anasuyadevi
-
కోలో కోలోయన్న కోలో..
జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత్రి వింజమూరి అనసూయాదేవి జీవితం ఎంతటి స్ఫూర్తిమంతమైనదో డాక్యుమెంటరీగా తీసి, ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’లో ప్రదర్శించారు ఆమె కుమార్తె సీతారత్నాకర్. ‘అసమాన అనసూయ’ ను తెరపై చూసిన నాటి తరమే కాదు, నేటి నవతరమూ కళ్లప్పగించి చూస్తూనే ఉంది. ఈ సందర్భంగా తల్లి తన జీవితంలో నింపిన స్ఫూర్తిని సీతారత్నాకర్ పంచుకున్నారు.మారుమూల పల్లెల్లో దాగి ఉన్న జానపద గేయాలకు సభా గాన మర్యాద కలిగించి సంగీత జగత్తులో ఉన్నతస్థానాన్ని కలిగించిన తొలి గాయని వింజమూరి అనసూయాదేవి. జానపద గేయాలకు కర్నాటక బాణీలో స్వర రచన చేసిన తొలి స్వరకర్త. విశ్వ విద్యాలయాలలో శాస్త్రీయ సంగీతాన్ని పాఠ్యాంశంగా చేర్పించిన అసమాన గాయని. దక్షిణ భారతదేశంలో తొలి మహిళా సంగీత దర్శకురాలు. ఆమె ఒక అద్భుతం. ఆమెను తలుచుకుంటున్నారు కుమార్తె సీతారత్నాకర్.పాట పాడింది... బాధ్యతలూ నెరవేర్చిందిఅమ్మానాన్నలకు మేం ఐదుగురం సంతానం. అమ్మకు సంగీతం అంటేప్రాణం. స్కూల్ లేని రోజుల్లో అమ్మ తనతోపాటు మమ్మల్నీ కచేరీలకు తీసుకెళ్లేది. ఎక్కడకు వెళ్లినా తల్లిగా తన బాధ్యతలను నెరవేరుస్తూనే కళను కూడా సాకారం చేసుకున్నారు. నేనూ, మా అక్క భరతనాట్యం నేర్చుకొని దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చాం. అక్కకు పెళ్లయ్యి అమెరికా వెళ్లడం, నాకు పెళ్లవడంతో నృత్యం ఆగిపోయింది. దూరదర్శన్లో ఉద్యోగం వచ్చింది. మేం మొదటి నుంచి చెన్నైలో ఉండేవాళ్లం. అలా చెన్నై, ఢిల్లీ దూరదర్శన్లో 37 ఏళ్లు వర్క్ చేశాను. ఎంతో మంది కళాకారులను, యాక్టివిస్ట్లను దూరదర్శన్కి పరిచయం చేశాను. అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు నలుగురూ అమెరికాలో స్థిరపడ్డారు. అమ్మ ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువ సమయం తనతో గడిపే అవకాశం లభించేంది. అమ్మకు జానపద గేయాల గురించి తెలుసు కాబట్టి కాకినాడకు తీసుకెళ్లి, అక్కడి పల్లె పాటల మీద ఓ కార్యక్రమాన్ని చేశాం. అదొక మధురానుభూతి నాకు. నేను చేసిన ప్రోగ్రామ్స్ చూసేది. సూచనలు ఇచ్చేది. ‘ఇంకా ఏదైనా చేయాలి’ అంటూ గాయనిగా స్వరాలను కూర్చుతూనే ఉండేది. రచనలు చేస్తూనే ఉండేది. భావగీతాలు, జానపద గేయాలు ఈ రెండు పుస్తకాలు ఆమె 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా విడుదలయ్యాయి. ఆ తర్వాత జానపద సంగీతంపై ఏడు పుస్తకాలను విడుదల చేశారు. ఇవి కాకుండా నేనూ–నా రచనలు, గతానికి స్వాగతం అనే పుస్తకాలు, 95వ పుట్టిన రోజు సందర్భంగా ‘అసమాన అనసూయ’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు.యజ్ఞంలా అనిపించింది...నిరంతర కృషియే అమ్మను అసమానంగా ఈ రోజు నిలబెట్టింది. అమ్మ మరణించాక ఆమెకు సంబంధించిన ఫుటేజీ అంతా ఒకసారి చూడటం మొదలుపెట్టాను. మరికొంత మా వాళ్ల నుంచి సేకరించాను. అదంతా చూడటానికే నాకు రోజుల సమయం పట్టింది. ఆవిడ వీడియోలు చూస్తున్నప్పుడు ‘నా పాటలు ఆగిపోకూడదు...’ వంటి మాటలు విన్నాను. దీంతో అమ్మకు సంబంధించిన డాక్యుమెంటరీ ఎలాగైనా తీసుకురావాలని ప్రయత్నించాను. ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి.. అని చాలా ఆలోచించేదాన్ని. ఫుటేజీలో ఆమె దినచర్యతోపాటు, జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ చేర్చుకుంటూ, ప్రముఖుల సభా విశేషాలు, పుస్తకప్రారంభోత్సవాలు, కుటుంబ సభ్యుల నుంచి కామెంట్స్ జత చేసి ఒక రూపం తీసుకువచ్చాను. ఈ సమయంలో అమ్మ నా వెంటే ఉంటూ నాకు సూచనలు చేస్తున్నట్టు అనిపించేది. డాక్యుమెంటరీ పూర్తవ్వడానికి మూడేళ్ల సమయం పట్టింది. అమ్మ ఘనత అలనాటి వారికే తెలుసు అనుకున్నాను. కానీ, నేటి తరం కూడా అమ్మ డాక్యుమెంటరీ చూడటం, ఆమె గొప్పతనం గురించి ప్రస్తావిస్తుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది’ అంటూ తన తల్లితో తనకున్న అనుబంధాన్ని తెలిపారు సీతా రత్నాకర్. – నిర్మలారెడ్డి -
వింజమూరి అనసూయాదేవి కన్నుమూత
సాక్షి, అమరావతి: ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని, ప్రఖ్యాత కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు వింజమూరి అనసూయాదేవి (99) వయోభారంతో అమెరికాలోని హ్యూస్టన్లో ఆదివారం కన్నుమూశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన దేశభక్తి గీతం ‘జయజయజయ ప్రియ భారత‘ పాటకు బాణీ కట్టింది అనసూయనే. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 1920లో మే 12న జన్మించిన అనసూయాదేవి ఆలిండియా రేడియో ద్వారా జానపద గీతాలకు ఎనలేని ప్రాచుర్యం కల్పించారు. జానపద గేయాలు రాయడం, బాణీలు కట్టడంలో, పాడడంలో అనసూయా దేవిది అందెవేసిన చేయి. హార్మోనియం వాయించడంలోనూ ఆమెకు అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. 1977లో ఆమెకు ఆంధ్రా విశ్వవిద్యాలయం ’కళాప్రపూర్ణ’ అనే బిరుదును, గౌరవ డాక్టరేట్ను ఇచ్చి సన్మానించింది. అనసూయాదేవి అమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు. పారిస్లోనూ అనసూయాదేవికి ‘క్వీన్ ఆఫ్ ఫోక్’అనే బిరుదును ప్రదానం చేశారు. ఆమె రాసిన భావ గీతాలు, జానపద గేయాలు అనే రెండు పుస్తకాలను ఆమెకు 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా చెన్నైలో 2008 ఏప్రిల్ 12లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు. జానపద సంగీతంపై ఆమె ఏడు పుస్తకాలను రచించారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఆమె పాట రికార్డ్ అయ్యింది. స్వాతంత్య్రోద్యమంలో గాంధీజీ, సుభాస్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారి సమక్షంలో అనుసూయాదేవి దేశభక్తి గీతాలు పాడారు. ఆమెకు ఐదుగురు సంతానం. అనసూయాదేవి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అనసూయాదేవి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, దేశభక్తి గీతాలు, జానపద గీతాలాపనతో కళామతల్లికి సేవ చేశారని చంద్రబాబు కొనియాడారు. అనసూయదేవి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ జానపద కళాకారిణి, రేడియో వ్యాఖ్యాత వింజమూరి అనసూయాదేవి(99) మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనడంతో పాటు వివిధ సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన అనసూయాదేవి రేడియో వ్యాఖ్యాతగా సుపరిచితురాలని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వింజమూరి అనసూయాదేవి మృతికి జగన్ సంతాపం ప్రఖ్యాత తెలుగు గాయని డాక్టర్ వింజమూరి అనసూయాదేవి మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. విషాదంలో ఉన్న అనసూయాదేవి కుటుంబీకులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
చేయవలసినవి చాలా ఉన్నాయి
ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని వింజమూరి అనసూయాదేవి (99) అమెరికాలోని హ్యూస్టన్లో ఆదివారం కన్ను మూశారు. జానపద గేయాలు రాయడంలో, బాణీలు కట్టడంలో, పాడడంలో అనసూయాదేవి ప్రావీణ్యం సాటిలేనిది. అనసూయ 1920 మే 12న కాకినాడలో జన్మించారు. ఆమెకు ఐదుగురు సంతానం. కవి స్వర్గీయ దేవులపల్లి కృష్ణశాస్త్రి మేనకోడలు కూడా అయిన అనసూయ ఇటీవల చెన్నై వచ్చినప్పుడు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలోని విశేషాలివి. తొమ్మిదవ ఏటనే జానపదాలకు, భావగీతాలకు బాణీలు కట్టి ప్రాణప్రతిష్ట చేసిన అపర బ్రహ్మ అనసూయ. మేనమామ కృష్ణశాస్త్రి రచించిన ‘ప్రాభాత ప్రాంగణాన’ గీతాన్ని ఒకే రోజు ఆరు వేదికల్లో ప్రత్యక్షంగా పాడిన దివ్యగాయని. గాంధీజీ సమక్షంలోనూ అనసూయ గీతాలాపన చేశారు. తొమ్మిది దశాబ్దాలు పూర్తయినా కూడా కూడా పసిపిల్లలకు ఉండే ఉత్సాహం పోగొట్టుకోని చిన్ని శిశువు. ఆమె జీవనరాగంలోని సరిగమల్ని ఆమె చెప్పిన క్రమంలోనే వినడం శ్రావ్యంగా ఉంటుంది. ఆ రోజు నా డ్రస్సూ హిట్టయింది! ‘‘మొదటి స్వాతంత్య్ర దినం నేను మర్చిపోలేని రోజు. ఆ రోజు మా మామయ్య రాసిన ‘ప్రాభాత ప్రాంగణాన మోగేను నగారా’ అనే దేశభక్తి గేయాన్ని 1947 ఆగస్టు 15 న పొద్దున్నే ఆరుగంటలకి మద్రాసు రేడియోలో లైవ్లో పాడాను. తరవాత తొమ్మిది గంటలకి ఆంధ్ర విజ్ఞాన సమితిలో పాడాను. 10 గం.లకి వై.యమ్.సి.ఏ.లో పాడాను. సాయంత్రం నాలుగు గంటలకి ఆంధ్రమహిళాసభలోను, ఆరు గంటలకి ఆంధ్రమహాసభలోను, రాత్రి 8 గం.లకి రేడియో వారు రూపకల్పన చేసిన ‘స్వాతంత్య్ర రథం’ కార్యక్రమంలోను ఒకే రోజున అన్నీ లైÐŒ గా పాడాను. ఆ రోజే మరో చిత్రమైన సంఘటన. నాకు అలంకరణ అంటే చాలా ఇష్టం. నేనే ఒక ఫ్యాషన్ క్రియేట్ చేశాను. 5 గజాల తెల్ల చీర కొనుక్కుని వచ్చి, ఎరుపు, ఆకుపచ్చ రంగుల శాటిన్ రిబ్బన్లు కొనుక్కుని వచ్చి వాటిని పొడవుగా కట్చేసి చీర మీద నిలువు చారలుగా వేసుకున్నాను. జాకెట్కి కూడా బోర్డర్ వేసుకున్నాను. టైలర్ని రాత్రింబవళ్లు కూచోపెట్టి దగ్గరుండి కుట్టించుకున్నాను. నా పాటలాగే నా డ్రస్ కూడా హిట్ అయ్యింది. ‘అయ్యో కుయ్యోడో’ నా ఫస్ట్ సాంగ్ చిన్నప్పుడే నేను నా చెల్లి సీత కలిసి పాడటం మొదలుపెట్టాం. సుమారు 23 ఏళ్లు కలిసి పాడాము. నేను జానపదాల మీద రీసెర్చి చేద్దామనుకున్నాను. నా సంగీత గురువు మునిగంటి వెంకట్రావుపంతులుగారు. ఆయన నాకు క్షేత్రయ్య పదాలు నేర్పారు. ఆ పదాల మీద రీసెర్చి చేద్దామనుకున్నాను. నాకు ఫోక్ ఇష్టం. అప్పటికే చాలా జానపదాలు రాశాను. పాడాను. అలా సుమారు 30 ఏళ్లు పాడాక రేడియోలో జానపదాలు మొదలుపెట్టాక నాకు అవకాశం వచ్చింది. నేను పాడిన మొదటి పాట ‘అయ్యోకుయ్యోడో’. హిట్ అయింది. కృష్ణశాస్త్రిగారు పాటలు రాసేవారు, నేను బాణీలు కట్టేదానిని. అలా ఎన్నో భావగీతాలు పాడాను. నేను కట్టిన బాణీలన్నీ కర్ణాటక సంగీతం ఆధారంగానే. నాకు నేర్పిందీ, నన్ను తీర్చిందీ కర్ణాటక సంగీతమే. తొమ్మిదవ ఏటనే రెండు మూడు వందల పాటలకి రాగాలు కట్టాను. అందరికీ తెలిసిన ‘మొక్కజొన్నతోటలో’ నేనే రాగం కట్టి పాడాను. 1931లో రాజమండ్రి నాళం వారి సభలో, కాకినాడ సభలో జానపదాలను పాడాను. అలాగే రేడియోలోను ఈ జాన పదాలు ప్రసిద్ధి చెందేలా కృషి చేశాను. ‘చెత్తపాట పాడిస్తున్నారు’ అన్నారు! జానపద గీతాలన్నీ జానపదులు పాడినట్లే పాడగలను. త్యాగరాజు ఎలా పాడాడో తెలీదు. నగుమోములాంటివి బాలమురళి బాగా పాడాడు. జానపదాలను బాగా పాడి, బాగుందనిపించి, సభల్లో ప్రవేశపెట్టాను. అప్పుడు ఎన్నో కాంప్లిమెంట్స్ వచ్చాయి. క్షేత్రయ్య పదాలలాగ ‘కోటిరత్సపు ముద్దు కోమలాంగి’ అనే గీతాన్ని పాడాను. ఆ పాటని ముందుగా అమ్మకి వినిపించి, ఆవిడ బావుందని అన్నాకే బయట పాడాను. అమ్మ అనుమతి ఇచ్చాక, నాకు బలం వచ్చింది. ఆ పాట విన్నాక ఒక కవయిత్రి నాళం వారి సభలో పాడుతుంటే ఆక్షేపించారు. అమ్మ వెంకటరత్నమ్మతో ‘‘కవి కుటుంబంలో పుట్టిన మీరు మీ అమ్మాయి చేత చెత్త పాట పాడిస్తున్నారు’’ అని అన్నారు. ఆ మాటకు అమ్మ నన్ను సమర్థిస్తూ సమాధానం ఇచ్చారు. ఎప్పుడయితే అమ్మ నన్ను బలపరిచిందో అప్పటి నుంచి వెనుదిరగలేదు. ఎనభై ఏళ్లుగా పాడుతూనే ఉన్నాను. నన్ను ప్రోత్సహించింది రజనీకాంతరావుగారు. దేశదేశాల్లో జానపదాలు ప్రచారం చేసింది మాత్రం నేనే. కచేరీలకు సిలోన్, లండన్, పారిస్ దేశాలకు వెళ్లాను. పారిస్లో నాకు ‘క్వీన్ ఆఫ్ ఫోక్’ మ్యూజిక్ అని బిరుదు ఇచ్చారు. 1977లో అమెరికాలో మొట్టమొదటి తానా సభలో పాడాను. అక్కడే 23 కచేరీలు చేశాను. ఆ కచేరీలను 22 శృతులతో పోల్చి, ‘అమెరికాలో నా సంగీత యాత్ర’ అని పుస్తకం రాశాను. రేడియోలో రూ. 250 జీతం చిన్నప్పటి నుంచి కొత్త పాటలు పాడటం సరదా. ఒక కాంపిటిషన్లో నేను వేరేదో పాడుతుంటే, నన్ను పిలిచి ‘నీకు త్యాగరాజ కీర్తనలు రావా’ అని అడగగానే ‘నిధి చాల సుఖమా’ పాడాను. అది విన్న వారు పిట్ట కొంచెం కూత ఘనం అన్నారు. మద్రాసు పంపిస్తే సినిమాలో పాడిస్తాం అన్నారు. ఆడపిల్లను ఒక్కతినే పంపడం ఇష్టం లేదని నాన్నవాళ్లు అనడంతో మా కుటుంబం అంతా రావడానికి ఏర్పాటు చేశారు. అప్పుడు నా చేత ‘కిట్టమ్మా గోపాలబాలా కిట్టమ్మా’ పాడించారు. నేను కచేరీ ఇచ్చేటప్పుడు ముందుగా క్లాసికల్, భావగీతాలు, తరవాత చివరలో ఒక జానపద గీతం పాడేదానిని. నాకున్న ఇంటరెస్ట్ కారణంగా జానపదాలు పాడాను. రేడియో పని మీద నా చెల్లి సీత వెడుతున్నప్పుడు నేను కూడా సీతతో వెళ్లి చాలా సేకరించాను. అన్నీ సేకరించాక వాటి మీద పరిశోధన చేద్దామనుకున్నాను. అయతే నా రీసెర్చి కొన్ని కారణాల వల్ల కుదరలేదు. నా పాటల స్వరాలన్నీ నేను బుక్గా రాసిపెట్టుకున్నాను. సంగీత నాటక అకాడమీ వాళ్లు దానిని పబ్లిష్ చేశారు. పునర్ముద్రణ కూడా చేశారు. 1938లో ఆలిండియా రేడియో ప్రారంభోత్సవం నాడు ‘రారమ్మ రారమ్మ’ అని, ముగింపులో ‘పోయినది దానిమ్మ’ అని నా చేత పాడించారు. 1939లో ‘ఊర్వశి’లో పాటలు ప్లే బ్యాక్ లేకపోయినా కూడా నేను పాడాను. అదొక క్రెడిట్. అది రేడియో వారిదే. ఉత్తర రామచరితంలో లక్ష్మణమూర్ఛలో పద్యాలు చదువుతుంటే ఎస్.ఎన్.మూర్తికి నాకు ఉద్యోగం ఇస్తానన్నారు. 250 రూ.ల జీతం అన్నారు. 1940 లో చేరాను. రేడియోలో ఊర్వశి, విద్యాపతి, శ్రీకృష్ణుడు, నవరసాలు, గోదాదేవి, దక్షయజ్ఞం మొదలయిన దేవులపల్లివారి నాటకాలు వేశాం. ఓ పక్కన నవ్యసాహిత్య పరిషత్లో కచ్చేరీలు చేసేవాళ్లం. వెన్నెల్లో బ్రహ్మసమాజంలో పాడేవాళ్లం. ఆ తర్వాత ఉద్యోగంలోంచి మామమ్య, నాన్న నన్ను వెనక్కి తీసుకువెళ్లిపోయారు. 1943లో బి.ఏ. చేశాను. పి.సుబ్రహ్మణ్యం గారు నా పాట విని ‘నర్తన మురళి’లో పాడడానికి నన్ను మద్రాసు తీసుకెళ్లారు. 1945లో వివాహం జరిగింది. అనసూయ పెళ్లి కబుర్లు అని అందరికీ మామయ్య చెప్పేవారు. ‘మధూదయంలో’ అనే పాట నా మీదే రాశారు.కొన్నాళ్లు స్టెల్లామేరీస్లో మ్యూజిక్ లెక్చరర్గా చేశారు. కళాక్షేత్రంలో ఆఫర్ వచ్చింది వదిలేశాను. అన్నమయ్య పాటలను రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు బయటకి తీసుకొచ్చినప్పుడు ఆ పాటలకు నన్ను ట్యూన్ చేసి పాడమన్నారు. అందుకోసం తాళ్లపాక రమ్మన్నారు. ఆ టైమ్లో మా వారికి చెయ్యి విరిగింది. మా అమ్మాయికి బాగా జ్వరంగా ఉంది. వెళ్లలేకపోయాను. బదులుగా మల్లిక్ వెళ్లారు. పాడగలిగినా ప్లే బ్యాక్కి వెళ్లలేదు. ట్యూన్ చేయగలిగినా చేయలేదు. యాక్ట్ చేయగలిగినా చేయలేదు. అయిన వాటి గురించి బాధపడి లాభంలేదు. చేయవలసినవి చాలా ఉన్నాయి. తొందరపడుతున్నాను చేయడానికి. దక్షిణభారతంలో నేనే మొట్టమొదటి సంగీతదర్శకురాలిని. హార్మనీపట్టుకుని వాయిస్తూ పాడతాను. స్త్రీల పాటలు పాడితే, సెంట్రల్ గవర్నమెంటు వారు ఫెలోషిప్ ఇచ్చారు. పెళ్లిపాటలు, సరదా పాటలు, మేలుకొలుపులు, లాలిపాటలు, గొబ్బిపాటలు, కోలాటం, మంగళహారతులు పండుగలు, పూజలు అన్నిటినీ మ్యూజిక్ నొటేషన్తో చేశాను. సంగీతం గొప్ప గనిలాంటిది. ఎంత తవ్వితే అంత వస్తుంది. అలాగే కలెక్ట్ చేశాను. ఎక్కడ వింటే అక్కడ పట్టేసేదాన్ని. ఫోటోలు: వి. శ్రీనివాసులు, చెన్నై వీలునామాలో ‘అంతిమ యాత్ర’ ఘనతగా చెప్పడం కాదు కానీ పల్లెల్లో ఉండే ఈ జానపదాలను బాణీలు కట్టి జన బాహుళ్యంలోకి తెచ్చిన తొలి ప్రయత్నం నాదే. ఆలిండియా రేడియోలో ప్రవేశపెట్టిందీ నేనే. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది.. నాకు రావలసిన గుర్తింపు రాలేదని. మామయ్య రాసిన ‘మల్లీశ్వరి’ సినిమా పాటలకి హార్మనీ పట్టుకుని ముందుగా బాణీలు కట్టింది కూడా నేనే. ‘పోయిరావే తల్లి’ని పున్నాగ వరాళి రాగంలో ట్యూన్ చేశాను. నా పాట విని వాహినిలో పాడతావా అని అడిగారు. వెంటనే ఒప్పుకున్నాను. పాట విని బి.యన్.రెడ్డి గారు మెచ్చుకున్నారు. పాట తీసుకున్నారు. రాగాలు నేనే సజెస్ట్ చేశాను. ఇదంతా ఎలా జరిగిందంటే.. అక్కడొక పెళ్లిలో ధీరసమీరే యమన్ కళ్యాణిలో పాడాను. ఆ పెళ్లికి వచ్చిన బియన్రెడ్డి, కెవిరెడ్డి, నాగిరెడ్డి అందరూ ముగ్ధులయ్యారు. ముందర నన్ను సినిమాలో నటించమని కోరారు. కాని నేను నటించను పాడతాను అని చెప్పాను. ధీరసమీరే లాంటిది కావాలన్నారు. అప్పుడు వచ్చినదే ‘మనసున మల్లెల మాలలూగెనే’. అది నా ట్యూనే. అప్పటివరకు నేను కేవలం మామయ్య పాటలకే రాగాలు కట్టాను. మల్లీశ్వరి పాటలు విన్న యం.వి.శాస్త్రిగారు పాటలన్నీ అనసూయ నోట విన్నట్టుగానే ఉంది అన్నారు. మల్లీశ్వరి ఫంక్షన్లో అందరూ మామయ్యనీ, మిగిలిన వారినీ అభినందిస్తుంటే నాకు బాధ అనిపించింది. మొట్టమొదటి సంగీత దర్శకురాలిని పరిచయం చేసిన ఘనత వారికి వచ్చేది. కాని అలా కాకుండా నా రాగాలు వాడుకుని నన్ను పక్కన పెట్టేశారు. తరవాత ‘బంగారుపాప’కి చేశాను. పక్కనే స్టూడియోలో ఉన్న ప్రొడ్యూసర్ కోరిక మేరకు కోయంబత్తూరు వెళ్లి ‘అగ్గిరాముడు’కి చేశాను. అందులో ఎఎం.రాజా, భానుమతి, సాయి సుబ్బలక్ష్మి చేత పాడించాను. నేను రాగం కట్టిన పాట జనం విని పొగిడితే సరదా. అప్పుడు ఉత్సాహంగా పాడతాను. అలాగే అలంకరణ బాగా సరదా. నా వీలునామాలో నన్ను ఎర్రచీరతో అలంకరించి, తల నిండా పూలు పెట్టి నా అంతిమయాత్ర సాగించాలని రాసుకున్నాను. -
అనసూయాదేవి మృతిపట్ల కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ జానపద కళాకారిణి, రేడియో వ్యాఖ్యాత వింజమూరి అనసూయాదేవి (99) మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనడంతో పాటు వివిధ సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన అనసూయాదేవి రేడియో వ్యాఖ్యాతగా సుపరిచితురాలని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా అమెరికాలోని హ్యుస్టన్లో అనసూయాదేవి కన్నుమూశారు. డాక్టర్ అవసరాల (వింజమూరి) అనసూయా దేవి ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత. హార్మోనియం వాయించటంలో దిట్ట. 1920 మే 12న కాకినాడలో ఆమె జన్మించారు. కళా ప్రపూర్ణ బిరుదాంకితురాలు. ఎనిమిదేళ్ళ వయసులోనే ఆమె పాట రికార్డ్ అయింది. స్వాతంత్ర్యోద్యమంలో మహామహులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాక్రిష్ణన్ లాంటి వారి సమక్షంలో పాడిన అనుభవం ఆమెకుంది. ఆమె మామయ్య దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసిన ప్రముఖ దేశభక్తి గీతం "జయజయజయ ప్రియ భారత" పాటకు బాణీ కట్టింది వింజమూరి అనసూయనే. ఆమె రాసిన భావ గీతాలు, జానపద గేయాలు అనే రెండు పుస్తకాలను ఆమెకు 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా చెన్నైలో 2008 ఏప్రిల్ 12లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. వీటితో బాటు ఆమె దాదాపు ఏడు పుస్తకాలను జానపద సంగీతం మీద ఏడు పుస్తకాలను విడుదల చేశారు. 1977లో ఆమెకు ఆంధ్రా విశ్వవిద్యాలయం 'కళా ప్రపూర్ణ' అనే బిరుదునిచ్చి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సన్మానించింది. ఇంకా అమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకుంది. పారిస్లోనూ అనసూయాదేవికి క్వీన్ ఆఫ్ ఫోక్ అనే బిరుదును ప్రధానం చేశారు. అనసూయా దేవికి ఐదుగురు సంతానం. -
అబ్కారీ గ‘మ్మత్తు’
హోటళ్లు, దాబాల్లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు అర్ధరాత్రి వరకూ తాగేందుకు అనుమతులు ప్రాణం..లేదా పరువు పోగొట్టుకుంటున్న మందుబాబులు అనంతపురం సెంట్రల్ : – అనంతపురం నగర శివార్లలో ఉంటున్న శ్రీధర్రెడ్డి ఓ దాబాలో స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వరకూ మద్యం తాగి ఇంటికి బయలు దేరాడు. అయితే మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డాడు. – గుత్తికి చెందిన సుధాకర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ డాబాలో మద్యం తాగాడు. అర్ధరాత్రి వేళ ఇంటికి వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. కోర్టు ముందు హాజరు పర్చగా జరిమానా విధించి రిమాండ్కు పంపించారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువుల్లో సైతం అతనికి పరువు పోయింది. అర్ధరాత్రి మద్యం అమ్మకాల వల్ల జరిగే అనర్థాలకు పైరెండు సంఘటనలు ఉదాహరణలు మాత్రమే..ఇలాంటి నిత్యం ఏదోచోట చేటే చేసుకుంటూనే ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత శాఖ మాత్రం తనకేం తెలియనట్టు వ్యవహరిస్తోంది. తప్పు ఒకరిది..శిక్షణ మరొకరికి.. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు అధికారులు చేస్తున్నది మంచిదే అయినా... తప్పు చేస్తున్నది ఒకరైతే.. శిక్ష వేస్తున్నది మరొకరికి అన్నట్లు తయారైంది. హోటళ్లు, దాబాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేసుకోవడానికి ఎక్సైజ్ అధికారులు అనధికార అనుమతులు మంజూరు చేశారు. ఎంతైనా అమ్ముకోండి.. నెల మామూళ్లు పంపిస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో మద్యం దొరకని హోటల్, డాబా ఉందంటే అది అతిశయోక్తిగానే అనిపిస్తుంది. కోరుకున్న బ్రాండ్ ఏదైనా సరే ఇట్టే సరఫరా చేస్తున్నారు. కేవలం మద్యం అమ్మడమే కాదు అర్ధరాత్రి వరకూ తాగేందుకు అనుమతులు ఇస్తున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాల రూపంలో ప్రాణాలు పొగొట్టుకుని భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. హోటల్, డాబాలు వదిలి ప్రజలపై కేసులా? ఏపీ ప్రొహిబిషన్ చట్టం 1995, సెక్షన్ 9 ప్రకారం దాబాలు, హోటల్స్లో మద్యం సేవించడం, విక్రయించడం చట్ట విరుద్ధం. కానీ ఈ చట్టం జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. ఎక్సైజ్, పోలీస్ అధికారులకు వైన్షాపుల నుంచే కాకుండా దాబాల నుంచి కూడా నెలనెలా మామూళ్లు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వైన్ షాపుల్లో అధిక ధరలకు అమ్ముకున్నా... డాబాల్లో అర్ధరాత్రి వరకూ తప్ప తాగుతున్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఐదేళ్ల రోడ్డు ప్రమాదాల వివరాలు సంవత్సరం ప్రమాదాలు మృతులు 2012–13 89 23 2013–14 133 24 2014–15 102 35 2015–16 73 41 2016–ఇప్పటి వరకూ 28 12 తాగి నడిపితే కేసులు నమోదు మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో నగరంలో ద్విచక్ర వాహనాలు ఢీకొని మృతి చెందిన ఘటనలు ఇటీవల ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు కారణం తాగి వాహనాలు నడపడమే. ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నాం. అంతేకాదు..తీవ్రతను బట్టి రిమాండ్కు కూడా పంపుతున్నాం. – నరసింగప్ప, డీఎస్పీ, అనంతపురం ట్రాఫిక్ ∙ దాడులు నిర్వహిస్తాం దాబాలు, హోటళ్లలో మద్యం విక్రయించడం, తాగడం చట్ట రీత్యా నేరం. దీన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దాడులు చేసిన సమయంలో దాబాల్లో మద్యం ఉన్నట్లైతే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తాం. –అనసూయదేవి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్