సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో గురువారం సినీనటి ముమైత్ ఖాన్ సిట్ విచారణ ముగిసింది. దాదాపు ఆరున్నర గంటలపాటు ముమైత్ ను నలుగురు మహిళా అధికారులు డ్రగ్స్ కేసుకు సంబంధించి పలు విషయాలపై ప్రశ్నించారు. తరచు గోవా, బ్యాంకాక్ ఎందుకు వెళతారని, ఖాళీ సమయాల్లో ఎక్కడ గడుపుతారని ముమైత్ ను అడిగారు. కాగా, ప్రస్తుతం బిగ్ బాస్ రియాల్టీలో పాల్గొంటున్న ముమైత్ ఖాన్ షో ప్రతినిధుల వెంట బుధవారం రాత్రి పుణే నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. నేటి ఉదయం శంషాబాద్లోని నోవాటెల్ హోటల్ నుంచి బిగ్ బాస్ షో ప్రతినిధులతో కలిసి నేరుగా నాంపల్లి అబ్కారీ కార్యాలయానికి వచ్చి సిట్ విచారణకు హాజరయ్యారు.