Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Court: State Vs A Nobody Movie Review In Telugu1
Court Movie Review: నాని ‘కోర్ట్‌’ మూవీ రివ్యూ

టైటిల్‌:'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' నటీనటులు: ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్‌, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి తదితరులుసమర్పణ: నానినిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమానిర్మాత: ప్రశాంతి తిపిర్నేనికథ, దర్శకత్వం: రామ్ జగదీష్సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: దినేష్‌ పురుషోత్తమన్‌ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్విడుదల తేది: మార్చి 14, 2023హీరో నాని ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కొత్త చిత్రాలను నిర్మిస్తున్నాడు. వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌ ద్వారా కొత్త కంటెంట్‌తో పాటు కొత్త నటీనటులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఆయన బ్యానర్‌లో తెరకెక్కిన చిత్రమే ‘కోర్ట్‌’. ‘‘కోర్ట్‌’ నచ్చకపోతే నా ‘హిట్‌ 3’సినిమా చూడకండి’ అంటూ నాని సవాల్‌ విసరడంతో ఈ చిన్న చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అంతేకాదు రిలీజ్‌కి రెండు రోజుల ముందే మీడియాకు స్పెషల్‌ షో వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుఖలేఖ సుధాకర్‌) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త తేడా దుస్తులు ధరించిన సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్‌ చదువుతున్న జాబిలి.. ఇంటర్‌ ఫెయిల్‌ అయి పార్ట్‌ టైం జాబు చేస్తున్న వాచ్‌మెన్‌ కొడుకు చంద్రశేఖర్‌ అలియాస్‌ చందు(రోషన్‌)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్‌ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపట్టాడు? జూనియర్‌ లాయర్‌ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కోర్ట్‌’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని రాజ్యాంగం చెబుతోంది. కానీ అదే చట్టాలను కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకులను జైలుపాలు చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ‘కోర్ట్‌’ సినిమా చూస్తున్నంతసేపు అలాంటి ఘటనలు గుర్తుకొస్తూనే ఉంటాయి. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని కొంతమంది ఎలా మిస్‌ యూజ్‌ చేస్తున్నారు? ఇలాంటి పవర్‌ఫుల్‌ చట్టాలలో ఉన్న లొసుగులను పోలీసులతో పాటు ‘లా’ వ్యవస్థ ఎలా వాడుకుంటుంది? పోక్సో చట్టం ఎం చెబుతోంది? అందులో ఉన్న ప్లస్‌, మైనస్‌ పాయింట్స్‌ ఏంటి? తదితర విషయాలను ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు రామ్‌ జగదీష్‌.దర్శకుడు ఎంచుకున్న టాపిక్‌ చాలా సెన్సిబుల్‌. ఎక్కడ అసభ్యతకు తావులేకుండా చాలా నీట్‌గా ఆ టాపిక్‌ని చర్చించాడు. ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే. అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగించాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సీన్‌ మన ఊహకందేలా సాగుతుంది. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. అలాగే లవ్‌ స్టోరీని కూడా రొటీన్‌గానే చూపించాడు. కుర్రాడిపై పోక్సో కేసు నమోదైన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. బెయిల్‌ కోసం ప్రయత్నించిన ప్రతిసారి చట్టంలోని లొసుగులు ఉపయోగించి లాయర్‌ దాము(హర్ష వర్ధన్‌) అడ్డుపడే విధానం ఆకట్టుకుంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్ అవన్ని అబద్దాలని తేలిపోతాయని తెలిసినా..తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తాయి. సెకండాఫ్‌ మొత్తం కోర్టు వాదనల చుట్టే తిరుగుతుంది. కొన్ని చోట్ల ప్రియదర్శి వాదనలు ఆకట్టుకుంటాయి. చిన్నచిన్న ట్విస్టులు కూడా ఎంటర్‌టైన్‌ చేస్తాయి. ఎమోషనల్‌ సీన్లను బలంగా రాసుకున్నాడు. క్లైమాక్స్‌ లో లా వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రియదర్శి చెప్పే సంభాషలు ఆలోచింపజేస్తాయి. ఎవరెలా చేశారంటే.. ప్రియదర్శి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా సరే నేచురల్‌ యాక్టింగ్‌తో అదరగొట్టేస్తాడు. జూనియర్‌ లాయర్‌ సూర్యతేజ పాత్రలో ఒదిగిపోయాడు. కోర్టులో ఆయన వినిపించే వాదలను ఆకట్టుకుంటాయి. పలు సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన హర్ష రోషన్‌ ఈ సినిమాలో చందు పాత్ర పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జాబిలిగా కొత్తమ్మాయి శ్రీదేవి చక్కగా నటించింది. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర శివాజీది అని చెప్పాలి. తెరపై ఆయన పండించిన విలనిజం సినిమా స్థాయిని పెంచేసింది. సాయి కుమార్‌, రోహిణి, శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలమైంది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

 Gudivada Amarnath Strong Counter To Vijayasai Reddy Kotary Comments2
Vijayasaireddy: ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తాం?

విశాఖపట్నం, సాక్షి: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే తాను వైఎస్సార్‌సీపీకి దూరమయ్యానని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు(Vijayasai Kotary Comments) మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్‌ ఇచ్చారు. ఆయన గతంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలకు.. ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదని అమర్నాథ్‌ చురకలంటించారు. ‘‘వైఎస్ జగన్(YS Jagan) కోటరీ అంటే అది ప్రజలే. అయినా ఏ రాజకీయ పార్టీ చుట్టూ కోటరీ ఉండదో చెప్పండి. ఆ మాటకొస్తే చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా?. మొన్నటి వరకు కోటరిలో ఉన్న మనమే.. ఇప్పుడు ఆ కోటరీ గురించి మాట్లాడితే ఏమి బాగుంటుంది?. ఒకరి మీద ప్రేమ పుడితే మరొకరి మీద ప్రేమ విరిగిపోతుంది. మరి విజయసాయిరెడ్డికి ఎవరి మీద ప్రేమ పుట్టిందో తెలియదు. అయినా పార్టీ మారిన ఆ వ్యక్తి నుంచి ఇంతకంటే ఏమి ఆశిస్తాం?.ప్రస్తుతం రాష్ట్రంలో మూడు వర్గాలు ఉన్నాయి. ఒకటి కూటమి వర్గం.. రెండోది వైఎస్సార్‌సీపీ వర్గం. ఇక మూడోది.. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు చూసే వర్గం. గతంలో వైఎస్సార్‌సీపీలో కీలకమైన పదవులు అనుభవించారు. మళ్ళీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే పార్టీ నుంచి వెళ్లే పోయేవారా?. ఇదే విధంగా మాట్లాడేవారా?. అసలు ఇటువంటి వ్యాఖ్యలను ప్రజలు హర్షిస్తారా?. ఆ మధ్య రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. ఇప్పుడేమో కోటరీ అంటూ మాట్లాడుతున్నారు. ఆయన మాటలు చూస్తే తేడాగా కనిపిస్తోంది. ఆయన తాజా వ్యాఖ్యలు మళ్లీ రాజకీయాల వైపు చూస్తున్నారనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది’’ అని గుడివాడ అమర్నాథ్‌(Gudivada Amarnath) అన్నారు. ఒక్క హామీ అమలు చేయలేదుకూటమి ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదు. హామీలు అమలు చేయకపొగా.. వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగ భృతి కింద రూ.3 వేలు ఇస్తామన్నారు. కానీ, బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి కోసం రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇప్పటిదాకా కాలేదు. జగన్‌ హయాంలో తీసుకొచ్చిన 17 మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్నారు. ఈ సమస్యలపై పోరాటంలో యువత పోరు కార్యక్రమం చేపట్టాం.. అది విజయవంతం అయ్యింది. ప్రజలకు ఎల్లప్పుడూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది అని అమర్నాథ్‌ అన్నారు.

BJP MLA Raja Singh Sensational Comments on Party Leaders And Revanth3
బీజేపీలో పాత సామాను వెళ్లిపోవాలి.. రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: గోషామహాల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత సామాను బయటకు పోవాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్ చెప్పాల్సిన పనిలేదంటూ చురకలంటించారు.తెలంగాణలో హోలీ నిబంధనలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాసింగ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నిజాం పాలనలా కాంగ్రెస్‌ పాలన సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తొమ్మిదో నిజాం లాగా వ్యవహరిస్తున్నారు. హిందువులు పండుగలు ఎలా చేసుకోవాలో రేవంత్‌ చెబుతారా?. హోలీ 12 గంటల వరకే జరుపుకోవాలన్న నిబంధన ఎందుకు?. రంజాన్‌ నెలలో ముస్లింలు హడావుడి చేసినా పట్టించుకోరు. కాంగ్రెస్‌ అంటేనే హిందువుల పండుగ వ్యతిరేకి. హిందువుల జోలికి వస్తే రేవంత్‌ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటాడు. కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు కూడా పడుతుంది’ అని ఘాటు విమర్శలు చేశారు.ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలపై రాజాసింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. రాజాసింగ్‌ మాట్లాడుతూ..‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అలా జరగాలి అంటే.. బీజేపీలోని పాత సామాను బయటకు పోవాలి. బీజేపీ అధిష్టానం దీనిపై ఫోకస్‌ పెట్టాలి. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ ముఖ్యమంత్రిని సీక్రెట్‌గా కలుస్తారు. నా అయ్య పార్టీ అనుకునే వాళ్లను పంపితేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయి. తెలంగాణలో హిందువులు సేఫ్‌గా ఉండాలంటే బీజేపీ రావాలి’ అని చెప్పుకొచ్చారు.

Holi 2025 colourful celebrations in trendy and fashion outfit4
Holi 2025 : ఎపుడూ వైట్‌ డ్రెస్సేనా? కలర్‌ ఫుల్‌గా, ట్రెండీగా.. ఇలా!

హోలీ (Holi) అంటే.. రంగుల రాజ్యం. ఆద్యంతం హుషారుగా సాగే ఏకైక పండుగ ఇదేనేమో.. డ్యాన్స్, మ్యూజిక్, విందు వినోదాల కలయికగా సాగే ఈ పండుగ సందర్భంగా అనుసరించే ఫ్యాషన్‌ కూడా కలర్‌ఫుల్‌గా ఉండాలి కదా.. కాబట్టి కలర్‌ ఫెస్ట్‌లో ప్రత్యేకంగా కనబడేందుకు తాను చెప్పే స్టైల్స్‌తో లుక్‌ని కొత్త లెవల్‌కి తీసుకెళ్లండి అని సూచిస్తున్నారు నగరానికి చెందిన ఫ్యాషన్‌ కన్సెల్టెంట్‌ సుమన్‌ కృష్ణ. ఈ ఏడాది ఆరంభం నుంచి ట్రెండింగ్‌లో ఉన్న కలర్‌.. బ్లాక్‌ని సెంటరాఫ్‌ ఫ్యాషన్‌గా చేసి హోలీ వేడుకలో త‘లుక్‌’మనవచ్చని అంటున్నారామె. ఆమె అందిస్తున్న విశేషాలు, సూచనలివీ.. – సాక్షి, సిటీబ్యూరో కలర్‌ బ్లాకింగ్‌ అంటే..? ఇది విభిన్న, కాంట్రాస్ట్‌ కలర్‌ కాంబినేషన్‌ స్టైల్‌. మామూలు వైట్‌ కుర్తా బోరింగ్‌గా ఉంటుంది. సో.. ట్రెండీ కలర్‌ కాంబినేషన్‌లతో లుక్‌కి ఎక్స్‌ట్రా గ్లామర్‌ వస్తుంది.. ఒకే షేడ్‌లో ఉండే డ్రెస్సింగ్‌ కంటే, రెండు లేదా మూడింటికి పైగా బ్రైట్‌ కలర్స్‌ మిక్స్‌ చేసి ధరించడం ద్వారా మరింత స్టైలిష్‌గా కనిపిస్తారు. కొన్ని కలర్‌ కాంబినేషన్స్‌.. ధరించే దుస్తుల మధ్య సరైన కలర్‌ కాంబినేషన్‌ చాలా కీలకం. పింక్‌–ఆరేంజ్‌ హోలీకి చాలా ఎనర్జిటిక్‌ కలర్‌ కాంబినేషన్‌ అని చెప్పొచ్చు. అలాగే..ఎల్లో–పర్పుల్‌ వంటి బ్రైట్‌ షేడ్స్‌ ట్రెడిషనల్‌ హోలీ లుక్‌కి సరైన ఎంపిక. అంతేకాకుండా బ్లూ–రెడ్‌ కూడా ట్రెండీ లుక్‌ అందిస్తాయి. వైట్‌–రేసింగ్‌ గ్రీన్‌లు క్లాసిక్‌గా కనపడాలంటే బెస్ట్‌. పీచ్‌లను సున్నితమైన, పండుగ కళ తెచ్చే కలర్స్‌గా పేర్కొనవచ్చు.స్టైల్‌–కంఫర్ట్‌ రెండింటి మేళవింపులా ఇంపుగా అనిపించాలంటే, కాటన్‌ లేదా లినెన్‌ ఫ్యాబ్రిక్స్‌ ఎంచుకోవడం మంచిది. బ్రైట్‌ టాప్‌ + లైట్‌ బాటమ్‌ – లేదా ఆపోజిట్‌ కలర్‌ బ్లాక్‌ డ్రెస్సింగ్‌ ట్రై చేయవచ్చు. బాగీ/లూజ్‌ కుర్తాస్, ఫ్యూజన్‌ ధోతి ప్యాంట్స్‌ హోలీ మూడ్‌కి సరిగ్గా సరిపోతాయి. హోలీ డాన్స్‌లో ఫుల్‌ ఫన్‌ కోసం బెస్ట్‌ ఆప్షన్‌గా పాదాలకు స్నీకర్స్‌ బెస్ట్‌. సన్‌గ్లాసెస్, వాటర్‌ ప్రూఫ్‌ మేకప్‌ – హోలీ ఎఫెక్ట్స్‌ స్టైలిష్‌గా హ్యాండిల్‌ చేయండి. ఇలా చేయొద్దు.. పూర్తిగా వైట్‌ డ్రెస్సింగ్‌ వద్దు. దీనివల్ల రంగుల మిక్స్‌ తక్కువగా కనిపిస్తుంది. హెవీ మెటీరియల్స్, సిల్క్‌ ధరిస్తే అన్‌ ఈజీగా అసౌకర్యంగా ఉంటుంది. అలాగే కాళ్లకు హీల్స్‌ ధరిస్తే జారిపడే చాన్స్‌ ఎక్కువ. మేకప్, హెయిర్‌ ప్రొటెక్షన్‌ లేకుండా వెళ్లడం పెద్ద పొరపాటు అవుతుంది.ఫైనల్‌ టచ్‌.. ఈ హోలీలో బ్లాక్‌ కలర్‌తో మ్యాజిక్‌ ట్రై చేయవచ్చు. ఫొటోలు మరింత ట్రెండీగా ఉండేలా ప్లాన్‌ చేసుకుంటే ఈ హోలీ జ్ఞాపకాలతో ఆనందాన్ని ఏడాది పాటు కొనసాగించవచ్చు.

Karnataka Ranya Rao gold case Update Over Investigation5
యూట్యూబ్‌ చూసి నేర్చుకున్నా: రన్యా రావు

బెంగళూరు: దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రావు బెయిల్‌ అర్జీపై తీర్పును బెంగళూరులోని ఆర్థిక నేరాల విభాగం ప్రత్యేక కోర్టు 14వ తేదీకి రిజర్వు చేసింది. ఇక రన్యా బంగారం దందాలో కొత్త కొత్త సంగతులు వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా ఈ కేసులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు ఆమెను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణ సందర్భంగా ఆమె పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. విచారణలో రన్యా రావు..‘దుబాయ్‌ నుంచి ఇంతకుముందు ఎప్పుడూ బంగారాన్ని అక్రమంగా తీసుకురాలేదు. స్మగ్లింగ్‌ చేయడం ఇదే మొదటిసారి. ఎవరికీ కనబడకుండా బంగారాన్ని ఎలా దాచాలన్నది యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నా’ అంటూ అధికారులకు చెప్పినట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసులో రాష్ట్ర పోలీసులు అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై సీఐడీ దర్యాప్తునకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వును కర్ణాటక ప్రభుత్వం బుధవారం ఉపసంహరించుకుంది. అయితే, కర్ణాటక ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా నేతృత్వంలో రన్యా రావు తండ్రి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కె రామచంద్రరావు పాత్రపై దర్యాప్తు కొనసాగుతుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.తరుణ్‌ మాస్టర్‌ మైండ్‌ దుబాయ్‌లో బంగారం కొనుగోలు చేయడం, తిరిగి రావడం ఎలా అనే అన్ని వివరాలను నటి రన్య స్నేహితుడు, పారిశ్రామికవేత్త కుమారుడు తరుణ్‌రాజు మార్గదర్శకం చేసినట్లు డీఆర్‌ఐ అధికారుల విచారణలో వెలుగుచూసింది. పట్టుబడిన తరుణ్‌రాజును విచారిస్తున్నారు. దుబాయ్‌కు వెళ్లే రన్యాతో నిరంతరం సంప్రదించేవాడు. అతడు చెప్పినట్లు ఆమె నడుచుకునేది. విదేశాల నుంచి బంగారం తీసుకొచ్చే కొరియర్‌గా ఆమెను వాడుకున్నాడని డీఆర్‌ఐ భావిస్తోంది. ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ జరిపారు. కొన్నేళ్లుగా రన్యారావుతో తరుణ్‌రాజు ఆత్మీయంగా ఉంటున్నాడు. అతనికి దుబాయ్‌లో కొందరు పారిశ్రామికవేత్తలు బాగా తెలుసు. భారీగా ధన సంపాదన ఆశతో బంగారం స్మగ్లింగ్‌లో నిమగ్నమయ్యాడు. అతనిని ఐదురోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇందులో రన్యా స్నేహితుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది.సమగ్ర విచారణ జరగాలి: మంత్రి లక్ష్మి నటి రన్యా రావు బంగారం కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని మహిళా శిశు సంక్షేమ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ తెలిపారు. ఈ కేసులో ఓ ప్రముఖ మంత్రి హస్తం ఉందనే ఆరోపణలపై బుధవారం విధానసౌధలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగాలన్నారు. గ్యారంటీ పథకాలను కమిటీల గొడవపై స్పందిస్తూ ఆ కమిటీలను రద్దుచేయాలని ప్రతిపక్షాలు చేపట్టిన ధర్నాకు అర్థం లేదన్నారు. తమ పథకాలను పోలిన స్కీములను అమలు చేసిన కొన్ని బీజేపీ ప్రభుత్వాలు రెండు నెలల తరువాత రద్దు చేశాయని ఆరోపించారు.

Today Gold and Silver Price 13th March 20256
హోలీకి ముందే.. అమాంతం పెరిగిన బంగారం రేటు

బంగారం ధరలు వరుసగా పెరుగుదల దిశవైపు అడుగులు వేస్తోంది. రెండో రోజు (మార్చి 13) గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 600 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 81,200 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,500 వద్ద నిలిచాయి. నిన్న రూ.450, రూ.490 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ రూ.700 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.760 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 550, రూ. 600 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 81,200 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 88,580 వద్ద ఉంది.ఇదీ చదవండి: దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చు? దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 81,350 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 88,730 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 550, రూ. 600 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు గరిష్టంగా రూ.1,000 పెరిగింది. దీంతో ఈ రోజు (మార్చి 3) కేజీ సిల్వర్ రేటు రూ. 1,10,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 10,1000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Russia Demands For Talks With US On Ukraine Deal7
అమెరికాకు పుతిన్‌ డిమాండ్స్‌.. రష్యాకు ట్రంప్‌ సీరియస్‌ వార్నింగ్‌

వాష్టింగన్‌/మాస్కో: ఉక్రెయిన్‌-రష్యా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదుర్చేందుకు అమెరికా ప్లాన​్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌తో డీల్‌ చేసుకునేందుకు రష్యా పలు డిమాండ్లను అమెరికా ముందుకు తీసుకొచ్చినట్టు యూఎస్‌కు చెందిన ఇద్దరు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో అమెరికా ప్రతినిధులు రష్యాకు బయలుదేరడం విశేషం.ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు, అమెరికాతో సంబంధాల మెరుగు కోసం రష్యా పలు డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఓ జాబితాను సిద్దం చేసి రష్యాకు చెందిన అధికారులు అమెరికాకు అందజేశారు. అయితే, జాబితాలో రష్యా ఏం కోరిందనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. ఇక,గత మూడు వారాలుగా పలు నిబంధనలపై అమెరికా, రష్యా అధికారులు చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా డిమాండ్లు ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది.మరోవైపు.. యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యా బయల్దేరారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వైట్‌హౌస్‌ వద్ద మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్బంగా ట్రంప్‌ మాట్లాడుతూ..‘మా ప్రతినిధులు రష్యాకు బయల్దేరారు. కాల్పుల విరమణకు పుతిన్‌ అంగీకరిస్తారనే ఆశిస్తున్నాం. లేదంటే యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అదే జరిగితే మాస్కో ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది రష్యాకే వినాశకరంగా మారుతుంది. అలాంటి ఫలితాన్ని నేను కోరుకోవట్లేదు. శాంతిని సాధించడమే నా లక్ష్యం. రష్యా అంగీకరిస్తే అది గొప్ప నిర్ణయం అవుతుంది. లేదంటే ప్రజలు మరణిస్తూనే ఉంటారు’ అని స్పష్టం చేశారు.Trump threatens Putin with 'devastating' punishment if he doesn't agree to 30-day ceasefire with Ukraine. pic.twitter.com/vU6rLTX479— Daily Mail Online (@MailOnline) March 12, 2025ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌ మాత్రం కీవ్‌కు నాటో సభ్యత్వం ఇవ్వాలని ముందు నుంచి డిమాండ్‌ చేస్తోంది. ఉక్రెయిన్‌లో విదేశీ దళాలను మోహరించకూడదని చెబుతోంది. ఈ మేరకు అమెరికాతో కూడా చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ డిమాండ్లపైనే రష్యా కూడా ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చకూడదనే వాదనలు వినిపిస్తోంది. మాస్కో కాల్పుల విరమణకు సంతకం చేయకపోతే ఆంక్షల వలయంలో చిక్కుకోవాల్సి ఉంటుంది.

Chhaava Movie Making Video Telugu8
'ఛావా'.. తెర వెనక ఇంత కష్టపడ్డారా?

గత నెలరోజులుగా దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచిన మూవీ 'ఛావా'. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే రూ.600 కోట్ల మేర వసూళ్లు సాధించింది. తెలుగులోనూ రూ.11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్)దాదాపు నెలరోజుల నుంచి థియేటర్లలో అద్భుతంగా ప్రదర్శితమవుతున్న 'ఛావా' క్లైమాక్స్ బీటీఎస్ (బిహైండ్ ద సీన్స్) వీడియోని చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇందులో విక్కీ రిహార్సల్ చేయడం, ప్రొస్థటిక్ మేకప్ లాంటివి చూపించారు. ఇదంతా చూస్తున్నప్పుడు సినిమా కోసం ఇంతలా కష్టపడ్డారా అనిపించకమానదు.(ఇదీ చదవండి: 40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత)

Behind Balochistan Freedom Struggle9
Balochistan: జిన్నా చేసిన ద్రోహమే.. పాక్‌కు ముప్పుగా మారిందా?

ఖనిజ సంపద అధికంగా ఉన్న బలూచిస్తాన్‌(Balochistan) రాష్ట్రం పాకిస్తాన్‌ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తోంది. ఇది పాక్‌కు భద్రతా ముప్పుగా పరిణమించింది. ఈ క్రమంలోనే ఇరాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో రైలు హైజాక్‌ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ). ఇంతకీ బలూచిస్తాన్‌ ఎందుకు పాక్‌ నుంచి విడిపోవాలనుకుంటోంది? దీని వెనుక ఏముంది?పాకిస్తాన్(Pakistan) స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి చెలరేగుతున్న బలూచ్ ఉద్యమంలో తాజాగా చోటుచేసుకున్న రైలు హైజాక్ అతి పెద్ద ఘటనగా చెప్పుకోవచ్చు. బలూచ్‌ తిరుగుబాటుకు మూలం పాకిస్తాన్ జాతిపి ముహమ్మద్ అలీ జిన్నా చేసిన ద్రోహం అని చెబుతుంటారు. నాడు పాక్‌తో విలీనం కావడానికి బలూచిస్తాన్‌ ఏమాత్రం ఇష్టపడలేదు. పాకిస్తాన్‌లో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్ ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటూ వచ్చింది. నాడు రష్యా నుండి తన వలస ప్రయోజనాలను రక్షించుకునేందుకు బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతాన్ని ఒక స్థావరంగా ఉపయోగించుకున్నారు. అయితే భారతదేశ విభజన తర్వాత పలు పరిణామాల నేపధ్యంలో పాకిస్తాన్‌లో బలూచ్ విలీనమయ్యింది. ఇది స్థానికులకు నచ్చలేదు. దీంతో స్వతంత్ర బలూచిస్తాన్ కోసం ఉద్యమం ప్రారంభమయ్యింది.చదవండి: బెలూచిస్థాన్‌ ఎందుకు భగ్గుమంటోంది?బలూచిస్తాన్ అధికంగా బీడువారినట్లు కనిపించినప్పటికీ, ఖనిజాలు, వనరులతో సమృద్ధిగా ఉంది. చాఘి జిల్లాలోని రెకో దిక్, సైందక్ ప్రాంతాల్లో అపారంగా బంగారం, రాగి నిక్షేపాలు ఉన్నాయి. అలాగే బలూచిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో సీసం, జింక్, బొగ్గు నిక్షేపాలు కూడా ఉన్నాయి. బెలూచ్‌కు సొంతమైన ఈ వనరులను పాక్‌ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని బలూచ్ ఎప్పటి నుంచో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుగుబాటు సంస్థలైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ),బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్‌ఎప్‌)లు బలూచ్‌ స్వాంతంత్య్రం కోసం ఉద్యమిస్తున్నాయి.ఈ సంస్థలు పాకిస్తాన్ భద్రతా దళాలు(Pakistan security forces), సంస్థలు, మౌలిక సదుపాయాలపై దాడులకు తెగబడ్డాయి. గత కొన్నేళ్లుగా మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలతో బలూచ్‌ ఉద్యమం మరింత తీవ్రమైంది. తమ ఉద్యమాన్ని అణచివేసేందుకు తమ దళాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు, పౌరులను పాక్‌ సైన్యం అదృశ్యం చేసిందని తిరుగుబాటు సంస్థలు ఆరోపిస్తున్నాయి.విభజన సమయంలో బలూచిస్తాన్‌ను భారతదేశం, పాకిస్తాన్‌లతో పాటు స్వతంత్ర దేశంగా ప్రకటించారు. నాడు ఈ ప్రాంతంలో నాలుగు రాచరిక రాష్ట్రాలు ఉండేవి. అవి ఖరన్, మకరన్, లాస్ బేలా, కలాత్. విభజనకు ముందు ఈ రాచరిక రాష్ట్రాలకు మూడు ఎంపికలు ఇచ్చారు. అవి భారతదేశం లేదా పాకిస్తాన్‌లో చేరడం లేదా స్వతంత్రంగా ఉండటం. ఈ నేపధ్యంలో మూడు ప్రాంతాలు పాకిస్తాన్‌లో విలీనమ్యాయి. దీంతో కలాత్‌కు 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యం ప్రకటించారు. అయితే విస్తరణవాద పాలన భయంతో కలాత్ స్వతంత్రంగా ఉండటానికి బ్రిటిష్ ఒప్పుకోలేదు. కలాత్‌ను స్వాధీనం చేసుకోవాలంటూ పాక్‌పై ఒత్తిడి తెచ్చారు. 1947 అక్టోబరులో పాక్‌ వ్యవస్థాపకుడు జిన్నా.. కలాత్‌ విలీనాన్ని వేగవంతం చేయాలని సలహా ఇచ్చాడు. అయితే కలాత్‌ పాలకుడు దీనిని నిరాకరించాడు.నాటి నుండి పాకిస్తాన్ అధికారులు కలాత్‌ పాలకుడు ఖాన్‌ను పాకిస్తాన్‌లో చేరాలంటూ మరింతగా ఒత్తిడి తీసుకువచ్చారు. 1954లో పాకిస్తాన్ తన ప్రావిన్సులను పునర్వ్యవస్థీకరిస్తూ వన్-యూనిట్ ప్రణాళికను ప్రారంభించినప్పుడు బలూచ్‌లో తిరుగుబాటు వచ్చింది. ఖాన్ ఆఫ్ కలాత్ నవాబ్ నౌరోజ్ ఖాన్ 1959లో పాక్‌కు లొంగిపోయాడు. ఏడాది తరువాత పశ్చిమ పాకిస్తాన్‌లో వన్ యూనిట్ ప్లాన్ రద్దు చేశారు. దీంతో బలూచిస్తాన్‌ను పంజాబ్, సింధ్, ఫ్రాంటియర్‌తో పాటు మరో రాష్ట్రంగా ప్రకటించారు.1970లలో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన దరిమిలా బలూచ్‌లలో ధైర్యం పెరిగింది. స్వయంప్రతిపత్తి కోసం డిమాండ్లను లేవనెత్తారు. అయితే నాటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో దీనిని నిరాకరించారు. ఇది భారీ నిరసనలకు దారితీసింది. ఇది నాటి నుంచి ఏదో ఒక రూపేణా ఉద్యమం కొనసాగుతూనే వస్తోంది. గత కొన్నేళ్లుగా పాక్‌ భద్రతా సిబ్బంది, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని బలూచ్‌ దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పట్లో బలూచ్ డిమాండ్లకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించే సూచనలు కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: మహాకుంభ్‌తో నిండిన రైల్వే ఖజానా.. ఎంత ఆదాయమంటే..

Noor, Bracewell Secure Top Deals In The Hundred Draft10
న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌కు జాక్‌పాట్‌

నిన్న (మార్చి 12) జరిగిన హండ్రెడ్‌ లీగ్‌-2025 డ్రాఫ్ట్‌లో (వేలం) న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, ఆఫ్ఘనిస్తాన్‌ యువ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ జాక్‌పాట్‌ కొట్టారు. ఈ ఇద్దరు ఊహించని ధర 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. బ్రేస్‌వెల్‌ను గత సీజన్‌ రన్నరప్‌ సధరన్‌ బ్రేవ్‌ దక్కించుకోగా.. నూర్‌ అహ్మద్‌ను మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ సొంతం చేసుకుంది. బ్రేస్‌వెల్‌ త్వరలో స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈసారి డ్రాఫ్ట్‌లో బ్రేస్‌వెల్‌, నూర్‌ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కూడా 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్‌ను లండన్‌ స్పిరిట్‌.. మరో ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ విల్లేను ట్రెంట్‌ రాకెట్స్‌ సొంతం చేసుకున్నాయి. నిన్నటి డ్రాఫ్ట్‌లో మరో మేజర్‌ సైనింగ్‌ ఆసీస్‌ వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ది. గతేడాది డ్రాఫ్ట్‌లో అమ్ముడుపోని వార్నర్‌ను ఈసారి లండన్‌ స్పిరిట్‌ 1.2 లక్షల పౌండ్లకు (రూ. 1.35 కోట్లు) సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ హీరో రచిన్‌ రవీంద్రను మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ ఇదే ధరకు (1.2 లక్షల పౌండ్లు) దక్కించుకుంది. ఈసారి డ్రాఫ్ట్‌కు అందుబాటులో ఉండిన ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌కు చుక్కెదురైంది. ఆండర్సన్‌ను డ్రాఫ్ట్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. మహిళల డ్రాఫ్ట్‌ విషయానికొస్తే.. సోఫి డివైన్‌, జార్జియా వాల్‌, పెయిజ్‌ స్కోల్‌ఫీల్డ్‌ మంచి ధరలు దక్కించుకున్నారు. పురుషులు, మహిళల డ్రాఫ్ట్‌లో మొత్తం 66 మంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. ఈ డ్రాఫ్ట్‌ తర్వాత కూడా ఫ్రాంచైజీలకు వైల్డ్‌కార్డ్‌ డ్రాఫ్ట్‌ ద్వారా ప్లేయర్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ద హండ్రెడ్‌ లీగ్‌-2025 (పురుషులు, మహిళలు) ఆగస్ట్‌ 5 నుంచి ప్రారంభం కానుంది. లార్డ్స్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో లండన్‌ స్పిరిట్‌, ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ తలపడతాయి.హండ్రెల్‌ లీగ్‌లో పాల్గొనే అన్ని ఫ్రాంచైజీల జట్లు..బర్మింగ్హమ్ ఫీనిక్స్పురుషుల విభాగం: లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ డకెట్, ట్రెంట్ బౌల్ట్*, జాకబ్ బెథెల్, బెన్నీ హోవెల్, ఆడమ్ మిల్నే*, డాన్ మౌస్లీ, టిమ్ సౌథీ*, విల్ స్మీడ్, క్రిస్ వుడ్, అనేరిన్ డోనాల్డ్, జో క్లార్క్, హ్యారీ మూర్, టామ్ హెల్మ్.మహిళలు: ఎల్లీస్ పెర్రీ*, అమీ జోన్స్, ఎమిలీ ఆర్లాట్, మేగాన్ షుట్*, హన్నా బేకర్, చారిస్ పావెలీ, స్టెర్ కాలిస్, ఐల్సా లిస్టర్, జార్జియా వాల్*, ఎమ్మా లాంబ్, జార్జీ బోయ్స్, మేరీ కెల్లీ, బెథాన్ ఎల్లిస్.లండన్ స్పిరిట్పురుషుల విభాగం: జామీ స్మిత్, లియామ్ డాసన్, డేనియల్ వొరాల్, కేన్ విలియమ్సన్*, రిచర్డ్ గ్లీసన్, ఓల్లీ స్టోన్, ఓల్లీ పోప్, కీటన్ జెన్నింగ్స్, జేమీ ఓవర్టన్, డేవిడ్ వార్నర్*, ల్యూక్ వుడ్, ఆష్టన్ టర్నర్*, జాఫర్ చోహన్, వేన్ మాడ్సెన్.మహిళలు: గ్రేస్ హారిస్*, డేనియల్ గిబ్సన్, సారా గ్లెన్, చార్లీ డీన్, దీప్తి శర్మ*, జార్జియా రెడ్‌మైన్*, ఎవా గ్రే, కార్డెలియా గ్రిఫిత్, తారా నోరిస్, సోఫీ మున్రో, హీథర్ నైట్, ఇస్సీ వాంగ్, రెబెక్కా టైసన్.మాంచెస్టర్ ఒరిజినల్స్పురుషులు: జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, హెన్రిచ్ క్లాసెన్*, మాథ్యూ హర్స్ట్, స్కాట్ క్యూరీ, జోష్ టంగ్, టామ్ హార్ట్లీ, సోనీ బేకర్, టామ్ ఆస్పిన్‌వాల్, నూర్ అహ్మద్*, రాచిన్ రవీంద్ర*, లూయిస్ గ్రెగొరీ, బెన్ మెక్‌కిన్నీ, జార్జ్ గార్టన్.మహిళలు: అమేలియా కెర్*, సోఫీ ఎక్లెస్టోన్, బెత్ మూనీ*, లారెన్ ఫైలర్, మహికా గౌర్, ఈవ్ జోన్స్, కాథరిన్ బ్రైస్, ఫై మోరిస్, డేనియల్ గ్రెగొరీ, డియాండ్రా డాటిన్*, సెరెన్ స్మాల్, ఎల్లా మెక్‌కాఘన్, ఆలిస్ మోనాఘన్.నార్తర్న్ సూపర్‌చార్జర్స్పురుషుల విభాగం: హ్యారీ బ్రూక్, ఆదిల్ రషీద్, డేవిడ్ మిల్లర్*, మిచెల్ సాంట్నర్*, బ్రైడాన్ కార్స్, మాథ్యూ పాట్స్, బెన్ డ్వార్షుయిస్*, గ్రాహం క్లార్క్, పాట్ బ్రౌన్, టామ్ లావెస్, జాక్ క్రాలే, డాన్ లారెన్స్, మైఖేల్ పెప్పర్, డేవిడ్ మలన్.మహిళలు: ఫోబ్ లిచ్‌ఫీల్డ్*, అన్నాబెల్ సదర్లాండ్*, జార్జియా వేర్‌హామ్*, కేట్ క్రాస్, బెస్ హీత్, లిన్సే స్మిత్, హోలీ ఆర్మిటేజ్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్, గ్రేస్ బలింగర్, డేవినా పెర్రిన్, గ్రేస్ పాట్స్, లూసీ హిఘం, ఎల్లా క్లారిడ్జ్.ఓవల్ ఇన్విన్సిబుల్స్పురుషుల విభాగం: సామ్ కర్రాన్, విల్ జాక్స్, టామ్ కర్రాన్, జోర్డాన్ కాక్స్, రషీద్ ఖాన్*, సాకిబ్ మహమూద్, సామ్ బిల్లింగ్స్, గస్ అట్కిన్సన్, నాథన్ సౌటర్, డోనోవన్ ఫెర్రీరా*, తవాండా ముయేయ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్*, మైల్స్ హామండ్.మహిళలు: మారిజాన్ కాప్*, ఆలిస్ కాప్సే, లారెన్ విన్‌ఫీల్డ్-హిల్, అమాండా-జేడ్ వెల్లింగ్టన్*, మెగ్ లాన్నింగ్*, టాష్ ఫారెంట్, రైనా మెక్‌డోనాల్డ్-గే, సోఫియా స్మాల్, జో గార్డ్నర్, రాచెల్ స్లేటర్, పైజ్ స్కోల్‌ఫీల్డ్, ఫోబ్ ఫ్రాంక్లిన్, కలియా మూర్.సదరన్ బ్రేవ్పురుషులు: జేమ్స్ విన్స్, జోఫ్రా ఆర్చర్, టైమల్ మిల్స్, క్రిస్ జోర్డాన్, ఫాఫ్ డు ప్లెసిస్*, ల్యూస్ డు ప్లూయ్, క్రెయిగ్ ఓవర్టన్, లారీ ఎవాన్స్, ఫిన్ అల్లెన్*, డానీ బ్రిగ్స్, జేమ్స్ కోల్స్, మైఖేల్ బ్రేస్‌వెల్*, రీస్ టోప్లీ, జోర్డాన్ థాంప్సన్.మహిళలు: లారా వోల్వార్డ్*, డానీ వ్యాట్-హాడ్జ్, మైయా బౌచియర్, లారెన్ బెల్, ఫ్రెయా కెంప్, జార్జియా ఆడమ్స్, టిల్లీ కోర్టీన్-కోల్‌మన్, రియానా సౌత్‌బై, సోఫీ డెవిన్*, క్లోయ్ ట్రయాన్*, మాడీ విలియర్స్, జోసీ గ్రోవ్స్, ఫోబ్ గ్రాహం.ట్రెంట్ రాకెట్స్పురుషుల విభాగం: జో రూట్, మార్కస్ స్టోయినిస్*, టామ్ బాంటన్, జాన్ టర్నర్, సామ్ కుక్, సామ్ హైన్, టామ్ అల్సోప్, కాల్విన్ హారిసన్, డేవిడ్ విల్లీ, లాకీ ఫెర్గూసన్*, మాక్స్ హోల్డెన్, జార్జ్ లిండే*, ఆడమ్ హోస్, రెహాన్ అహ్మద్.మహిళలు: ఆష్ గార్డ్నర్*, నాట్ స్కైవర్-బ్రంట్, అలానా కింగ్*, హీథర్ గ్రాహం*, బ్రయోనీ స్మిత్, గ్రేస్ స్క్రీవెన్స్, కిర్స్టీ గోర్డాన్, అలెక్సా స్టోన్‌హౌస్, నటాషా వ్రైత్, కాసిడీ మెక్‌కార్తీ, జోడి గ్రూకాక్, ఎమ్మా జోన్స్, ఎల్లీ థ్రెల్‌కెల్డ్.వెల్ష్ ఫైర్పురుషుల విభాగం: క్రిస్ వోక్స్, స్టీవ్ స్మిత్*, జానీ బెయిర్‌స్టో, టామ్ కోహ్లర్-కాడ్మోర్, టామ్ అబెల్, ల్యూక్ వెల్స్, స్టీఫెన్ ఎస్కినాజీ, డేవిడ్ పేన్, పాల్ వాల్టర్, రిలే మెరెడిత్*, క్రిస్ గ్రీన్*, సైఫ్ జైబ్, జోష్ హల్, మాసన్ క్రేన్.మహిళలు: హేలీ మాథ్యూస్*, టామీ బ్యూమాంట్, జెస్ జోనాసెన్*, షబ్నిమ్ ఇస్మాయిల్*, సారా బ్రైస్, జార్జియా ఎల్విస్, ఫ్రెయా డేవిస్, జార్జియా డేవిస్, ఎమిలీ విండ్సర్, బెత్ లాంగ్‌స్టన్, సోఫియా డంక్లీ, కేటీ జార్జ్, కేటీ లెవిక్.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
Brazil: పర్యావరణ సదస్సు కోసం చెట్ల నరికివేత!!

బ్రెజిల్‌లో ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే ప్రపంచ వాతావరణ సదస్సు(2025 United Nat

title
Balochistan: జిన్నా చేసిన ద్రోహమే.. పాక్‌కు ముప్పుగా మారిందా?

ఖనిజ సంపద అధికంగా ఉన్న బలూచిస్తాన్‌(

title
అమెరికాకు పుతిన్‌ డిమాండ్స్‌.. రష్యాకు ట్రంప్‌ సీరియస్‌ వార్నింగ్‌

వాష్టింగన్‌/మాస్కో: ఉక్రెయిన్‌-రష్యా కాల్పుల విరమణ ఒప్పందంలో

title
గాజా ప్లాన్‌పై ట్రంప్‌ రివర్స్‌ గేర్‌

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధంతో శిథిలమైన గాజాను స్వా

title
Sunita Williams: మళ్లీ నిరాశే.. చివరి నిమిషంలో ప్రయోగం వాయిదా

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌ రాక విషయంలో మళ్లీ నిరాశే ఎదురైంది.

NRI View all
title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!

ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

title
సుదీక్ష మిస్సింగ్‌.. కిడ్నాపైందా?

న్యూఢిల్లీ: కరీబియన్‌ దేశం డొమినికన్‌ రిపబ్లిక్‌లో తెలుగు వి

title
టీటీఏ (TTA) న్యూయార్క్‌ చాప్టర్‌ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA)  న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

title
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలకు  ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి  పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస

Advertisement

వీడియోలు

Advertisement