
పుణే: నీరు, రక్తం కలిసి పారవని.. పహల్గామ్ లాంటి ఉగ్రదాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదంటూ పాకిస్థాన్కు సీడీఎస్ అనిల్ చౌహన్ వార్నింగ్ ఇచ్చారు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్థాన్ తన విధానంగా మార్చుకుందని.. ఉగ్రవాదం పడగ నీడ కింద భారత్ ఉండబోదని అనిల్ చౌహన్ అన్నారు.
‘‘చిన్నచిన్న నష్టాలు జరుగుతాయి., వాటికన్నా ఏం సాధించామన్నదే ముఖ్యం. జరిగిన నష్టం కాదు.. సాధించిన విజయం చూడాలి. తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్థాన్ ఆపేయాలి. జరిగిన నష్టంపై సైన్యంపై ఎలాంటి ప్రభావం చూపదు’’ అని సీడీఎస్ అనిల్ చౌహన్ అన్నారు.