Anil Chauhan
-
సీమాంతర ఉగ్రవాదానికి కొత్త రెడ్లైన్
పుణే: వెయ్యిసార్లు గాయపర్చడం ద్వారా భారత్ను రక్తసిక్తం చేయాలన్న విధానాన్ని పాకిస్తాన్ అమలు చేస్తోందని ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా సీమాంతర ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కొత్త రెడ్లైన్ గీశామని చెప్పారు. మంగళవారం మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫూలే పుణే యూనివర్సిటీలో ‘భవిష్యత్తు యుద్ధాలు, యుద్ధ రీతులు’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. యుద్ధంలో జరిగిన చిన్నచిన్న తప్పిదాల కంటే అంతిమంగా ఏం సాధించామన్నదే చాలా ముఖ్యమని తేల్చిచెప్పారు.తాత్కాలిక నష్టాల కారణంగా సైన్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కొన్ని యుద్ధ విమానాలు కోల్పోయామంటూ తాను చేసిన ప్రకటనను కొందరు తప్పుపట్టడాన్ని జనరల్ అనిల్ చౌహాన్ ఖండించారు. మనవైపు జరిగిన నష్టం గురించి మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు స్పందించానని చెప్పారు. ఇలాంటి చిన్నపాటి నష్టాలకు ఏమాత్రం ప్రాధాన్యం లేదని, ఫలితాన్నే పరిగణనలోకి తీసుకోవాలని అప్పుడే స్పష్టంచేశానని ఉద్ఘాటించారు. శత్రువు పట్ల మన ప్రతిస్పందన ఎలా ఉందన్నదే కీలకమని వ్యాఖ్యానించారు. జరిగిన నష్టం గురించి, అంకెల గురించి మాట్లాడుకోవడం సరైంది కాదన్నారు.యుద్ధంలో ఎలాంటి నష్టం జరిగినా సైన్యం నైతిక స్థైర్యం కాపాడుకోవాలన్నారు. యుద్ధం, హింస ఉన్నచోట రాజకీయ జోక్యం కూడా ఉంటుందని తెలియజేశారు. ఆపరేషన్ సిందూర్లోనూ అదే జరిగిందని చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడి కంటే కొన్ని వారాల ముందు పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ అసీం మునీర్ భారత్కు, హిందువులకు వ్యతిరేకంగా విషం కక్కారని అనిల్ చౌహాన్ గుర్తు చేశారు. భారత్ పట్ల దశాబ్దాలుగా కొనసా గుతున్న పాకిస్తాన్ విద్వేషాన్ని ఆయన మాటలు ప్రతిబింబించాయని తెలిపారు. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తే ఇకపై తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్కు తెలి యజెప్పామని పేర్కొన్నారు. ఉగ్రవాద దాడులకు, అణు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.పాక్పై నిర్ణయాత్మక విజయం 48 గంటలపాటు నిర్విరామంగా దాడులు చేసి ఇండియాను ఓడించాలని ప్రణాళిక సిద్ధం చేసిన పాకిస్తాన్ కేవలం 8 గంటల్లోనే చేతులెత్తేసిందని అనిల్ చౌహాన్ అన్నారు. ఆపరేషన్ సిందూర్లో భారత్ దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిందని పేర్కొన్నారు. ఆ ఆపరేషన్ ఇంకా కొనసాగితే చావుదెబ్బ తప్పదన్న సంగతికి పాక్కు తెలిసిపోయిందని వెల్లడించారు. కాల్పుల విరమణ, చర్చల ప్రతిపాదన తొలుత పాకిస్తాన్ నుంచే వచ్చిందని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్పై నిర్ణయాత్మక విజయం సాధించామని మరోసారి తేల్చిచెప్పారు. పాకిస్తాన్కు ‘ఇన్నింగ్స్ డిఫీట్’ మిగిలిందని అన్నారు. ఈ ఆపరేషన్ ఇంకా ముగిసిపోలేదని, పాకిస్తాన్తో ఘర్షణ తాత్కాలికంగా ఆగిపోయిందని తెలిపారు. -
జరిగిన నష్టం కాదు.. సాధించిన విజయం చూడాలి: సీడీఎస్
పుణే: నీరు, రక్తం కలిసి పారవని.. పహల్గామ్ లాంటి ఉగ్రదాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదంటూ పాకిస్థాన్కు సీడీఎస్ అనిల్ చౌహన్ వార్నింగ్ ఇచ్చారు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్థాన్ తన విధానంగా మార్చుకుందని.. ఉగ్రవాదం పడగ నీడ కింద భారత్ ఉండబోదని అనిల్ చౌహన్ అన్నారు.‘‘చిన్నచిన్న నష్టాలు జరుగుతాయి., వాటికన్నా ఏం సాధించామన్నదే ముఖ్యం. జరిగిన నష్టం కాదు.. సాధించిన విజయం చూడాలి. తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్థాన్ ఆపేయాలి. జరిగిన నష్టంపై సైన్యంపై ఎలాంటి ప్రభావం చూపదు’’ అని సీడీఎస్ అనిల్ చౌహన్ అన్నారు. -
కొన్ని జెట్లను కోల్పోయాం
సింగపూర్/న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్తో జరిగిన ఘర్షణల్లో మనకు వైమానికంగా నష్టం జరిగిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. మన ఫైటర్ జెట్లను దాయాది కూల్చేసినట్టు వెల్లడించారు. షాంగ్రిలా డైలాగ్ నిమిత్తం సింగపూర్లో పర్యటిస్తున్న ఆయన శనివారం బ్లూంబర్గ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. పాక్తో యుద్ధం భారత్ ఫైటర్ జెట్లను నష్టపోయిందా అన్న ప్రశ్నకు బదులుగా ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి పెను రాజకీయ దుమారానికి దారితీశాయి. ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వాస్తవాలను మోదీ సర్కారు తొక్కిపెట్టిందనేందుకు ఇదే నిదర్శనమని కాంగ్రెస్ దుయ్యబట్టింది. సీడీఎస్ వ్యాఖ్యల నేపథ్యంలో మన యుద్ధ సన్నద్ధతపై స్వతంత్ర విచారణకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఉదంతంపై లోతుగా చర్చించేందుకు తక్షణం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ‘అణు’ స్థాయికి పోలేదు పాక్పై దాడుల సందర్భంగా యుద్ధ విమానాలను నష్టపోయినట్టు వాయుసేన గతంలోనే పరోక్షంగా అంగీకరించింది. పాక్ వైమానిక స్థావరాలపై దాడుల వివరాలను ఆర్మీ, నేవీ సైనిక ఆపరేషన్స్ డైరెక్టర్స్ జనరల్తో కలిసి వాయుసేన డీజీ ఎయిర్ మార్షల్ ఎ.కె.భారతి అప్పట్లో ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడించారు. మన ఫైటర్ జెట్లను కూల్చేశామన్న పాక్ ప్రకటన ఏ మేరకు వాస్తవమని మే 11 నాటి భేటీలో విలేకరులు ప్రశ్నించగా, ‘‘యుద్ధమన్నాక నష్టాలు సహజం. కాకపోతే మన పైలట్లంతా సురక్షితంగా తిరిగొచ్చారు. యుద్దం ఇంకా కొనసాగుతున్నందున మనం ఫైటర్ జెట్లను కోల్పోయామా అన్న ప్రశ్నకు ఈ దశలో బదులివ్వలేను’’ అని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో పాక్తో సాగిన ఆ నాలుగు రోజుల ఘర్షణల్లో మనకు నష్టం జరిగిందంటూ సైన్యం నుంచి ఇలా తొలిసారి స్పష్టమైన ప్రకటన వెలువడటం, అదీ స్వయానా త్రివిధ దళాలకు అధిపతి అయిన సీడీఎస్ నోటినుంచి రావడం విశేషం. అయితే మనం ఎన్ని విమానాలను నష్టపోయిందీ చెప్పేందుకు జనరల్ చౌహాన్ నిరాకరించారు. అంతేగాక ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చేశామన్న పాక్ వాదన కూడా శుద్ధ అబద్ధమన్నారు. ‘‘తొలి దశలో, అంటే మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిన రోజు నష్టాలు జరిగాయి. అయితే అసలు సమస్య యుద్ధ విమానాలను కోల్పోవడం కాదు. అలా జరగడం వెనక కారణాలను వీలైనంత త్వరగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. జరిగిన వ్యూహాత్మక తప్పిదాలను రెండు రోజుల్లోపే కనిపెట్టగలిగాం. కాబట్టే పొరపాట్లను వెంటనే సరిదిద్దుకుని యుద్ధ విమానాలన్నింటినీ తిరిగి రంగంలోకి దించాం. మే 8, 10 తేదీల్లో శత్రువును చావుదెబ్బ తీయగలిగాం. పాక్ లోలోపలికి చొచ్చుకుపోయి మరీ అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశాం’’ అని ఆయన వివరించారు. ‘‘చైనా అందజేసిన భారీ ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాక్ను ఏ మాత్రమూ ఆదుకోలేకపోయాయి. వాటి గురించి పాక్ చెప్పుకున్న గొప్పలన్నీ వట్టివేనని మన దాడులు రుజువు చేశాయి. ఎందుకంటే పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను తుత్తునియలు చేస్తూ దాని భూభాగంలో 300 కి.మీ. లోపలి దాకా అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చే శాం’’ అన్నారు. పాక్తో ఘర్షణ ఏ దశలోనూ అణుయుద్ధానికి దగ్గరగా రాలేదని స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడం తెలిసిందే. పాక్, పీఓకేల్లోని 9 ఉగ్ర శిబిరాలు, శిక్షణ కేంద్రాలను బ్రహ్మో స్ తదితర అత్యాధునిక క్షిపణులతో నామరూపాల్లేకుండా చేసింది. మర్నాడు పాక్ డ్రోన్లు తదితరాలతో సరిహద్దు గ్రామాలు, పట్టణాలపై ప్రతీకార దాడులకు దిగింది. బదులుగా మన సైన్యం పాక్లో కి 11 కీలక వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. నాలుగు రోజుల ఘర్షణల అనంతరం ఇరుదేశా లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. పాక్ సై న్యం విజ్ఞప్తి మేరకే అందుకు ఒప్పుకున్నట్టు భారత్ పేర్కొనగా తానే ఒప్పందం కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు.స్వదేశీ శక్తికి తార్కాణం రక్షణ రంగంలో భారత్ సాధించిన స్వావలంబనకు ఆపరేషన్ సిందూర్ అద్దం పట్టిందని సీడీఎస్ జనరల్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. సింగపూర్లో జరిగిన ఆసియా స్థాయి రక్షణ శిఖరాగ్ర సదస్సు షాంగ్రిలా డైలాగ్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆకాశ్ వంటి పూర్తి దేశీయ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాక్ దాడులను అత్యంత సమర్థంగా అడ్డుకుని తిప్పికొట్టాయని గుర్తు చేశారు. గగనతల రక్షణకు విదేశాల సాయంపై ఆధారపడకుండా సొంతంగా అభివృద్ధి చేసుకున్న దేశవ్యాప్త సమీకృత రాడార్ వ్యవస్థ అద్భుతంగా రాణించి సత్తా చాటిందన్నారు. దాయాది విద్వేష మంత్రం శాంతి కోసం భారత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బదులుగా పాక్ విద్వేషమే వెల్లగక్కిందని సీడీఎస్ జనరల్ చౌహాన్ దుయ్యబట్టారు. ‘‘2014లో ప్రధాని నరేంద్ర మోదీ పాక్కు స్నేహ హస్తం సాచారు. రెండు చేతులు కలవనిదే చప్పట్లు అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ను దూరం పెట్టడమే సరైన వ్యూహం. ఇప్పుడు భారత్ చేస్తున్నది అదే’’ అని వివరించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో సామాజికంగా, ఆర్థికంగా, తలసరి ఆదాయంలోనూ పాక్ మనకంటే చాలా ముందంజలో ఉంది. కానీ ఇప్పుడు ప్రతి రంగంలోనూ మనం పాక్ అందుకోలేనంతగా ప్రగతి సాధించాం’’ అని గుర్తు చేశారు.దేశాన్ని తప్పుదోవ పట్టించిన కేంద్రం: కాంగ్రెస్ పాక్తో జరిగిన సాయుధ ఘర్షణ విషయంలో మోదీ సర్కారు దేశాన్ని తప్పుదోవ పట్టించిందంటూ కాంగ్రెస్ మండిపడింది. అది దాచేసిన నిజాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని ఫైటర్ జెట్లను కోల్పోయామన్న సీడీఎస్ ప్రకటనను ఉద్దేశించి అభిప్రాయపడింది. పాక్తో నాలుగు రోజుల ఘర్షణలో ఎంత నష్టం జరిగిందో వాస్తవాలు వెల్లడించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ‘‘సీడీఎస్ ప్రకటన నేపథ్యంలో సిందూర్కు సంబంధించి ఎన్నో కీలక సందేహాలు తలెత్తుతున్నాయి. వాటన్నింటికీ సమాధానాలు లభించాలంటే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలే ఏకైక మార్గం. కాబట్టి తక్షణం వాటిని ఏర్పాటు చేయాలి. అంతేకాదు, మన యుద్ధ సన్నద్ధతపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరిపించాలి’’ అంటూ ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధంపై కూడా వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కమిటీ వేసి సమీక్ష జరిపిందని గుర్తు చేశారు. ‘‘మన వీర పైలట్లు ప్రాణాలకు తెగించి దేశ గౌరవాన్ని కాపాడారు. వారికి వందనం’’ అంటూ ఖర్గే కొనియాడారు. -
పాక్ సైన్యంతో ప్రమాదమే: సీడీఎస్
న్యూఢిల్లీ: పొరుగుదేశం పాకిస్తాన్ ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నప్పటికీ, ఆ దేశ ఆర్మీతో మనకు ప్రమాదంఎప్పటిలాగానే ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించారు. పాక్ సైనిక సామర్థ్యం చెక్కు చెదరలేదని చెప్పారు. అయితే సరిహద్దులను, ముఖ్యంగా వివాదాస్పద ఉత్తర సరిహద్దులను కాపాడుకోగల సత్తా మన సైన్యానికి ఉందని శనివారం ఇండియా టుడే కాంక్లేవ్లో చెప్పారు. ‘చైనా బలపడుతుండటం, ఆ దేశంతో తెగని సరిహద్దు వివాదం మనకు తక్షణ సవాలుగా మారింది. చైనా, పాక్ మనకు బద్ధ శత్రువులు. పైగా వీరివద్ద అణ్వాయుధాలున్నాయి. యుద్ధ రీతుల్లో ఎప్పటికప్పుడు అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మన ఆర్మీకి ఇదే అతి పెద్ద సవాల్గా మారింది. కొత్త ఆయుధ వ్యవస్థలను సమకూర్చుకోవడం, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, వ్యూహాలు, ప్రతివ్యూహాలను రచించుకోవడం వంటివి కొనసాగుతున్నాయి’’ అని జనరల్ చౌహాన్ చెప్పారు. -
శత్రువుల పాలిట ‘ప్రచండ’మే
సాక్షి, న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అధునాతన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్(ఎల్సీహెచ్) ప్రచండ్ భారత వైమానిక దళంలో చేరింది. సోమవారం రాజస్తాన్లోని జోధ్పూర్ వైమానికస్థావరంలో రక్షణ మంత్రి రాజ్నాథ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సమక్షంలో 4 లైట్ కంబాట్ హెలికాప్టర్లను వైమానిక దళంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రచండ్లో రాజ్నాథ్ కొద్దిసేపు ప్రయాణించారు. పర్వతప్రాంతాల్లో, ఎడారి వంటి ప్రతికూల వాతావరణంలో పగలూ, రాత్రి శత్రువులపై దాడి చేయగలగడం ప్రచండ్ ప్రత్యేకత. గగనతలంలోని లక్ష్యాలను గగనతలం నుంచే చేధించగల క్షిపణులను, ట్యాంక్ విధ్వంసక మిస్సైళ్లను, 20 ఎంఎం తుపాకులనూ వీటిలో అమర్చవచ్చు. నిమిషానికి 750 తూటాలను పేల్చగల సత్తా వీటి సొంతం. పర్వతప్రాంతాల్లోని శత్రు సైన్యంపై, ట్యాంక్లు, బంకర్లు, డ్రోన్లపై ఇవి సులభంగా దాడిచేయగలవని ఆర్మీ ఉన్నతాధికారులు చెప్పారు. 22 ఏళ్ల క్రితం భారత్ కన్న కల ఇప్పుడు నెరవేరిందని రాజ్నాథ్ అన్నారు. 1999లో పాకిస్తాన్తో కార్గిల్ యుద్ధకాలంలో పర్వతప్రాంతాల్లో తేలికపాటి పోరాట హెలికాప్టర్ల ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి చేసిన పరిశోధన ఫలితమే ప్రచండ్ రూపంలో వచ్చిందన్నారు. ఇంకొన్ని ప్రత్యేకతలు ఈ హెలికాప్టర్లు గరిష్ట సంఖ్యలో ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని మోసుకెళ్లగలవు. గాలిలో ఎక్కువసేపు ఉండటానికి సరిపడా ఇంథనాన్ని నింపొచ్చు. ఎడారుల్లో, మంచుమయమైన హిమాలయ పర్వతాల్లోనూ పోరాడగలవు. ట్విన్ ఇంజన్లు ఉన్న ఈ హెలికాప్టర్ బరువు 5.8 టన్నులు. శత్రువుకు కనపడని రంగులో, తక్కువ శబ్దం చేస్తూ, రాడార్కు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లకు చిక్కకుండా వెళ్లగలవు. హెలికాప్లర్లను అడవులు, పట్టణ ప్రాంతాలలో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలోనూ మొహరించవచ్చు. ఇక సైనిక వెర్షన్లో 96 హెలికాప్టర్లను తీసుకోవాలని ఆర్మీ భావిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీడీఎస్గా జనరల్ చౌహాన్ బాధ్యతలు
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత సీనియర్ కమాండర్, ఈస్టర్న్ ఆర్మీ మాజీ కమాండర్ జనరల్ చౌహాన్ కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అయ్యారు. దేశ మొట్టమొదటి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ 9 నెలల క్రితం తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన స్థానం జనరల్ చౌహాన్ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. దేశం ముందున్న భవిష్యత్ భద్రతా సవాళ్లకు త్రివిధ దళాలను సన్నద్ధం చేయడం, ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన థియేటర్ ప్లాన్ను అమలు చేయడం జనరల్ అనిల్ చౌహాన్ ప్రధాన లక్ష్యాలు. ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మిలటరీ ఎఫైర్స్కు సెక్రటరీగాను ఆయన వ్యవహరిస్తారు. సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్లో డ్రాగన్ దేశంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా పేరున్న జనరల్ చౌహాన్ను అత్యున్నత హోదాలో కేంద్రం నియమించడం గమనార్హం. ‘భారత సైనిక బలగాల్లో అత్యున్నత హోదాను చేపట్టినందుకు గర్వంగా ఉంది. త్రివిధ దళాలు నాపై ఉంచిన అంచనాలను అందుకునేందుకు నా వంతు కృషి చేస్తాను. అన్ని సవాళ్లను, ఇబ్బందులను కలిసికట్టుగా ఎదుర్కొంటాం’ అని ఈ సందర్భంగా జనరల్ చౌహాన్ అన్నారు. రైజినా హిల్స్లోని సౌత్ బ్లాక్ వద్ద జరిగిన కార్యక్రమంలో జనరల్ చౌహాన్ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. 1961లో జన్మించిన జనరల్ చౌహాన్ 1981లో భారత సైన్యంలోని 11 గూర్ఖా రైఫిల్స్లో చేరారు. -
బిపిన్ రావత్ తర్వాత సీడీఎస్గా అనీల్ చౌహాన్
సాక్షి, న్యూఢిల్లీ: జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం సుమారు 9 నెలల తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్)ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. బిపిన్ రావత్ తర్వాత సీడీఎస్గా లెఫ్టినెట్ జనరల్ అనిల్ చౌహాన్(రిటైర్ట్) పేరును ప్రకటించింది. లెఫ్టినెంట్ జనరల్ చౌహాన్ 2021, మే నెలలో తూర్పు కమాండ్ చీఫ్గా విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ చేశారు. సైన్యంలో పలు ఉన్నత పదవులను నిర్వర్తించారు చౌహాన్. జమ్ముకశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లో ఉగ్రకార్యకలాపాలను నిలువరించటంలో విస్తృత అనుభవం ఉంది. త్రివిద దళాలను ఏకతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ను ఏర్పాటు చేసింది కేంద్రం. దేశ తొలి సీడీఎస్గా జనరల్ బిపిన్ రావత్ 2020, జనవరిలో బాధ్యతలు చేపట్టారు. అయితే.. 2021 డిసెంబర్లో తమిళనాడులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మిలిటరీ హెలికాప్టర్లో వెళుతుండగా ప్రమాదం జరిగి రావత్, ఆయన భార్య ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు మరో 11 మంది మరణించారు. అప్పటి నుంచి సీడీఎస్ పోస్ట్ ఖాళీగానే ఉంది. దాదాపు 9 నెలల తర్వాత కొత్త సీడీఎస్ను నియమించింది కేంద్రం. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగ్విజయ్ సింగ్? -
శివసేన నాయకుడిపై కాల్పులు
శివసేన నాయకుడు అనిల్ చౌహాన్పై కాల్పులు జరిగాయి. వెంటనే ఆయనను భక్తివేదాంత ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఉదయమే ఆయనపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఉత్తర ముంబైలోని కశ్మీరియా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అనిల్ చౌహాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దుండగులు ఎవరు, ఆయనపై ఎందుకు కాల్పులు జరిపారన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. దీనిపై తమకు ఫిర్యాదు అందిందని, నిందితులను గుర్తించి పట్టుకునేందుకు గాలింపు మొదలుపెట్టామని ముంబై పోలీసు అధికారి అవినాష్ అంబురే తెలిపారు. -
బడా కార్ల దొంగ బుక్కయ్యాడు
గువాహటి: కార్లకు అతడంటే హడల్.. అదేంటని అనుకుంటున్నారా.. ఒంటరిగా కారు కనిపించిందో చిటుక్కున అతడు మాయం చేస్తాడు. అదేదో అతడు ఉండే చోట కాదు.. మొత్తం దేశ వ్యాప్తంగా ఇదే తంతు. బిజినెస్మెన్ చిత్రంలో సూర్యభాయ్ (మహేశ్బాబు) నెట్ వర్క్ మాదిరిగా ఈ కార్ల దొంగకు దేశమంతటా పెద్ద నెట్వర్క్ ఉంది. ఇప్పుడా కార్ల గజదొంగ పోలీసుల చేతికి చిక్కాడు. వివరాల్లోకి వెళితే... దేశ వ్యాప్తంగా పలు కార్ల దొంగతనాలకు పాల్పడుతున్న అనిల్ చవాన్ను గువాహటి పోలీసులు శుక్రవారం అజారాలో అరెస్టు చేశారు. అతడి కీలక అనుచరుడు మమూద్ చౌదరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే, అతడి కోసం తీవ్రంగా గాలింపులు జరుపుతున్న ముంబయి, న్యూఢిల్లీ, మేఘాలయ పోలీసులకు సమాచారం అందించారు. అరెస్టుతోపాటు అనిల్ చవాన్ నుంచి తుపాకీ, ఐదు రౌండ్ల బుల్లెట్లు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న ఆటోమోబైల్ దొంగతనాలు, ముఖ్యంగా కార్ల దొంగతనాల్లో అనిల్ది అందె వేసిన చేయి అని, దేశవ్యాప్తంగా అతడు చాలా ప్రభావం కలిగినవాడని తెలిపారు. ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నామని చెప్పారు.