Andhra Pradesh BC Welfare Association
-
బీసీలను టీడీపీకి తాకట్టుపెట్టిన కృష్ణయ్య
అనంతపురం: బీసీ సంక్షేమ సంఘాన్ని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి బీసీలకు తీరని అన్యాయం చేశారని ఆర్.క్రిష్ణయ్యపై ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అధ్యక్షుడు డేరంగుల ఉదయ్కిరణ్ ధ్వజమెత్తారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం అనంతపురంలోని ప్రెస్క్లబ్లో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఉదయ్కిరణ్ మాట్లాడుతూ క్రిష్ణయ్య నిర్ణయంతో అన్ని పార్టీలలోని బీసీ నాయకుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. నూతన కార్యవర్గం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్కిరణ్ (అనంతపురం), గౌరవాధ్యక్షులుగా వీరాంజనేయులు (కృష్ణా), ఉపాధ్యాక్షులుగా కామాచార్యులు (తూర్పుగోదావరి), సనూరి నాగేశ్వరి (గుంటూరు), రామంచంద్ర (అనంతపురం), కార్యదర్శులుగా ఉప్పల కొండయ్య (ప్రకాశం), కొరడా నాగభద్రం (తూర్పుగోదావరి), సూర్యనారాయణ (అనంతపురం), ప్రధాన కార్యదర్శులుగా రవికుమార్ (కర్నూలు), శ్రీనివాసులు (కడప), శ్రీనివాసులు (అనంతపురం), ట్రెజరర్లుగా బాలాంజనేయులు (అనంతపురం), జమీల్, ఎక్జిక్యూటివ్ మెంబర్లుగా గోవిందరాజులు, విష్ణువర ్ధన్, మీనుగ శ్రీనివాసులు, చంద్రశేఖర్, లక్ష్మి తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా అనంతపురానికి చెందిన లక్ష్మిదేవమ్మ ఎన్నికయ్యారు. -
బీసీలకు 50% సీట్లివ్వాల్సిందే
* పార్టీలకు ఆర్.కృష్ణయ్య డిమాండ్ * రెండు రాష్ట్రాల్లోనూ సీఎం పదవి బీసీలకేనని ప్రకటించాలి సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో బీసీ వర్గాలకు అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం సీట్లు కేటాయించాలని, విభజన తరువాత రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి పదవి బీసీలకే ఇస్తామని ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు ప్రాధాన్యమిచ్చే పార్టీకే వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో బీసీల సమావేశం జరిగింది. రాష్ట్రంలోని 96 కులసంఘాలు, 45 బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీల జనాభా 60 శాతంగా ఉన్నప్పటికీ గత 60 ఏళ్లలో ఒక్క బీసీ కూడా సీఎం కాలేకపోయారని ఆవేదన వెలిబుచ్చారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాల్సిందేనని స్పష్టం చేశారు. విభజన నేపథ్యంలో 2 రాష్ట్రాల్లోనూ బీసీలకే అధికారం కట్టబెట్టాలని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ సంఘాల నేతలు జె.శ్రీనివాస్గౌడ్, గుజ్జు కృష్ణ, యెగ్గం మల్లేశం, పెరిక సురేష్, పావులూరి హన్మంతరావు, ర్యాగ రమేష్, ఎ.రాంకోటి, ఎ.ఎల్.మల్లయ్య, వేముల వెంకటేశ్, గణేష్ చారి, కోల శ్రీనివాస్, శారద తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. అవి... * వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని రాజకీయపార్టీలు తెలంగాణలో 60 అసెంబ్లీ, 9 ఎంపీ స్థానాలను బీసీలకు కేటాయించాలి * సీమాంధ్రలో 90 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలు కేటాయించాలి * బీసీ రాజకీయ పాలసీని అన్ని పార్టీలూ ప్రకటించాలి * పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై రాజ్యాంగసవరణ జరగాలి * రూ. 20 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ తేవాలి * పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలి