధించి ప్రశ్నించినట్టు తెలిసింది. వీరెవరు, కేసుతో ఏం సంబంధం, కెల్విన్తో కలిసి డ్రగ్స్ దందా చేశారా, జీశాన్తో కలిసి సినీ ఇండస్ట్రీలో ఎవరికైన డ్రగ్స్ అందిచారా అనే కోణంలో విచారించినట్టు తెలుస్తోంది. మరోవైపు రాజధానిలోని పలు ప్రాంతాల్లో సిట్ బృందాలు సోదాలు కూడా నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ఇవి ఇప్పటిదాకా విచారణ ఎదుర్కొన్న వారి నివాస ప్రాంతాల్లో జరిగాయా, లేకా అరెస్టయిన వారి ఇళ్లు, కార్యాలయాల్లోనా అన్నదానిపై సిట్ స్పష్టత ఇవ్వలేదు. బుధవారం అరెస్టయిన మైక్ కమింగాకు చెందిన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. నేడు సిట్ ముందకు హీరో రవితేజ జీశాన్తో ఎనిమిదేళ్లుగా పరిచయముందంటున్న సిట్ ఆయన డ్రైవర్తోనూ జీశాన్కు లింకులు ఇప్పటిదాకా డ్రగ్ కేసులో విచారణఎదుర్కున్న వారంతా ఒకెత్తయితే, శుక్రవారం సిట్ ముందు విచారణకు రానున్న ప్రముఖ హీరో రవితేజ వ్యవహారం మరో ఎత్తు కాబోతోంది. ఇప్పటిదాకా సినీ దర్శకులు, పలువురు చిన్న హీరోలను ప్రశ్నించిన సిట్, ప్రముఖ హీరో, ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన ఉన్న రవితేజను ప్రశ్నించనుంది. రవితేజ నిజంగా డ్రగ్స్ తీసుకున్నాడా? తీసుకుని ఉంటే ఆ పరిస్థితులు ఎందుకొచ్చాయి? ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రవితేజ సోదరుడు భరత్ గతంలో డ్రగ్స్ కేసులో అరెస్టవడం తెలిసిందే. రవితేజకు అప్పటి నుంచే డ్రగ్స్ లింకున్నాయా అన్న కోణంలోనూ సిట్ ప్రశ్నించవచ్చని సమాచారం. కెల్విన్ ద్వారా రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాసరాజుకు కూడా తాను డ్రగ్స్ సరఫరా చేశానని ఈ కేసులో అరెస్టయిన జీశాన్ ఇప్పటికే సిట్కు తెలిపాడు. రవితేజతో తనకు ఎనిమిదేళ్లకు పైగా పరిచయముందని కూడా సిట్కు జీశాన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. పూరి జగన్నాథ్, కెల్విన్, రవితేజ మధ్య ఉన్న సంబంధాన్ని వెలుగులోకి తేవడంపై సిట్ ప్రధానంగా దృష్టి పెట్టవచ్చని తెలుస్తోంది. పూరి, రవితేజ కాంబినేషన్లో పలు హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. -
ముమైత్ ఖాన్.. సిట్.. ఆరున్నర గంటలు
-
ముమైత్ ఖాన్.. సిట్.. ఆరున్నర గంటలు
సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో గురువారం సినీనటి ముమైత్ ఖాన్ సిట్ విచారణ ముగిసింది. దాదాపు ఆరున్నర గంటలపాటు ముమైత్ ను నలుగురు మహిళా అధికారులు డ్రగ్స్ కేసుకు సంబంధించి పలు విషయాలపై ప్రశ్నించారు. తరచు గోవా, బ్యాంకాక్ ఎందుకు వెళతారని, ఖాళీ సమయాల్లో ఎక్కడ గడుపుతారని ముమైత్ ను అడిగారు. కాగా, ప్రస్తుతం బిగ్ బాస్ రియాల్టీలో పాల్గొంటున్న ముమైత్ ఖాన్ షో ప్రతినిధుల వెంట బుధవారం రాత్రి పుణే నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. నేటి ఉదయం శంషాబాద్లోని నోవాటెల్ హోటల్ నుంచి బిగ్ బాస్ షో ప్రతినిధులతో కలిసి నేరుగా నాంపల్లి అబ్కారీ కార్యాలయానికి వచ్చి సిట్ విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా డ్రగ్ డీలర్ కెల్విన్ తో సంబంధాలున్నాయా, డ్రగ్స్ వినియోగిస్తారా అనే ప్రశ్నలు సిట్ అధికారులు సంధించారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవకముందు ఏం పనులు చేసేవారు.. ఆపై హైదరాబాద్ నుంచి ముంబైకి ఎందుకు వెళ్లారన్న విషయాలను విచారణలో భాగంగా ముమైత్ ను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా గోవా, బ్యాంకాక్ లకు ఎందుకు వెళతారన్న సిట్ ప్రశ్నలపై ముమైత్ క్లారిటీ ఇచ్చారు. పబ్ లకు వెళ్లే అలవాట్లతో పాటు తీరిక వేళల్లో ఏ పనులు చేస్తుంటారన్న విషయాలను విచారణలో ఆమె చెప్పినట్లు సమచారం. అయితే భోజన విరామ సమయంలో ఆహారానికి బదులు కేవలం పండ్లు మాత్రమే తీసుకున్నారని అధికారులు చెప్పారు. రెండు సంవత్సరాల క్రితమే ఆమె హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చగా.. అక్కడికి ఎందుకు వెళ్లారు ఏం చేస్తున్నారన్న విషయాలపై ముమైత్ వివరణ ఇచ్చుకున్నారు. ముంబై డ్రగ్స్ మాఫియాతో సంబంధాలతో పాటు హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా లాంటి కీలక అంశాలపై ముమైత్ను విచారించారు. విచారణ అనంతరం ముమైత్ ఖాన్ విజయసంకేతం చూపిస్తూ వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు వరుసగా సిట్ ఎదుట విచారణకు హాజరు అవుతున్నారు. ముందుగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, చార్మీలను ప్రశ్నించిన సిట్... ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్తో గల సంబంధాలపై ఆరా తీసింది. నేటి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటలవరకు ముమైత్ ఖాన్ను సిట్ అధికారులు విచారించారు. రేపు (శుక్రవారం) హీరో రవితేజను సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. -
న్యాయవాదితో హీరో రవితేజ సంప్రదింపులు
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో రేపు (శుక్రవారం) సిట్ ఎదుట హాజరు కానున్న నేపథ్యంలో హీరో రవితేజ...న్యాయవాదితో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం రవితేజ రాజాది గ్రేట్, టచ్ చేసి చూడు చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ చిత్రాలకు సంబంధించి విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఆయన ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. విచారణ నిమిత్తం రవితేజ తన నివాసం నుంచి కాకుండా వేరే ప్రాంతం నుంచి సిట్ కార్యాలయానికి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మీడియా తాకిడి నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసుతో సంబంధమున్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరే సిట్ ముందుకు హాజరవుతున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉండి.. డ్రగ్స్ తీసుకుంటున్న పలువురు ప్రముఖులకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఇప్పటికే నోటీసులు జారీ చేయడంతో వారు ఈ నెల 19 నుంచి సిట్ విచారణకు హాజరు అవుతున్నారు. ఇవాళ సినీనటి ముమైత్ ఖాన్ సిట్ ఎదుట హాజరయ్యారు. కాగా, డ్రగ్స్ వ్యవహారంలో తన కుమారుడికి సంబంధం లేదని హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి చెప్పిన సంగతి తెలిసిందే. మాదక ద్రవ్యాల కేసులో రవితేజ పేరు బయటకు రావడం తనకు బాధ కలింగించిందని ఆమె అన్నారు. -
విచారణకు హాజరైన ముమైత్ ఖాన్
-
విచారణకు హాజరైన ముమైత్ ఖాన్
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటి ముమైత్ ఖాన్ గురువారం సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం ఆమె శంషాబాద్లోని నోవాటెల్ హోటల్ నుంచి నేరుగా నాంపల్లి అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. ముమైత్ వెంట బిగ్ బాస్ షో నిర్వాహకులు కూడా సిట్ కార్యాలయానికి వచ్చారు. కాగా పూణెలో జరుగుతున్న బిగ్ బాస్ షో లో పాల్గొంటున్న ఆమె...షో నుంచి అనుమతి తీసుకుని బుధవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ముమైత్ ఎయిర్పోర్టులో తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేలా ముఖానికి జర్కిన్ అడ్డుపెట్టుకొని మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయింది. కాగా సరైన చిరునామా దొరకకపోవడంతో సిట్ అధికారులు ఆమెకు ఆలస్యంగా నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు వరుసగా సిట్ ఎదుట విచారణకు హాజరు అవుతున్నారు. ముందుగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, చార్మీలను ప్రశ్నించిన సిట్... ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్తో గల సంబంధాలపై ఆరా తీసింది. శుక్రవారం హీరో రవితేజను సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. -
ఏడు పాటలకు రూ. ఏడు లక్షలు కొట్టేసింది!
విజయనగరం : ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అంటూ పోకిరి సినిమాలో ముమైత్ ఖాన్ సెప్టులేసి... ప్రేక్షకులతోపాటు కుర్రకారును మైమరిపించింది. ఆ సినిమాలో ఆ పాటకు డ్యాన్స్ వేసి ఆ చిత్ర నిర్మాతల నుంచి ఎంత పారితోషకం తీసుకుందో తెలియదు కానీ... విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం చిప్పాడ గ్రామంలో ఏర్పాటు చేసిన స్టేజ్పై ఏడు పాటలకు ముమైత్ ఖాన్ డ్యాన్స్ చేసి... ఏకంగా ఒక్కో పాటకు రూ. లక్ష చొప్పున ఏడు పాటలకు రూ. 7 లక్షలు నిర్వాహాకుల నుంచి పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. బుధవారం చిప్పాడ గ్రామంలో కొలువైన శ్రీ సుత్తమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానికంగా ప్రోగ్రాం నిర్వాహాకులు ఏర్పాటు చేశారు. అందులోభాగంగా ముమైత్ ఖాన్ డాన్స్ ప్రోగ్రాం చూడటానికి పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు చిప్పాడ చేరుకున్నారు. -
నయనతార కాదు ముమైత్ ఖాన్
సంక్రాంతి కానుకగా రిలీజ్కు రెడీ అవుతున్న నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ ఎంటర్టైనర్ డిక్టేటర్. బాలయ్య స్టైలిష్ డాన్గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఒక్క పాట మాత్రం బ్యాలెన్స్ ఉంది. భారీగా తెరకెక్కిస్తున్న ఈ పాట కోసం ముందుగా స్టార్ హీరోయిన్లను ప్రయత్నించారు చిత్రయూనిట్. బాలయ్య సరసన సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న నయనతార, ప్రస్తుతం టాలీవుడ్లో రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న ఇలియానా లాంటి తారలను ప్రయత్నించి ఫైనల్గా ముమైత్ ఖాన్ను ఫిక్స్ అయ్యారట. డిసెంబర్ 23 నుంచి హైదరాబాద్లో వేసిన సెట్లో ఈ పాట చిత్రీకరణ జరగనుంది. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి అనుకున్న సమయానికి చిత్రాన్ని విడుదల చేస్తాం అంటున్నారు చిత్రయూనిట్. బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహాన్లు నటిస్తున్న ఈ సినిమాను, ఈరోస్ ఇంటర్ నేషనల్తో కలిసి దర్శకుడు శ్రీవాస్ నిర్మిస్తున్నాడు. కోనవెంకట్, గోపి మోహన్లు కథ, మాటలు అందిస్తున్నారు. -
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
ముమైత్ఖాన్. ఈ పేరు వింటే ఆరేళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఖుషీ అయిపోతారు. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ తెలుగు ప్రేక్షకులను.. మమ్మీ డాడీ యారుం వీటిల్ ఇల్లై అంటూ తమిళ తంబిల గుండెల్లో గుబులు పుట్టించిన శృంగార నర్తకి ముమైత్ఖాన్. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ అంటూ యావత్ భారతదేశ సినీ అభిమానులను ఉర్రూతలూగించిన మాస్ గ్లామరస్ డాన్సర్. కొన్ని చిత్రాల్లో నాయికగా కూడా నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ 200ల చిత్రాలకు పైగా ఐటమ్సాంగ్స్ చేశారు. తాను ఆడటానికే పుట్టానేమో నంటారు. డాన్స్కు అడిక్ట్ అయ్యానని చెప్పే ఈ బ్లాక్ బ్యూటీ తాను తొలిసారిగా రూపొందించిన మ్యూజిక్ ఆల్బమ్కు అడిక్షన్ అనే పేరును నిర్ణయించారు. ముమైత్ఖాన్ అనూహ్యంగా ఈ పాప్ మ్యూజిక్ ఆల్బమ్పై మొగ్గు చూపించడానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన గాయని షకీరానే స్ఫూర్తి అంటారు. ఈ గాయనీమణి రచయిత్రి మ్యూజిక్ ఆల్బమ్ చూసి తానూ అలాంటి ప్రయత్నం చేయాలనే కోరిక కలిగిందని చెప్పారు ముమైత్ఖాన్. ఆ ప్రయత్నంలో భాగమే ఈ అడిక్షన్ ఆల్బమ్ అన్నారు. 9 ఎక్స్ ఓ, ఎంటీవీ లాంటి అంతర్జాతీయ చానళ్లలో ఈ అడిక్షన్ మ్యూజిక్ ఆల్బమ్ పలుసార్లు ప్రచారమై ముమైత్ఖాన్ను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిందట. అంతేకాదు తొలి ఏషియన్ మ్యూజిక్ ఆల్బమ్గా ఈ అడిక్షన్ గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉందంటున్నారు ముమైత్ఖాన్. ఈ అడిక్షన్ ఆల్బమ్ను ముమైత్ఖాన్ బుధవారం చెన్నైలో ఆవిష్కరించారు. ఇందులోని పాటలకు ముమైత్ఖాన్ ఆడి పాడడం విశేషం. -
పిచ్చెక్కిస్తున్న ముమైత్ ఖాన్ ఆల్బమ్
-
కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ముమైత్ ఖాన్ ఆల్బమ్
ఐటమ్ గర్ల్ ముమైత్ ఖాన్ కుర్రకారుకు పిచ్చెక్కించేవిధంగా ఆల్బమ్ రూపొందించారు. ఆ ఆల్బమ్ జనం ముందుకు వచ్చేసింది. ముమైత్ ఖాన్ను ప్రేక్షకులు మరచిపోకపోయినా, దర్శక, నిర్మాతలు మాత్రం మరచిపోయారని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఏ దర్శక,నిర్మాత డ్యాన్స్ గర్ల్కు అవకాశం ఇవ్వడంలేదు. గత కొద్దికాలంగా ముమైత్ ఏ చిత్రంలో నటించలేదు. ఈ పరిస్థితులలో అందరికీ మతిపోయేవిధంగా తన ఆల్బమ్తో అదరగొడుతోంది. తన అందచందాలు - హావభావాలు - చిలిపి చూపులు - కుర్రకారుని రెచ్చగొట్టే డ్యాన్సలతోపాటు తన సెక్సీ వాయిస్తో ఈ ఆల్బమ్ను విడుదల చేసింది. ఇంకేముంది కుర్రకారు మరింత కిర్రెక్కిపోతున్నారు. ముమైత్ ఖాన్ పేరు చెప్పగానే మనకు దాదాపు ఏడేళ్ల క్రితం పూరీ జగన్నాథ్ - మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'పోకిరి' సినిమాలోని 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' పాట గుర్తొస్తుంది. పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఈ పాట కూడా అదే స్థాయిలో జనాన్ని ఉర్రూతలూగించింది. దీంతో ముమైత్ ఖాన్ రేంజి రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ ముద్దుగుమ్మ దుమ్ము రేపేసింది. ఎంత పదారేళ్ల వయసు అయినా, కొంత కాలానికి మొహం మొత్తుతుంది కదా!. అలా ముమైత్ తెర వెనక్కు పోయింది. అయినప్పటికీ నిరుత్సాహ పడటం లేదు. ముమైత్లో యాక్టివ్నెస్ గానీ, ఆ ఊపుగానీ ఏమీ తగ్గలేదు. ఇప్పుడు కొత్త అవతారంలో జనం ముందుకొచ్చింది. అడిక్షన్ పేరుతో ఓ పాట పాడి ఆల్బమ్ను రెండు రోజుల క్రితం విడుదల చేసింది. నాలుగు నిమిషాల ఈ ఆల్బమ్లో మళ్లీ తన సత్తా చూపింది. దీంతో మళ్లీ తనకు ఆఫర్లు వస్తాయనే ఆశతో ముమైత్ ఖాన్ ఉంది. ఆమె ఆశ నెరవేరాలని ఆశిద్ధాం. - శిసూర్య -
ముమైత్ స్పెషల్ సాంగ్
జై ఆకాష్ హీరోగా తెలుగులో ‘ఆదివారం అమావాస్య’ పేరుతోనూ, తమిళంలో ‘అమావాస్య’ గానూ ఓ చిత్రం రూపొందుతోంది. బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీసావంత్ సోదరుడు రాకేష్ సావంత్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇటీవలే జై ఆకాష్, ముమైత్ఖాన్పై ఓ ఐటమ్ సాంగ్ చిత్రీకరించారు. ఈ సాంగ్లో 40 మంది డ్యాన్సర్లు, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ పాట చాలా మెస్మరైజింగ్గా ఉంటుందని, ముమైత్ఖాన్ పేరు మళ్లీ మార్మోగడం ఖాయమని రాకేష్ సావంత్ చెప్పారు. కోట శ్రీనివాసరావు, జీవ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సయ్యద్ అహ్మద్. ఎడిటింగ్: అనిల్ బొంతు, రచన: దిలీప్ మిశ్ర, రాకేష్ సావంత్, సహనిర్మాత: కె.కె. అగర్వాల్.