Top Stories
ప్రధాన వార్తలు

రైతులకు బాసటగా వైఎస్సార్సీపీ: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఏపీలో అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం సరైన చర్యలేవీ చేపట్టలేదని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఏపీలో అకాల వర్షాలపై పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనాయకులతో సోమవారం వైఎస్ జగన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించండి.. వారికి ధైర్యం చెప్పండి. రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక ధాన్యఙ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రబీ సీజన్లో కూడా కష్టాలు పడటం ఆవేదన కలిగిస్తోంది. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కళ్లాల్లో, పొలాల్లో రైతులవద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడంలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అకాల వర్షాలవల్ల మరింతగా నష్టపోతున్నారు. యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. రైతులకు బాసటగా నిలవాలి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని కేడర్కు వైఎస్ జగన్ సూచించారు.

వక్ఫ్ చట్టం చట్టబద్ధతపై కాసేపట్లో ‘సుప్రీం’ విచారణ
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం(Waqf Amendment Act) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు మరోసారి రానున్నాయి. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పిటిషన్లపై విచారణ జరపనుంది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఇవాళ వాదనలు వినిపించే అవకాశం ఉంది.వక్ఫ్ (సవరణ) చట్టం2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖయ్యాయి. ఇప్పటికే పలుసార్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కేంద్రం విజ్ఞప్తి మేరకు నేటి వరకు గడువు ఇచ్చింది. గత విచారణ సమయంలో చట్టంలోని రెండు వివాదాస్పద నిబంధనలను తాత్కాలికంగా కేంద్రం నిలిపివేసింది. మే 5వ తేదీ వరకు వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపింది. గత వాదనల్లో.. వక్ఫ్ కౌన్సిల్, బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించొద్దని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. గత విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. అన్నిరకాలుగా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొంది. ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి వాదనలు వినకపోవడం సముచితం కాదని పేర్కొన్నారు. మరోవైపు.. వక్ఫ్గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించొద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో ఎక్స్అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే అయ్యుండాలనీ చెప్పింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్ అఫీషియో సభ్యులను నియమించొచ్చని.. ఈ మేరకు వక్ఫ్(సవరణ) చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదించింది.

ఈనాడు పేపర్నే కూటమి సర్కార్ ఫాలో అయ్యేది: ఉండవల్లి
తూర్పుగోదావరి, సాక్షి: సీనియర్ పోలీస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనాడు పత్రికకు ఆంజనేయులిపై చాలా కక్ష ఉండి ఉండొచ్చని.. ఈ అరెస్ట్ పోలీస్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలని అన్నారాయన. ఈ కేసులో అసలు ముంబై నటి ని రేప్ చేసారన్న వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారు?. ఆంజనేయులు లాంటి అధికారులను వేధించడం సరికాదు. ఇలా అయితే పోలీసులు ఎలా పని చేస్తారు?. ముంబైలో నమోదైన కేసులో ఏం జరుగుతుందో?. ఈనాడు పేపర్కు ఆంజనేయులిపై కక్ష చాలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈనాడు పేపర్లో ముందురోజు ఏమి వస్తుందో.. ఆ తర్వాతి రోజు ప్రభుత్వం అదే ఫాలో అవుతోంది అని ఉండవల్లి అన్నారు. ఆంధ్రా నుంచి ఎవరూ మాట్లాడరా?ఏపీ రీఆర్గనైజేషన్ చట్టానికి సంబంధించి 11 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేసిన రోజు ఇదేనని ఉండవల్లి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకూ అఫిడవిట్ ఫైల్ చేయలేదు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. నేనే 43 సార్లు పార్టీ ఇన్ పర్సన్ గా కోర్టుకు హాజరయ్యాను. విభజన చట్టంలో ఆంధ్రా కు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వండని కోర్టును కోరాం. ఆంధ్ర నుంచి ఈ విషయం ఎవరూ మాట్లాడరు. పబ్లిక్ మీటింగ్లో మాత్రం ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు.. కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా స్పందించారు.. అందుకే ఆయనకు లెటర్ రాశాను.. ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ ను తీసుకువచ్చి వాదన వినిపించమని కోరుతున్నా. ప్రజాస్వామ్యానికి అతి ప్రధానమైన ఆర్టికల్ 100 లోక్సభలో ఏపీ రిఆర్గనైజేషన్ చట్టం చేసే సమయంలో సక్రమంగా అమలు కాలేదు అని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

IND vs ENG: బుమ్రాకు షాక్.. వైస్ కెప్టెన్గానూ అవుట్!
గత కొంతకాలంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఇంగ్లండ్లో సత్తా చాటి పూర్వ వైభవం పొందాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్తో సిరీస్లో నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు సీనియర్ టీమ్, భారత ‘ఎ’ జట్టు కోసం కలిపి ఇప్పటికే ప్రాథమికంగా 35 మంది ప్రాబబుల్స్ను ఎంపిక చేశారు. ఇందులో కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma)పేరు దాదాపుగా ఖరారు కాగా.. వైస్ కెప్టెన్ ఎవరన్న అంశంపై సందిగ్దం నెలకొంది.నిజానికి స్వదేశంలో న్యూజిలాండ్తో 3-0తో క్లీన్స్వీప్, ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (BGT)ని చేజార్చుకున్న తర్వాత రోహిత్ టెస్టు భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గానూ అతడు విఫలం కావడంతో ఇక సంప్రదాయ ఫార్మాట్కు వీడ్కోలు పలుకుతాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కెప్టెన్గానే కాదు.. వైస్ కెప్టెన్గానూ బుమ్రా అవుట్!ఈ నేపథ్యంలో రోహిత్ స్థానాన్ని పేస్ దళ నాయకుడు, టెస్టు జట్టు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో భర్తీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం రోహిత్నే కెప్టెన్గా కొనసాగించేందుకు మొగ్గు చూపిన బోర్డు.. బుమ్రా పేరును కనీసం వైస్ కెప్టెన్సీ రేసులోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘ఐదు టెస్టులకూ అందుబాటులో ఉండే ఆటగాడికే వైస్ కెప్టెన్ ఇవ్వాలని భావిస్తున్నాం.నిజానికి బుమ్రా ఈ పర్యటనలో అన్ని మ్యాచ్లు ఆడడు. కాబట్టి కెప్టెన్కు డిప్యూటీగా వేర్వేరు మ్యాచ్లలో వేర్వేరు ఆటగాళ్లను నియమించలేము. అందుకే ఐదు టెస్టులు ఆడే ఆటగాడినే వైస్ కెప్టెన్గా ఎంపిక చేస్తాం’’ అని పేర్కొన్నాయి.గాయం తిరగబెట్టే అవకాశం!కాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఐదింట రెండు టెస్టులకు కెప్టెన్గా వ్యవహరించడంతో పాటు.. పేస్ దళం భారం మొత్తాన్ని బుమ్రానే మోశాడు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2023-25 సీజన్లో ముప్పై రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కానీ ఈ సిరీస్లో భారత్ ఓడిపోయింది. మరోవైపు.. ఆఖరిదైన సిడ్నీ టెస్టులో బుమ్రా గాయపడ్డాడు.వెన్నునొప్పి తిరగబెట్టడంతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొత్తానికి బుమ్రా అందుబాటులో లేకుండా పోయాడు. ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్లకూ అతడు దూరమయ్యాడు. దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరంగానే న్నాడు.ఈ క్రమంలో బుమ్రా ఫిట్నెస్ దృష్ట్యా ఇంగ్లండ్లోనూ అతడిని వరుస మ్యాచ్లలో ఆడిస్తే మళ్లీ గాయం తిరగబెట్టే అవకాశం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.బుమ్రా వంటి విలువైన ఫాస్ట్ బౌలర్ను కాపాడుకోవాలంటే.. ఒక టెస్టు ముగిసిన తర్వాత రెండో టెస్టు కోసం అతడికి విశ్రాంతినివ్వాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రాపై పనిభారం తగ్గించే విషయంలో సెలక్టర్లు కూడా ఓ నిర్ణయానికి వచ్చారని.. అందుకే వైస్ కెప్టెన్సీ రూపంలో అదనపు బాధ్యతల నుంచి కూడా తప్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.రేసులో ఆ మూడు పేర్లుఒకవేళ బుమ్రాను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్ల ఎవరన్న చర్చ ఇప్పటికే మొదలైంది. రిషభ్ పంత్ లేదంటే.. శుబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ల పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, అసలే ఇంగ్లండ్తో టెస్టులు కాబట్టి యువ ఆటగాళ్ల వైపు మొగ్గుచూపకుండా.. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్లకు బోర్డు బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు. కాగా టీమిండియా ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. మే 25న క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్ జరుగనుండగా.. ఆ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.చదవండి: PBKS VS LSG: అప్పుడే అంతా అయిపోలేదు: లక్నో కెప్టెన్ పంత్

సీమ రాజా, కిర్రాక్ ఆర్పీలాంటోళ్లను చట్టం వదలదు: అంబటి
గుంటూరు, సాక్షి: తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని.. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్ మీడియాలో పార్టీ మీద, పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే వాళ్లను వదలబోమని, చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరతామని అన్నారాయన.సోమవారం పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ సోషల్ మీడియా వింగ్ వైఎస్సార్సీపీపై, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై, తనపైనా తప్పుడు ప్రచారం చేస్తోంది. అందుకే ఐటీడీపీపై ఫిర్యాదు చేశాం. అలాగే.. వైఎస్సార్సీపీ కండువా చేసి ప్రేలాపనలు చేసే సీమ రాజా అనే వ్యక్తిపైనా, మాజీ మంత్రి రోజా తదితరులపైనా వీడియోలు చేసే కిర్రాక్ ఆర్పీపైనా ఫిర్యాదు చేశాం.గతంలోనూ మేం ఫిర్యాదులు చేశాం. కానీ, పోలీసులు చర్యలు తీసుకోలేదు. అందుకే ఈసారి రసీదు తీసుకున్నాం. మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. అందుకే టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీస్ వ్యవస్థ టీడీపీ గుప్పిట్లో ఉంది. పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టులకు వెళ్తాం.ఐటీడీపీ పేరుతో చంద్రబాబు, లోకేష్ ప్రొత్సహంతో వైఎస్సార్సీపీ నేతలపై ప్రేలాపనలు చేస్తున్నారు. పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తాం. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుంది. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. పార్టీ ఇన్ పర్సన్గా నా ఆవేదనను నేనే స్వయంగా వినిపిస్తా. చట్టం సీమ రాజాను, కిర్రాక్ ఆర్పీ లాంటి వాళ్లను చట్టం వదలదు. ఎంత పెద్దవారు అయినా శిక్ష నుంచి తప్పించుకోలేరు.

శ్రీతేజ్ను పరామర్శించిన నిర్మాత అల్లు అరవింద్, బన్నీవాసు
సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్(Sri Tej )ను సోమవారం ఉదయం నిర్మాతలు అల్లు అరవింద్(Allu Aravind), బన్నీ వాసు పరామర్శించారు. కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్ ప్రస్తుతం ఏషియన్ ట్రాన్స్కేర్ రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న నిర్మాతలు, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.శ్రీతేజ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీ వాసు అతని యోగక్షేమాలను నిరంతరం అడిగి తెలుసుకుంటున్నారు. శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులతోపాటు, అతని కుటుంబానికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ ఆర్థిక సహాయం అందించారు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని, సాధారణ స్థితికి చేరే వరకు, భవిష్యత్లో అతనికి ఏ అవసరమైనా అతనికి, అతని కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నుంచి రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స వరకు, అల్లు అరవింద్, బన్నీ వాసుల ద్వారా శ్రీతేజ్ ఆరోగ్య వివరాలను అల్లు అర్జున్ నిరంతరం తెలుసుకుంటున్నారు.

పవన్ మర్చిపోవచ్చు.. మోదీ కూడా యూటర్న్!
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎన్నికైన తొలి నాళ్లలో అందరికీ నరేంద్ర మోదీ అంటే బాగా గౌరవం ఉండేది. కానీ, కాలం గడిచే కొద్ది ఆయనలో రాజనీతిజ్ఞుడు బదులు ఫక్తు రాజకీయవేత్త కనిపిస్తున్నారు. సొంత అవసరాలకోసం అవకాశవాద రాజకీయాలు చేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదేమో అన్న అభిప్రాయం కలిగేలా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది.అమరావతి పనుల పునః ప్రారంభానికి మోదీ ఏపీకి వచ్చిన సందర్భంలో జరిగిన సభ, ఆయనతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల స్పీచ్ గమనిస్తే, ప్రజలను మభ్య పెట్టడానికి ఒకరికొకరు పోటీ పడినట్లు కనిపిస్తుంది. దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఒక విధంగా తండ్రి పాత్రలో ఉన్నట్లు లెక్క. కుటుంబంలోని పిల్లలు ఎవరైనా తప్పుడు మార్గంలో ఉంటే తండ్రి ఏ రకంగా మందలిస్తారో, అదే రీతిలో మోదీ కూడా రాష్ట్రాలలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపి అలా చేయవద్దని చెప్పాలి. కానీ, దురదృష్టవశాత్తు, అందుకు విరుద్దంగా ఆయన కూడా అల్లరిచేసే పిల్లాడిని గారాబం చేసినట్లు వ్యవహరిస్తున్నారన్న సందేహం వస్తుంది.ఏపీలో ఇప్పటికే పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో.. అందులోనూ తానే గతంలో ఒకసారి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి మళ్లీ వచ్చి అదేమీ తప్పు కాదన్నట్లు ఉపన్యసించి వెళ్లారు. దేశంలో కొత్తగా వచ్చిన రాష్ట్రాలలో ఏర్పడిన రాజధానులలో అవసరమైన భవనాల నిర్మాణాలకు ఎంత ఖర్చు అయింది మోదీకి తెలిసే ఉండాలి. ఎన్ని వేల ఎకరాల భూమి ఆ రాష్ట్రాలు సేకరించాయన్న సమాచారం ఆయన వద్ద ఉండి ఉండాలి. ఏపీ తప్ప మిగిలిన కొత్త రాష్ట్రాలలో లక్ష ఎకరాల భూమి సమీకరించలేదు. ఆ రాష్ట్రాలలో నేతలు తామే నగరాలు నిర్మిస్తామని చెప్పి, రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చలేదు. కానీ ఏపీలో మాత్రం తొలుత ఏభైమూడువేల ఎకరాలు సిద్దం చేసుకుని, తిరిగి ఇంకో 44వేల ఎకరాలు తీసుకుంటామని చెబుతుంటే మోదీ వారించనవసరం లేదా?.అసలు ఇంత భూమి తీసుకుని ఏమి చేస్తారు?. మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ఎందుకు ఈ స్థాయిలో తీసుకుంటున్నారు? అని అడగాలా?లేదా?. తెలంగాణలో 400 ఎకరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో అభివృద్ది పనులు చేపట్టాలని తలపెడితే, పర్యావరణం దెబ్బతినిపోయిందని గగ్గోలు పెట్టిన ఆయన లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసానికి ఎందుకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా?. అలా చేయకపోగా తగుదునమ్మా అంటూ ఆ పర్యావరణ విధ్వంసంలో తాను కూడా భాగస్వామి అవడం మోదీ ప్రత్యేకత అనుకోవాలి. ఇదే అమరావతికి సంబంధించి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును ఏ స్థాయిలో మోదీ విమర్శించారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవినీతి కోసమే పధకాలను తయారు చేస్తున్నారని, రాజధాని నుంచి అన్నిటా అవినీతి రాజ్యమేలుతోందని చంద్రబాబుపై ధ్వజమెత్తిన మోదీ, ఇప్పుడు చంద్రబాబు గొప్ప పని చేస్తున్నారని మెచ్చుకోవడం అవకాశవాదం అవ్వదా?.అమరావతి ఏపీకి ఒక శక్తి అవుతుందని అన్నారు. నిజంగా అలా జరిగితే ఎవరూ కాదనరు. కానీ, అదెలా సాధ్యం?. అందుకోసం అయ్యే లక్షల కోట్ల వ్యయం ఎక్కడ నుంచి వస్తుందో మోదీ చెప్పాలి కదా!. ఏపీ ప్రభుత్వం సుమారు లక్ష కోట్ల పనులు చేపడుతోందని మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో 33వేల ఎకరాల భూమిలో మౌలిక సదుపాయాల కల్పనకు లక్షాతొమ్మిదివేల కోట్ల రూపాయలు అవసరం అని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. ఆ లేఖను మోదీ సర్కార్ చెత్తబుట్టలో పడేసినట్లుగా పక్కనబెట్టేసి కేవలం 2500 కోట్ల రూపాయలు మాత్రం మంజూరు చేసింది. తాజాగా 2024 ఎన్నికలలో మళ్లీ స్నేహం కుదిరింది కనుక మోదీ, చంద్రబాబు ఒకరినొకరు పొగుడుకుంటూ జనాన్ని పిచ్చోళ్లను చేస్తున్నారు. చంద్రబాబును యూటర్న్ బాబు అని, పోలవరం, అమరావతిలను ఏటీఎంల మాదిరి వాడుకుంటున్నారని గతంలో ధ్వజమెత్తిన మోదీ.. ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడంలో చంద్రబాబుకు అనుభవం ఉందని అంటున్నారు. మోడీ కూడా యూటర్న్ తీసుకున్నట్లే కదా!.ప్రస్తుతం లక్ష కోట్లు వ్యయం చేస్తామని చెబుతున్న ఏపీ ప్రభుత్వానికి ఆ మొత్తం కేంద్రం నుంచి వచ్చే అవకాశమే లేదు. అదంతా రుణమే. అంటే అమరావతిని అప్పుల చిప్పగా మార్చుతున్నారన్నమాట. అమరావతి సభలో ఒక్క నయాపైసా కూడా కొత్తగా ఇస్తున్నట్లు మోదీ చెప్పలేదు. ఇదంతా అయ్యే పని కాదని, లక్షల కోట్ల అప్పు భారం ఏపీ ప్రజలపై పడుతుందని తెలిసి కూడా మోదీ మాట మాత్రం కూడా హెచ్చరించకపోవడం దారుణంగా ఉంటుంది. ఇప్పటికే ఒక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు ఉన్నాయి కదా!. మళ్లీ ఆ స్థాయిలో నిర్మాణాలు చేపట్టవలసిన అవసరం ఏమిటి అని ప్రధాని హోదాలో ప్రశ్నించలేదు.అంతేకాదు.. కేవలం రెండువేల మంది పనిచేసే సచివాలయానికి ఏభై, నలభై అంతస్తుల టవర్లు దేనికి అని అడగలేదు. ఏపీలో కూటమి నేతలు కోరగానే వాటికి మరోసారి శంకుస్థాపన చేసేశారు. దీనిపై సోషల్ మీడియాలో చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ జరగాలన్న పిచ్చి కవిత్వాన్ని ప్రస్తావిస్తూ ఎద్దేవ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున కూడా చిన్న, చిన్న రోడ్ల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేసి అవేదో చాలా పెద్ద పనులు అన్నట్లుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నం జరిగినట్లు అనిపిస్తుంది. మండుటెండలో లక్షల సంఖ్యలో జనాన్ని బలవంతంగా అధికార యంత్రాంగం ద్వారా తరలించి వందల కోట్లు ఖర్చు చేయడం మినహా ఏమీ ప్రయోజనం జరిగిందన్నది ప్రశ్నగా ఉంది.సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రజలను మోసం చేస్తున్న నేపధ్యంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలలో పెరుగుతున్న నిరసనను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు అనిపిస్తుంది. బీజేపీ కూడా కూటమిలో భాగస్వామి కనుక ప్రధాని కూడా ఒక పాత్ర పోషించారనుకోవాలి. చంద్రబాబు తన ప్రసంగంలో మోదీని ఆకాశానికి ఎత్తివేశారు. ఒకప్పుడు మోదీ అంత అవినీతిపరుడు లేడన్న నోటితోనే, మోదీ ప్రపంచంలోనే పవర్ పుల్ నేత అని, 2047 నాటికి వికసిత్ భారత్ ఆయన వల్లే సాధ్యమని చెబుతున్నారు. 2047 నాడికి మోదీకి 96 ఏళ్లు వస్తాయి. అప్పటి వరకు ఆయనే దేశానికి సారధ్యం వహించడం సాధ్యమేనా అని ఎవరు అడుగుతారు!. మరో పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పొగిడినట్లే ఇది కూడా ఉంది. మోడీ ఒకటి, రెండు అంశాలలో చంద్రబాబును పొగిడినా, మరీ అతి చేయలేదు.కానీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు మాత్రం హద్దులు లేకుండా పొగిడారు. ఒకరకంగా నమో సంకీర్తన చేశారనిపిస్తుంది. పోనీ ఇంతగా పొగిడితే పొగిడారులే.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, ఇతర హామీల విషయంలో మోదీకి ఏమైనా విజ్ఞప్తి చేస్తారేమోలే అని ఆశించినవారికి మాత్రం ఆశాభంగమే ఎదురైంది. అమరావతికి లక్ష కోట్ల అప్పు చేస్తున్నాం.. ఇందులో మీరు ఇంత శాతం భరించండి .. అని అడగలేదు. ప్రత్యేక హోదా ఊసే లేదు. అసలు ఈ నేతలెవ్వరూ లక్ష కోట్ల అప్పు చేస్తున్న విషయాన్నే ప్రజలకు చెప్పకుండా దాటవేయడంలోనే కుట్ర ఉందనిపిస్తుంది. ఒకపక్క భారీ ఎత్తున పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ, లక్షల కోట్లను కేవలం 30 గ్రామాలలో వ్యయం చేస్తూ ఆర్ధిక విధ్వంసానికి పాల్పడుతున్న చంద్రబాబు.. గత జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందని విమర్శించారు.చంద్రబాబు ప్రభుత్వం 2014 టర్మ్లో నిర్మించిన అసెంబ్లీ, సచివాలయం తదితర నీరు కారే భవనాలను ఏమైనా జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందా?. ఉన్నవాటిని వాడుకుందాం.. విశాఖ కార్యనిర్వాహణ రాజధాని అయితే పదివేల కోట్లతో గ్రోత్ ఇంజన్ అవుతుంది అని జగన్ చెబితే విధ్వంసం అని తప్పుడు ప్రచారం చేశారు. అప్పట్లో అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన చంద్రబాబు ఈ సభలో ఆ మాట ఎందుకు అనలేకపోయారు. ఖర్చుకు అవసరమైన నిధులు ఎలా సేకరిస్తున్నది, దాని భారం ప్రజలపై ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలను వివరించలేకపోయారు. పైగా మూడేళ్లలో లక్ష కోట్ల పనులు పూర్తి చేస్తామని అనడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. దానికి ఎంతో యంత్రాంగం అవసరం అవుతుంది. ఏ ప్రభుత్వం అయినా ఏడాదికి ఒక ప్రాజెక్టుకు ఐదువేల నుంచి పదివేల కోట్లు వ్యయం చేయగలిగితే గొప్ప. కానీ, ఏడాదికి 33 వేల కోట్ల చొప్పున ఖర్చు చేయడం అంటే అందులో మతలబు ఉన్నట్లే అవుతుంది. ఆయా పనుల రేట్లు డబుల్ చేసి కాంట్రాక్టర్లకు మేలు చేస్తారేమో తెలియదు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో రాజధానిపై ఏ విమర్శలు చేసింది మర్చిపోయి మాట్లాడారు. పనిలో పని చంద్రబాబును గొప్పగా పొగిడి మార్కులు తెచ్చుకున్నారు. లోకేష్ అయితే విభజన తర్వాత హైదరాబాద్ నుంచి తరిమేశారని చెప్పి నవ్వులపాలయ్యారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి రాత్రికి రాత్రి చంద్రబాబు విజయవాడ వెళ్లిపోయిన సంగతిని అంతా గుర్తు చేసుకుంటున్నారు. విశేషం ఏమిటంటే బాబు, లోకేష్, పవన్లు పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించి తన నాయకత్వం గురించి విశేషంగా పొగిడినా, మోదీ మాత్రం ఆ ప్రస్తావనే తేలేదు.అలాగే జగన్ ప్రభుత్వాన్ని వారు విమర్శించినా, మోదీ మాత్రం అందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏతావాతా చెప్పవచ్చేదేమిటంటే, అమరావతి పనుల పునఃప్రారంభ సభ నిర్వహణకు, పబ్లిసిటీకి వందల కోట్లు ఖర్చు అయినా, ఆ మందం అయినా ఏపీ ప్రజలకు మేలు జరగలేదన్న భావనే కలుగుతుంది. కాకపోతే, పవన్కు మోదీ నుంచి ఒక చాక్లెట్ లభించింది. ఆయనకు అదే మంచి లడ్డూ అనుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

పడి లేచిన పసిడి ధర! తులం ఎంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో సోమవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,750 (22 క్యారెట్స్), రూ.95,730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.200, రూ.220 పెరిగింది.చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,730 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.200 పెరిగి రూ.87,900కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.220 పెరిగి రూ.95,880 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా సోమవారం వెండి ధర(Silver Prices)లు తిరోగమనం చెందాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,08,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

దయలేని ట్రంప్.. ఈసారి సినిమాపై సుంకం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై సుంకాలు విధించారు. అమెరికా గడ్డపై షూటింగ్ జరగని సినిమాలపై ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారాయన.కొందరు నిర్మాతల తీరుతో హాలీవుడ్ తీవ్రంగా నష్టపోతోందన్న ట్రంప్.. విదేశాల్లో చిత్రీకరణ జరిగి.. అమెరికాలో రిలీజ్ అయ్యే చిత్రాలపై వెంటనే 100 శాతం సుంకాలను విధించాలని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్(USTR)కు ఆదేశాలు జారీ చేశారాయన. అమెరికా చలన చిత్ర పరిశ్రమను పునరుద్ధించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన.చాలా దేశాలు అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలను ఆకర్షించడానికి లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఇది అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పు కలిగించడమేనని అన్నారాయన. అమెరికన్ సినిమా ఇండస్ట్రీ చాలా వేగంగా మరణిస్తోందన్న ట్రంప్.. మళ్లీ అమెరికా గడ్డపై సినిమాలు చిత్రీకరణ జరగాల్సిన రోజులు రావాలని ఆశిస్తున్నట్లు ట్రూత్ సోషల్ ప్లాట్ఫారమ్లో పోస్ట్ చేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద చిత్ర మార్కెట్ ఉంది చైనాకే. అలాంటి దేశం కిందటి నెలలో ‘టారిఫ్ వార్’లో భాగంగా హాలీవుడ చిత్రాల విడుదలపై పరిమితి విధించింది. ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్ విదేశాల్లో చిత్రీకరణ చేసుకునే చిత్రాలపై 100 శాతం సుంకాలను విధించడం గమనార్హం. బెడిసికొట్టే అవకాశం?ట్రంప్ తాజా ప్రకటపై విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. ఇది హాలీవుడ్ను పునరుద్ధరించకపోగా.. నష్టం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిస్నీ, పారామౌంట్, వార్నర్ బ్రోస్ లాంటి స్టూడియోలు కరోనా దెబ్బ నుంచి ఇంకా కొలుకోలేదు. ఇప్పటికీ చాలా వరకు అమెరికా చిత్రాలు బయటి దేశాల్లో షూటింగులు చేసుకుంటున్నాయి. పన్ను మినహాయింపులు, సినిమాకు పని చేసే టెక్నీషియన్లకు తక్కువ ఖర్చులు అవుతుండడమే అందుకు ప్రధాన కారణం.

60 ఏళ్ల వయసులో చెప్పింది.. చెప్పినట్టు : సెలబ్రిటీ కోచ్ ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
వ్యాపారవేత్త, దేశీయ అతిపెద్ద కార్పొరేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ ఆరుపదుల వయసులో కూడా ఫిట్గా ఉంటారు. మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన ఫిట్నెస్ రహస్యాన్ని వెల్లడిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. చాలా అలవోకగా యోగాసనాలు వేస్తూ కనిపించారు. మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసు కోవాలని ఈ సందర్భంగా మహిళలకు సలహా ఇచ్చారు. 40 ఏళ్లు దాటిన తరువాత ప్రతీ మహిళ తన ఆరోగ్యంపై, శరీరంపై శ్రద్ధ పెట్టాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కూడా. తాజాగా కోచ్ వినోద్ చన్నా నీతా అంబానీ వ్యాయామ పద్ధతులపై కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.నీతా అంబానీ ఫిట్నెస్ కోచ్ వినోద్ చన్నా, తన అనుభవాన్ని బాలీవుడ్ షాదీస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా పంచుకున్నారు . 60 ఏళ్ళ వయసులో కూడా నీతా అంబానీ వ్యాయామానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారంటూ వినోద్ చన్నా ఆమె వ్యాయామ దినచర్య గురించి మాట్లాడారు. తన సలహాలను, సూచనలను తు.చ తప్పకుండా పాటిస్తారని వెల్లడించారు. " నేను నిర్ణయించినట్టే ఆమె వ్యాయామం చేస్తారు.చాలా కష్టపడతారు. వ్యాయామం చేయడానికి సిద్ధంగా ఉంది. నేను ఏమి చెప్పినా, అనుసరించి లక్ష్యాన్ని చేరుకుంటారు" అని చెప్పారు. వినోద్ మార్గదర్శకత్వంలో వివిధ యోగా ఆసనాలు, స్ట్రెచింగ్ ,శ్వాస వ్యాయామాలు చేసిన వీడియోను నీతా ఇటీవల షేర్ చేసిన సంగతి తెలిసిందే.వినోద చన్నా వ్యాయామ సలహాలు50 ఏళ్లు పైబడిన వారు, ముఖ్యంగా మహిళలకు శిక్షణ ఇస్తున్న సమయంలో వారి వారి విభిన్న జీవనశైలి, ప్రతిదాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు తమ పోషకాహారాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని, కాల్షియం స్థాయి గురించి తెలుసుకోవాలని చెప్పారు. లేదంటే పైకి బాగానే ఉన్నప్పటీ, ఎముకలు పెళుసుగా మారి తొందరగా గాయపడతారని తెలిపారు. వయస్సు పెరిగే కొద్దీ కండరాల నిర్మాణం తగ్గుతుంది కాబట్టి పోషకాహారం పరిపూర్ణంగా ఉండాలని, కదలిక లేకపోవడం వల్ల ఎముక సాంద్రత తగ్గుతుంది కాబట్టి, మంచి ఆహారం తీసుకోవడం, శక్తి, స్థిరత్వం, మనస్సు,శరీరం మధ్య సమన్వయాన్ని సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు.చదవండి: స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్ రైడ్ బ్రో..!ఉదయమా? సాయంత్రమా? ఉదయం లేదా రాత్రి వ్యాయామం చేయాలా వద్దా అని ప్రశ్నిస్తే.. రోజులో ఏ సమయంలోనైనా వ్యాయామం చేయవచ్చని చెప్పారు వినోద్ . శరీరానికి చురుకుదనం, కదలికలే ముఖ్యం అని చెప్పారు. "ఆడ అయినా మగ అయినా వర్కౌట్ వెయిట్ ట్రైనింగ్ అనేది చేతులు, భుజాలు, పొట్ట, వీపు , కాళ్లు వంటి శరీర భాగాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే చురుగ్గా ఉండరో, వారికి భవిష్యత్తులో ప్రతీ విషయంలోనూ సమస్యలొస్తాయి. చురుగ్గా ఉండని వారు ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్లకి వెయిట్ ట్రైనింగ్లో ముందుగా మొబిలిటీ అనేది చూడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుకాగా సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ వినోద్ చన్నా నీతాతోపాటు, ఆమె కుమార్తె ఇషా , చిన్న కుమారుడు అనంత్ అంబానీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు, వ్యాపారవేత్త, అనన్య బిర్లా, నటి శిల్పా శెట్టి, జాన్ అబ్రహం, రితేష్ దేశ్ముఖ్,ఆయుష్మాన్ ఖురానా ఇతర నటులు కొంతమందికి వినోద్ దగ్గర శిక్షణ పొందిన వారే కావడం విశేషం.
నా వయసు 12 ఏళ్లు.. బస్సులో భయానక సంఘటన: బుల్లితెర నటి
దైవ దర్శనానికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడికి..
‘60 అడుగుల గోడకే దిక్కులేదు.. అమరావతి కడతారా?’
ఇదంతా వేధింపుల్లో భాగమే: మద్యం కొనుగోళ్ల వ్యవహారం కేసులో పిటిషనర్లు
ఆపరేషన్ చేశారు.. బ్యాండేజ్ క్లాత్ మరిచారు
ఓటీటీలో 'జాక్' సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
కేఎల్ రాహుల్ను కలిసిన బీఆఎర్ఎస్ ఎమ్మెల్యే.. కుమార్తెకు ఓ ‘గిఫ్ట్’!
Shooting Spot భువనగిరి.. సినిమాలకు సిరి
హిట్3 కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన అర్జున్ సర్కార్
వచ్చే మూడేళ్లలో ఒకే రంగంలో కోటిన్నర ఉద్యోగాలు
నా కొడుకును సంపేయండి
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్తో తెరమరుగు..
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీ..
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్లు
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్లైన్ ఆపరేటర్
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
బంగారం భారీగా పడిపోతుంది!
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
బాలకృష్ణ విలన్ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
ఇంట్లో పాముల కలకలం
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
3 నిమిషాలకో మరణం
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
‘ఛీ’నా రాజకీయం...
కొందరికే ‘భరోసా’
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
శ్రీకృష్ణ లీలలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
హైదరాబాద్లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
భారత్తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
మూడో పంటగా సౌర విద్యుత్తు!
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
నచ్చిన వారితో శృంగారం.. అజిత్పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
పాక్ నడ్డి విరిగేలా..
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
తండ్రికి బైక్ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్నే’
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఏప్రిల్లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్కేర్ రివల్యూషన్..!
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
ఒకే ఇల్లు.. ఒకే వంట
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్తున్నారా..?
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
ముష్కర మూకలకు ముచ్చెమటలు
నా వయసు 12 ఏళ్లు.. బస్సులో భయానక సంఘటన: బుల్లితెర నటి
దైవ దర్శనానికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడికి..
‘60 అడుగుల గోడకే దిక్కులేదు.. అమరావతి కడతారా?’
ఇదంతా వేధింపుల్లో భాగమే: మద్యం కొనుగోళ్ల వ్యవహారం కేసులో పిటిషనర్లు
ఆపరేషన్ చేశారు.. బ్యాండేజ్ క్లాత్ మరిచారు
ఓటీటీలో 'జాక్' సినిమా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
కేఎల్ రాహుల్ను కలిసిన బీఆఎర్ఎస్ ఎమ్మెల్యే.. కుమార్తెకు ఓ ‘గిఫ్ట్’!
Shooting Spot భువనగిరి.. సినిమాలకు సిరి
హిట్3 కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన అర్జున్ సర్కార్
వచ్చే మూడేళ్లలో ఒకే రంగంలో కోటిన్నర ఉద్యోగాలు
నా కొడుకును సంపేయండి
ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్
సూర్యవంశీపై గిల్ కామెంట్స్.. జడేజా కౌంటర్
13ఏళ్లకే హీరో, 15ఏళ్లకే టాలీవుడ్ స్టార్..ఒక్క యాక్సిడెంట్తో తెరమరుగు..
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
Smita Sabharwal: స్మితా సబర్వాల్ మరో సంచలన ట్వీట్
తెలుగు బ్యూటీకి ఎట్టకేలకు మరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
IND vs ENG: ఇంగ్లండ్ టూర్కు వైభవ్ సూర్యవంశీ..
Owaisi: నీ తల్లికి తూటా దింపిందెవరు?
TG: హైకోర్టును ఆశ్రయించిన ముగ్గురు ఐపీఎస్లు
అందరి అనుమానం అదే.. NIA ప్రశ్నకు తడబడ్డ జిప్లైన్ ఆపరేటర్
ఫెన్సింగ్ కింద పాక్కుంటూ వెళ్లి.. గుంతలో దాక్కుని
'ప్రవస్తి' నీకు నేను ఉన్నా.. మేము ఉన్నాం: గీతా మాధురి
‘ఎల్లమ్మ’ దొరకట్లేదు.. ఇప్పుడెలా?
మహేశ్ బాబు నయా లుక్.. ఎప్పుడు లేనంతగా
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
నా కోరిక తీర్చకపోతే మొహంపై యాసిడ్ పోస్తా..!
వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..!
నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
బంగారం భారీగా పడిపోతుంది!
అత్యంత కీలకంగా మారిన చెట్టు మీది వీడియో
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్
బాలకృష్ణ విలన్ను ఎంపిక చేసుకున్న పూరీ జగన్నాథ్
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
ఇంట్లో పాముల కలకలం
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
వీళ్లు ఐదురూపాయలు బిచ్చమేశార్రా! దీంతో వైజాగ్లో ఐదెకరాల భూమి కొనేయవచ్చు... మనకూ ‘ఉర్సా’ లాంటి కంపెనీ ఉంటే!
3 నిమిషాలకో మరణం
రోజూ బాదాం తింటే.. ఈ నాలుగు గ్యారెంటీ!
ఆర్మూరు–జగిత్యాల హైవేకు ఓకే
మృత్యువుతో పోరాడి ఓడిన వైద్య విద్యార్థిని భావన యాదవ్
‘ఛీ’నా రాజకీయం...
కొందరికే ‘భరోసా’
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
శ్రీకృష్ణ లీలలు
ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీలు చేసిన నలుగురిలో ఓ 'కామన్ పాయింట్' ఉంది.. అదేంటి..?
హైదరాబాద్లో హై అలర్ట్
బ్రదర్ కేటీఆర్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్ జగన్
భారత్తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
ఎంత పనైపాయే..! పిల్లిలా కనిపించాలని సర్జరీ చేయించుకుంటే చివరికి..
ఆట అదుర్స్.. అతడిని టీమిండియాకి ఎంపిక చేయండి: పీటర్సన్
మూడో పంటగా సౌర విద్యుత్తు!
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్ సూర్యవంశీ
నచ్చిన వారితో శృంగారం.. అజిత్పై నటి 'హీరా' సెన్సేషనల్ కామెంట్
'లాహోర్ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
ప్రొటోకాల్ రగడ.. తుమ్మల సమక్షంలో అధికారులపై ఎమ్మెల్యే ఫైర్
జాబ్ చేస్తానంటే ఇంట్లోకి రమ్మంటారు.. బాధ చెప్పుకున్న దీపిక
బెల్లంకొండ హీరో దెయ్యం సినిమా.. గ్లింప్స్ రిలీజ్
ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
అర్థరాత్రి నా హోటల్ రూంలోకి రావాలని చూశాడు: హీరోయిన్
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
వామ్మో.. ఇదేం ట్రాఫిక్!
సంధ్య థియేటర్ ఘటన.. బాలుడు శ్రీతేజ్ డిశ్చార్జ్
కొత్త రేషన్ కార్డు దేవుడెరుగు..!
పాక్ నడ్డి విరిగేలా..
ఉత్కంఠపోరు.. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
తండ్రికి బైక్ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్నే’
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
నా వారసత్వం గొప్పగౌరవమనుకో: శ్రీలీలకు సీనియర్ నటి ఉద్భోధ
నీట్–2025కు పకడ్బందీ ఏర్పాట్లు
శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకం
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్ జగన్
అందంలోనే కాదు.. చదువులోనూ అదుర్స్
సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి
ఏప్రిల్లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
మైక్రోసాఫ్ట్ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్కేర్ రివల్యూషన్..!
సెలవుల సంతోషం మాకు దూరం : అయ్యో బిడ్డా ఎంత కష్టం!
ఒకే ఇల్లు.. ఒకే వంట
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
పడిపోయినా ఈ పరుగు ఆగదు.. సునీత పోస్ట్
ఈపీఎఫ్ క్లెయిమ్కు వెళ్తున్నారా..?
‘పెగాసస్’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
IPL 2025: ఒక్క విజయం.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న ఆర్సీబీ
మళ్లీ ఉగ్ర కాండ!
రెడ్ మిర్చిలా రెజీనా... విష్ణుప్రియ మౌంటైన్ ట్రిప్
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
ముష్కర మూకలకు ముచ్చెమటలు
సినిమా

'అందరూ ఫేక్.. కిర్రాక్ ఆర్పీ మోసాన్ని నా జీవితంలో మర్చిపోను'.. జబర్దస్త్ తన్మయ్
జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో తన్మయ్ ఒకరు. లేడీ గెటప్స్లో జబర్దస్త్ షో మాత్రమే కాకుండా పలు షోల్లో కనిపించింది. అయితే ఊహించని విధంగా జబర్దస్త్కి గుడ్ బై చెప్పేసి ఓ టీవీ షోలో కనిపించింది. అయితే కొన్ని రోజులకు ఆ షో ఆగిపోవడంతో జబర్దస్త్లో రీఎంట్రీ ఇచ్చింది. రాకింగ్ రాకేష్, చలాకీ చంటి టీమ్స్లో లేడీ గెటప్లో కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు తన్మయ్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన జీవితంలో పడిన కష్టాలను తలచుకుని ఎమోషనలైంది తన్మయ్. నా జీవితంలో చాలా మంది తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన్మయ్ మాట్లాడుతూ..' నన్ను మోసం చేయని వారంటూ లేరు. స్నేహితులు, బంధువులు, తెలిసినవాళ్లు కూడా చీట్ చేశారు. ఇండస్ట్రీ వాళ్లతో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. నన్ను ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తామని బెదిరించారు. ఒక పెద్ద పేరున్న వ్యక్తే. మా జబర్దస్త్లోనే కొంతమంది నన్ను మోసం చేశారు. స్నేహితులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా చీట్ చేశారు. వారిలో కిర్రాక్ ఆర్పీ ఒకడు. అతన్ని నేను లైఫ్లో మర్చిపోను. నేను జబర్దస్త్ మానేసి అదిరింది షోకి వచ్చింది కూడా అతని వల్లే. అతన్ని ఒక టైమ్లో నా సొంత అన్నలా ట్రీట్ చేశా. కానీ అతని మైండ్ సెంట్ అంతా వేరు. కానీ నా పర్సనల్ విషయాల్లో అతని వల్ల చాలా బాధపడ్డా. ఒకానొక టైమ్లో తనకి నేను చాలా సపోర్ట్ చేశా. కానీ అతని వల్లే నేను జబర్దస్త్ నుంచి బయటికొచ్చేశా. ఫైనాన్షియల్గా అతని సపోర్ట్ చేశా. కానీ నాకు ఎలాంటి సాయం చేయలేదు. ఈ ప్రపంచంలో నాశనం చేసేది డబ్బు, నమ్మకం ఈ రెండే. మనకు సాయం చేశారన్న విశ్వాసం కూడా కొంతమందికి ఉండదు. నేను ఎంత చేశానన్నది కిర్రాక్ ఆర్పీకి తెలుసు. చాలా మంది జబర్దస్త్ వాళ్లకి తెలుసు. ఈ రోజుల్లో డబ్బు మీదే అంతా నడుస్తోంది. ఒక మనిషిని బాగుపడాలన్నా డబ్బు, నమ్మకమే.. చెడిపోవాలన్నా డబ్బు, నమ్మకమే. కానీ మనం ఎంత స్ట్రగుల్ అవుతున్నది మనకు మాత్రమే తెలుసు. అందరికీ నా డబ్బు, బాడీ, ఫేమ్ మాత్రమే కావాలి' అని ఆవేదన వ్యక్తం చేసింది.(ఇది చదవండి: 'ఇక్కడికి వస్తే బ్లాక్ బస్టరే'.. తీవ్ర భావోద్వేగానికి గురైన సమంత!)నాకంటూ నేను పర్సనల్గా ఏమీ దాచుకోలేదని తన్మయ్ తెలిపింది. మా నాన్న చనిపోయినప్పుడు నూక రాజు తనకు అండగా నిలిచారని చెప్పింది. ఆ రోజు హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్లే వరకు తనతో పాటే ఉన్నాడని పేర్కొంది. నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని నాకు తపన ఉండేదని తెలిపింది. నా జీవితంలో మా అన్నయ్య నాకు చాలా అండగా నిలిచాడని తన్మయ్ చెప్పుకొచ్చింది. నా కోసం తను చాలా కష్టపడ్డాడని తన్మయ్ ఎమోషనల్ అయింది.జబర్దస్త్ గురించి మాట్లాడుతూ..'నా జీవితంలో ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్నది లేదు. జబర్దస్త్ వల్ల కొంచం పేరు వచ్చింది. గుంటూరులో ఒక మంచి ఇల్లు కట్టుకున్నా. ఫ్యామిలీని బాగా చూసుకున్నా. కానీ వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డా. అసలు ఎవరికీ ఇలాంటి కష్టం రాకూడదు. ఒక ప్రేమ లేదు, కుటుంబం నుంచి సపోర్ట్ లేదు. బయట కూడా ఎవరూ సాయం చేయలేజు. ఎక్కడ చూసిన ఫేక్ అంతా.. నమ్మి మోసం పోవడం తప్ప చేసేదేం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

భారతీయ తొలి ఐటమ్ గాళ్ ఓ పాకిస్తానీ..
భారతీయ సినిమా చరిత్రలో ఐటమ్ సాంగ్స్ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఇటీవలి కాలంలో అయితే బాలీవుడ్ చిత్రాలు ఐటమ్ సాంగ్ లేకుండా పూర్తి కాదన్న అభిప్రాయం స్థిరపడిపోయింది. మలైకా అరోరా ‘హోత్ రసిలే’, కరీనా కపూర్ ‘ఫేవికోల్ సే’, సమంతా ‘ఊ అంటావా’, నోరా ఫతేహి ‘దిల్బర్ దిల్బర్’ వంటి పాటలు విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. తాజాగా తమన్నా భాటియా ఆజ్కీ రాత్ ద్వారా ఐటమ్ క్వీన్గా మారిపోయిన సంగతీ తెలిసిందే. ఇంతగా భారతీయ సినిమా చరిత్రలో మమేకం అయిపోయిన ఈ ఐటమ్ నంబర్ల చరిత్ర ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా?సినిమా పరిజ్ఞానం బాగా ఉన్నవారు కూడా ఈ ఐటమ్ నంబర్ల ట్రెండ్ను హెలెన్, బిందు లేదా జీనత్ అమెన్ మొదలుపెట్టారని అనుకుంటారు. కానీ నిజానికి వీళ్లందరి కన్నా ముందుగానే శృంగార నర్తకిగా తెరపై చిందేసిన ఇండియా ఫస్ట్ ఐటమ్ గర్ల్ ఎవరో తెలుసా? ఆ గౌరవం ‘మేడమ్ అజురీ‘(Madame Azurie)కి దక్కింది.అన్నా మేరీ గ్వీజెలర్...ఉరఫ్ మేడమ్ అజురీ... బాలీవుడ్లో తొలి ఐటమ్ డాన్సర్ ఎలా అయింది? అనే ప్రశ్నలు కలిగితే... ఒకసారి చరిత్ర తవ్వి తీయాలి. దాదాపు వందేళ్ల క్రితం... అంటే 1930లలో హీరోయిన్లకు భిన్నంగా ప్రత్యేక డాన్సర్ పాత్రలను సినీ పరిశ్రమలో ప్రవేశపెట్టిన పేరే మేడమ్ అజురీ అని చెప్పాలి. బెంగళూరులో జన్మించిన ఆమె తల్లి హిందూ బ్రాహ్మణ నర్స్ కాగా, తండ్రి జర్మన్ జ్యూయిష్ డాక్టర్. తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత ఆమె తండ్రితో నివసించింది. ఆ సమయంలో ఆమె తండ్రి ఆమెను బాలే నృత్యం నేర్చుకోవడానికి ప్రోత్సహించారు, కానీ భారతీయ నృత్యాలను అభ్యసించేందుకు మాత్రం అంగీకరించలేదు. అజురీ యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఆమె కుటుంబం బొంబాయికి తరలివెళ్లింది. ఆమె తండ్రి త్రీ ఆర్ట్స్ సర్కిల్లో సభ్యుడయ్యాడు, ఆ సమయంలో అజురీకి త్రీ ఆర్ట్స్ సర్కిల్ నిర్వాహకురాలు బేగం అతియా ఫైజీ–రహమిన్తో సంభాషించడానికి వీలు కలిగింది.అలా అజురీ అతియా సహకారంతో మరికొన్ని మనవైన కళలు నృత్యాలనుు అభ్యసించగలిగింది. అలా అజురీ పలు నృత్య శైలులను నేర్చుకుని నదిరా సినిమా తో హిందీ సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘పర్దేసీ సయ్యాన్’, ‘క్వత్ల్–ఎ–ఆమ్’, ‘ది బాంబే టాకీస్’, ‘నయా సంసార్’ వంటి చిత్రాలతో సహా 700కి పైగా సినిమాల్లో నటించి, తన డాన్సులతో ఎంతో పాప్యులర్ అయ్యింది.తమ ప్యాలెస్లో నృత్యం చేయాలంటూ మేడమ్ అజురీకి బ్రిటన్ లోని బకింగ్ హ్యామ్ ప్యాలెస్ నుంచి ఆహ్వానం అందింది అంటేనే ఆమె పాప్యులారిటీ ఏ స్థాయిలో వెలిగేదో తెలుస్తుంది. దేశ విభజన అనంతరం అజూరీ ఓ ముస్లింను నిఖా చేసుకుని పాకిస్తాన్ లోని రావల్పిండీలో స్థిరపడి, పాకిస్తాన్లో కూడా కొన్ని స్థానిక చిత్రాల్లో నటించిన తర్వాత ఎందుకనో గానీ నటనకు గుడ్బై చెప్పేసింది. ఆ తర్వాత అక్కడ ఒక క్లాసికల్ డాన్స్ అకాడమీని ప్రారంభించి, ఏళ్ల తరబడి నృత్యాన్ని బోధించింది. అలా భారతీయ చిత్రాల్లో ఐటమ్ డ్యాన్సులకు ఊపిరిపోసిన అజురీ ఆగస్టు 1998లో మరణించింది.

'పెళ్లి చేసుకుంటానని వాడుకున్నాడు'.. అజాజ్ ఖాన్పై నటి తీవ్ర ఆరోపణలు!
బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ వివాదానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయాడు. అతను హోస్ట్గా వ్యవహరిస్తోన్న హౌస్ అరెస్ట్ అనే షోలో విపరీతమైన, అసభ్యకరమైన కంటెంట్తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఈ షోపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షోను ఇప్పటికే సదరు ఓటీటీ సంస్థ బ్యాన్ చేసింది. ఈ అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చేస్తోన్న అజాజ్ ఖాన్పై సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వివాదంలో నడుస్తుండగానే అజాజ్ ఖాన్పై ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వివాహం చేసుకుంటానని లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అజాజ్ ఖాన్పై చార్కోప్ పీఎస్లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో అతనిపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు.అజాజ్ ఖాన్ తన ఓటీటీ షో 'హౌస్ అరెస్ట్'లో తనకు ఓ పాత్ర ఆఫర్ చేశాడని ఆమె తెలిపింది. ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తనకు లవ్ ప్రపోజ్ చేశాడని నటి ఆరోపించింది. మార్చి 25న తన నివాసంలోనే నాపై అత్యాచారం చేశాడని.. రెండు సార్లు తనను పెళ్లి చేసుకుంటానని హామీ కూడా ఇచ్చాడని చార్కోప్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మాకు నాలుగు వివాహాలకు అనుమతి ఉందని తనకు చెప్పాడని నటి ప్రస్తావించింది. ఆమె ఆరోపణలతో కేసు నమోదు చేసిన చార్కోప్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ షో 'హౌస్ అరెస్ట్'లో మహిళలను అసభ్యకరంగా చూపించినందుకు అజాజ్ ఖాన్పై అంబోలి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మరోసారి వచ్చేస్తోన్న హార్ట్ బీట్.. సీజన్-2 ప్రోమో చూశారా?
కోలీవుడ్ వెబ్ ప్రపంచంలో హార్ట్బీట్ సిరీస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆస్పత్రి నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్లో కుటుంబ అంశాలు, ప్రేమ, ఒక తల్లి ప్రేమ కోసం యువతి పడే ఆరాటం కనిపిస్తుంది. సెంటిమెంట్, పదవి కోసం పోరాటం అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్ను తెరకెక్కించారు. జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అయినా హార్ట్బీట్ వెబ్ సిరీస్కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది.ఈ నేపథ్యంలోనే వెబ్ సిరీస్లో పలు ఆసక్తికరమైన విషయాలకు పరిష్కారం చూపే విధంగా దీనికి సీజన్–2 రూపొందించారు మేకర్స్. ఈ సిరీస్కు దీపక్ సుందర రాజన్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. రెజిమల్ సూర్య థామస్ ఛాయాగ్రహణం, చరణ్ రాఘవన్ సంగీతాన్ని అందించారు. ఏ టెలీ ఫ్యాక్టరీ ప్రొడక్షన్స్ పతాకంపై రాజవేలు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ప్రోమో ఇప్పుడు హాట్ స్టార్ ఓటీటీలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.హార్ట్ బీట్ సీజన్–2ను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో నటి దీపా బాలు, అనుమోన్, యోగలక్షి్మ, శర్వ, శబరీశ్, చారుకేశ్, రామ్, చంద్రశేఖర్, గిరి ద్వారకేశ్, రేయ ముఖ్య పాత్రలు పోషించారు. వీరితోపాటు అక్షిత, శివం, అబ్దుల్, అమైయ, టీఎం కార్తీక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. Get ready for a double blast of fun and excitement 🥳❤️❤️#HotstarSpecials Heart Beat Season 2 Coming Soon on JioHotstar#HotstarSpecials #HeartBeatSeason2 #HeartBeatS2 #HB2 #HB2ComingSoon #LubDubOnHotstar #HeartBeatS2OnHotstar #HeartBeatS2onJioHotstar #HB2onJioHotstar… pic.twitter.com/akIbMEzuJf— JioHotstar Tamil (@JioHotstartam) May 4, 2025 Adhey Heart'u dhan, ana Beat'u vera.. ❤️❤️ Rina 2.0 coming soon 😉😎😍#HotstarSpecials HeartBeat Season 2 Coming Soon on JioHotstar#HotstarSpecials #HeartBeatSeason2 #HeartBeatS2 #HeartBeat2Promo #HB2 #HB2ComingSoon #LubDubOnHotstar #HeartBeatS2OnHotstar… pic.twitter.com/WzxzFblVwj— JioHotstar Tamil (@JioHotstartam) May 1, 2025
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

‘కళ్లుచెదిరే ప్రదర్శన.. వైభవ్ ఆట ఆకట్టుకుంది’
ఐపీఎల్-2025 (IPL 2025)లో సంచలన బ్యాటింగ్తో అందరికంటా పడిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రశంసలతో ముంచెత్తారు. అతడు పడిన కష్టం, ఆడిన తీరు తనని అమితంగా ఆకట్టుకుందని అన్నారు. బిహార్లో ‘ఖేలో ఇండియా’ గేమ్స్ ఆరంభోత్సవం సందర్భంగా మోదీ వీడియో సందేశం ఇచ్చారు. కళ్లుచెదిరే ప్రదర్శనఈ సందర్భంగా క్రీడాకారుల కష్టాన్ని కొనియాడిన ఆయన వైభవ్ విధ్వంసక శతకాన్ని ఆ వీడియో సందేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ‘బిహార్ ముద్దుబిడ్డ వైభవ్ సూర్యవంశీ. అతను ఆడిన మ్యాచ్ను చూశాను. 14 ఏళ్ల కౌమార ప్రాయంలోనే కళ్లుచెదిరే ప్రదర్శన కనబరిచాడు.ఇన్నాళ్లు ఏ భారత బ్యాటర్కు సాధ్యంకానీ రికార్డును సాధించిన ఘనత వైభవ్కే దక్కుతుంది. ఇంతచిన్న వయసులో అంతటి ఇన్నింగ్స్ ఆడటం మాటలు కాదు. దీనికోసం అతనెంతో కష్టపడ్డాడు. ఆటకోసం తపించాడు. అంకితభావంతో ముందడుగు వేశాడు. అతన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది’ అని ఆ సందేశంలో ప్రశంసల మోదీ వర్షం కురిపించారు. ‘ఖేలో ఇండియా’ కార్యక్రమంతో తమ ప్రభుత్వం క్రీడాకారుల సాఫల్యం కోసం కృషిచేస్తోందని చెప్పారు. అన్ని రకాలుగా అండదండలు అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.కొత్తకొత్త క్రీడలపై కూడా కసరత్తు చేయాలిమన భారత అథ్లెట్లు క్రికెట్, హాకీలే కాదు కొత్తకొత్త క్రీడలపై కూడా కసరత్తు చేయాలని ప్రధాని సూచించారు. గ్రామీణ క్రీడ ఖో–ఖోతో పాటు గట్కా, మల్లకంభ, యోగాసన తదితర కొత్త క్రీడల్ని ‘ఖేలో–ఇండియా’లో భాగం చేశామని చెప్పారు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో వైభవ్ను రాజస్తాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది.వేగవంతమైన సెంచరీఈ టీనేజ్ కుర్రాడు వైభవ్ గుజరాత్ టైటాన్స్తో జరిగిన లీగ్ మ్యాచ్లో విధ్వంసరచన చేశాడు. కేవలం 35 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచింది. 30 బంతుల్లో గేల్ చేసిన సెంచరీ మొదటి స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. గుజరాత్పై సెంచరీ చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. గత రెండు మ్యాచ్లలో ఈ కుర్రాడు విఫలమయ్యాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో డకౌట్ అయిన వైభవ్.. ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో నాలుగు పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే, వైభవ్ ప్రస్తుతం నేర్చుకునే దశలోనే ఉన్నాడని.. తప్పక తన పొరపాట్లను సరిచేసుకుంటాడని పలువురు మాజీ క్రికెటర్లు అతడికి అండగా నిలుస్తున్నారు.చదవండి: IPL 2025: సన్రైజర్స్ జట్టులో చరిత్ర సృష్టించిన బౌలర్

IPL 2025: సింగ్ ఈజ్ కింగ్.. పైసా వసూల్ ప్రదర్శనలు చేస్తున్న అర్షదీప్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ పేసర్ అర్షదీప్ సింగ్ పైసా వసూల్ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ పంజాబీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ను పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఆ సీజన్ మెగా వేలంలో ఆర్టీమ్ కార్డు ఉపయోగించి రూ. 18 కోట్లకు తిరిగి దక్కించుకుంది. అంచనాలకు తగ్గట్టుగానే అర్షదీప్ ఈ సీజన్లో చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.ఈ సీజన్లో పంజాబ్ సాధించిన ప్రతి విజయంలో అర్షదీప్ ప్రధానపాత్ర పోషించాడు. దాదాపు అన్ని మ్యాచ్ల్లో అర్షదీప్ వికెట్లు తీశాడు. వికెట్లు తీయడమే కాకుండా పొదుపుగా కూడా బౌలింగ్ చేశాడు. నిన్న ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లక్నో ప్రధాన బ్యాటర్లు, విధ్వంసకర వీరులు మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ను తన తొలి మూడు ఓవర్లలోనే పెవిలియన్కు పంపాడు. తద్వారా ఈ మ్యాచ్లో పంజాబ్ లక్నోపై ఆదిలోనే పట్టు సాధించి, చివరికి 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అర్షదీప్ మున్ముందు జరుగబోయే మ్యాచ్ల్లో కూడా ఇలాంటి ప్రదర్శనలే కొనసాగిస్తే పంజాబ్ తొలి టైటిల్ గెలవడం ఖాయం.ఈ సీజన్లో అర్షదీప్ ప్రదర్శనలు..2/36 vs GT (4)3/43 vs LSG (4)1/35 vs RR (4)0/39 vs CSK (4)1/37 vs SRH (4)1/11 vs KKR (3)2/23 vs RCB (3)1/26 vs RCB (3)0/0 vs KKR (0)- వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైంది2/25 vs CSK (3.2)3/16 vs LSG (4)నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) రెచ్చిపోవడంతో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్లో మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (4 బంతుల్లో 1) విఫలమైనా, మిగతా బ్యాటర్లంతా సత్తా చాటారు. వన్డౌన్లో వచ్చిన జోష్ ఇంగ్లిస్ 14 బంతుల్లో బౌండరీ, 4 సిక్సర్ల సాయంతో 30, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 45, నేహల్ వధేరా 9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 16 పరుగులు చేశారు. ఆఖర్లో శశాంక్ సింగ్ తాండవం చేశాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ సాయంతో అజేయమైన 33 పరుగులు చేశాడు. ఇదే సమయంలో స్టోయినిస్ (5 బంతుల్లో 15 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా బ్యాట్ ఝులిపించాడు. లక్నో బౌలర్లలో ఆకాశ్ మహారాజ్ సింగ్, దిగ్వేశ్ రాఠీ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ప్రిన్స్ యాదవ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో.. 73 పరుగులకే తమ కీలక బ్యాటర్ల వికెట్లన్నీ కోల్పోయింది. అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో లక్నో టాపార్డార్ పేకమేడలా కూలింది. అర్షదీప్ 27 పరుగులకే మార్క్రమ్ (13), మిచెల్ మార్ష్ (0), నికోలస్ పూరన్ను (6) ఔట్ చేశాడు. ఆతర్వాత ఒమర్జాయ్.. రిషబ్ పంత్ (18), డేవిడ్ మిల్లర్ను (11) పెవిలియన్కు పంపాడు. ఈ దశలో ఆయుశ్ బదోని (40 బంతుల్లో 74; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రతిఘటించారు. వీరిద్దరు ఆరో వికెట్కు 81 పరుగులు జోడించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సమద్ ఔటయ్యే సమయానికి (16.4వ ఓవర్) లక్నో 20 బంతుల్లో 73 పరుగులు చేయాల్సి ఉండింది. దాదాపుగా అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరి ఓవర్ తొలి బంతికి బదోని కూడా ఔటయ్యాడు. దీంతో లక్నో ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. అర్షదీప్ 3, ఒమర్జాయ్ 2, జన్సెన్, చహల్ తలో వికెట్ తీసి లక్నోను దెబ్బ కొట్టారు. ఈ గెలుపుతో పంజాబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి (15 పాయింట్లు) చేరి ప్లే ఆఫ్స్కు చేరువైంది. దాదాపు 10 సీజన్ల తర్వాత పంజాబ్ 15 పాయింట్లు సాధించింది. పంజాబ్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఢిల్లీ (మే 8), ముంబై ఇండియన్స్ (మే 11), రాజస్థాన్తో (మే 16) తలపడాల్సి ఉంది.

IPL 2025: సన్రైజర్స్ జట్టులో చరిత్ర సృష్టించిన బౌలర్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో నిష్క్రమణకు అంచుల్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్.. ఇవాళ (మే 5) ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగబోయే డు ఆర్ డై మ్యాచ్కు ముందు కీలక ప్రకటన చేసింది. గాయపడిన స్మరణ్ రవిచంద్రన్ స్థానంలో విదర్భ లెఫ్డ్ ఆర్మ్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్ష్ దూబేను జట్టులోకి తీసుకుంది. హర్ష్ను బేస్ ధర రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. కొద్ది రోజుల ముందే స్మరణ్ ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చాడు. స్మరణ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అంతకుముందు జంపా రెండు మ్యాచ్లు ఆడి ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డాడు.Harsh Dubey joins the squad as a replacement for Smaran, who is ruled out due to injury.#PlayWithFire pic.twitter.com/Bd4vnLanGF— SunRisers Hyderabad (@SunRisers) May 5, 2025ఎవరీ హర్ష్ దూబే..?పూణేలో జన్మించి, విదర్భ తరఫున దేశవాలీ క్రికెట్ ఆడుతున్న 22 ఏళ్ల హర్ష్ దూబే.. తాజాగా ముగిసిన రంజీ సీజన్లో (2024-25) రికార్డు స్థాయిలో 10 మ్యాచ్ల్లో 69 వికెట్లు (7 ఐదు వికెట్ల ప్రదర్శనలతో పాటు రెండు 10 వికెట్ల ప్రదర్శనలు) తీసి, రంజీ చరిత్రలోనే ఓ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించాడు. హర్ష్ విదర్భ తరఫున 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 21 లిస్ట్-ఏ మ్యాచ్లు, 16 టీ20లు ఆడి 128 వికెట్లు తీశాడు. బ్యాటింగ్లో దాదాపు 100 పరుగులు చేశాడు. హర్ష్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 7 అర్ద సెంచరీలు, లిస్ట్-ఏ క్రికెట్లో 2 అర్ద సెంచరీలు సాధించాడు.హర్ష్ అద్బుత ప్రదర్శన కారణంగా గత రంజీ సీజన్లో విదర్భ ఛాంపియన్గా నిలిచింది. విదర్భ రంజీ టైటిల్ గెలవడం ఇది మూడో సారి. ఫైనల్లో విదర్భ కేరళపై విజయం సాధించి, ఛాంపియన్గా అవతరించింది.నిష్క్రమణ అంచుల్లో ఎస్ఆర్హెచ్ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గత సీజన్ రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శనలు చేస్తూ నిష్క్రమణ అంచుల్లో ఉంది. ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో 7 పరాజయాలు చవిచూసి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో సన్రైజర్స్ ఇంకా నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు గెలిచినా సన్రైజర్స్ ప్లే ఆఫ్స్కు చేరడం అసంభవం. టెక్నికల్గా ఆ జట్టు ఇంకా ఎలిమినేట్ కాలేదు కానీ, ఈ సీజన్లో సన్రైజర్స్ పని అయిపోయింది. ఇవాళ (మే 5) ఆ జట్టు సొంత మైదానంలో (ఉప్పల్ స్టేడియం) టేబుల్ ఫిఫ్త్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది.

2014 సీజన్లో కూడా ఇలాగే.. పంజాబ్ టైటిల్ గెలుస్తుందా..?
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో ఆ జట్టు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో వరుస విజయాలతో దూసుకుపోతూ ప్లే ఆఫ్స్కు చేరువైంది. ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 7 విజయాలు (15 పాయింట్లు) సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఉన్నా ఇప్పటివరకు టైటిల్ సాధించని జట్లలో పంజాబ్ కింగ్స్ కూడా ఒకటి. ఈ జట్టు 2014 సీజన్లో అత్యుత్తమంగా ఫైనల్కు చేరింది. 17 ఏళ్ల ప్రస్తానంలో పంజాబ్ ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. ఏకైక సారి.కాగా, 2014 సీజన్ తరహాలోనే పంజాబ్ ఈ సీజన్లోనూ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆ సీజన్ తర్వాత తొలిసారి ఈ సీజన్లోనే 15 పాయింట్లు సాధించింది. నాడు (2014) టేబుల్ టాపర్గా నిలిచి ప్లే ఆఫ్స్కు చేరిన పంజాబ్.. ఫైనల్లో కేకేఆర్ చేతిలో పరాజయంపాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. ఆ సీజన్లోలాగే పంజాబ్ ఈ సీజన్లోనూ పటిష్టంగా కనిపిస్తూ సామర్థ్యం మేరకు రాణిస్తుంది. ఇదే ఊపును మున్ముందు జరుగబోయే మ్యాచ్ల్లో కొనసాగిస్తే పంజాబ్ తమ తొలి టైటిల్ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది.శ్రేయస్ అయ్యర్ రాకతో ఈ సీజన్లో పంజాబ్ ఫేట్ మారినట్లు స్పష్టమవుతుంది. గతంలో ఎన్నడూ లేనట్లు ఆ జట్టు ప్రతి మ్యాచ్లో గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. పంజాబ్ ఈ సీజన్లో సక్సెస్ సాధించడంలో ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. పాంటింగ్ ఆథ్వర్యంలో ప్రతి పంజాబ్ ఆటగాళ్లు ఉరకలేస్తున్నాడు. ఈ సీజన్లో పంజాబ్ బ్యాటింగ్ విభాగం అన్ని జట్ల కంటే పటిష్టంగా ఉంది. మెగా వేలంలో పాంటింగ్ కీలకంగా వ్యవహరించి ప్రియాంశ్ ఆర్య లాంటి యువ టాలెంట్ను అక్కున చేర్చుకున్నాడు. ఈ సీజన్లో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ విశేషంగా రాణిస్తున్నాడు. మెగా వేలానికి ముందు పంజాబ్ సిమ్రన్ను అట్టిపెట్టుకుంది. ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకానికి సిమ్రన్ న్యాయం చేస్తున్నాడు. మెగా వేలంలో రికార్డు ధర పెట్టి సొంతం చేసుకున్న శ్రేయస్ అయ్యర్ వ్యక్తిగతంగా రాణించడమే కాకుండా కెప్టెన్గా కూడా విజయవంతమవుతున్నాడు. పంజాబ్ యాజమాన్యం ఎంతో నమ్మకంతో అట్టిపెట్టుకున్న శశాంక్ సింగ్, నేహల్ వధేరా ఓ మోస్తరు చేస్తూ పర్వాలేదనిపిస్తున్నారు.ఈ సీజన్లో పంజాబ్ విజయాల్లో బౌలర్లు ప్రధానపాత్ర పోషించారు. అర్షదీప్ పైసా వసూల్ ప్రదర్శనలు చేస్తుండగా.. చహల్, జన్సెన్ సామర్థ్యం మేరకు రాణిస్తున్నారు.మొత్తంగా చూస్తే ఈ సీజన్లో పంజాబ్కు ఛాంపియన్ అయ్యేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఫామ్ లేమితో బాధపడుతున్న మ్యాక్స్వెల్ గాయం కారణంగా వైదొలగడం కూడా పంజాబ్కు కలిసొచ్చే అంశమే. అతడి స్థానంలో మరో విధ్వంసకర బ్యాటర్ మిచెల్ ఓవెన్ను అక్కున చేర్చుకుంది పంజాబ్ మేనేజ్మెంట్. ఆసీస్ ఆటగాళ్లు స్టోయినిస్, ఇంగ్లిస్ సామర్థ్యం మేరకు రాణిస్తే ఈ సీజన్లో పంజాబ్ టైటిల్ గెలవడాన్ని ఎవరూ ఆపలేరు. 2014 తర్వాత సీజన్ల వారీగా పంజాబ్ పాయింట్లు2015- 6 పాయింట్లు2016- 82017- 142018- 122019- 122020- 122021- 122022- 142023- 122024- 102025- 15*
బిజినెస్

సరళతర ఎఫ్డీఐ విధానం.. అవకాశాలు అపారం
భారత్ అమలు చేస్తున్న సరళతర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం (ఎఫ్డీఐ) విదేశీ ఇన్వెస్టర్లకు అపారమైన పెట్టుబడి అవకాశాలను ఆఫర్ చేస్తోందని డెలాయిట్ ఇండియా తెలిపింది. ఫార్మాస్యూటికల్స్, ఆటో, పర్యాటక రంగాలకు ఎఫ్డీఐలను ఆకర్షించే శక్తితోపాటు ఉపాధి కల్పనకు చోదకాలుగా నిలవగలవని పేర్కొంది. వీటికితోడుగా ఎగుమతులు, ఆవిష్కరణలు భారత్ తదుపరి దశ వృద్ధిని నడిపించగలవని తెలిపింది.చాలా రంగాల్లో ఆటోమేటిక్ మార్గంలో(అనుమతుల్లేని) 100 శాతం ఎఫ్డీఐల రాకకు అనుమతించడం ద్వారా భారత్ ఎంతో ప్రగతి సాధించినట్టు డెలాయిట్ ఇండియా గుర్తు చేసింది. పర్యాటకం, నిర్మాణం, హాస్పిటల్స్, మెడికల్ డివైజ్లను ప్రస్తావించింది. ఈ విధాన నిర్ణయాలు స్థిరత్వాన్ని, స్పష్టతను అందిస్తున్నట్టు డెలాయిడ్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కి మజుందార్ పేర్కొన్నారు. 70 బిలియన్ డాలర్ల జాతీయ మోనిటైజేషన్ పైపులైన్, 100 పట్టణాల్లో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి కార్యక్రమాలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు వెంటనే కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలైన పెట్టుబడి జోన్లను అందిస్తున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: మార్కెట్లపై రెండింటి ఎఫెక్ట్పర్యాటకం, ఆతిథ్య రంగంలో హోటళ్లు, రిక్రియేషన్ కేంద్రాల నిర్మాణానికి 100 శాతం ఎఫ్డీఐని అనుమతిస్తున్నట్టు మజుందార్ గుర్తు చేశారు. పారదర్శక, స్థిరమైన పెట్టుబడుల కేంద్రంగా భారత్ ప్రతిష్ట దీంతో మరింత ఇనుమడిస్తుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం, సరళతర ఎఫ్డీఐ విధానం.. లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, పట్టణాభివృద్ధి రంగాల్లో అపార అవకాశాలను తీసుకొస్తున్నట్టు మజుందార్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2024–2025) తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) 27 శాతం అధికంగా 40.67 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐ భారత్లోకి రావడం గమనార్హం.

మార్కెట్లపై రెండింటి ఎఫెక్ట్
దేశీ స్టాక్ మార్కెట్లలో ఈ వారం ట్రెండ్ పలు కీలక అంశాలపై ఆధారపడనుంది. దేశీయంగా కార్పొరేట్ ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్షకు తెరతీయనుంది. మరోపక్క భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ వారం ఆటుపోట్లకు అవకాశమున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లకు దిక్సూచిగా నిలవగల అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ బుధవారం పాలసీ సమీక్షను ప్రకటించనుంది. రెండు రోజులపాటు సమావేశమయ్యే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) 7న వడ్డీ రేట్లపై నిర్ణయాలు ప్రకటించనుంది. అయితే మార్చి నెల సమావేశంమాదిరిగా ఈసారికూడా ఫెడ్ యథాతథ రేట్ల అమలుకే కట్టుబడే అవకాశమున్నట్లు అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. గత సమావేశంలో ఫెడ్ ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంగా కొనసాగించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా.. ఏప్రిల్ నెలకు యూఎస్ సర్వీసుల పీఎంఐ గణాంకాలు సోమవారం(5న) విడుదలకానున్నాయి. ఇక చైనా ఏప్రిల్ వాణిజ్య గణాంకాలు 9న వెల్లడికానున్నాయి. మార్చిలో ఎగుమతుల జోరు కారణంగా 102 బిలియన్ డాలర్లకుపైగా వాణిజ్య మిగులు నమోదైంది.బ్లూచిప్స్ ఫలితాలుఈ వారం ఆతిథ్య రంగ దిగ్గజం ఇండియన్ హోటల్స్, ఆటో దిగ్గజం ఎంఅండ్ఎం(5న), బ్యాంక్ ఆఫ్ బరోడా(6న), కోల్ ఇండియా, డాబర్(7న), మౌలిక దిగ్గజం ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్, బయోకాన్, టైటన్(8న), డాక్టర్ రెడ్డీస్(9న) గత ఆర్థి క సంవత్సరం చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించనున్నాయి. గత వారాంతాన(3న) బ్యాంకింగ్ దిగ్గజాలు స్టేట్బ్యాంక్, కొటక్ మహీంద్రాతోపాటు డీమార్ట్ క్యూ4 ఫలితాలు వెల్లడించాయి. ఈ ప్రభావం నేడు(5న) మార్కెట్లలో కనిపించనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. కాగా.. హెచ్ఎస్బీసీ పీఎంఐ సరీ్వసుల డేటా 6న విడుదలకానుంది.యుద్ధ భయాలుపహల్గావ్లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లలో ఓవైపు ఆందోళనలు నెలకొన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు. ఫలితంగా భారత్, పాకిస్తాన్ మిలటరీ దళాల ప్రతీ కదలికలనూ కూలంకషంగా పరిశీలించే వీలున్నట్లు వివరించారు. ఫలితంగా మార్కెట్లలో ఆటుపోట్లు కనిపించవచ్చని లెమన్ మార్కెట్స్ డెస్క్ విశ్లేషకులు గౌరవ్ గార్గ్ అంచనా వేశారు. సాంకేతికంగా ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 24,400 పాయింట్ల వద్ద కీలక అవరోధాన్ని ఎదుర్కొనే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ స్థాయికి ఎగువన నిలిస్తే మరింత బలపడవచ్చని, లేదంటే పరిమిత శ్రేణి కదలికలకే పరిమితంకావచ్చని అంచనా వేశారు. క్యూ1లో యూఎస్ జీడీపీ నీరసించడం గ్లోబల్స్థాయిలో అనిశ్చితికి దారితీస్తున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ విశ్లేషించారు. దీంతో ఫెడ్ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు.గత వారమిలా..గురువారం సెలవు కావడంతో 4 రోజులకే ట్రేడింగ్ పరిమితమైన గత వారం.. సెన్సెక్స్ 1289 పాయింట్లు(1.6 శాతం) ఎగసి 80,502కు చేరింది. నిఫ్టీ 307 పాయింట్లు(1.3 శాతం) పుంజుకుని 24,347 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం బలపడగా.. స్మాల్ క్యాప్ మాత్రం 1.33 శాతం క్షీణించింది.ఇదీ చదవండి: న్యూ ఫండ్ ఆఫర్లపై ఓ లుక్కేయండి!ఎఫ్పీఐల దన్నుఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్లో కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు టారిఫ్ల విషయంలో యూఎస్తో ఒప్పందం కుదరనున్నట్లు అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. దీంతో గత 12 ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్పీఐలు పెట్టుబడులకే ఆసక్తి చూపుతున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలియజేశారు. ఫలితంగా యూఎస్ డాలరుతో మారకంలో రూపాయి వేగంగా బలపడుతున్నట్లు పేర్కొన్నారు. మరోపక్క స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలవైపు పరుగు తీస్తున్నట్లు వివరించారు. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 99కు బలహీనపడటం కూడా రూపాయికి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు ఆరి్థకవేత్తలు పేర్కొన్నారు. దేశీయంగా తొలి మూడు నెలల(జనవరి–మార్చి) తదుపరి ఏప్రిల్లో ఎఫ్పీఐలు నికరంగా రూ.4,223 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం!

న్యూ ఫండ్ ఆఫర్లపై ఓ లుక్కేయండి!
యూటీఐ మల్టీ క్యాప్ ఫండ్వివిధ మార్కెట్ క్యాప్స్వ్యాప్తంగా ఇన్వెస్ట్ చేసే మల్టీ క్యాప్ ఫండ్ను ప్రకటించింది యూటీఐ మ్యూచువల్ ఫండ్. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మే 13 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ సెగ్మెంట్ స్టాక్స్లో 3ఎస్ విధానంతో (సైజు, సెక్టార్, స్టయిల్) ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. ఒక్కో సెగ్మెంట్కి కనీసం 25 శాతం మొత్తాన్ని కేటాయిస్తుంది. పటిష్టమైన ఫండమెంటల్స్తో టర్న్రౌండ్ అవకాశాలు ఉండి ఆకర్షణీయమైన వేల్యుయేషన్స్లో లభించే స్టాక్స్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుందని యూటీఐ ఏఎంసీ సీఐవో వెట్రి సుబ్రమణియమ్ తెలిపారు. దీనికి కార్తీక్రాజ్ లక్ష్మణన్ ఫండ్ మేనేజర్గా వ్యవహరిస్తారు.ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ క్వాలిటీ ఫండ్ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ క్వాలిటీ ఫండ్ను ఆవిష్కరించింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 6న మొదలు కానుంది. 20వ తేదీ వరకు సబ్స్క్రిప్షన్లకు అనుమతి ఉంటుంది. ఈ పథకానికి ప్రామాణిక సూచీగా ‘నిఫ్టీ 200 క్వాలిటీ 30 టీఆర్ఐ’ కొనసాగుతుంది. ఇహబ్ దల్వాయ్, మసూమి జుర్మర్వాలా ఫండ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నారు. బలమైన ఆర్థిక మూలాలు, పటిష్టమైన నగదు ప్రవాహాలు, రుణ భారం తక్కువగా ఉండి, నిధుల వ్యయాల సామర్థ్యాలు గొప్పగా ఉన్న కంపెనీలను పెట్టుబడులకు ఎంపిక చేస్తుంది. అందుకే పథకానికి క్వాలిటీ అని పేరు పెట్టారు. సుమారు 625 కంపెనీలను జల్లెడ పట్టి అందులో మెరుగైన 40–60 కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంది. భౌగోళిక రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు, వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలాంటి సవాళ్లను నాణ్యమైన కంపెనీలు ఎదుర్కొని బలంగా నిలబడగలవని భావిస్తూ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఈ పథకాన్ని తీసుకొచి్చంది. పెట్టుబడులను ఏడాదిలోపు విక్రయిస్తే విలువపై ఒక శాతం ఎగ్జిట్ లోడ్ అమలవుతుంది. ఏడాది తర్వాత విక్రయిస్తే ఎగ్జిట్ చార్జీలు ఉండవు. ఇదీ చదవండి: త్వరలో కేంద్రీకృత కేవైసీ వ్యవస్థగ్రో సిల్వర్ ఈటీఎఫ్వెండిలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి కోసం గ్రో మ్యూచువల్ ఫండ్ ‘గ్రో సిల్వర్ ఈటీఎఫ్’ ఎన్ఎఫ్వోను ప్రారంభించింది. ఈ నెల 16 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. అనంతరం మే 30 నాటికి స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో రోజువారీ పెట్టుబడులు, విక్రయాలకు అందుబాటులోకి వస్తుందని సంస్థ ప్రకటించింది. దేశీ వెండి ధరలకు అనుగుణంగా గ్రో సిల్వర్ ఈటీఎఫ్ ట్రేడవుతుంటుంది. వెండి ధరల గమనానికి అనుగుణంగానే ఇందులో లాభ, నష్టాలు ఆధారపడి ఉంటాయి. భౌతిక వెండి కొనుగోలు, నిల్వ, విక్రయం వంటి సమస్యలను సిల్వర్ ఈటీఎఫ్ తప్పిస్తుంది. ఇందులో కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో రాబడులు కోరుకునే వారికి ఇది అనుకూలమని సంస్థ తెలిపింది. ప్రస్తుతం బంగారం–వెండి నిష్పత్తి 91.64 వద్ద ఉందని.. ఈ ప్రకారం చూస్తే బంగారం కంటే వెండి ధరలే అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది.

త్వరలో కేంద్రీకృత కేవైసీ వ్యవస్థ
న్యూఢిల్లీ: కేంద్రీకృత కేవైసీ (నో యువర్ కస్టమర్) వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆర్థిక శాఖ, ఆర్థిక నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. కస్టమర్ల కేవైసీ వివరాలను ఒకే చోట నిర్వహించేదే సెంట్రల్ కేవైసీ. దీనివద్ద కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తే.. అన్ని ఆర్థిక సంస్థల వద్ద ఆటోమేటిక్గా అది అప్డేట్ అయిపోతుంది.ఎప్పటిలోగా ఈ వ్యవస్థను తీసుకొచ్చేదీ పాండే స్పష్టంగా వెల్లడించలేదు. కానీ వీలైనంత త్వరగా చేయాల్సి ఉందన్నారు. ఉమ్మడి కేవైసీ వ్యవస్థ గురించి ఎదురైన ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘ఈ విషయంలోనూ మేము సానుకూలంగా ముందుకు వెళ్లాలనుకుంటున్నాం. మరింత సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు. ఆర్థిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన గల కమిటీ ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.ఇదీ చదవండి: బఫెట్ వారసుడొచ్చాడు..!2025లో నూతన సెంట్రల్ కేవైసీ రిజిస్ట్రీని తీసుకురానున్నట్టు బడ్జెట్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. సెక్యూరిటీలకు సంబంధించి టీప్లస్0 సెటిల్మెంట్ ప్రస్తుతం ఐచ్ఛికంగానే ఉందని పాండే చెప్పారు. దీనివల్ల మార్కెట్ భాగస్వాములు క్రమంగా కొత్త వ్యవస్థకు మారేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. నిఘా, ఐపీవో దరఖాస్తులను వేగంగా మదింపు వేసేందుకు ప్రస్తుతం సెబీ కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగిస్తున్నట్టు చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని చోట్ల దీన్ని వాడనున్నట్టు తెలిపారు. టీప్లస్1 ప్రస్తుతం తప్పనిసరిగా అమల్లో ఉన్న విధానం. స్టాక్స్ కొనుగోలు చేసిన తర్వాతి పనిదినం రోజున అవి కస్టమర్ల డీమ్యాట్ ఖాతాలకు జమ అవుతాయి.
ఫ్యామిలీ

భాగ్యనగరంలో అందాల హడావిడి..!
హైదరాబాద్ నగర వేదికగా జరగనున్న 72వ ప్రపంచ సుందరి పోటీల కోసం నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబై ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 120 దేశాలకు చెందిన అందాల భామలు ఒక్కొక్కరుగా నగరానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే మిస్ వరల్డ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి, మిస్ కెనడా మిస్ ఎమ్మా డయన్నా క్యాథరీన్ మొర్రిసన్ వంటి ప్రముఖులు నగరానికి చేరుకున్నారు. కాగా ఆదివారం మిస్ బ్రెజిల్ జెస్సికా స్కాన్డియుజ్జి పెడ్రోసో, మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్ జాన్సెన్ వాన్ రెన్స్బర్గ్ నగరానికి చేరుకున్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్కి చేరుకున్న మిస్ బ్రెజిల్ జెస్సికా, మిస్ సౌత్ ఆఫ్రికా జోయలైజ్కు భారతీయ సంస్కృతి, సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. భారతీయ సాంస్కృతిక నృత్యాలతో జెస్సికాను, జోయలైజ్ను ఆహ్వానించిన విధానం విశేషంగా ఆకట్టుకుంది. ఈ నెల 10 నుంచి 31వ తేదీ వరకూ జరగనున్న అంతర్జాతీయ కార్యక్రమం ‘మిస్ వరల్డ్–2025’ పోటీల్లో పాల్గొనడానికి వివిధ దేశాల నుంచి మరికొందరు సుందరీమణులు ఈనెల 6వ తేదీ వరకూ ఒక్కొక్కరుగా రానున్నట్లు నిర్వాహక ప్రతినిధులు తెలిపారు. బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖుల సందడి.. మరి కొద్ది రోజుల్లో నగర వేదికగా జరగనున్న ప్రారంభ వేడుకల్లో గ్లోబల్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేయనున్నారు. వీరి కోసం నగరంలోని పలు ఫైవ్ స్టార్ హోటల్స్, 3 స్టార్ హోటల్స్లో ముందస్తు బుకింగ్ చేశారు. అంతేకాకుండా విమానాశ్రయంలో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీరితోపాటు భారత్ నుంచి మిస్ వరల్డ్గా నిలిచిన మాజీ మిస్ వరల్డ్లు సైతం నగరానికి చేరుకోనున్నారు. ఈనెల 10వ తేదీ లోపు బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం ముఖ్య అతిథులుగా రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.(చదవండి: ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర)

ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర
ఇది తొమ్మిది రోజుల యాత్ర... దక్షిణాదిలో దివ్యమైన యాత్ర. మూడు కడలి తీరాలను చూద్దాం... తొమ్మిది ప్రదేశాలను వీక్షిద్దాం. అరుణాచలం... శ్రీరంగం... మధురై... కన్యాకుమారి... రామేశ్వరం..కోవళమ్... త్రివేండ్రమ్... తంజావూరులతో తీర్థయాత్ర పరిపూర్ణం.దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ (ఎస్సీజెడ్బీజీ42). ఇది 9 రోజులు ప్యాకేజ్. సికింద్రాబాద్లో మొదలై సికింద్రాబాద్కి చేరడంతో పూర్తయ్యే ఈ ప్యాకేజ్లో తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రమ్, తంజావూరు కవర్ అవుతాయి. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్లో మే నెల 22వ తేదీన టూర్ మొదలవుతుంది.తొలిరోజు తిరు యాత్ర షురూ!మధ్యాహ్నం పన్నెండు గంటలకు సికింద్రాబాద్లో మొదలైన ప్రయాణం రెండవ రోజు ఉదయం ఏడున్నరకు తిరువణ్ణామలైకి చేరుతుంది. ఈ మధ్యలో భోన్గిర్, జన్గాన్, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, దోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణం సాగుతుంది. ఈ ప్యాకేజ్లో బుక్ చేసుకున్న వాళ్లు సికింద్రాబాద్లోనే రైలెక్కాల్సిన తప్పనిసరి ఏమీ ఉండదు. ఈ రైలు ఆగే ఈ జాబితాలో ఎవరికి వారు తమకు సౌకర్యంగా ఉన్న స్టేషన్లో జాయిన్ కావచ్చు. అలాగే పర్యటన పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలోనూ తమకు అనువైన చోట దిగవచ్చు. అయితే మధ్యలో ఎక్కినా, దిగినా టికెట్ ధరలో కన్సెషన్ ఉండదు. సికింద్రాబాద్ నుంచి సికింద్రాబాద్కి బుక్ చేసుకోవాల్సిందే.రెండోరోజు తొమ్మిది గోపురాల తిరువణ్ణామలైతిరువణ్ణామలై స్టేషన్లో దిగిన తర్వాత హోటల్ రూమ్లో చెక్ ఇన్ కావడం. రిఫ్రెష్మెంట్ తర్వాత అరుణాచలం ఆలయ దర్శనం. ఇతర దర్శనాలు పూర్తయిన భోజనం చేసుకుని స్టేషన్కి వచ్చి రైలెక్కాలి. రైలు రాత్రి పదింటికి బయలుదేరుతుంది. తిరువణ్ణామలై ఆలయంలోని దేవుడు అరుణాచలేశ్వరుడు కావడంతో దీనిని అరుణాచలం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని పాతిక ఎకరాల్లో నిర్మించారు. బయటి ప్రహరీ గోడకు నాలుగు ప్రాకారాలు, లోపల మరో ప్రహరీ కి నాలుగు ప్రాకారాలతోపాటు గర్భాలయగోపురం మొత్తం తొమ్మిది గోపురాల ఆలయం ఇది. గణపతి మందిరం దగ్గర నేల మీద వలయాకారంలో పెయింట్ చేసి ఉంటుంది. ఆ వలయంలో నిలబడి చూస్తే తొమ్మిది గోపురాలనూ చూడవచ్చు. ఇక్కడ మరో విశిష్టత ఏమిటంటే గిరి ప్రదక్షిణ చేసే అరుణాచలం కొండ చుట్టూ ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య లింగాల అష్ట లింగాల ఆలయాలుంటాయి. ఇక్కడ రమణమహర్షి ఆశ్రమాన్ని కూడా తప్పకుండా చూడాలి. అరుణాచలం కొండ చుట్టూ 14 కిలోమీటర్ల దూరం గిరి ప్రదక్షణ చేయాలనుకునే వారు చేయవచ్చు. కాలి నడకన చేయలేని వారి కోసం ఆటోలు ఉంటాయి. గిరి ప్రదక్షణలో భాగంగా అష్ట లింగాల ఆలయాల దగ్గర ఆపుతారు. వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణాన్ని కొనసాగించాలి.మూడో రోజు రాముడు కొలిచిన శివుడు (రామేశ్వరం)ఉదయం ఆరున్నరకు రైలు కుదాల్నగర్ చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన రామేశ్వరానికి చేరి అక్కడ హోటల్లో చెక్ ఇన్. రిఫ్రెష్మెంట్ తర్వాత స్థానికంగా ఉన్న ఆలయాలు, ఇతర పర్యాటక ప్రదేశాలను చూసుకోవాలి. రాత్రి బస రామేశ్వరంలోనే.రామేశ్వరం మనదేశ భూభాగానికి దూరంగా బంగాళాఖాతం– హిందూమహాసముద్రం మధ్యలో ఉన్న దీవి. రామాయణం ప్రకారం రాముడు... రావణాసురుడిని సంహరించిన తర్వాత బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడానికి శివలింగాన్ని స్థాపించి పూజించాలనుకున్నాడు. హిమాలయాల నుంచి శివలింగాన్ని తీసుకురావలసిందిగా హనుమంతుడిని ఆదేశిస్తాడు. హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడం ఆలస్యం కావడంతో విశేషఘడియలు ముగిసేలోపు రాముడు సముద్రపు ఇసుకతో లింగాన్ని చేసి ప్రతిష్ఠించాడు. రాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ శివుడికి రామేశ్వరుడనే పేరు వచ్చింది. పన్నెండు జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం ఒకటి. రామేశ్వరం అనే పేరుకు ముందు ఆ దీవి పేరు పంబన్. రామేశ్వరానికి – భారత్ ప్రధాన భూభాగానికి మధ్య నిర్మించిన వంతెనకు పంబన్ బ్రిడ్జి అని పేరు పెట్టారు. పంబన్ బ్రిడ్జి మీద రామేశ్వరానికి చేరతాం. ఇక్కడి నుంచి శ్రీలంక కేవలం 18 నాటికల్ మైళ్ల దూరంలోనే ఉంది.నాలుగో రోజు కనువిందైన మధురైమధ్యాహ్నం తర్వాత రామేశ్వరం నుంచి మధురైకి బస్లో వెళ్లాలి. సాయంత్రానికి మధురై చేరడం, మీనాక్షి దర్శనం, షాపింగ్ చేసుకుని బస్లో కుదాల్నగర్ స్టేషన్కి చేరాలి. రాత్రి పదకొండున్నరకు రైలు కదులుతుంది. కన్యాకుమారి వైపు సాగిపోవాలి.మధుర మీనాక్షి ఆలయాన్ని చూసిన తర్వాత ఎవరికైనా కలిగే ఫీలింగ్ ఒక్కటే. ఈ ఆలయాన్ని చూడక΄ోయి ఉంటే జీవితంలో గొప్ప సంతోషాన్ని మిస్ అయ్యేవాళ్లం... అనే గొప్ప అనుభూతి అది. మీనాక్షీ సుందరేశ్వర ఆలయం వైష్ణవం– శైవాల మధ్య మైత్రిబంధానికి ప్రతీక. వధువు మీనాక్షి అమ్మవారి చేతిని శివుడి చేతిలో పెడుతున్నది స్వయానా విష్ణుమూర్తి. మధురై ఆలయంలోకి కెమెరాలు, సెల్ఫోన్లను అనుమతించరు. కంటి నిండా చూసి మదినిండా గుర్తుంచుకోవాల్సిందే. మీనాక్షి– సుందరేశ్వరుల వివాహాన్ని విష్ణుమూర్తి తన చేతుల మీదుగా జరిపిస్తున్న శిల్పాన్ని చూడడం మరిచిపోవద్దు. వైష్ణవం– శైవ మతాల మధ్య సోదరబంధాన్ని తెలియచేసే శిల్పం అది. సున్నితమైన ఆభరణాలను సునిశితంగా చెక్కిన శిల్పి నైపుణ్యానికి సలామ్ అనాల్సిందే.ఐదో రోజు మూడు సముద్రాల కలయికఉదయం ఎనిమిది గంటలకు రైలు కన్యాకుమారికి చేరుతుంది. రూమ్కి వెళ్లి రిఫ్రెష్ అయిన తర్వాత బయలుదేరి వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్సెట్ పాయింట్ చూసుకుని రాత్రికి గదికి చేరాలి. రాత్రి బస కన్యాకుమారిలో. మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమం అంటాం. మూడు సముద్రాలు కలుస్తున్న ప్రదేశాన్ని ఏమనాలి? మూడు కడలుల సంగమం అంటే ముక్కడలి తీరం అందామా! చిరు అలలతో సొగసుగా కదిలే అరబిక్కడలి అందాన్ని మాత్రమే కాదు, ఉవ్వెత్తున ఎగిసిపడే బంగాళాఖాతం దుడుకుతనాన్ని చూస్తూ, ధీరగంభీరంగా ఉండే హిందూ మహాసముద్రం నీటితో పాదాలను అభిషేకించుకుందాం. కన్యాకుమారి అంటే ప్రకృతి ప్రేమికులకు గుర్తొచ్చేది మూడు సముద్రాల మీద సూర్యోదయం, సూర్యాస్తమయం. వీటితోపాటు తమిళ కవి వళ్లువార్ విగ్రహం, వివేకానంద రాక్ మెమోరియల్ని కూడా చూడాలి. అలాగే 2004, డిసెంబర్ 26వ తేదీ చేదు జ్ఞాపకానికి స్మారక స్థూపం సునామీ మెమోరియల్ని చూడడం మర్చిపోకూడదు.ఆరో రోజు సంపన్న దేవుడు పద్మనాభుడుఉదయం హోటల్ గది చెక్ అవుట్ చేసి కన్యాకుమారి రైల్వేస్టేషన్కు వెళ్లి రైలెక్కాలి. రైలు తొమ్మిది గంటలకు కొచ్చువెలి వైపు వెళ్తుంది. పన్నెండన్నరకు చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన త్రివేండ్రమ్కు వెళ్లాలి. పద్మనాభ స్వామి దర్శనం, కోవళం బీచ్ విహారం తర్వాత తిరిగి రైల్వే స్టేషన్కు చేరి అదే రైలెక్కాలి. రాత్రి తొమ్మిదిన్నరకు రైలు తిరుచ్చికి బయలుదేరుతుంది. రాత్రి భోజనం రైల్లోనే.తిరువనంతపురం దేవుడు అనంత పద్మనాభుడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన దేవుడు. ట్రావెన్కోర్ రాజవంశం నిర్వహణలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయం బంగారుమయం. 108 దివ్యదేశాల్లో ఇదొకటి. ఇది కేరళ– తమిళ వాస్తుశైలి సమ్మేళనం. ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే డ్రెస్కోడ్ను అనుసరించాలి. భారత సంప్రదాయ వస్త్రధారణలో ఉండాలి. ఏడో రోజు యునెస్కో రంగనాథుడు... బృహదీశ్వరుడుతెల్లవారుజామున ఐదింటికి తిరుచ్చిలో రైలు దిగి హోటల్ గదిలో చెక్ ఇన్. రిఫ్రెష్మెంట్ తర్వాత శ్రీరంగం ఆలయ దర్శనం. మధ్యాహ్న భోజనం తర్వాత తంజావూరు (60 కిమీలు). బృహదీశ్వరాలయ దర్శనంతో పర్యటన పూర్తవుతుంది. ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటలకు తిరుగుప్రయాణం మొదలవుతుంది.శ్రీరంగం అంటే చాలా మంది కావేరీ తీరాన ఉన్న పట్టణం అనే అభి్ర΄ాయంలో ఉంటారు. కానీ ఇది కావేరీ నదికి దాని ఉప నది కొల్లిదమ్ నదికి మధ్యనున్న ద్వీపం. తిరుచిరా పల్లికి సమీపంలోని ఈ దీవిలో ఉన్న రంగనాథ ఆలయం పేరుతో ఈ దీవికి శ్రీరంగం అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఈ వైష్ణవాలయం కూడా 108 దివ్యదేశాల్లో ఒకటి. ఇది యునెస్కో గుర్తించిన హెరిటేజ్ సైట్ కూడా. ఈ ఆలయంలో 21 ఎత్తైన గోపురాలున్నాయి. ప్రపంచంలో ఆంగ్కోర్వాట్ తర్వాత అత్యంత పెద్ద హిందూ ఆలయాల్లో ఇదొకటి.ఎనిమిదో రోజు దక్షిణాది కృష్ణుడుతంజావూరులో ఉన్న ఆలయాలన్నింటిలోకి పెద్ద ఆలయం బృహదీశ్వరాలయం. వెయ్యేళ్ల నాటి ఈ ఆలయాన్ని చోళ చక్రవర్తి మొదటి రాజరాజ కట్టించాడు. రాజ్యంలో రాజకీయ సంక్షోభం, సంక్లిష్టతలు ఎదురైనప్పుడు కళలకు ప్రీధాన్యం తగ్గి΄ోతుందనడానికి నిదర్శనం కూడా ఈ ఆలయాన్ని చెప్పవచ్చు. శిఖరం ఎత్తు 216 అడుగులు. శివలింగం 29అడుగులు. నంది కూడా పెద్దదే. ఈ నిర్మాణంలోని ప్రతి అంగుళమూ చోళుల కళాభిరుచికి అద్దం పడుతుంది. ఆలయనిర్మాణం పూర్తయ్యే సమయానికి యుద్ధం వచ్చింది. కొత్తగా నిధుల కేటాయింపు తగ్గి΄ోయింది. ఉన్న డబ్బుతో నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. దాంతో ప్రవేశ గోపురం ఎత్తును ముందు అనుకున్నట్లు ఆలయగోపురానికి దీటుగా నిర్మించలేక΄ోయారు. ఈ గోపురం కింది భాగం విశాలంగా ఉంటుంది, గోపురం ఎత్తు తక్కువగా ఉంటుంది. ఖర్చు, సమయం దృష్ట్యా ఎత్తు తగ్గించి రాజీ పడ్డారు. కానీ చేసిన పనిలో శిల్పనైపుణ్యంలో ఎక్కడా రాజీ పడలేదు. ఆలయంలోపల ఉన్న చిత్రకళ నాయకరాజుల అభిరుచికి నిదర్శనం. ఆలయం పై కప్పుకు రాగి ఆకులో కృష్ణుడి చిత్రం ఉంది. దానిని బాగా పరిశీలించి చూడండి. ఆ కృష్ణుడి ముఖంలో దక్షిణాది పోలికలు ముఖ్యంగా తమిళుల ముఖకవళికలు కనిపిస్తాయి. ఎత్తులో పై కప్పుకు ఉన్న చిత్రాన్ని పరిశీలించడానికి వీలుకాక΄ోతే ఫొటో తీసుకుని జూమ్ చేసి చూడవచ్చు. ‘గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్’గా గుర్తింపు పొందిన ఆలయం ఇది. యునెస్కో ఈ ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్ల జాబితాలో చేర్చింది.తొమ్మిదో రోజు..ఇక ఇంటిదారిఉదయం తొమ్మిది గంటలకు రేణిగుంటకు చేరుతుంది. వెళ్లిన క్రమంలోని స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తూ తొమ్మిదవ రోజు మధ్యాహ్నం రెండున్నరకు సికింద్రాబాద్కు చేరుతుంది. ఎవరికి అనువైన స్టేషన్లో వాళ్లు దిగిపోవడమే. (చదవండి: అనారోగ్య మృతుల్లో... పురుషులే ఎక్కువ! అధ్యయనంలో షాకింగ్ విషయాలు)

అనారోగ్య మరణాల్లో.. పురుషులే అధికం!
పురుషులతో పోలిస్తే మహిళల ఆయుర్దాయం ఎక్కువగా ఉంటోంది. అనారోగ్యంతో మరణిస్తున్న వారిలో పురుషులే అధికంగా ఉంటున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది. అధిక రక్తపోటు, మధుమేహం, ఎయిడ్స్ వంటివాటితో అస్వస్థతకు గురై మరణిస్తున్న వారిలో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) తాజా అధ్యయనం తెలిపింది. ఆధిపత్య ధోరణి, ఆరోగ్య సంరక్షణకు అంతగా సుముఖత చూపించకపోవడం, వైద్యానికి ఎక్కువగా ఖర్చు చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా వెల్లడైంది. పురుషుల్లో అధిక ధూమపానం, మహిళల్లో ఊబకాయం, అరక్షిత శృంగారం ప్రధాన అనారోగ్య హేతువులని తెలిపింది. హెచ్ఐవీతో పాటు కరోనా సమయాల్లోనూ కూడా నివారణ చర్యలు మొదలుకుని రోగ నిర్ధారణ, చికిత్స వంటి అన్ని విషయాల్లోనూ మహిళలతో పోలిస్తే పురుషులు బాగా వెనుకబడి ఉన్నారని అధ్యయనం వెల్లడించింది. 200 దేశాల్లో అధిక రక్తపోటుకు తీసుకునే చికిత్సలో కూడా పురుషులు, మహిళల్లో చాలా వ్యత్యాసముంది. 56 శాతం దేశాల్లో ఎయిడ్స్, 30 శాతం దేశాల్లో మధుమేహం, 4 శాతం దేశాల్లో హై బీపీ రేటు పురుషుల్లోనే ఎక్కువగా ఉంది. 14 శాతం దేశాల్లో ఎయిడ్స్, ఐదు శాతం దేశాల్లో మధుమేహం, భారత్లో హై బీపీ పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా ఉన్నాయి. 131 దేశాల్లో ఎయిడ్స్, 107 దేశాల్లో హై బీపీ, 100 దేశాల్లో మధుమేహ మృతుల్లో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ. ఎయిడ్స్తో 25 దేశాల్లో, డయాబెటిస్తో 9 దేశాల్లో, హై బీపీతో యూఏఈలో పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా మరణిస్తున్నారని అధ్యయనం తేల్చింది. వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్స దిశగా పురుషులను ప్రోత్సహించడం, అందరికీ సమానంగా ఆరోగ్యం అందించే వ్యవస్థలను రూపొందించడం చాలా అవసరమని బ్రిటన్కు చెందిన గ్లోబల్ 50/50 సహవ్యవస్థాపకుడు కెంట్ బస్ తెలిపారు.(చదవండి: First Women Rescuer: ఆపదలో ఆమె సైతం..!)

బ్రహ్మంగారి మఠం... ఆరంభమైన ఆరాధనోత్సవాలు
ప్రపంచంలో ఏ వింత జరిగినా ‘బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు’ అనడం మనం వింటుంటాం. అంత గొప్ప కాలజ్ఞాని, రాజయోగి, హేతువాది, తత్త్వవేత్త, మహిమాన్వితుడు, సంఘ సంస్కర్త, దైవ స్వరూపులుగా వినుతికెక్కిన శ్రీ మద్విరాట్పోతులూరు వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన, గురుపూజ మహోత్సవాలు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ (కడప) జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో.. ఆదివారం అంగరంగ వైభవంగా ఆరంభం అయ్యాయి. ఇందుకోసం క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మానవులకు జ్ఞానబోద చేసి, సన్మార్గంలో నడిపించడం కోసం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆయన విశ్వబ్రాహ్మణ దంపతులైన ప్రకృతాంబ, పరిపూర్ణయాచార్యులుకు ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని సరస్వతీ నదీ తీరంలో క్రీ.శ.1608లో జన్మించారు. వెంటనే తల్లిదండ్రులను కోల్పోయారు. అత్రి మహాముని ఆశ్రమంలో శిష్యుడిగా పెరిగారు. కర్ణాటక రాష్ట్రం పాపాగ్ని మఠం (ప్రస్తుతం చిక్బళ్లాపూర్ జిల్లాలోని కళవారహళ్లిలో ఉన్నది) మఠాధిపతులు యనమదల వీరభోజయాచార్య, వీరపాపమాంబ అనే విశ్వబ్రాహ్మణ వృద్ధ దంపతులు దత్తత తీసుకున్నారు. కొంత కాలానికి వీరభోజయాచార్య సహజ మరణం పొందారు. బ్రహ్మంగారు తన ఎనిమిదవ ఏటనే లోక సంచార నిమిత్తం బయలుదేరారు. తమిళనాడులోని కాంచీపురంలో ఆనందభైరవ యోగికి వీరనారాయణ మహామంత్రం ఉపదేశించారు. అనేక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ.. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా బనగానపల్లె చేరుకున్నారు. అక్కడ గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలకుడిగా ఉన్నారు. రవ్వలకొండలోని గుహలో కాలజ్ఞాన రచన చేశారు. కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు అచ్చమ్మ ఇంటిలో పాతర తీసి భద్రపరిచారు. యాగంటి గుహలో తపస్సు చేశారు. అచ్చమ్మ, వెంకటరెడ్డి దంపతులు బనగానపల్లెలో నిర్మించి ఇచ్చిన నేలమఠంలో అన్నాజయ్యకు కాలజ్ఞానం బోధించారు. అక్కడ ఆత్మలింగాన్ని ప్రతిష్టించి లోక సంచార నిమిత్తం మళ్లీ బయలుదేరారు. దేశ నలుమూలల సంచారం... వైఎస్ఆర్ (కడప) జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం అల్లాడుపల్లెలో.. తాను శిల్పీకరించిన శ్రీవీరభద్రస్వామి శిలా విగ్రహాన్ని ప్రతిష్టించారు. కందిమల్లాయపల్లెలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలోని పెద్దకొమెర్ల గ్రామానికి చెందిన శివకోటయాచార్య పుత్రిక గోవిందమాంబను వివాహం చేసుకున్నారు. ఐదుగురు పుత్రులు, ఒక పుత్రికను సంతానంగా పొందారు. దూదేకుల కులానికి చెందిన సిద్దయ్య, దళితుడైన కక్కయ్యను శిష్యులుగా స్వీకరించారు. శిష్యగణ సమేతంగా దేశ నలుమూలల సంచరించి వేదాంతతత్వ ప్రచారం చేశారు.కలియుగంలో పాపభారం అధికమైనప్పుడు తాను వీరభోగ వసంతరాయులుగా జన్మించి ధర్మసంస్థాపనం గావిస్తామన్నారు. 85 ఏళ్ల వయసులో (1693) వైశాఖ శుద్ధ దశమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. నాటి నుంచి జగత్ కల్యాణం కోసం యోగనిద్ర ముద్రితులై భక్తుల నీరాజనాలు స్వీకరిస్తున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామిచే ప్రసిద్ధి పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా పేరు పొందింది. ఏటా..స్వామి సజీవసమాధి నిష్ట పొందిన వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా ఏటా ఆరాధన, గురుపూజ మహోత్సవాలు ఆరు రోజుల పాటు కనుల పండువగా నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ నెల 4 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల నుంచి అశేష భక్తజనం తరలి రానున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవదాయ శాఖ అధికారులు, మఠం నిర్వాహకులు, స్వామి శిష్యబృందం ఏర్పాట్లు చేస్తున్నారు. – వి.మల్లికార్జున ఆచార్య, సాక్షి, కడపఉత్సవాలు ఇలా..శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గురుదేవుడిగా ప్రసిద్ధి చెందారు కావున.. ఏటా ఆయన శిష్య బృందం, భక్తులు.. ఆరాధన, గురుపూజోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన ఉత్సవాలు 9 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా రోజూ ఉదయం శ్రీవీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనం, అభిõషేకం, సహస్ర నామార్చన కార్యక్రమాలు నిర్వహిస్తారు. తర్వాత గుడి ఉత్సవం ఉంటుంది. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రహ్మంగారి నాటకాలు తదితర ప్రదర్శనలు ఉంటాయి.అలాగే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి రోజూ ఒక్కో వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 4న శేషవాహనోత్సవం, 5న గజవాహనోత్సవం, 6న నరనంది ఉత్సవం, 7న నంది ఉత్సవం, 8న బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తారు. 7న సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం కావడంతో.. స్వామివారు దీక్షాబంధనాలంకారోత్సవంలో దర్శనమిస్తారు. బ్రహ్మంగారి మాలధారణ చేసిన భక్తులు ఇరుముడి సమర్పిస్తారు. 9న మహాప్రసాద వినియోగంతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఫొటోలు
అంతర్జాతీయం

అదే జరిగితే.. భారత్కు పాక్ మరోసారి అణు బెదిరింపులు
మాస్కో: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపడుతున్న చర్యలు.. పాక్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తాజాగా రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీ అణు బూచిని భారత్కు చూపించి బెదిరించే యత్నం చేశారు. ఒక వేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే.. అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని పేర్కొన్నారు. రష్యా ఛానల్ ఆర్టీకి ఇంటర్వ్యూ ఇస్తూ.. భారత్కు చెందిన బాధ్యతారాహిత్య మీడియా నుంచి వస్తున్న ప్రకటనలు మమ్మల్ని తప్పనిసరిగా స్పందించేలా చేస్తున్నాయి. ఇటీవల లీకైనట్లు చెబుతున్న పత్రాల్లో భారత్ కొన్ని చోట్ల కచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసింది. ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే ప్రజల మద్దతుతో మా సంప్రదాయ, అణు బలంతో పూర్తిస్థాయిలో స్పందిస్తాం’’ అని జమాలీ పేర్కొన్నారు. గత వారం ఆ దేశ రైల్వేశాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ మాట్లాడుతూ తమ వద్ద ఉన్న ఘజన్నవీ, ఘోరీ, షహీన్ క్షిపణులు, 130 అణ్వాయుధాలు భారత్ కోసమే ఉంచినట్లు ప్రకటించారు. పాక్ ప్రేరిత ఉగ్రవాదులు పహల్గాంలోని బైసరన్ లోయలో దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు తీయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ టెర్రరిస్టులు పాక్ జాతీయులని తేలింది. దీంతో భారత్ ప్రతిచర్యలకు దిగింది. ఇప్పటికే సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేసి ఇస్లామాబాద్కు భారత్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఉగ్రవాదులు, ఆ మూకలకు మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకొనే విషయంలో భద్రతా దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఎక్కడ, ఎప్పుడు ఎలా దెబ్బకొట్టాలో వారే నిర్ణయిస్తారన్నారు. సైనిక చర్య కూడా ఉండొచ్చన్న ఆందోళనతో.. యుద్ధం వస్తే తాము అణ్వాయుధాలు వాడతామంటూ పాక్ ప్రకటనలు గుప్పిస్తోంది.

భారత్తో టెన్షన్ వేళ పాక్కు షాక్.. ఊహించని దెబ్బకొట్టిన బీఏల్ఏ
క్వెట్టా: పహల్గాం ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దాయాది దేశానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ సైన్యానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఊహించని షాక్ తగిలింది. పాక్ సైన్యానికి సవాల్ విసురుతూ కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. ఇదే సమయంలో సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా పట్టుకుంది. అలాగే, బీఎల్ఏ బలగాలు.. క్వెట్టా నగరం దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యాన్ని టార్గెట్ చేసిన బీఎల్ఏ దాడులు చేసింది. ఇక, తాజాగా పాక్ సైన్యంపై తిరుగుబాటు చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ సవాల్ విసిరింది. కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. బీఎల్ఏకు చెందిన అత్యంత క్రూరమైన, ప్రత్యేక శిక్షణ పొందిన 'డెత్ స్క్వాడ్' బృందం ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ బృందం మంగుచోర్ పట్టణంలోకి చొచ్చుకెళ్లి, అక్కడ ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, భద్రతా సంస్థల ప్రాంగణాలను తమ అదుపులోకి తీసుకుంది. ఇంతటితో ఆగకుండా, పట్టణంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉన్నత స్థాయి సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా చేసుకుంది.బలుచిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని బీఎల్ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో బీఎల్ఏ వరుస దాడులతో బలూచిస్తాన్పై పాకిస్తాన్ నియంత్రణ కోల్పోతోంది. ఇక, ఇప్పటికే బీఎల్ఏ దాడుల్లో వందలాదిమంది పాక్ సైనికులు మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం పాక్ సైనికులు వెళుతున్న ట్రైన్ని హైజాక్ చేసిన బీఎల్ఏ.. పాక్ సైనికులను హతమార్చింది. కొద్ది రోజుల క్రితం బీఎల్ఏ పాక్ సైన్యం కాన్వాయ్పై ఐఈడీ దాడి చేయడంతో ఏకంగా 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారు ఎంత దూకుడుగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారో పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు.Baloch sarmachars are roaming openly through Mangocher city, seizing control of banks, as well as government and military assets. Certain handles suggest that government personnel have been forced to evacuate, and that several state institutions are no longer operational.… https://t.co/h9KewE0JZc pic.twitter.com/P4mdw3l6aG— Char (@cqc_coffee_guns) May 3, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతమే బలూచిస్తాన్. ఇది పాక్లో ఒక ప్రావిన్స్గా ఉంది. పాకిస్తాన్ మొత్తం విస్తీర్ణంలో 44 శాతం బలూచిస్తాన్ ఉంటుంది. విస్తీర్ణంపరంగా పాకిస్థాన్లో అతి పెద్ద ప్రావిన్స్గా బలూచిస్తాన్ ఉంది. అలాగే మిగతా అన్ని ప్రావిన్స్లో కెల్లా అతి తక్కువ జనాభా ఉన్న ప్రావిన్స్ కూడా బలూచిస్తానే. బలూచిస్తాన్లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు వనరులు పుష్కలంగా ఉన్నాయి. బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయకముందువరకు బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగానే ఉండేది. బ్రిటిష్ వారి నుంచి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో భాగమైంది. ఆ తర్వాత కొంత కాలానికి స్వతంత్ర దేశం కోసం బలూచిస్తాన్ నుంచి డిమాండ్ పుట్టుకొచ్చింది.అలాగే ఆ ప్రావిన్స్లో పాక్ సాగిస్తున్న మారణకాండ కూడా తిరుగుబాటుకు మరో కారణం. 2011 నుంచి 2024 జనవరి వరకు పాక్లో మొత్తం 10,078 మంది అదృశ్యం అయ్యారు. అదృశ్యమైనవారిలో 2,752 మంది బలూచ్ పౌరులే. 2001-2017 మధ్య 5,228 మంది బలూచ్ పౌరులు అదృశ్యం కావడం గమనార్హం. ప్రస్తుతం బీఎల్ఏ యాక్టివ్గా వేర్పాటువాద కార్యకలాపాలు సాగిస్తోంది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్తో బీఎల్ఏ ఏర్పాటైంది. దశాబ్ద కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తోంది.

జిన్పింగ్కు టెన్షన్.. చైనా అధికారులకు అమెరికా ట్రాప్?
వాషింగ్టన్: చైనా అధికారులను బుట్టలో వేసుకునేందుకు అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ఎప్పటికప్పుడు కొత్త దారులు వెదుకుతోంది. అధ్యక్షుడు జిన్పింగ్ పాలనలో తమ భద్రత గురించి ఆందోళన చెందే చైనా అధికారులు తమతో కలిసి పనిచేయాలంటూ అమెరికా గూఢచార విభాగం సీఐఏ తాజాగా పిలుపునిచ్చింది. అలాంటి వారు తమను సంప్రదించాలని కోరింది. చైనాలో వారికి భద్రత ఇస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించి చైనా అధికార భాష మాండరిన్లో రూపొందించిన వీడియోలను తాజాగా యూట్యూబ్, ఎక్స్లలో విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ వీడియోలకు విడుదలైన మొదటి రోజే 50 లక్షల వ్యూస్ రావడం గమనార్హం.ఒక వీడియోలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వంలో ఎంతో నిజాయతీతో పనిచేస్తున్న ఓ వ్యక్తి.. ‘పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, వాటి వల్ల తన కుటుంబ భద్రత ప్రమాదంలో పడిందని ఆందోళన చెందుతుంటాడు. వీడియోలో నేపథ్య సంగీత తీవ్రత పెరుగుతుండగా అతడు..‘నేను ఏ తప్పూ చేయలేదు. నేను భయంతో జీవించలేను..!’అంటూ తన స్మార్ట్ఫోన్తో సీఐఏను సంప్రదించే ప్రయత్నం చేస్తుంటాడు. సీఐఏ చిహ్నం కనిపించడంతో రెండు నిమిషాల నిడివిగల ఈ వీడియో ముగుస్తుంది. వీడియో కింద ఉన్న లింక్లో సీఐఏ అంటూ నకిలీ ఖాతాలుంటాయనే హెచ్చరికతోపాటు, సురక్షితంగా సంప్రదించడంపై సూచనలుంటాయి.ఈ వీడియోలపై సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ స్పందించారు. కొత్తగా కొన్ని దేశాల్లో ముఖ్యంగా చైనాలో మనుషులను నియమించుకుని గూఢచర్య కార్యకలాపాలు ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. గూఢచర్యం కోసం అమెరికా అధికారులను చైనా వాడుకుంటున్నట్లు ఇటీవల వార్త లు వచ్చిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఆర్థికంగా, సైనికంగా, సాంకేతికత పరంగా ప్రపంచంపై ఆధిపత్యం చలాయించాలని చైనా కుట్రలు పన్నుతోందని తెలిపారు. ఇటువంటి బెడదపై తగురీతిలో స్పందిస్తామన్నారు. అందులో భాగంగానే ఈ వీడియోలను విడుదల చేశామని చెప్పారు. ఇటీవలే సీఐఏ కొరియన్, మాండరిన్, ఫార్సి భాషల్లో సీఐఏను సంప్రదించడమెలాగో వివరిస్తూ వీడియోలు విడుదల చేసింది. మూడేళ్ల క్రి తం రష్యన్ భాషలో నూ ఇలాంటి వీడియోనే సీఐఏ విడుదల చేయడం గమనార్హం. 牛B,美国CIA发布最新宣传片,向中国大陆高级官员抛出橄榄枝。一般人就别联系CIA了,联系了人家也不回。话说回来,当你没有利用价值的时候,CIA还会保护你或你的家人吗? 参考帮美国对抗塔利班的阿富汗人,跑道上趴飞机轮子也不给上。😂😂😂 pic.twitter.com/7Z06mSEInQ— 边境杀手 (@adjustcate) May 1, 2025

పాము విషానికి తిరుగులేని విరుగుడు.. మనిషి రక్తం నుంచే..
హీరోకు వాళ్ల నాన్నో, తాతయ్యో చిన్నప్పటి నుంచే కొద్దిపాటి మోతాదులో విషం తినిపిస్తారు. దాంతో పెరిగి పెద్దయ్యాక ఎలాంటి పాము కరిచినా మనవాడికి ఏమీ కాదు. ఈ ఫార్మూలాతో సూపర్డూపర్ హిట్టైన సినిమాలు అన్నీ ఇన్నీ కావు. అమెరికాలోనూ కాలిఫోర్నియాలో ఉండే తిమోతీ ఫ్రైడ్ అనే వ్యక్తి అచ్చం అలాగే చేశాడు. ఒకటీ రెండూ సార్లు కాదు, 18 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 200 సార్లకు పైగా పాములతో కరిపించుకున్నాడు. 700 సార్లకు పైగా పాము విషాన్ని ఒంట్లోకి ఎక్కించుకున్నాడు!.గుర్రం వంటి బలిష్టమైన జంతువులను కూడా ఒకే కాటుకు బలి తీసుకునే 16 ప్రాణాంతక పాము జాతుల విషాలూ వాటిలో ఉన్నాయి. ఫలితంగా తిమోతీ ఎలాంటి పాము కరిచినా ఏమీ కాని స్థితికి చేరుకున్నాడు! మనవాడి రక్తం నుంచి సైంటిస్టులు తాజాగా పాము విషానికి విరుగుడు తయారు చేశారు. ఇప్పటిదాకా తయారైన వాటిల్లోకెల్లా అత్యంత ప్రభావవంతమైన యాంటీ వెనమ్ ఇదేనని చెబుతుండటం విశేషం! దీన్ని పాముకాటు చికిత్సలోనే అత్యంత విప్లవాత్మక మలుపుగా చెబుతున్నారు!!ఇలా చేశారు... బ్లాక్మాంబా. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. రాచనాగు, టైగర్ స్నేక్, రాటిల్ స్నేక్ వంటివీ ఈ కోవలోకే వస్తా యి. ఇలాంటి విషపూరిత పాములతో పదేపదే కరిపించుకున్న తిమోతీ గురించి అమెరికాకు చెందిన వ్యాక్సీన్ కంపెనీ సెంటివాక్స్ సీఈఓ జాకబ్ గ్లెన్విల్లే 2017లో ఎక్కడో చదివారు. వాటి విషాన్ని వందలాదిసార్లు ఒంట్లోకి ఎక్కించుకున్నాడని తెలిసి ఆశ్చర్యపోయారు. తిమోతీ ట్రక్ మెకానిక్గా చేసేవాడు. తర్వాత రకరకాల పాములను గురించి ఆసక్తికరమైన వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు. ఆ క్రమంలో ఒకసారి రెండు నాగుపాములు వెంటవెంటనే కరవడంతో కోమాలోకి వెళ్లిపోయాడు.మరోసారి అలాంటి పరిస్థితి రాకుండా ఇలా విషం పుచ్చుకోవడం మొదలుపెట్టాడు. తిమోతీ అంగీకారంతో గ్లెన్విల్లే అతని రక్త నమూనాలు సేకరించారు. ఎలాంటి పాము విషాన్నైనా తట్టుకోగలిగే తిరుగులేని యాంటీబాడీలు వాటిలో పుష్కలంగా ఉన్నట్టు తేల్చారు. కొలంబియా వర్సటీకి చెందిన మెడికల్ సైన్సెస్ నిపుణుడు రిచర్డ్ స్టాక్ తదితరుల సాయంతో సైంటిస్టులు ఆ యాంటీబాడీలను సేకరించారు. ఎనిమిదేళ్లపాటు సుదీర్ఘ శ్రమకోర్చి వాటి సాయంతో అత్యంత ప్రభావవంతమైన యాంటీ వెనమ్ ఇంజక్షన్ తయారు చేశారు. దానికి ఎల్ఎన్ఎక్స్–డీ09 అని పేరు పెట్టారు.ప్రయోగాత్మకంగా బ్లాక్మాంబాతో పాటు 19 అత్యంత విషపూరిత పాముల విషాన్ని ఒక్కొక్కటిగా ఎలుకలకు ఎక్కించి, అనంతరం వాటికి ఈ విరుగుడు ఇచ్చారు. బ్లాక్మాంబాతో పాటు 13 రకాల విషాల బారినుంచి ఎలుకలను ఈ యాంటీ వెనమ్ కాపాడటం చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు! ఆరు అత్యంత విషపూరిత పాముల విషాన్ని కలగలిపి ఇచ్చినా అదే ఫలితం వచి్చంది. మిగతా 6 రకాల విషాలకు కూడా ఎల్ఎన్ఎక్స్–డీ09 పాక్షికంగా విరుగుడుగా పని చేసింది. ఇది ప్రస్తుతానికి ప్రయోగాల దశలోనే ఉన్నట్టు గ్లెన్విల్లే చెప్పారు. ఈ పరిశోధన ఫలితాలను తాజాగా సైంటిఫిక్ జర్నల్ ‘సెల్’లో ప్రచురించారు.శ్రమతో కూడిన ప్రక్రియ యాంటీ వెనమ్ తయారీ ఓ సంక్లిష్ట ప్రక్రియ. పాముల నుంచి సేకరించిన విషయాన్ని చిన్న డోసుల్లో గుర్రాల వంటి జంతువులకు ఎక్కిస్తారు. ఆ విషానికి రోగనిరోధకత సమకూరాక వాటి రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీలతో విరుగుడు తయారు చేస్తారు. అయితే ఇది శ్రమతో కూడినదే గాక ప్రమాదకరమైన ప్రక్రియ కూడా. చాలాసార్లు సరిగా పని చేయకపోవడంతో పాటు సీరియస్ సైడ్ ఎఫెక్టులు కూడా తలెత్తుతాయి. పాముకాటుకు ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.4 లక్షల మంది బలవుతున్నట్టు అంచనా. 4 లక్షల మంది దాకా వికలాంగులుగా మారుతున్నారు. గ్వాటెమాలా గ్రామాల్లో పెరిగిన గ్లెన్విల్లే ఈ సమస్యకు మెరుగైన, శాశ్వత పరిష్కారం కోసం చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అది ఎల్ఎన్ఎక్స్–డీ09 కాగలదని ఆయన ధీమాగా చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్.
జాతీయం

మూడేళ్ల చిన్నారి ‘సల్లేఖనం’
ముంబై: మూడేళ్ల చిన్నారి వియానా. ఐటీలో పనిచేసే పీయూష్, వర్షా జైన్ దంపతుల ఒక్కగానొక్క కూతురు. మాటలు కూడా పూర్తిగా రాని చిన్నారికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు గత జనవరిలో నిర్ధారణ అయ్యింది. ముంబైలో ఆపరేషన్ చేయించినా లాభం లేకపోయింది. రోజురోజుకూ పరిస్థితి విషమించడంతో జైన మతస్తులైన వారు ఇండోర్లోని తమ మత గురువు రాజేష్ ముని మహరాజ్ దగ్గరకు వెళ్లారు. చిన్నారిని ‘సంతారా/సల్లేఖన’ (ఆమరణ నిరాహార దీక్ష) చేయించాలని సూచించగా అగీకరించారు. అయితే ఆ దీక్ష తీసుకున్న పది నిమిషాల్లోనే చిన్నారి మరణించింది. అతి పిన్న వయసులో ‘సల్లేఖన దీక్ష’ స్వీకరించిన వ్యక్తిగా ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో వియానా పేరు నమోదవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏమిటీ దీక్ష? సంతారా లేదా సల్లేఖనం అంటే స్వచ్ఛందంగా ఆమరణ నిరాహార దీక్ష చేసే జైన ఆచారం. అలా శరీరాన్ని కృశింపజేసుకుంటూ మరణాన్ని ఆహా్వనించడం. సాధారణంగా వృద్ధులు ఈ దీక్ష తీసుకుంటారు. మూడేళ్ల చిన్నారికి అలాంటి దీక్ష ఇవ్వడం చర్చనీయంగా మారింది. జీవించే హక్కును కాలరాస్తూ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. తల్లిదండ్రుల వాదన వేరేలా ఉంది. ‘‘కూతురు చనిపోవాలని ఏ తల్లీ కోరుకోదు. నా బిడ్డతో సంతార ప్రతిజ్ఞ చేయించడానికి ఎంత బాధపడ్డానో చెప్పలేను! ట్యూమర్తో తను విలవిల్లాడుతోంది. ఆ స్థితిలో చూడలేకే అంగీకరించాం’’ అని వర్ష తెలిపింది. ‘‘నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది పడ్డ స్థితిలో పాపకు చివరి క్షణాలు సమీపించాయి గనుక మా గురువు సలహా మేరకు సంతారకు అంగీకరించాం’’ అని పీయూష్ చెప్పారు. కానీ అలాంటి నిర్ణయం తీసుకునే హక్కు తల్లిదండ్రులకు లేదని న్యాయ నిపుణులు అంటున్నారు. ‘‘మత స్వేచ్ఛ నమ్మకానికి సంబంధించింది మాత్రమే. ప్రాణాలు తీసే ఆచారాలను పాటించడానికి కాదు’’ అన్నది వారి వాదన. సల్లేఖనం నేరమన్న హైకోర్టు సంతారా/సల్లేఖన దీక్ష నేరమని 2015లో రాజస్థాన్ హైకోర్టు పేర్కొంది. ఈ ఆచారాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఆత్మాహత్యాయత్నంగా పరిగణించి శిక్షార్హమైన నేరంగా ప్రకటించింది. ఇది న్యాయ, జైన మత వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తీర్పును జైన సంస్థలు సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.

అవే ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: అవే ఉద్రిక్తతలు. అదే ఉత్కంఠ. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. దాయాది కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా పదో రోజూ కాల్పులకు తెగబడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం దాకా జమ్మూ కశ్మీర్లో కుప్వారా, పూంచ్, రాజౌరీ, మేంధార్, నౌషేరా, సుందర్బనీ, అఖూ్నర్ తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. వాటిని సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలు, భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించారు.నావికా దళాధిపతి చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠితో సమావేశమైన 24 గంటల్లోపే ఎయిర్ చీఫ్ మార్షల్తో మోదీ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రదాడులపై ప్రతీకారం విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, భారత వాయుసేనతో త్వరలో ఘర్షణ జరగవచ్చంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కొత్త పల్లవి అందుకున్నారు. తమ గగనతలంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన భారత రఫేల్ యుద్ధ విమానాలను అడ్డుకున్నట్టు చెప్పుకున్నారు. మరోవైపు మిత్ర దేశాల మద్దతు కూడగట్టేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. తుర్కియేకు చెందిన భారీ యుద్ధనౌక ఆదివారం కరాచీ తీరం చేరుకుంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్పై దాడికి తెగబడ్డ వారికి త్వరలో మర్చిపోలేని రీతిలో సమాధానం చెప్పి తీరతామని పునరుద్ఘాటించారు. ‘‘సైనికులను కాపాడటం నా బాధ్యత. ప్రధాని మోదీ పట్టుదల అందరికీ తెలుసు. ప్రజలు కోరుతున్నది ఆయన నాయకత్వంలో జరిగి తీరుతుంది’’ అని ప్రకటించారు.దీర్ఘకాల సెలవులు రద్దుఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సిబ్బందికి దీర్ఘకాల సెలవులు రద్దు చేస్తూ మ్యునీíÙయన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్) ఆదేశాలు జారీ చేసింది. ఎంఐఎల్ పరిధిలో 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలున్నాయి. సైన్యానికి అవసరమైన ఆయుధాలు వాటిలో తయారవుతాయి. ఆయుధ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికే సెలవులు రద్దు చేసినట్లు ఎంఐఎల్ అధికారి ఒకరు చెప్పారు. భద్రతా మండలికి పాక్ పహల్గాం దాడిని అడ్డు పెట్టుకొని భారత్ తమను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని పాక్ వాపోయింది. దీనిపై ఐరాస భద్రతా మండలిని ఆశ్రయిస్తామని పాక్ ప్రకటించింది. వీలైనంత త్వరగా భద్రతామండలి భేటీ జరిగేలా చూడాలని ఐరాసలోని తమ శాశ్వత ప్రతినిధి, రాయబారి అసీం ఇఫ్తికార్ను పాక్ విదేశాంగ శాఖ ఆదేశించింది. ‘‘సింధూ జల ఒప్పందం నిలిపివేత ప్రాంతీయ శాంతిభద్రతలకు దెబ్బ. భారత్ వైఖరిని అంతర్జాతీయ సమాజానికి వివరిస్తాం’’ అని చెప్పుకొచి్చంది. భద్రతా మండలిలో పాక్ తాత్కాలిక సభ్యదేశం.నేడు పాక్ పార్లమెంట్ ప్రత్యేక భేటీ భారత్తో ఉద్రిక్తతలపై చర్చించేందుకు పాక్ పార్లమెంట్ సోమవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశం కానుంది. సింధూ ఒప్పందం నిలిపివేత వంటి అంశాలపైనా చర్చిస్తామని ఎంపీలు తెలిపారు.మళ్లీ ‘అణు’ ప్రేలాపనలు పాక్ మరోసారి అణు ప్రేలాపనలకు దిగింది. పాక్లోని కొన్ని భూభాగాలపై భారత్ త్వరలో దాడి చేయనున్నట్లు తమకు సమాచారముందని రష్యాలో ఆ దేశ రాయబారి మొహమ్మద్ ఖలీద్ జమాలీ చెప్పుకొచ్చారు. ‘‘దాడికి దిగితే భారత్కు గట్టిగా బదులిస్తాం. అణ్వాయుధాలు సహా సర్వశక్తులూ ప్రయోగిస్తాం’’ అని హెచ్చరించారు. యుద్ధం జరిగితే పాక్ కచ్చితంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తుందన్నారు. భారత్పై అణు బాంబులు ప్రయోగిస్తామని పాకిస్తాన్మంత్రి హనీఫ్ అబ్బాసీ కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే.

భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ.. రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్న వేళ.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది జరిగి కచ్చితంగా జరిగి తీరుతుందంటూ తేల్చి చెప్పారు. అందుకు తాను హామీ ఇస్తున్నానన్నారు. ఢిల్లీలో జరిగిన సంస్కృతి జాగరణ్ మహోత్సవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారాయన.‘‘మోదీ వర్కింగ్ స్టైల్, అంకితభావం గురించి అందరికీ తెలుసు. మన దేశంపై దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పడం నా బాధ్యత’’ అంటూ కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత్ను దెబ్బతీయడానికి దుస్సాహసం చేసిన వారికి ధీటైన రీతిలో సమాధానం ఇస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. మరో వైపు, భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ.. ప్రధాని మోదీ.. జాతీయ భద్రతా సలహాదారు, ఎయిర్చీఫ్ మార్షల్ ఏపీ సింగ్తో తాజాగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.ఇక, సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ప్రధాని మోదీ.. వరస భేటీలు అవుతున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా.. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్కు చెందిన రెండు ఆయుధ కర్మాగారాల సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా కర్మాగారంతోపాటు మధ్యప్రదేశ్లోని జబల్పుర్ జిల్లా ఖమరియాలో ఉన్న ఆర్డినన్స్ ఫ్యాక్టరీ సిబ్బందికి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

వైరల్ వీడియో.. షాపులో ఆ బాలిక చేసిన పనికి అంతా షాక్!
హాపూర్: ఉత్తరప్రదేశ్లో ఓ షాకింగ్ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ షాపు యజమానిపై 15 ఏళ్ల బాలిక బ్లేడ్తో దాడి చేయడం కలకలం సృష్టించింది.. షాప్లో కొన్న వస్తువులను వెనక్కి ఇచ్చేందుకు ఆ బాలిక వెళ్లగా, వాటిని తీసుకునేందుకు ఆ దుకాణదారులడు నిరాకరించాడు. దీంతో కోపంతో బాలిక దాడికి పాల్పడింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు షాప్లోని సీసీటీవీ కెమెరాకు చిక్కాగా.. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. ఈ ఘటన యూపీలోని హాపూర్ జిల్లాలో శుక్రవారం జరిగింది.ఆ షాపు యజమాని స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ఆ బాలిక తరచూ వస్తువులు కొనుగోలు చేస్తుందని.. అయితే.. వాడిన వస్తువులను తిరిగి ఇచ్చేస్తోందని.. అనేకసార్లు వాటిని వెనక్కి తీసుకున్నానంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే బాలిక ప్రవర్తనతో విసిగిపోయిన అతను ఈసారి వాటిని వెనక్కి తీసుకునేందుకు నిరాకరించానని తెలిపారు.ఆ బాలిక బ్లేడ్తో దుకాణదారుడిపై దాడి చేయగా.. ఆయన చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో దుకాణంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వెంటనే అప్రమత్తమై వారు ఆ దుకాణదారుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, దుకాణదారుడిపై దాడి చేసిన తర్వాత బాలిక పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు ఆ బాలికను పట్టుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆ బాలిక మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. #हापुड़♦नाबालिग ने दुकानदार पर ब्लेड से हमला किया♦सामान वापस न करने पर नाबालिका हुई आक्रोशित♦दुकानदार गंभीर हालत में अस्पताल में भर्ती♦सीसीटीवी में कैद हुई पूरी घटना♦पिलखुवा कोतवाली क्षेत्र का मामला@hapurpolice pic.twitter.com/H9LkuAJsJp— Knews (@Knewsindia) May 4, 2025
ఎన్ఆర్ఐ

డల్లాస్లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.
క్రైమ్

ప్రియురాలి చేతిలో ట్రావెల్ ఏజెంట్ హత్య
అన్నానగర్(తమిళనాడు): మద్యం, మాంసంలో నిద్రమాత్రలు కలిపి దుబాయ్ ట్రావెల్స్ సీఈఓను హత్య చేసిన ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూత్తుక్కుడి కి చెందిన త్యాగరాజన్(69) ఇతను కోయంబత్తూరు వచ్చి ఖతీమా నగర్లో నివశించే సమయంలో గోమతి అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. గోమతికి నీల, శారద అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2016లో శారదతో గొడవపడిన ఆమె భర్త గుణవేల్ను హత్య చేసి త్యాగరాజన్ జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్పై వచ్చాడు. ఈ క్రమంలో శారద పని నిమిత్తం దుబాయ్ వెళ్లింది. ఆ సమయంలో తిరువారూరు జిల్లాకు చెందిన ట్రావెల్ ఏజెంట్ సిగమణి(47)తో శారదకు అక్రమ సంబంధం ఏర్పడింది. శారదకు, సిగమణికి డబ్బులు ఇచ్చి పుచ్చుకునే దాంట్లో సమస్య వచ్చింది. దీంతో శారద కోవైకి తిరిగి వచ్చింది. శారదను శాంతింపజేసేందుకు సిగమణి 21న కోయంబత్తూరుకు వచ్చాడు. అతనిని శారద తన ఇంటికి తీసుకెళ్లింది. ఆ సమయంలో త్యాగరాజన్ నెల్లైకి చెందిన ప్రముఖ రౌడీ పశుపతిపాండియన్ సహచరుడు పుదియవన్ కోయంబత్తూరుకు ఆహ్వానించారు. ఆ తర్వాత 22వ తేదీ రాత్రి మద్యం, మాంసంలో 30కి పైగా నిద్ర, నొప్పి నివారణ మాత్రలు కలిపి సిగమణిని హత్య చేశారు. అనంతరం సిగమణి మృతదేహాన్ని త్యాగరాజన్, శారద, పుదియవన్ కారులో తీసుకెళ్లి కరూర్ పొన్నమరావతి పక్కన పడేసి, పారిపోయారు. మిగిలిన ఇద్దరు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. దీనిపై సిగమణి భార్య ప్రియా(69) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోయంబత్తూరు బీలమేడు పోలీసులు విచారణ చేపట్టారు. త్యాగరాజన్(69), ఇతని వివాహేతర ప్రియురాలు గోమతి (53), ఆమె కూతుళ్లు నీల (33), శారద (35), కోడలు స్వాతి (26), పుదియవన్(48) సిగమణిని హత్య చేసినట్లు తేలింది. ఆదివారం శారదతోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

భర్త వివాహేతర సంబంధం.. గుండెపోటుతో భార్య మృతి..!
ఖమ్మంక్రైం: వరుసకు వదిన అయిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపినట్లు సమాచారం. ఈ ఘటన హైదరాబాద్లో జరగగా.. మృతురాలిది ఖమ్మం. వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన సాహితి (30)కి ఖమ్మం పట్టణానికి చెందిన రేగుల అనిల్తో కొన్నేళ్ల కిందట వివాహమైంది. అనిల్ హైదరాబాద్లోని పోలీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తుండటంతో దంపతులు అక్కడే ఉంటున్నారు. కాగా, అనిల్ వరుసకు వదిన అయిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పద్ధతి మార్చుకోవాలని పెద్దల సమక్షంలో హెచ్చరించినా మార్పు రాలేదు. శనివారం రాత్రి సాహితిని విపరీతంగా కొట్టడంతో ఆమె మృతిచెందగా గుండెపోటుతో మృతిచెందినట్లు చిత్రీకరించేందుకు అనిల్ యత్నంచాడని మృతురాలి బంధువులు ఆరోపించారు.మృతురాలి శరీరంపై కూడా గాయాలున్నాయని, హైదరాబాద్ నుంచి మృతదేహన్ని తీసుకొచ్చి ఖమ్మం టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. సీఐ బాలకృష్ణ వారితో మాట్లాడి అనిల్పై ఫిర్యాదు చేయాలని, పోస్టుమార్టంలో హత్య అని తేలితే కేసు నమోదు చేస్తామని, సర్దిచెప్పగా మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. టూటౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. అనిల్ పరారీలో ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు.

ప్రాణాలు తీసిన పెంపుడు కుక్క..!
వెంగళరావునగర్(హైదరాబాద్): తాను పెంచుకుంటున్న శునకమే ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్న ఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన డి.పవన్కుమార్ (37) తన స్నేహితుడు సందీప్తో కలిసి పదేళ్లుగా మధురానగర్లోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గదిలో నిద్రపోయాడు. పక్కనే అతని పెంపుడు కుక్క కూడా ఉంది. ఉదయం సందీప్ తలుపు తట్టగా పవన్ లేవలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారితో తలుపు పగులకొట్టి లోనికి వెళ్లి చూడగా పవన్ విగతజీవిగా కనిపించాడు. అతని మర్మాంగాలు రక్తంతో ఉన్నాయి. అతని పెంపుడు కుక్క నోటి నిండా రక్తం ఉంది. కుక్క అతడి మర్మాంగాలను గాయపర్చడం వల్లే మృతి చెంది ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. పవన్కుమార్కు గతంలో వివాహమైంది. భార్యతో విడాకులు కావడంతో నగరంలో ఉంటున్నాడు. స్నేహితుడు సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వృద్ధ దంపతుల దారుణ హత్య
అల్వాల్(హైదరాబాద్): వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు నగలతో పాటు, ఇంట్లో ఉన్న నగదు ఎత్తుకెళ్లిన సంఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలోని సూర్యనగర్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, మాణిక్యారం గ్రామానికి చెందిన కనకయ్య (70), రాజమ్మ (65) దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారికి పెళ్లిళ్లు కావడంతో బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి స్థిరపడ్డారు. ఊరిలో వ్యవసాయం చేసుకునే కనకయ్య, రాజమ్మ వయసు మీద పడడంతో పిల్లల వద్ద ఉందామనే ఆలోచనతో మూడేళ్ల క్రితం నగరానికి వచ్చారు. కనకయ్య అల్వాల్, సూర్యనగర్లో వాచ్మెన్గా పనిచేసేవాడు. కొన్నాళ్ల క్రితం అతను అనారోగ్యానికి గురి కావడంతో ఊరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి సమీపంలో ఉంటున్న కూతురు లత ఇంటికి వెళ్లి సామన్లు సర్దుకునేందుకు అవసరమైన సంచులు కూడా తెచ్చుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున వారి కుమార్తె లత ఇంటికి వచ్చి చూడగా తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో మంచంపై విగతజీవులై పడి ఉన్నారు. ఇద్దరి తలలపై గాయాలు ఉన్నాయి. సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. లత కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జాగిలాలను రప్పించి పరిసరాల్లో తనిఖీలు చేశారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఇంట్లో చొరబడి దొంగతనాలు పాల్పడి ఉంటారని, ఈ క్రమంలోనే వారిపై దాడి చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రాజమ్మ మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, వెండి పట్టీలు, రూ. లక్ష నగదు చోరీకి గురైనట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కనకయ్య తమ వద్ద ఉన్న నగదు అవసరమైన వారికి వడ్డీకి ఇచ్చే వాడని తాను ఊరికి వెళ్లి రూ. లక్ష తీసుకువచ్చానని, అవసరం ఉన్న వారికి వడ్డీకి ఇస్తానని చెప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న బాలానగర్ డీసీపీ సుధీర్ కుమార్, ఏసీపీ రాములు, సీఐ రాహుల్దేవ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయని త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.